దగ్గుపాటికి...వివాదాలు పరిపాటి?
Publish Date:Jan 14, 2026
Advertisement
పండగ పూట నారా వారి కుటుంబమంతా నారావారి పల్లెలో సంబరాల్లో మునిగి తేలుతుంటే.. అనంత ఎమ్మెల్యే వివాదం ఒకటి పండగ స్పెషల్ గా తెరపైకి వచ్చింది. అనంత అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రాన్రాను వివాదాస్పదంగా మారుతున్నారు. తాజాగా ఆయనపై ఒకే సారి రెండు ఆరోపణలు. ఒకటి నంబూరి వైన్స్ యజమానిని డబ్బు కోసం పలు మార్లు ఫోన్లు చేసి బెదిరించడం మాత్రమే కాకుండా.. ఆయన వైన్స్ ని కూడా తగలబెట్టించారు. నంబూరి నలభై ఏళ్ల నుంచి టీడీపీలో సిన్సియర్ కార్యకర్తగా కొనసాగుతున్నారు. తనలాంటి టీడీపీ వారి మీదే దగ్గుపాటి ఇంత ప్రతాపం చూపిస్తుంటే.. ఇక సాధారణ మైన వారి పరిస్థితి ఏంటన్నది ఆయన ప్రశ్నిస్తున్న విధం. ఇక ఇదే దగ్గుపాటి పై రాష్ట్ర లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ అయిన స్వప్న అనే మహిళ తన భూమి కబ్జా చేసినట్టుగా ఆరోపణలు చేశారు. అనంతపురంలో ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అయితే ఆ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్దీన్ మీద ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అనుచరులు దాడిచేశారని ఆరోపణలు వచ్చాయి. ఎగ్జిబిషన్ నిర్వాహకుడిని బెదిరించారంటూ సోమవారం ఆరోపణలు వచ్చాయి. అలాగే ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్ధీన్ ఈ విషయం మీద అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు గంగారాం, ఎమ్మెల్యే గన్మెన్ షేక్షా మద్యం సేవించి ఎగ్జిబిషన్ వద్ద వీరంగం సృష్టించారని ఫిర్యాదు చేశారు. పది లక్షల రూపాయలు ఇవ్వాలంటూ తనను బెదిరించారంటూ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్ధీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో దగ్గుపాటి మీద జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అనవసరంగా రెచ్చగొట్టిన ఆరోపణలున్నాయి. ఆ ఆడియో కాల్ తో సహా బయట పడి నానా రభస కింద తయారైంది. లోకేష్ ఆ టైంలో హెచ్చరించారు కూడా. అయినా సరే దగ్గుపాటి కి ఇలాంటి వివాదాలు ఒక పరిపాటిగా మారింది. ఇప్పటికే కొలికిపూడి వంటి ఎమ్మెల్యేలతో అధిష్టానానికి తల బొప్పి కడుతోంది. తాజాగా దగ్గుపాటి కూడా తయారయ్యారు. అయితే ఇవన్నీ ఆధారాలుండి బయట పడ్డ ఎమ్మెల్యే బాగోతాలనీ. ఇదే రాయలసీమలో ఒక కూటమి ఎంపీని కూటమి ఎమ్మెల్యే లంచం డిమాండ్ చేసిన విధం రాష్ట్రమంతా పాకింది. వీరే కాదు.. మొత్తం 48 మంది ఎమ్మెల్యేలను సాక్షాత్ చంద్రబాబే పిలిచి వార్నింగిచ్చారు. పద్ధతి మార్చుకోకుంటే కష్టమేనని తేల్చి చెప్పారు. ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న వారు సుమారు 70 మంది వరకూ ఉన్నట్టు కొన్ని అంచనాలున్నాయి. కాబట్టి.. అధినేత చంద్రబాబు వీరందరిపై క్రమశిక్షణ చర్యలు తీస్కోకుంటే కష్టమేనని తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/mla-daggupati-prasad-ranra-39-212512.html




