ఆ గణపతికి తొండం వుండదు! ఎందుకో తెలుసా?

Publish Date:Sep 9, 2016

Advertisement

వినాయక నవరాత్రులు దేశమంతటా మహా వైభవంగా సాగుతున్నాయి. అయితే, ఏ దేవుడ్ని పూజించినా తొలి పూజ తాను అందుకుని మనకు అనుజ్ఞ ఇచ్చే విఘ్నేశ్వరుడు ఈ నవరాత్రి ఉత్సవాల వేళ మరింత ముఖ్యమైపోతాడు! అంతే కాదు, గణపతి మిగతా అందరు దేవుళ్లకంటే చాలా చాలా పాప్యులర్ కూడా! చిన్న పిల్లలు మొదలు వృద్ధుల దాకా అందరికీ ఆయన ఫేవరెటే! సామాన్యంగా దేవుడి జోలికి పెద్దగా వెళ్లని యూత్ ని కూడా సినిమాలు, ప్రేమ, దోమా లాంటి అన్ని వ్యాపకాల నుంచి పదకొండు రోజులు దూరం చేసి మండపాల్లో బుద్దిగా కూర్చోబెడతాడు గణఫయ్య! అయితే, లంబోదరుడికి ఊరూరా , వీధి వీధినా పూజలందుకునే ప్రత్యేకతే కాదు ఇంకా బోలెడు విశేషాలున్నాయి. ఆయన్ని భక్తులు ఎవరికి తోచిన రూపంలో వారు పూజిస్తారు. ఒకరు మట్టితో చేస్తే మరోకరు సీసంతో, ఇంకొకరు గరికతో, మరొకరు ఆకుకూరలతో , పళ్లతో ఇలా ఇప్పటి వరకూ గణపతి రకరకాలుగా తయారు చేసుకున్న వారు బోలెడుమంది!

మట్టితో మొదలు రాతితో వరకూ... ఏ పదార్థంతో చేసినా వినాయకుడి తల ఎలా వుంటుంది? ఏనుగు ముఖంతో వుంటుంది. అందుకే, ఆయనని గజాననుడని, ఏక దంతుడని, గజవక్త్రృడని రకరకాలుగా కీర్తిస్తుంటాం. దీనికి కారణం కూడా మనకు తెలిసిందే. పార్వతీ దేవీ నలుగు పిండితో బాలుడిని చేసి ద్వారం వద్ద వుంచితే శివుడొచ్చి ఆ బాలుడి తల నరికేస్తాడు. ఆ పసివాడు పరమేశ్వరుడ్ని అడ్డగించడమే కారణం. తరువాత గణపతికి ఏనుగు తల పెట్టి తిరగి బతికిస్తాడు శంకరుడు! ఇక అప్పట్నుంచీ గజ ముఖంతోనే అందరికీ దర్శనమిస్తుంటాడు లంబోదరుడు. 

పార్వతీ దేవీ చక్కనైన బాలుడిగా ప్రాణం పోసిన ఆది గణపతికి మనందరి లాగే నర ముఖం వుండేది. మరి ఆ ముఖంతో ఇప్పుడు మనం గజాననుని చూడలేమా? మామూలుగా అయితే చూడలేమనేదే సమాధానం. కాని, తమిళనాడులోని ఆ ఒక్క ఆలయానికి వెళితే మాత్రం నర ముఖంతో వున్న గజ ముఖుని చూడొచ్చు!  తమిళనాడులోని తిరువరూర్ జిల్లాలో కూతనూర్ వద్ద పూన్ తొట్టమ్ కి దగ్గర్లో వుంటుంది తిలతర్పణపురం. పేరు వినగానే అర్థమైపోతోంది కదా దీని విశేషం ఏంటో? తిలలతో తర్పణాలు ఇవ్వటం ఇక్కడ మహా ప్రశస్తం. కాశీ, రామేశ్వరాల్లో ఎలాగైతే పితృ దేవతలకు తిల తర్పణాలు ఇస్తారో ఇక్కడ కూడా అలాగే సమర్పిస్తుంటారు. దీని వల్ల పితృ దోషం పోతుందని విశ్వాసం. 

