ఆశలను చిదిమేసిన విమాన ప్రమాదం.. మాటలకందని విషాదం

Publish Date:Jun 13, 2025

Advertisement

విమాన ప్రమాదంలో మరణించిన వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో విషాద గాధ. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు. రాజస్థాన్ కు చెందిన  ప్రతీక్ జోషి గత ఆరేళ్లుగా లండన్ లోనే పని చేస్తున్నారు. ఆయన కల కుటుంబం మొత్తాన్ని లండన్ కు తీసుకువెళ్లి అక్కడే స్థిరపడాలని. ఎట్టకేలకు ఆ కల నెరవేరే రోజు వచ్చిందని సంబరపడ్డారు. భార్యా, ముగ్గురు పిల్లలను తీసుకుని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయలు దేరారు. విమానం టేకాఫ్ కు ముందు కుటుంబంతో సెల్ఫీ దిగి బంధుమిత్రులకు గుడ్ బై చెబుతూ షేర్ చేశారు. అయితే అదే చివరి ప్రయాణమనీ, తిరిగి రాని లోకాలకు వెడుతున్నామనీ ఆ క్షణంలో వారికి తెలియదు. 

లండన్ ప్రయాణం ఖరారు కావడంతో ప్రతీక్ జోషి భార్య కోమి వ్యాస్  తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశారు. వారి ముగ్గురు పిల్లలు మిరాయ, నకుల్, ప్రద్యుత్ లు సహా కుటుంబం మొత్తం ఈ ప్రమాదంలో మరణించారు.   గత ఆరేళ్లుగా లండన్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తున్న ప్రతీక్ జోషి.. ఈ ఆరేళ్లూ భార్యాబిడ్డలను లండన్ తీసుకువెళ్లి అక్కడ స్థిరపడాలన్న లక్ష్యంతోనే ఉన్నారు. ఆ లక్ష్య సాధన కోసం శ్రమించారు. చివరకు అన్నీ అనుకున్నట్లుగా జరుగుతున్నాయని అనుకుంటున్న సమయంలో.. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లుగా.. ఘోర విమాన ప్రమాదంలో కుటుంబం మొత్తం మరణించింది.   

ఇలా ఈ ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరిదీ ఒక్కో విషాద గాధ. అందులో రాజస్థాన్ కు చెందిన ఖుష్బూ గాధ ఒకటి. ఆమెకు ఇటీవలే వివాహం అయ్యింది. ఆమె భర్త లండన్ లో విద్య అభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే  తన భర్తను కలిసేందుకు ఆమె లండన్ బయలుదేరారు.  అయితే ఆమె లండన్ చేరలేదు. ఆహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.

అలాగే భారత పర్యటనకు వచ్చిన ఇద్దరు బ్రిటిషర్లది మరో విషాదం. భారత్ సంస్కృతి పట్ల అభిమానంతో.. భారత్ లో పర్యాటక ప్రదేశాలను చూసి ఆ అనుభవాలను జీవితాంతం పదిలంగా దాచుకోవాలన్న ఆశలో  ఇద్దరు బ్రిటిషర్ లు భారత పర్యటనకు వచ్చి... బ్రిటన్ కు తిరుగు ప్రయాణమయ్యారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఇద్దరూ అసువులు బాసారు. బుధవారం (జూన్ 11) వీరు   ఇన్ స్టా గ్రాంలో పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. భారత్ లో ఇది మాకు చివరి రాత్రి అంటూ మొదలు పెట్టి.. భారత్ పర్యటన మాకు ఎన్నో మరపురాని అనుభూతులను మిగిల్చింది. ఈ పర్యటనతో భారత్ పట్ల మా అభిమానం, ఇష్టం ఎన్నో రెట్లు పెరిగింది. కొన్ని గంటల్లో ఈ దేశం విడిచి వెడుతున్నాం. అందుకు చాలా బాధగా ఉంటోంది అంటూ సాగిన వారి ఇన్ స్టా గ్రాం పోస్టు కంటతడి పెట్టిస్తోంది. భారత్ పై అంతటి అభిమానాన్ని పెంచుకున్న వారు  ఇలా విమన ప్రమాదంలో మరణించడం బాధేస్తోందంటూ నెటిజనులు కామెంట్లు పెడతున్నారు. 

