రాజకీయ వలయంలో సీబీఐ

Publish Date:May 16, 2013

Advertisement

 

 

 

 

భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం "సుప్రీం కోర్టు" ఇటీవల చేసిన వ్యాఖ్యలు సర్వత్రా సంచలనం రేకెత్తించాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) పంజరంలో చిలుకలా మారిందంటూ సుప్రీం చేసిన వ్యాఖ్య దేశంలో పెద్ద దుమారాన్నే లేపింది. దానికి తోడు సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా అవునని సుప్రీం మాటలని సమర్ధించడం దేశ ప్రజలందరిని మరింత విస్మయానికి గురిచేసింది. వీటన్నిటి నేపథ్యంలో ప్రజలకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే... కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ, ప్రభుత్వమూ రెండు కుమ్మక్కై నిస్పాక్షికత లోపించిన విచారణను నిర్వహిస్తున్నదని.


సుప్రీం మాటల నేపథ్యంలో సీబీఐ కి సర్వస్వతంత్రతను కల్పించటమే ప్రభుత్వం రంజిత్ సిన్హా చేసిన ముందున్న ఏకైక పరిష్కారం. సీబీఐ కి స్వతంత్రత కల్పించటం అన్నది ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, భాజాపాలకు సుతరాము ఇష్టం లేని వ్యవహారం. ఒకటి మాత్రం నిజం- పార్టీలతో సంబంధం లేకుండా, పార్లమెంట్ బిల్ తో సంబంధం లేకుండా సీబీఐ తనకు తానుగా బాగుపడే సువర్ణావకాశాన్ని చేజేతులా జారవిడుచుకుంది. ఇప్పటికైనా సుప్రీమ్ కోర్ట్ ముందుకు వచ్చి బాహ్య ప్రభావాల బారిన సీబీఐ పడకుండా నిరోధించే చట్టాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం మంగళవారం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. సీబీఐ స్వతంత్రతను పరిపుష్టం చేసేన్దుకున్న మార్గాలు, బాహ్య ప్రభావాలనుంచి రక్షణ కల్పించటానికి ఉన్న మార్గాలపై ఈ బృందం సమాలోచనలు చేస్తుంది.

  

    ఇంతవరకు జరిగిన అన్ని సంఘటనల నేపథ్యంలో సీబీఐ ప్రవర్తన తీరును పరిశీలిస్తే.... బొగ్గు కుంభకోణంపై సర్వోన్నత న్యాయస్థానానికి సీబీఐ నివేదిక సమర్పించక ముందే ప్రభుత్వానికి చూపించింది. న్యాయశాఖా మంత్రి, ప్రధాని కార్యాలయం అధికారులు ఆ నివేదికను చూసిన వారిలో ఉన్నారు. ఈ విషయంలో న్యాయ శాఖా మంత్రి అశ్విని కుమార్, ప్రధాని కార్యాలయం అధికారులు చేసిన దానికన్నా సీబీఐ డైరెక్టర్ చేసిన నేరం తక్కువ ఎలా అవుతుంది? రాజకీయనాయకులను ఏమంటాం? నీతి, నిజాయితి అంటే ఎలా ఉంటాయో మర్చిపోయిన నీచులు వాళ్ళు. కనీసం ప్రజల సొమ్ము తింటున్న ప్రభుత్వ ఉద్యోగులైన నీతి, నిజాయతీలతో పనిచెయొద్దా?
       

 

  ఉద్యోగ విరమణ తర్వాత భారీ వేతనం, గొప్ప సోకర్యాలతో కూడుకున్న పదవుల కోసం వారు అంతగా సాగిల పడాల? ఇది ఒక్క సీబీఐ సంస్థకు మాత్రమే వర్తించదు. ఐఏఎస్ లు, ఐపిఎస్ లు, పోలీస్ డిపార్టుమెంటు, జడ్జిలు, ఇతర ప్రభుత్వ అధికారులు... ఇలా ప్రతి ప్రభుత్వ రంగ సంస్థలలోనూ రాజకీయ ప్రమేయం ఉంటే ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుంది? రాజశేఖర రెడ్డి జమానాలో జరిగిన విపరీతమైన రాజకీయ జోక్యం ఫలితంగానే ఈ రోజు పలువురు ఐఏఎస్ ఆఫీసర్లు జైల్లో మగ్గుతున్నారు.

