2010 నుంచి ఏటా తన ఆస్తులను ప్రకటిస్తూ వస్తోన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్... 2019 సంవత్సరాంతంలో తన ఆస్తుల వివరాలను మీడియా ముందు పెట్టారు. 2018లో పోల్చితే... 2019లో ఒక్క రూపాయి కూడా పెరగలేదని ప్రకటించారు. తన ఆస్తిలో ఎలాంటి వృద్ధి జరగలేదని సీఎం నితీష్ వెల్లడించారు. 2018లో నితీష్ కుమార్ దగ్గర 42వేల నగదు ఉండగా... 2019 సంవత్సరాంతానికి దాదాపు నాలుగు వేలు తగ్గి 38వేల 39 రూపాయలున్నట్లు తెలిపారు. ఇక చరాస్తులు 16వేలు ఉండగా, స్థిరాస్తులు 40లక్షలు ఉన్నట్లు ప్రకటించారు. అయితే, నితీష్ కుమారుడు పేరిట కోటీ 39 లక్షలు ఉండగా... స్థిరాస్తులు మాత్రం కోటీ 48లక్షలుగా తెలిపారు.
అయితే, నితీష్ కుమార్ ఆస్తి ఒక్క రూపాయి కూడా పెరగకపోయినా, ఆయన పాడి సంపదలో మాత్రం భారీ పెరుగుదల కనిపించింది. నితీష్ పాడి సంపదలోకి కొత్తగా రెండు ఆవులు, ఒక లేగ దూడ చేరింది. ఏడాది క్రితం అంటే 2018 చివరి వరకు 8 ఆవులు మాత్రమే ఉండగా, 2018 ఎండింగ్ కి మరో రెండు ఆవులు జత కలిశాయి. అలాగే, గతంలో ఆరు లేగ దూడలు ఉండగా... ఇప్పుడు మరో బుల్లి లేగ వచ్చింది చేరింది. అయితే, నితీష్ కుమార్ తరహాలోనే 2011 నుంచి చంద్రబాబు కూడా తన ఆస్తులను ప్రకటిస్తూ వస్తున్నారు.
ఇక, నితీష్ కుమార్ ఆస్తులు పెరగకపోయినా, బీహార్ మంత్రుల ఆదాయంలో మాత్రం భారీ పెరుగుదల కనిపించింది. ఒకరిద్దరు మినహా అందరూ మంత్రుల ఆస్తులూ కోట్లల్లో ఉన్నాయి. అయితే, ఈ ఏడాదే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అండ్ మంత్రుల ఆస్తుల ప్రకటన ప్రజలపై ఎంతోకొంత ఇంపాక్ట్ చూపించే అవకాశముంది. ప్రస్తుతం మూడోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నితీష్ కుమార్.... నాలుగోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-no-growth-in-bihar-cm-nitish-kumar-assets-25-92775.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.