రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

అన్నమయ్య జిల్లాలో ఈ తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. తిరుమల నుంచి కర్నాటకలోని బాగేపల్లి వెడుతున్న టెంపుల్ ట్రావెల్ ను లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటన తంబళ్లపల్లి నియోజకవర్గ పరిధిలోని కురబలకోట మండలం చెన్నామర్రిమిట్ట వద్ద జరిగింది.

దుర్ఘటన జరిగిన సమయంలో టెంపుల్ ట్రావెల్ లో డ్రైవర్ సహా 14 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే కన్నుమూశారు. మరో తొమ్మది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటున్నారు. ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు.