వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనను చూస్తే భయపడేవారని, గౌరవించేవారని పాత రోజులను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. తానొస్తున్నప్పుడు లేచి నిలబడుతుంటే.... రాజశేఖర్ రెడ్డీ తప్పు చేస్తున్నావ్ జాగ్రత్త అంటే... గమ్మున కూర్చునేవారని అన్నారు. కానీ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నారో ఏవిధంగా ప్రవర్తిస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారని మండిపడ్డారు. తనను చూసి జగన్ వెకిలి నవ్వులు నవ్వుతున్నారని అన్నారు. అలాగే, జగన్ పక్కనుండే వాళ్లంతా ఎగిరెగిరి పడుతున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతల చేష్టలను చూస్తుంటే అసహ్యమేస్తోందని... కానీ, ఇవన్నీ ప్రజల కోసమే భరిస్తున్నానంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు.
ఆనాడు అమరావతిలో రాజధాని నిర్మాణానికి ఒప్పుకుని ఇఫ్పుడెందుకు యూటర్న్ తీసుకున్నారని జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు ప్రశ్నించారు. మాట తప్పను మడమయ తిప్పను అంటే ఇదేనా అన్నారు. రాష్ట్రానికి మధ్యలో ఉంటుందనే అమరావతిని ఎంపిక చేశామని... కానీ, ఒక సామాజిక వర్గానికి లబ్ధి చేసేందుకు చూశామని, అలాగే ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బాబు మండిపడ్డారు. అమరావతి రైతులు కారుణ్య మరణాలు కావాలని అడిగారంటే అసలు ఈ సీఎంకు సిగ్గుందా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతులు ఇదే విధంగా పోరాడి ముందుకెళ్తే జగన్మోహన్ రెడ్డి పులివెందుల పారిపోవడం ఖాయమన్నారు.
అమరావతి జోలికొస్తే ఎవరైనాసరే కాలిపోతారని చంద్రబాబు హెచ్చరించారు. విశాఖ ప్రజల ఆస్తులను కొట్టేయడానికే అక్కడ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అంటున్నారని బాబు ఆరోపించారు. జగన్ అధికారంలోకి వచ్చాక విశాఖ అభివృద్ధే ఆగిపోయిందన్న చంద్రబాబు.... ఇక, రాజధానిని అక్కడికి తరలిస్తే... ఇంకెన్ని దారుణాలు జరుగుతాయోనని అన్నారు. అమరావతి రైతుల తరపున పోరాడతానన్న చంద్రబాబు.... అవసరమైతే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమేనన్నారు
ఊరూరా తిరిగి ముద్దులు పెట్టి... అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజలను పిడిగుద్దులు గుద్దుతున్నారని చంద్రబాబు విమర్శించారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన తనతోనే జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నాడని బాబు మండిపడ్డారు. ఒక్కసారి సీఎం కావాలన్న జగన్ కోరిక తీరిందని, రెండోసారి ముఖ్యమంత్రి కాడని అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-sensational-comments-on-ys-25-92773.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.