తిలతర్పణపురం అధిష్టాన దైవం ముక్తేశ్వర స్వామి. ఈ శివుడి అర్థాంగి అయిన అమ్మవారి పేరు సువర్ణవళ్లి. సువర్ణవళ్లి, ముక్తేశ్వరుల దర్శనానికి వెళ్లిన భక్తులకు మొదట్లోనే కనిపిస్తాడు నర ముఖ గణపతి. శివాలయానికి ముందు భాగంలో ఈ ఆదిగణపతి ఆలయం వుంటుంది. మిగతా అందరు హిందూ దేవుళ్ల మాదిరిగా ఇక్కడ గజాననుడు మనిషి ముఖంతో భక్తుల్ని తరింపజేస్తుంటాడు. పార్వతీ దేవీ ప్రాణం పోసిన ఆదిమ సమయంలోని నర ముఖంతో వుంటాడు కాబట్టి ఇక్కడ ఈ వినాయకుడ్ని ఆది గణపతి అంటారు! తిలతర్పణ పుర ఆది గణపతి కేవలం రూపంలో మాత్రమే విభిన్నంగా వుండడు. ఆయన్ని పూజిస్తే కలిగే ఫలితాలు కూడా విభిన్నమే. ఆయన్ని స్వయంగా ఆగస్త్య మహర్షి సేవించాడంటారు! అంతే కాదు, ఈయన్ని మనం పూజిస్తే ఇంట్లో వారి మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొంటుందట! విద్యార్థులు, పిల్లలు ఈ ఆది దంపతుల తనయుడైన ఆది గణపతిని పూజిస్తే తిరుగులేని జ్ఞాపకశక్తి, తెలివితేటలు ప్రసాదిస్తాడని కూడా చెబుతారు!

పెద్ద తొండం, పెద్ద పెద్ద చెవులు, ఏక దంతం... వీటితో దర్శనమిచ్చే మనకు తెలిసిన అపురూప గణపతి కొత్త రూపంలో కావాలంటే తిలతర్పణ పురం తప్పక వెళ్లండి! ఆదిశంకరుడు, అమ్మవారి కృపతో పాటూ ఆది గణపతి అనుగ్రహం కూడా పొందండి!    
 

