బోత్సాపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్
Publish Date:Jun 22, 2012
Advertisement
ఉపఎన్నికల ఫలితాలు దారుణంగా ఉన్నాయంటూ పీసీసీ చీఫ్ బొత్సా సత్యనారాయణపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది. దీనికి పీసీసీ సమావేశంలో తాను సేకరించిన బొత్సా కేంద్ర నాయకుల ముందుంచారు. ఆ కారణం విననైనా వినకుండానే నాయకులు బోత్సాపై సీరియస్ అయ్యారు. దీంతో ఏమిచేయాలో అర్థం కాక బొత్సా తాను తీసుకున్న వివరాలను సమావేశంలో కేంద్రనాయకుల చేతికి ఇచ్చేసి వచ్చారు. సోనియా తరపున కూడా బోత్సాకు అక్షింతలు వేసి పంపించారు. ఎలానూ వచ్చాం కాబట్టి ప్రణబ్ ముఖర్జీని కలిసి మర్యాదపూర్వకంగా అభినందించి బొత్సా తిరుగు ప్రయాణమై వచ్చారు. వచ్చినది మొదలు కాంగ్రెస్ నాయకులను కలవకుండా బొత్సా ఇంటిదారి పట్టారు. కాంగ్రెస్ చైర్మన్ సోనియాగాంధీ ఉపఎన్నికల ఫలితాలు సమీక్షించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 24, 25తేదీల్లో సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్సా సత్యనారాయణలతో ఈ చర్చల్లో పాల్గొంటారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారటానికి అవకాశం ఎలా ఏర్పడిందన్న అంశాలపై ఆమె ప్రధానంగా చర్చిస్తారు. సిఎంతో మాత్రం జగన్ అక్రమాస్తుల కేసులో ఇడి కనుక ఆయన్ని తరలిస్తే వచ్చే ఇబ్బందుల గురించి మాట్లాడతారని సమాచారం. ఏదేమైనా వీరిద్దరిలో ఒకరి మార్పు ఖాయమని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/botsa-satyanarayana-24-15049.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





