ఢిల్లీ పోలీసుల వ్యూహ వైఫల్యం.!

Publish Date:Jul 21, 2026

Advertisement

 నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి నిరసనగా కాక్రోచ్ జనతాపార్టీ పిలుపు మేరకు జరిగిన పిలుపునిచ్చిన  చలో పార్లమెంటు ఆందోళన హస్తినలో  ఉద్రిక్తతలకు దారితీసింది. వేలాది మంది నిరసనకారులు ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చి పార్లమెంట్ వైపు దూసుకురావడం,  శాంతియుతంగా సాగుతుందనుకున్న ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంలో పోలీసుల వ్యూహ వైఫల్యం ప్రస్ఫుటంగా బయటపడింది. 

హస్తినలో కాక్రోచ్ జనతాపార్టీ ఆందోళనలో ఉద్రిక్తత ఏర్పడడానికి కారణం పరిస్థితిని అంచనా వేయడంలో పోలీసులు ఘోరంగా విఫలం కావడమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గత మూడు వారాలుగా చలో సంసద్ కార్యక్రమంపై   కాక్రోచ్ జనతాపార్టీ సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల  ద్వారా వరుస ప్రకటనలు ఇస్తూనే ఉంది.   ఈ నిరసనలో    పదివేల మంది వరకు  నిరసనకారులు పాల్గొనే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసులు అంచనా వేశారా. అయితే ఆ అంచనాలను తల్లకిందులు చేస్తూ.. భారీ సంఖ్యలో యువత,  విద్యార్థులు, మహిళలు  రోడ్లపైకి రావడంతో రాజధాని వీధులు జనసంద్రంగా మారిపోయాయి. 

ఈ స్థాయిలో జనం తరలిరావడానికి కాక్రోచ్ జనతా పార్టీ ముందు నుంచీ చేసుకున్న డిజిటల్ సమన్వయమే కారణంగా పరిశీలకులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది విద్యార్థులు, మహిళలు, యువకులు ఢిల్లీకి చేరుకోవడానికి వాట్సాప్ గ్రూపుల ద్వారా  పక్కాగా కమ్యూనికేట్ చేసుకున్నారు. ఈ సమన్వయాన్ని చివరి నిమిషం వరకు  నిఘా వర్గాలు పసిగట్టలేకపోవడమే ఈ పరిస్థితికి కారణమైంది. ఆందోళనకారులు చిన్న చిన్న బృందాలుగా వచ్చి ఒక్కసారిగా పార్లమెంటు ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. దీంతో  పరిస్థితి   చేయిదాటిపోయిందని భావించిన పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీనికి ప్రతిగా  ఆందోళనకారులు  పోలీసులపైకి రాళ్లు రువ్వారు. లాఠీఛార్జ్, రాళ్ల దాడులతో పార్లమెంట్ పరిసర ప్రాంతాలు రణ క్షేత్రాన్ని తలపించాయి.    

గతంలో ఎంతో సున్నితమైన నిర్భయ ఘటన సమయం లోనూ, సుదీర్ఘంగా సాగిన రైతు ఉద్యమాల సమయంలోనూ లక్షలాది మంది ప్రదర్శకులను అత్యంత సమర్థవంతంగా నిలువరించిన చరిత్ర ఢిల్లీ పోలీసులకు ఉంది. అలాంటి బలమైన పోలీస్ యంత్రాంగం ఈసారి   నిరసనకారులను ఏ దశలోనూ కంట్రోల్ చేయలేక చేతులెత్తేయడం విస్మయం గొలుపుతోంది.  

Chalo Parliament protest, NEET paper leak protest Delhi, Cockroach Janata Party protest, Parliament gate tension, Delhi protest lathi charge

By
en-us Political News

  
టెక్ మహీంద్రా కంపెనీ ముందు ధర్నాకు దిగిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి..
ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో సీఐడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో తీవ్ర చలననాన్ని రేపింది.
వరంగల్‌లో మీడియా రిపోర్టర్లతో నిర్వహించిన చిట్‌చాట్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
తన అనుచరులు, స్థానికులతో కలసి ప్రత్యేక వేదికపై కూర్చుని ఈ మౌన నిరసన చేపట్టారు. ఏలాంటి ఉపన్యాసాలు, నినాదాలు లేకుండా కేవలం మౌనంతోనే ఆయన నిరసన వ్యక్తం చేశారు. దేశ రాజథానిలో వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్రం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేతులు మారిన ప్రతీసారీ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల అంశం మళ్లీ రాజకీయ తెరపైకి వస్తుంది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన ప్రాపర్టీని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలం వేయడాన్ని సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బండ్ల గణేష్ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి విదితమే. అయితే బండ్ల గణేష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును సమర్ధించింది.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఢిల్లీ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో తాజాగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
భద్రత దృష్ట్యా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ నగరంలోని 16 మెట్రో స్టేషన్లను తదుపరి ఆదేశాలు వెలువడే వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్టేషన్లలో రైళ్లు ఆగవని పేర్కొంది. ఆయా మెట్రో స్టేషన్ల నుంచి ప్రయాణికుల ప్రవేశం, నిష్క్రమణను కూడా నిలిపివేసినట్లు తెలిపింది.
అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు సుమారు 27.65 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకోగా, మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ 400 కోట్ల రూపాయలు ఉండోచ్ని అంచనా.
లీకేజీకి బాధ్యత వహిస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని యువత డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనలకు రోజు రోజుకూ మద్దతు పెరుగుతుండటంతో.. ఇంత కాలంగా మౌనంగా ఉన్న ప్రధాని మోడీ అనివార్యంగా స్పందించాల్సి వచ్చింది.
విజిలెన్స్ విచారణ ఆధారంగా రెవెన్యూ అధికారులు విలువైన ప్రభుత్వ, ఇనాం భూములను తిరిగి తమ అధీనంలోకి తీసుకున్నారు. భూమన కరుణాకరరెడ్డి ఆక్రమించిన ఈ భూములు మార్కెట్ విలువ వంద కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.