By
en-us Political News

  
ఈ గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌ రెండో విజ‌య‌వంత‌మైన ఏడాది ముగింపు ఉత్స‌వంగా చెప్పాలి. అయితే రేవంత్ సర్కార్ దీనిని ఒక గ్లోబ‌ల్ ఇన్వెస్ట్ మెంట్ ఈవెంట్ గా రూపొందించి గొప్పగా నిర్వహించింది. తెలంగాణ‌ను ప్ర‌పంచ రోల్ మోడ‌ల్ గా తీర్చి దిద్దేలా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించింది.
ప్రస్తుతం పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ శాఖను ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. విన్నూత్న ఆలోచ‌న‌లతో విమానయానాన్ని సామాన్యులకు చేరువ చేయడానికి, దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజాధనాన్ని తమ సొంతానికి దుబారా చేయడంలో తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు రికార్డులన్నీ తిరగరాసేశారని అంటున్నారు పరిశీలకులు. అలా అనడానికి కారణం ఇటీవల ఆర్టీఐ ద్వారా వారు పెట్టిన ఖర్చులు వెలుగులోకి రావడమే.
ఆయన ప్రయాణం చేసేది విమానంలో అయినా కెమ్లిన్ లోలాగా అన్ని సౌకర్యాలు ఉంటాయి.అలాగే ఆయన వెంట అదే తరహా మరో విమానం కూడా ఉంటుంది.ఆయన ఏ విమానంలో ప్రయాణిస్తారనేది తెలియకుండా ఉండడం కోసం ఈ ఏర్పాటు. ఆయన తినే ఆహారాన్ని పరిరక్షించే చిన్నసైజు ల్యాబ్ ,వ్యక్తిగత వంటవాడు కూడా ఉంటారు.
అగ్రరాజ్యం అమెరికా ఆగకుండా చేస్తున్న హెచ్చరికలు, విధిస్తున్న ఆంక్షలు, ఆరంభించిన టాక్స్ వార్ ను కూడా లెక్క చేయకుండా మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం రష్యాతో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా వేస్తున్న అడుగులు అమెరికా అధ్యక్షుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో దేవతలు దీవించడానికి బదులు శపిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేవుళ్లకు సంబంధించిన అంశాల్లో చిన్న వివాదం కూడా అతి పెద్ద రాద్ధాంతంగా మారిపోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దిగ్గజ దర్శకుడు రాజమౌళి.. ఇలా వారు యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వెనుక కూడా దైవ ధిక్కారం, దైవ దూషణ ఉందన్న ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తి పెద్ద వివాదంగా మారిపోతున్న పరిస్థితి.
పవన్ ఆ వ్యాఖ్యలు చేసిన వెంటనే తెలంగాణ నుంచి ఎవరూ స్పందించలేదు కూడా. కానీ తీరిగ్గా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసిన వారం తరువాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయన టార్గెట్ గా విమర్శలు గుప్పించడం విస్తుగొలుపుతోంది.
అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జగన్ సర్కార్ అనుసరించిన విధానాలు, కక్షపూరిత రాజకీయం, రాష్ట్రంలోఅభివృద్ధి ఆనవాలు లేకుండా చేసి, సంక్షేమం పేరుతో అరకొర పందేరాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న జగన్ సర్కార్ కు గత ఎన్నికలలో జనం గట్టి బుద్ధి చెప్పారు. కేవలం 11 స్థానాలలో మాత్రమే విజయం సాధించిన వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.
తెలుగు రాష్ట్రాలలో స‌ర్పంచ్ ప‌దవికి కూడా భారీ ఎత్తున ఖ‌ర్చు పెట్టేస్తున్నారు. స‌ర్పంచ్ ప‌ద‌వుల వేలంలో ఒక పంచయతీలో స‌ర్పంచ్ సీటు ఏకంగా కోటి రూపాయ‌లు ప‌లికిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్ధం చేసుకోవచ్చు.
నిన్న మొన్నటి వరకూ కాళేశ్వరం అవినీతిపైనే విమర్శలు గుప్పించి, ఆ అవినీతి వెనుక ఉన్నది మాజీ మంత్రి హరీష్ రావే అంటూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు అసలు కాళేశ్వరం ప్రాజెక్టే వేస్ట్..అంటూ బాంబు పేల్చారు.
లోకేష్ త‌ల్లిచాటు బిడ్డ‌గా ఎదిగారు. ఆయ‌న ఎదిగిన విధం అత్యంత ఉదాత్తం. సంస్కార‌వంతం. ఎందుకంటే తండ్రి ప్రజా నాయకుడిగా చాలా చాలా బిజీ. దీంతో లోకేష్ ని అన్నీ తానై పెంచిన జిజియా బాయి భువ‌నేశ్వ‌రి. లోకేష్ లో ఒక మాన‌వ‌త్వం, మంచి, మ‌ర్యాద, పెద్దా, చిన్నల ప‌ట్ల చూపించాల్సిన క‌రుణ- జాలి- ద‌య- ప్రేమ‌- బాధ్య‌త‌ వంటి సుగుణాల‌ు ప్రోది అయ్యేలా పెంచి పెద్ద చేశారు భువ‌నేశ్వ‌రి అని చెప్ప‌డానికి ఎన్నో నిద‌ర్శ‌నాలు.
తాజాగా ఆయన కోనసీమలో కొబ్బరికాయల దిగుబడి తగ్గడానికి తెలంగాణ వాళ్ల దిష్టి తగలడమే కారణమన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలూ వివాదాస్పదంగా మారి పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చాయి.
కాంగ్రెస్, బీజేపీల‌క‌న్నా కూడా ఈ క‌విత‌తోనే ఎక్కువ ఇబ్బంది కలుగుతోంది. పరువుపోతోందన్న మాట బీఆర్ఎస్ నేతల నుంచి వినిపిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.