      

  నీతి, నిజాయితీలకు ప్రాణం పెడుతూ, ఏ  రాజకీయనాయకుడిని లెక్కచెయ్యని అశోక్ ఖేమ్కా లాంటి ఆఫీసర్లు ఉన్నారు. ఎంతో నీతిమంతుడైన ఐఏఎస్ అధికారి ఆయన. అందుకే రాజకీయ నాయకులు, పాలకులు ఆయనను ఒక్క చోట కుదురుగా ఉంచటం లేదు, పనిచేసుకోనివ్వడం లేదు. అతి తక్కువ కాలం లోనే అత్యధికసార్లు బదిలీ ఐన అధికారిగా ఇప్పటికే ఆయన పేరు లిమ్కా రికార్డుల పుస్తకానికి ఎక్కింది. 1991 ఐఏఎస్ బ్యాచ్ ఆయనది. ఆయన హర్యానాలో పనిచేసారు. ఓం ప్రకాష్ చౌతాలా ప్రభుత్వంలో 5సం.ల కాలంలో 9 సార్లు బదిలీ అయ్యారు. ఆయన 21 సం.ల సర్వీస్ లో 40 సార్లు బదిలీ అయ్యారు. ఆయన నిజాయితీకి రాబర్ట్ వాద్రా అవినీతి కేసుల విషయంలో ప్రాణ హాని హెచ్చరికలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.

   

మరి ఇంతగా పేరు ప్రఖ్యాతలు గాంచిన ఆఫీసురు నీతి నిజాయితీల పరంగా ఇన్ని ఇబ్బందులు పడుతూ, ఆ ఇబ్బందులు లిమ్కా బుక్కు రికార్డ్సు వరకు వెళ్ళినా కాని కలగని చైతన్యం సుప్రీం కోర్టుకు ఈనాడు సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా వ్యవహారంలోనైనా కలగటం ఇపాతికైనా స్వాగతిన్చదగినదే.

      

చివరిగా ఒక్క మాట ఒక పదవి, అధికారం అంటే... నిజాయితీ, అవగాహన, ధైర్యం, సాహసంతో కూడుకున్న వ్యవహారం. ఈ లక్షణాలన్నీ ఉన్న అధికారి ఎవరైనా ప్రజలకోసం పాటుపడడానికి వస్తే వారిని కాపాడుకునే ప్రయత్నం లో ప్రజలందరూ సమాయత్తం అవ్వాలి. ఎందుకంటే వారి శ్రమ, తెగువ, చొరవే... భావిభారతం.   

 

By
en-us Political News

  
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు.
పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు వైసీపీలోనే ప్రచారం నడుస్తోంది. కుప్పంలో చంద్రబాబుని, హిందూపురంలో బాలకృష్ణని ఓడించడానికి అప్పట్లో పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జగన్ ఫుల్ సపోర్ట్ ఆయనకి ఉండటంతో అప్పట్లో జిల్లా నేతల్లో ఎవరూ అయన్నివ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు.
తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోడీ కేబినెట్ ప్రక్షాళనలో డీకే అరుణకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వైసీపీ తరపున గవర్నర్ కోటాలో నామినేట్ అయిన జకియా ఖానం, పందుల రవీంద్రబాబుల పదవీ కాలం నెల రోజుల్లో ముగియనుంది. దీనితో ఖాళీ అవుతున్న ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం కూటమి దక్కించుకోనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నో ఆలయాలు నిధులు లేక, ధూపదీప నైవేద్యాలు కరవై శిథిలావస్థకు చేరుకుంటుంటే.. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆలయాలకు శ్రీవాణి నిధులు కేటాయించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కొండగట్టు వంటి తెలంగాణ ఆలయాలకు టిటిడి నిధులు ఇవ్వడంపై అక్కడి కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఆలయాల అభివృద్ధికి ఏపీ నిధులు ఎందుకు కేటాయించాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన రాష్ట్రంలో మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రణాళికా బద్ధంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గత ఎన్నికలలో ఘోర పరాజయంతో కుదేలై ఉన్న వైసీపీని మరింత బలహీన పరిచే దిశగా వ్యూహాలు రచిస్తోంది.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ శ్రేణులతో పాటు.. ఆయన పార్టీకే చెందిన సొంత సామాజిక వర్గ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాలు
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కావేరి నదిపై నిర్మించ తలపెట్టిన మేకేదాటు డ్యామ్ ప్రతిపాదనను విజయ్ వ్యతిరేకించారు. తమిళనాడుకు వచ్చే నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఏ ప్రాజెక్టునైనా సహించేది లేదని ఆయన శాసనసభ వేదికగా కుండబద్దలు కొట్టారు.
ఇప్పుడు బీజేపీ సమాజ్‌వాదీ పార్టీని నిట్టనిలువుగా చీల్చేందుకు. ఆ పార్టీ ఎంపీలకు గాలం వేస్తున్నట్లు రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ మంత్రి, బీజేపీ మిత్రపక్ష నేత అయిన ఓం ప్రకాష్ రాజ్‌భర్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఏ క్షణంలోనైనా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వారీ పార్టీ ఎంపీలు కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న చర్చకు బలం చేకూరుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిపాలనా నగరంగానే కాకుండా.. ప్రపంచస్థాయి పెట్టుబడులకు, అత్యాధునిక సాంకేతికతకు కేంద్రబిందువుగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. గతంలో హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన ఆయన ఇప్పుడు అమరావతిని అంతకు మించి.. అన్నట్లుగా ముందుకు తీసుకువెడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.