జమ్మూ కాశ్మీరులో బీజేపీ అధికారంలోకి వస్తుందా?

Publish Date:Nov 26, 2014

Advertisement

 

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో నిన్న జరిగిన మొదటి దశ ఎన్నికలలో 71.3శాతం పోలింగ్ నమోదు అయింది. అందుకు ప్రధాన కారణం ప్రధాని నరేంద్ర మోడీ ఆ రాష్ట్రంలో చేసిన ఎన్నికల ప్రచారమేనని ప్రత్యేకంగా చెప్పుకొనవసరం లేదు. మోడీ కారణంగానే ఓటింగ్ శాతం పెరిగిందని ఎందుకు చెప్పవచ్చునంటే గత ఎన్నికలలో ఆయన ప్రభావం లేనప్పుడు కేవలం 65 శాతమే నమోదు అయింది కనుక. మోడీ కారణంగానే పోలింగ్ శాతం పెరగడం నిజమనుకొంటే, ప్రజలు బీజేపీకే ఓటువేసి ఉండవచ్చును కనుక ఆ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయని భావించవచ్చును.

 

అయితే కేవలం మోడీ కారణంగానే పోలింగ్ శాతం పెరిగిందని చెప్పడం కూడా సరికాదు. ఎవరయినా పోలింగ్ కి అంతరాయం కలిగిస్తే వారిని ఉక్కుపాదంతో అణచివేసేందుకు ఎన్నికల కమీషన్ చాలా భారీ భద్రతా ఏర్పాట్లు చేసిందని కాశ్మీరీ వేర్పాటువాదులే స్వయంగా అంగీకరించడం గమనిస్తే, ఎన్నికల కమీషన్ చేసిన ప్రయత్నాలు కూడా పోలింగ్ పెరిగేందుకు దోహదపడ్డాయని భావించవచ్చును. మొదటి దశ ఎన్నికలలో మారు మూల గ్రామాల నుండి ప్రజలను పోలింగ్ బూతులకు తరలించేందుకు ఏకంగా 43 హెలికాఫ్టర్లను వాడటమే అందుకు మంచి నిదర్శనంగా చెప్పవచ్చును. కాశ్మీరీ వేర్పాటు వాదులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చినప్పటికీ, భారీగా ప్రజలు తరలివచ్చి ఓట్లు వేయడం మరో మంచి ఉదాహరణ. భద్రత దళాలు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినందునే ఎక్కడా ఎటువంటి ఆవంచనీయమయిన సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా మొదటి దశ ఎన్నికలు ముగిసాయి.

 

పోలింగ్ శాతం పెరగడానికి ఇంకా మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో నేటివరకు కూడా అశాంతి నెలకొని ఉంది. అందుకు రాష్ట్రాన్ని పాలించిన ఫరూక్ అబ్దుల్లా, అతని కొడుకు ఒమర్ అబ్దుల్లా, వారితో చేతులు కలిపిన కాంగ్రెస్ పార్టీలనే నిందించవలసి ఉంటుంది. వేర్పాటువాదులను ఉక్కుపాదంతో అణచి వేయవలసిన ప్రభుత్వాలు వారితో చర్చలు చేయడంతో వారు క్రమంగా బలపడ్డారు. వారికి పాకిస్తాన్ తీవ్రవాదులు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుండటంతో భూతల స్వర్గమని చెప్పుకోవలసిన జమ్మూ-కాశ్మీరు రాష్ట్రం ఒక భయానక శాశ్విత యుద్దభూమిగా మారిపోయింది. తత్ఫలితంగా ఆ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఆ పరిస్థితికి విసిగి వేసారి పోయిన ప్రజలకు బహుశః మోడీ ఒక ఆశాకిరణంగా కనిపించి ఉండవచ్చును. ఆయన చైనా, పాకిస్తాన్ దేశాలతో కటువుగా వ్యవహరిస్తున్న తీరు చూసిన తరువాతనే కాశ్మీరీ ప్రజలలో ఆయన పట్ల నమ్మకం కలిగి ఉండవచ్చును. అయితే కేవలం ఓటింగ్ శాతం పెరిగినంత మాత్రాన్న ప్రజలు బీజేపీకే ఓటేసి ఉంటారని అనుకోవడానికి కూడా లేదు. కానీ ఆ అవకాశాలున్నాయని భావించవచ్చును.

 

అయితే పెరిగిన ఈ ఓటింగ్ శాతం వలన ప్రస్తుతం అధికారంలో ఉన్న ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం పూర్తిగా తుడిచిపెట్టుకు పోవచ్చును. ఎందుకంటే ఇటీవల సెప్టెంబర్ నెలలో కాశ్మీరులో వరదలు వచ్చినప్పుడు ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అదే సమయంలో వారిని ఆదుకోవడానికి కేంద్రప్రభుత్వం పెద్ద ఎత్తున చేప్పటిన సహాయ పునరావాస చర్యలను ప్రజలు ప్రశంసిస్తున్నారు. అయినా వారు బీజేపీకి పట్టం కట్టే ఆలోచనలో లేకపోతే అప్పుడు ప్రత్యామ్నాయంగా ఉన్న పిడి.పి.కి పట్టం కట్టే అవకాశాలున్నాయి. కానీ ఒకవేళ జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో బీజేపీ కనుక విజయం సాధించి అధికారంలోకి వస్తే ఇక మోడీకి తిరుగు ఉండదని చెప్పవచ్చును. అదేవిధంగా అక్కడ పరిస్థితులలో చాలా మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు పూర్తయ్యి ఫలితాలు వెలువడితే గానీ ఎవరు గెలుస్తారో ఊహించలేము కానీ ఇమార్ అబ్దుల్లా ప్రభుత్వం మాత్రం మటుమాయం అవడం తధ్యమని ఖచ్చితంగా చెప్పవచ్చును.

By
en-us Political News

  
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు, సంప్రదింపులు జరిగాయి.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ప్రియాంక గాధీ వంటి వూరు రంగంలోకి దిగి బుజ్జగింపులు, సంప్రదింపులు జరిపారు.
ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ( మే 25) అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది.
వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు మ‌ళ్లీ తెర‌పైకి.
రెండు నెలల కాలంలోనే దాదాపు తొమ్మిది ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న పేర్లు మార్చి పాత పేర్లను ఖరారు చేశారు.
విజ‌య్ ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిగ్‌గా మారింది.
దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి పిలుపునకు అనుగుణంగా.. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.