మూర్తీభవించిన మానవత్వం..ఏంజెలీనా

Publish Date:May 16, 2013

Advertisement

 

 

 

 

ఆమె అందానికి ప్రతిరూపం... ప్రపంచ ప్రసిద్ధ నటి... ఆస్కార్ అవార్డు గ్రహీత... ఆమె మరేవ్వరోకాదు... ఏంజెలినా జోలి. ఆమె వయస్సు 37 సం.లు. ఇది నాణానికి ఒకవైపు. నాణానికి మరోవైపు చూస్తే జన్యు పరంగా వచ్చే రొమ్ము కేన్సర్ తనకు సోకే ప్రమాదం 87% ఉందని, అండాశయ కేన్సర్ వచ్చే ప్రమాదం 50% వరకు వచ్చే ప్రమాదం ఉందని వైద్యుల ద్వారా తెలుసుకున్న ఆమె క్రుంగిపోలేదు. మానసికంగా ముందు తనని తాను సిద్ధం చేసుకొని, అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఆపరేషన్ ద్వారా తన రొమ్ము కణజాలాన్ని తొలగించి దాని స్థానంలో తాత్కాలిక ఫిల్లర్లు అమర్చారు. 9 వారాల తరువాత రొమ్ముల పునర్నిర్మానంతో చివరి ఆపరేషన్ ను పూర్తి చేసుకోవడం ద్వారా రొమ్ము కేన్సర్ ప్రమాదాన్ని 87% నుండి 5% కి తగ్గించుకోగలిగారు.


        ఇక్కడ అసలు విషయం ఏమిటంటే పదేళ్ళపాటు కేన్సర్ తో పోరాడిన అనంతరం 56 ఏళ్ళ వయస్సులో జోలి వాళ్ళ అమ్మగారు రొమ్ము కేన్సర్ తో చనిపోయారు. జోలి మంచి వైద్య  పరమైన అవగాహనతో కేన్సర్ ను ఎదురించగలిగారు. అంతే కాదు, ఇలాంటి వ్యక్తిగత అంశాలని బయటకు వెల్లడించడానికి ఎవరూ ఇష్టపడరు. కాని ఆమె తన స్వీయ అనుభవం తో న్యూ యార్క్ టైమ్స్ అనే పత్రిక లో "my medical choice" అనే శీర్షిక తో ఒక వ్యాసాన్ని కూడా రాశారు.


కుటుంబ పరంగా ఈ వ్యాధుల చరిత్ర ఉన్నవాళ్ళు తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవాలని సూచించారు. మాస్టెక్టమి చేయించుకోవాలన్న నిర్ణయం అంత సులభమేమీ కాదు అని, కానీ తను ఆ నిర్ణయం తీసుకున్న తరువాత ఎంతో సంతోషంగా ఉన్నానని ఆ వ్యాసం లో పేర్కొన్నారు. ఏటా రొమ్ము కేన్సర్ తో 4,58,000ల మంది... ప్రధానంగా పేద, మధ్య స్థాయి దేశాలలో మరణిస్తున్నారని పేర్కొన్నారు.


      ఇక ఆమె వ్యక్తిత్వం విషయానికి వస్తే, అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన మైహిళ ఆమె. ఆమె ఐక్య రాజ్య సమితి ప్రత్యేక రాయబారిగా ఉన్నారు. ఘర్షణలు చెలరేగే ప్రాంతంలో లైంగిక హింసకు వ్యహిరేకంగా ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రొమ్ము కేన్సర్ కు చికిత్స తీసుకుంటూనే ఆమె Democratic Republic of Congo వెళ్ళారు. లండన్ లో జరిగిన జి8 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరయ్యారు. తాలిబాన్ ల చేతిలో దాడికి గురైన మాలాల నెలకొల్పిన బాలికల విద్యా సంస్థకు నిధులు సేకరించారు. ఆన్నింటికి మించి ఆమెకు ముగ్గురు సంతానం. మరో ముగ్గురు అనాధ పిల్లలను దత్తత తీసుకున్నారు.

      

      ఏంజెలీనా జోలి నుండి మన నటీనటులు చాలా నేర్చుకోవాలి. తాత వారసుడినని, నాన్న వారసుడినని, మేనమామ వారసుడినని తోడగోట్టే వంశమని పనికి మాలిన అంశాలపై అత్యంత శ్రద్ధ కనబరుస్తూ జబ్బలు చరుచుకునే వీరులు కనీసం తమ సినిమా పరిశ్రమలో కార్మికులనైనా ఆదుకోవాలనే ఇంగిత జ్ఞానం లేని హీరోలమని చెప్పుకునే జీరోలు. పది మంది డూపులని పెట్టుకుని తెరమీద ఇరగదీసే సాహస దృశ్యాలను చిత్రీకరిమ్పచేసుకోవడం కాదు. నటన అంటే ప్రతి డైలాగుకొకసారి నా వంశమేమితో తెలుసా, నా వంశ చరిత్ర ఏమిటో తెలుసా? అంటూ పనికిమాలిన సంభాషణలు పేల్చటం కాదు. నటుడు అనగానే అద్దాల మేడకు అంకితమై ప్రేక్షకుడికి అందనంత దూరంలో సామాన్య మానవుడికి, బడుగు జీవికి తానేదో ఒక పరమాత్ముడిలా ఒక భయంకరమైన వలయాన్ని గిరిగీసుకుని కూర్చోవటం కాదు. ఒక సామాన్య ప్రేక్షకుడు, ఒక సగటు మనిషి, ఒక బడుగు జీవి వందల్లో డబ్బులు వెచ్చించి టిక్కెట్ కొనుక్కుని సినిమా చూస్తేనే ఈ నటులంతా కోట్లకు పడగలెత్తారు. అంతే గాని దివి నుంచి భువికి ఊడి పడిన దైవాంశ సంభూతులేమి కారు వీరంతా.

