మాల్యాను వెనక్కి పంపిచండి.. భారత విదేశాంగ శాఖ లేఖ

 

బ్యాంకుల నుండి వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకొని వాటికి ఎగనామం పెట్టి ఎంచక్కా విదేశాల్లో ఉన్న విజయ్ మాల్యాకు రోజు రోజుకు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే మాల్యా పాస్ పోర్ట్ రద్దు చేసింది కేంద్ర విదేశాంగ శాఖ. అంతేకాదు నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ చేసింది. ఇంకా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి.. ఇంటర్ పోల్ కు సమాచారం అందించడమే తరువాయి భాగం. అయితే ఇప్పుడు భారత విదేశాంగ శాఖ మరో అడుగు ముందుకేసింది. విజయ్ మాల్యాను తిరిగి ఇండియాకు పంపించాలని బ్రిటన్ హై కమిషనర్‌కు లేఖ రాసింది. మరి దీనిపై బ్రిటన్ హై కమిషనర్ ఎలా స్పందిస్తారో చూడాలి.