రాజకీయ వలయంలో సీబీఐ

Publish Date:May 16, 2013

Advertisement

 

 

 

 

భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం "సుప్రీం కోర్టు" ఇటీవల చేసిన వ్యాఖ్యలు సర్వత్రా సంచలనం రేకెత్తించాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) పంజరంలో చిలుకలా మారిందంటూ సుప్రీం చేసిన వ్యాఖ్య దేశంలో పెద్ద దుమారాన్నే లేపింది. దానికి తోడు సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా అవునని సుప్రీం మాటలని సమర్ధించడం దేశ ప్రజలందరిని మరింత విస్మయానికి గురిచేసింది. వీటన్నిటి నేపథ్యంలో ప్రజలకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే... కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ, ప్రభుత్వమూ రెండు కుమ్మక్కై నిస్పాక్షికత లోపించిన విచారణను నిర్వహిస్తున్నదని.


సుప్రీం మాటల నేపథ్యంలో సీబీఐ కి సర్వస్వతంత్రతను కల్పించటమే ప్రభుత్వం రంజిత్ సిన్హా చేసిన ముందున్న ఏకైక పరిష్కారం. సీబీఐ కి స్వతంత్రత కల్పించటం అన్నది ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, భాజాపాలకు సుతరాము ఇష్టం లేని వ్యవహారం. ఒకటి మాత్రం నిజం- పార్టీలతో సంబంధం లేకుండా, పార్లమెంట్ బిల్ తో సంబంధం లేకుండా సీబీఐ తనకు తానుగా బాగుపడే సువర్ణావకాశాన్ని చేజేతులా జారవిడుచుకుంది. ఇప్పటికైనా సుప్రీమ్ కోర్ట్ ముందుకు వచ్చి బాహ్య ప్రభావాల బారిన సీబీఐ పడకుండా నిరోధించే చట్టాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం మంగళవారం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. సీబీఐ స్వతంత్రతను పరిపుష్టం చేసేన్దుకున్న మార్గాలు, బాహ్య ప్రభావాలనుంచి రక్షణ కల్పించటానికి ఉన్న మార్గాలపై ఈ బృందం సమాలోచనలు చేస్తుంది.

  

    ఇంతవరకు జరిగిన అన్ని సంఘటనల నేపథ్యంలో సీబీఐ ప్రవర్తన తీరును పరిశీలిస్తే.... బొగ్గు కుంభకోణంపై సర్వోన్నత న్యాయస్థానానికి సీబీఐ నివేదిక సమర్పించక ముందే ప్రభుత్వానికి చూపించింది. న్యాయశాఖా మంత్రి, ప్రధాని కార్యాలయం అధికారులు ఆ నివేదికను చూసిన వారిలో ఉన్నారు. ఈ విషయంలో న్యాయ శాఖా మంత్రి అశ్విని కుమార్, ప్రధాని కార్యాలయం అధికారులు చేసిన దానికన్నా సీబీఐ డైరెక్టర్ చేసిన నేరం తక్కువ ఎలా అవుతుంది? రాజకీయనాయకులను ఏమంటాం? నీతి, నిజాయితి అంటే ఎలా ఉంటాయో మర్చిపోయిన నీచులు వాళ్ళు. కనీసం ప్రజల సొమ్ము తింటున్న ప్రభుత్వ ఉద్యోగులైన నీతి, నిజాయతీలతో పనిచెయొద్దా?
       

 

  ఉద్యోగ విరమణ తర్వాత భారీ వేతనం, గొప్ప సోకర్యాలతో కూడుకున్న పదవుల కోసం వారు అంతగా సాగిల పడాల? ఇది ఒక్క సీబీఐ సంస్థకు మాత్రమే వర్తించదు. ఐఏఎస్ లు, ఐపిఎస్ లు, పోలీస్ డిపార్టుమెంటు, జడ్జిలు, ఇతర ప్రభుత్వ అధికారులు... ఇలా ప్రతి ప్రభుత్వ రంగ సంస్థలలోనూ రాజకీయ ప్రమేయం ఉంటే ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుంది? రాజశేఖర రెడ్డి జమానాలో జరిగిన విపరీతమైన రాజకీయ జోక్యం ఫలితంగానే ఈ రోజు పలువురు ఐఏఎస్ ఆఫీసర్లు జైల్లో మగ్గుతున్నారు.

      

  నీతి, నిజాయితీలకు ప్రాణం పెడుతూ, ఏ  రాజకీయనాయకుడిని లెక్కచెయ్యని అశోక్ ఖేమ్కా లాంటి ఆఫీసర్లు ఉన్నారు. ఎంతో నీతిమంతుడైన ఐఏఎస్ అధికారి ఆయన. అందుకే రాజకీయ నాయకులు, పాలకులు ఆయనను ఒక్క చోట కుదురుగా ఉంచటం లేదు, పనిచేసుకోనివ్వడం లేదు. అతి తక్కువ కాలం లోనే అత్యధికసార్లు బదిలీ ఐన అధికారిగా ఇప్పటికే ఆయన పేరు లిమ్కా రికార్డుల పుస్తకానికి ఎక్కింది. 1991 ఐఏఎస్ బ్యాచ్ ఆయనది. ఆయన హర్యానాలో పనిచేసారు. ఓం ప్రకాష్ చౌతాలా ప్రభుత్వంలో 5సం.ల కాలంలో 9 సార్లు బదిలీ అయ్యారు. ఆయన 21 సం.ల సర్వీస్ లో 40 సార్లు బదిలీ అయ్యారు. ఆయన నిజాయితీకి రాబర్ట్ వాద్రా అవినీతి కేసుల విషయంలో ప్రాణ హాని హెచ్చరికలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.