          

  వీళ్ళ సినిమాలలో కథాబలం ఉండదు, వీళ్ళ వ్యక్తిత్వంలో నైతిక బలం ఉండదు. ఒక సెలబ్రిటీ 10 మందికి ఆదర్శప్రాయంగా ఎలా బ్రతకొచ్చో ఏంజెలీనా జోలి జీవితాన్ని చూసి వీళ్ళు నేర్చుకుంటే కనీసం మనుషులుగా మిగులుతారు.... లేకపోతే సినిమాలోను, నిజజీవితంలోను కూడా నటులుగానే మిగిలిపోతారు.
 

 

 

By
en-us Political News

  
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
రెండు ఉప ఎన్నికలలో ఓటమి, తాజాగా పంచాయతీ ఎన్నికలలో పార్టీ పెర్ఫార్మెన్స్ చూడటంతో ఇక తాను రంగంలోకి దిగక తప్పదని భావించినట్లు చెబుతున్నారు.
తెలంగాణ బీజేపీలో అస‌లేం జ‌రుగుతోంది?
ఈ గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌ రెండో విజ‌య‌వంత‌మైన ఏడాది ముగింపు ఉత్స‌వంగా చెప్పాలి. అయితే రేవంత్ సర్కార్ దీనిని ఒక గ్లోబ‌ల్ ఇన్వెస్ట్ మెంట్ ఈవెంట్ గా రూపొందించి గొప్పగా నిర్వహించింది. తెలంగాణ‌ను ప్ర‌పంచ రోల్ మోడ‌ల్ గా తీర్చి దిద్దేలా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించింది.
ప్రస్తుతం పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ శాఖను ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. విన్నూత్న ఆలోచ‌న‌లతో విమానయానాన్ని సామాన్యులకు చేరువ చేయడానికి, దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజాధనాన్ని తమ సొంతానికి దుబారా చేయడంలో తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు రికార్డులన్నీ తిరగరాసేశారని అంటున్నారు పరిశీలకులు. అలా అనడానికి కారణం ఇటీవల ఆర్టీఐ ద్వారా వారు పెట్టిన ఖర్చులు వెలుగులోకి రావడమే.
ఆయన ప్రయాణం చేసేది విమానంలో అయినా కెమ్లిన్ లోలాగా అన్ని సౌకర్యాలు ఉంటాయి.అలాగే ఆయన వెంట అదే తరహా మరో విమానం కూడా ఉంటుంది.ఆయన ఏ విమానంలో ప్రయాణిస్తారనేది తెలియకుండా ఉండడం కోసం ఈ ఏర్పాటు. ఆయన తినే ఆహారాన్ని పరిరక్షించే చిన్నసైజు ల్యాబ్ ,వ్యక్తిగత వంటవాడు కూడా ఉంటారు.
అగ్రరాజ్యం అమెరికా ఆగకుండా చేస్తున్న హెచ్చరికలు, విధిస్తున్న ఆంక్షలు, ఆరంభించిన టాక్స్ వార్ ను కూడా లెక్క చేయకుండా మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం రష్యాతో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా వేస్తున్న అడుగులు అమెరికా అధ్యక్షుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో దేవతలు దీవించడానికి బదులు శపిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేవుళ్లకు సంబంధించిన అంశాల్లో చిన్న వివాదం కూడా అతి పెద్ద రాద్ధాంతంగా మారిపోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దిగ్గజ దర్శకుడు రాజమౌళి.. ఇలా వారు యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వెనుక కూడా దైవ ధిక్కారం, దైవ దూషణ ఉందన్న ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తి పెద్ద వివాదంగా మారిపోతున్న పరిస్థితి.
పవన్ ఆ వ్యాఖ్యలు చేసిన వెంటనే తెలంగాణ నుంచి ఎవరూ స్పందించలేదు కూడా. కానీ తీరిగ్గా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసిన వారం తరువాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయన టార్గెట్ గా విమర్శలు గుప్పించడం విస్తుగొలుపుతోంది.
అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జగన్ సర్కార్ అనుసరించిన విధానాలు, కక్షపూరిత రాజకీయం, రాష్ట్రంలోఅభివృద్ధి ఆనవాలు లేకుండా చేసి, సంక్షేమం పేరుతో అరకొర పందేరాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న జగన్ సర్కార్ కు గత ఎన్నికలలో జనం గట్టి బుద్ధి చెప్పారు. కేవలం 11 స్థానాలలో మాత్రమే విజయం సాధించిన వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.
తెలుగు రాష్ట్రాలలో స‌ర్పంచ్ ప‌దవికి కూడా భారీ ఎత్తున ఖ‌ర్చు పెట్టేస్తున్నారు. స‌ర్పంచ్ ప‌ద‌వుల వేలంలో ఒక పంచయతీలో స‌ర్పంచ్ సీటు ఏకంగా కోటి రూపాయ‌లు ప‌లికిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్ధం చేసుకోవచ్చు.
నిన్న మొన్నటి వరకూ కాళేశ్వరం అవినీతిపైనే విమర్శలు గుప్పించి, ఆ అవినీతి వెనుక ఉన్నది మాజీ మంత్రి హరీష్ రావే అంటూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు అసలు కాళేశ్వరం ప్రాజెక్టే వేస్ట్..అంటూ బాంబు పేల్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.