కేసీఆర్, జగన్ మధ్య దూరం పెరిగిందనే మాట వినిపిస్తోంది. ఇటీవల తన సన్నిహితులతో జగన్మోహన్ రెడ్డిపై కేసీఆర్ నెగటివ్ కామెంట్స్ చేశారనే టాక్ బయటికొచ్చింది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ వేలకోట్లు సంపాదించారని, అందుకే సీబీఐ కేసులు పెట్టిందని అన్నారట. అయితే, చంద్రబాబు పేరు ఎత్తితే చాలు అంతెత్తున లేస్తూ మాటల తూటాలతో విరుచుకుపడే కేసీఆర్.... తన సన్నిహితులతో ముందు మాత్రం పాజిటివ్ కామెంట్స్ చేశారని అంటున్నారు. ఆంధ్రోళ్లు చాలా స్వార్ధపరులని, అవకాశవాదులని... లేకపోతే నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కష్టపడిన చంద్రబాబును ఘోరంగా ఓడించడమేంటి? తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేలకోట్లు సంపాదించి జైలుకెళ్లొచ్చిన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమేంటంటూ అన్నారట. ఇటీవల తనను కలిసిన ఏపీ విపక్ష నేతలతోనూ కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని జనం వ్యతిరేకంగా ఓటేశారని.... జగన్మోహన్ రెడ్డి ఏమైనా నిజాయితీగా సంపాదించారా? అంటూ అన్నారట. అయినా, చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రమే అవినీతి జరిగిందా? అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారట. అమరావతిలో అంతర్జాతీయస్థాయి రాజధానిని నిర్మించాలని చంద్రబాబు ఆశపడ్డారని, కానీ జగన్మోహన్ రెడ్డేమో.... రాజధానినే మార్చేస్తున్నాడని తనను కలిసిన ఏపీ విపక్ష నేతలతో అన్నారట.
కేసీఆర్ కామెంట్స్ ను పక్కనబెడితే, రెండు రాష్ట్రాల మధ్య ఇటీవల తెరపైకి వచ్చిన గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టు ఆగిపోయిందని అంటున్నారు. గోదావరి నీటిని కృష్ణా బేసిన్ కి తరలించడం ద్వారా... ఏపీలో రాయలసీమకు.... తెలంగాణలో మారుమూల ప్రాంతాలను నీళ్లు అందించాలని కేసీఆర్, జగన్ భావించారు. ఈ ప్రాజెక్టును ఇరురాష్ట్రాలకు కలిసి చేపట్టాలని నిర్ణయించారు. అనుమతితోపాటు నిధులు కూడా కావాలంటూ ఇరువురు ముఖ్యమంత్రులు కేంద్రాన్ని కూడా కోరారు. కానీ, ఈ ప్రాజెక్టుపై కేసీఆర్, జగన్ మనసు మార్చుకున్నారని అంటున్నారు. ఎవరికి వాళ్లు... తమతమ భూభాగాల్లోనే ప్రాజెక్టును నిర్మించడానికి మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుపై మనసు మార్చుకోవడంపై ఇరువురి మధ్య దూరం పెరిగిందనే ప్రచారం జరుగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/reasons-behind-gap-between-kcr-and-ys-jagan-25-92777.html
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.