రాష్ట్రపతి ఎన్నికల తరువాతే వలస ఎమ్మెల్యేల రాజీనామాలు?
Publish Date:Jun 22, 2012
Advertisement
ఉపఎన్నికల ఫలితాలు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి జాతీయస్థాయిలో గుర్తిప్మ్పును తెచ్చిపెట్టాయి. దీనివల్ల వలసలు కూడా ప్రారంభమయ్యాయి. తమ పార్టీలోకి ఎమ్మెల్యేలే రావటం ఖాయమన్న స్థిరమైన నమ్మకంలో ఆ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి ఉన్నారు. అయితే అందరినీ రాష్ట్రపతి ఎన్నికలు పూర్తయ్యేవరకూ ఆగమని ఆయన చెబుతున్నారట. ఈ ఎన్నికల్లో తమకు జాతీయస్థాయిలో ప్రాముఖ్యత లభిస్తుందని, దీని తరువాత తమ సమీకరణాలను మార్పు చేస్తే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా దిగివస్తారని జగన్ భావిస్తున్నారు. ఆమెను లొంగదీసే ఏ అవకాశమూ వదులుకోకూడదని ఆయన తన సన్నిహితులతో అన్నారట. అందుకే చెంచల్ గూడ జైలులో ఉన్న జగన్ తన ములాఖాత్ సమయంలో పార్టీ నాయకుల సెల్ నుంచి కాంగ్రెస్ నుంచి వలస వచ్చేందుకు సిద్ధమైన కాకినాడ ఎమ్మల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని తదితరులకు రింగ్ చేసి ఈ ఎన్నికలయ్యే వరకూ ఆగమని తెలిపారు. తన మాటపై వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ రాష్ట్రపతి అభ్యర్థిని ఎన్నుకుంటారని ఎంఐఎం అసదుద్దీన్ ఒవైసీకి తెలిపారు. తనకు ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేయించేందుకు ఎటువంటి అభ్యంతరం లేకపోయినా ఈ కేసుల గురించే ఎమ్మెల్యేలు తనను నిలదీస్తున్నారని ఒవైసీకి చెప్పారట. దీని విషయం కూడా కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పాలని ఒవైసీని జగన్ కోరారని విశ్వసనీయ సమాచారం. ఒకవేళ తన కేసులకు రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధం లేకపోతే రాష్ట్రంలో మరోసారి అవిశ్వాసం పెడితే తనకు సహకరించాలని ఒవైసీని కోరారట. దీనికి తగ్గట్లుగా ఎంఐఎం రంగారెడ్డి జిల్లాలో విస్తరించేందుకు తనవంతు సహకారాన్ని అందిస్తానని జగన్ హామీ ఇచ్చారని సమాచారం. దీంతో సంతృప్తి చెందిన ఒవైసీ మీడియా ముందు నుంచి వెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతే తనను నినదించవద్దని జగన్ చెప్పిన మాటలను దాచేస్తూ చిన్న హింట్ ను మాత్రం వదిలేశారు. తెలంగాణలో టి.ఆర్.ఎస్., రంగారెడ్డి జిల్లాలో ఎంఐఎం పార్టీల ఎదుగుదలకు తనకేమీ అభ్యంతరం ఉండదని ఒవైసీకి జగన్ ఇచ్చిన హామీ కూడా బయటకు పొక్కింది. అయితే ఎమ్మెల్యేల రాజీనామాలను రాష్ట్రపతి ఎన్నికలయ్యేంత వరకూ జరగవని జగన్ స్పష్టం చేశారని తెలిసింది.
http://www.teluguone.com/news/content/-president-poll-24-15050.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





