స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్, అన్నీ ఆర్నెళ్ల తరువాతే
Publish Date:Jun 22, 2012
Advertisement
స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్రప్రభుత్వం బ్రేక్ వేసింది. రాష్ట్రంలో ఉపఎన్నికలకు ముందే ఈ ఎన్నికలు నిర్వహిద్డామనుకున్న ప్రభుత్వం రాష్టపతి ఎన్నికల గురించి దీన్ని వాయిదా వేసింది. ఎమ్మెల్యేల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు ప్రతికూలంగా ఉండటంతో అసలు ఈ ఎన్నికల ప్రస్తావనే ప్రభుత్వం మరిచిపోయింది. మరో ఆర్నెళ్లపాటు ఈ ఎన్నికలు జరగాకపోవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి బిసీలను దగ్గర చేసేందుకు ఈ ఎన్నికలు ఉపయోగపడతాయని సిఎం గతంలో భావించారు. నగరపాలక సంస్థలకు, మున్సిపాల్టీలకు, పంచాయితీలకు ఎన్నికలు నిర్వహిస్తే ద్వితీయశ్రేణి నాయకులు పార్టీపై విశ్వాసంతో పనిచేస్తారని సిఎం అభిప్రాయపడ్డారు. వీరంతా 2014 ఎన్నికలు వచ్చేటప్పటికి పార్టీ వెనుక బలంగా ఉంటారని ఆయన భావించారు. ఉపఎన్నికల ఫలితాలు జగన్ కు సానుభూతిగా వచ్చాయని భావించిన ప్రభుత్వం మరో ఆర్నెల్లు ఆగితే ఈ సానుభూతి తగ్గుతుందని భావిస్తోంది. అయితే ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా ఇతర పార్టీలకూ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవటమే నష్టాన్ని తెచ్చిపెట్టాయని పరిశీలకులు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా బిసిలపైనే ఆధారపడి ఉన్నంతున ఈ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో ఆ పార్టీ ద్వితీయశ్రేణి గెలిచి ఉంటే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక్కస్థానమైనా దక్కేదని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు పూర్తయ్యాక, మరో ఆర్నెల్లలో ఈ ఎన్నికలను ప్రభుత్వం జరిపిస్తుందని పార్టీల జిల్లా అధ్యక్షులు ద్వితీయశ్రేణి నాయకులకు హామీలు ఇస్తున్నారు. జగన్ ప్రభావం తగ్గేన్తవరకూ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలు జరగనీయదని తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులూ తమ మాజీలకు వివరిస్తున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం మాత్రమే పోటీపడేలా ఈ ఎన్నికలు జరగకపోతే భవిష్యత్తు రాజేకీయపరిణామాలు చేజారుతాయని వారు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆర్నెళ్ల తరువాత కూడా ఇదే స్పీడులో ఉంటేనో అన్న ప్రశ్నకు రెండు పార్టీల నేతలూ నోళ్ళు వెళ్ళబెడుతున్నారు.
http://www.teluguone.com/news/content/congress-president-polls-24-15051.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