By
en-us Political News

  
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలేశుని దర్శనం కోసం పోటెత్తుతున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అస్సలు తగ్గేదేలే అంటున్నారు.
తిరుపతి జిల్లా రంగంపేట మార్గంలో అక్రమంగా రవాణా చేస్తున్న 24 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితులకు నార్కో టెస్ట్ చేయించాలని సిట్ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనంగా మారిన మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనపై సీఐడీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలనిఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ ను హైకోర్టు తిరస్కరించింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. విశ్వసనీయ సమాచారం మేరకు, మరో రెండు రోజులో,జూన్ 30 న నామినేషన్లు,జూలై 1 న నూతన అధ్యక్షుని ఎన్నికకు బీజేపీ అధిష్టానం ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
సీతక్క ఓ నమ్మకం, కష్టాలో ఆమె ఓ సహాయం, ఆపదలో ఉన్న వారికి ఆమె భరోసా, ప్రజా నాయకురాలిగా అలుపెరుగని పోరాటం, ప్రజాసేవలో అలసిపోని మానవత్వం కలిగిన అరుదైన వ్యక్తిత్వం సితక్క, ఆలాంటి నాయకురాలు కోటికొక్కరుంటారు
భారత గూఢచార సంస్థ రిసెర్చ్‌ అండ్‌ ఎనాలసిస్‌ వింగ్‌ చీఫ్‌గా పంజాబ్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి పరాగ్‌ జైన్‌‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.
హైదరాబాద్‌‌లో మహా న్యూస్ హెడ్ ఆఫీస్‌పై బీఆర్‌ఎస్ నేతల దాడిని ఏపీ సీఎం చంద్రబాబు ఖండించారు. స్టూడియోపై దాడి చేసి విధ్వంసం సృష్టించడం దారుణమని ఎక్స్ వేదికంగా పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రమాణ స్వీకారంచేసి, ఇంచుమించుగా 18నెలలు అయింది. అయితే, ఈ 18 నెలల కాలంలో, రేవంత్ రెడ్డి ఇతర ముఖ్యమంత్రుల్లా అధికార దర్పాన్ని ప్రదర్శించిన సందర్భాలు అంతగా కనిపించవు.
హైదరాబాద్‌లో మహా న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. మీడియా సంస్థపై భౌతిక దాడులకు పాల్పడటం అత్యంత గర్హనీయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు.
పూర్ణ‌చంద్ర‌రావు అనే ఒక వ్య‌క్తితో యాంక‌ర్ స్వేచ్ఛ స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. గ‌తంలో కూడా ఆమె ఒక‌రితో వివాహం అయ్యి త‌ర్వాత విడిపోయారు. ఆమె టీవీనైన్ వంటి ప్ర‌ముఖ న్యూస్ ఛానెళ్ల‌లో ప‌ని చేశారు.
ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేటీఆర్‌పై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ ఆగ్రహించిన బీఆర్ఎస్ కార్యకర్తలు మహా టీవీ ఆఫీస్‌పై దాడి చేశారు. ఆఫీస్ అద్దాలు, కార్లు, స్టూడియోను ధ్వంసం చేశారు.
ఆస్కార్ క‌మిటీలో చోటు ద‌క్కింది. అకాడ‌మీ ఆఫ్ మోష‌న్ పిక్చ‌ర్స్ అండ్ సైన్సెస్ తాజాగా విడుద‌ల చేసిన స‌భ్యుల జాబితాలో క‌మ‌ల్ పేరు కూడా ఉంది. ఎంతో మంది హాలీవుడ్ న‌టీన‌టుల‌తో పాటు ఆస్కార్ ఓటింగ్ ప్ర‌క్రియ‌లో పాలుపంచుకోనున్నారు క‌మ‌ల్.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.