   

మరి ఇంతగా పేరు ప్రఖ్యాతలు గాంచిన ఆఫీసురు నీతి నిజాయితీల పరంగా ఇన్ని ఇబ్బందులు పడుతూ, ఆ ఇబ్బందులు లిమ్కా బుక్కు రికార్డ్సు వరకు వెళ్ళినా కాని కలగని చైతన్యం సుప్రీం కోర్టుకు ఈనాడు సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా వ్యవహారంలోనైనా కలగటం ఇపాతికైనా స్వాగతిన్చదగినదే.

      

చివరిగా ఒక్క మాట ఒక పదవి, అధికారం అంటే... నిజాయితీ, అవగాహన, ధైర్యం, సాహసంతో కూడుకున్న వ్యవహారం. ఈ లక్షణాలన్నీ ఉన్న అధికారి ఎవరైనా ప్రజలకోసం పాటుపడడానికి వస్తే వారిని కాపాడుకునే ప్రయత్నం లో ప్రజలందరూ సమాయత్తం అవ్వాలి. ఎందుకంటే వారి శ్రమ, తెగువ, చొరవే... భావిభారతం.   

 

By
en-us Political News

  
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
రెండు ఉప ఎన్నికలలో ఓటమి, తాజాగా పంచాయతీ ఎన్నికలలో పార్టీ పెర్ఫార్మెన్స్ చూడటంతో ఇక తాను రంగంలోకి దిగక తప్పదని భావించినట్లు చెబుతున్నారు.
తెలంగాణ బీజేపీలో అస‌లేం జ‌రుగుతోంది?
ఈ గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌ రెండో విజ‌య‌వంత‌మైన ఏడాది ముగింపు ఉత్స‌వంగా చెప్పాలి. అయితే రేవంత్ సర్కార్ దీనిని ఒక గ్లోబ‌ల్ ఇన్వెస్ట్ మెంట్ ఈవెంట్ గా రూపొందించి గొప్పగా నిర్వహించింది. తెలంగాణ‌ను ప్ర‌పంచ రోల్ మోడ‌ల్ గా తీర్చి దిద్దేలా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించింది.
ప్రస్తుతం పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ శాఖను ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. విన్నూత్న ఆలోచ‌న‌లతో విమానయానాన్ని సామాన్యులకు చేరువ చేయడానికి, దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజాధనాన్ని తమ సొంతానికి దుబారా చేయడంలో తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు రికార్డులన్నీ తిరగరాసేశారని అంటున్నారు పరిశీలకులు. అలా అనడానికి కారణం ఇటీవల ఆర్టీఐ ద్వారా వారు పెట్టిన ఖర్చులు వెలుగులోకి రావడమే.
ఆయన ప్రయాణం చేసేది విమానంలో అయినా కెమ్లిన్ లోలాగా అన్ని సౌకర్యాలు ఉంటాయి.అలాగే ఆయన వెంట అదే తరహా మరో విమానం కూడా ఉంటుంది.ఆయన ఏ విమానంలో ప్రయాణిస్తారనేది తెలియకుండా ఉండడం కోసం ఈ ఏర్పాటు. ఆయన తినే ఆహారాన్ని పరిరక్షించే చిన్నసైజు ల్యాబ్ ,వ్యక్తిగత వంటవాడు కూడా ఉంటారు.
అగ్రరాజ్యం అమెరికా ఆగకుండా చేస్తున్న హెచ్చరికలు, విధిస్తున్న ఆంక్షలు, ఆరంభించిన టాక్స్ వార్ ను కూడా లెక్క చేయకుండా మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం రష్యాతో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా వేస్తున్న అడుగులు అమెరికా అధ్యక్షుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో దేవతలు దీవించడానికి బదులు శపిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేవుళ్లకు సంబంధించిన అంశాల్లో చిన్న వివాదం కూడా అతి పెద్ద రాద్ధాంతంగా మారిపోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దిగ్గజ దర్శకుడు రాజమౌళి.. ఇలా వారు యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వెనుక కూడా దైవ ధిక్కారం, దైవ దూషణ ఉందన్న ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తి పెద్ద వివాదంగా మారిపోతున్న పరిస్థితి.
పవన్ ఆ వ్యాఖ్యలు చేసిన వెంటనే తెలంగాణ నుంచి ఎవరూ స్పందించలేదు కూడా. కానీ తీరిగ్గా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసిన వారం తరువాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయన టార్గెట్ గా విమర్శలు గుప్పించడం విస్తుగొలుపుతోంది.
అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జగన్ సర్కార్ అనుసరించిన విధానాలు, కక్షపూరిత రాజకీయం, రాష్ట్రంలోఅభివృద్ధి ఆనవాలు లేకుండా చేసి, సంక్షేమం పేరుతో అరకొర పందేరాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న జగన్ సర్కార్ కు గత ఎన్నికలలో జనం గట్టి బుద్ధి చెప్పారు. కేవలం 11 స్థానాలలో మాత్రమే విజయం సాధించిన వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.
తెలుగు రాష్ట్రాలలో స‌ర్పంచ్ ప‌దవికి కూడా భారీ ఎత్తున ఖ‌ర్చు పెట్టేస్తున్నారు. స‌ర్పంచ్ ప‌ద‌వుల వేలంలో ఒక పంచయతీలో స‌ర్పంచ్ సీటు ఏకంగా కోటి రూపాయ‌లు ప‌లికిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్ధం చేసుకోవచ్చు.
నిన్న మొన్నటి వరకూ కాళేశ్వరం అవినీతిపైనే విమర్శలు గుప్పించి, ఆ అవినీతి వెనుక ఉన్నది మాజీ మంత్రి హరీష్ రావే అంటూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు అసలు కాళేశ్వరం ప్రాజెక్టే వేస్ట్..అంటూ బాంబు పేల్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.