మిథున్రెడ్డికి ప్రత్యేక వసతులకు కోర్టు అనుమతి
posted on Jul 22, 2025 9:30PM

ఏపీ మద్యం కుంభ కోణం కేసులో అరెస్ట్యిన వైసీపీ ఎంపీ మిథున్రెడ్డికి రాజమండ్రి సెంట్రల్ జైలులో ప్రత్యేక వసతులు కల్పించడానికి విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. జైలులో ప్రత్యేక వసతులకు కోర్టు అనుమతి ఇచ్చింది. మంచం, దుప్పటి, దిండు, వాటర్ బాటిల్స్, కూలర్, పేపర్-పెన్ను, టేబుల్, ప్రొవిజన్ ఉంటే టీవీ అనుమతించాలని కోర్టు పేర్కొంది.
పేపర్, వాటర్ బాటిల్స్, ఫుడ్ ఖర్చును మిథున్రెడ్డి భరించాలని స్పష్టం చేసింది. బయటి ఆహారం తీసుకువస్తే అండర్ టేకింగ్ లెటర్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. జైలులో ఉన్న వైద్య వసతి కల్పించాలని.. అవసరమైతే జైలు బయట వైద్య సౌకర్యం కల్పించాలని సూచించింది. న్యాయవాదులకు వారంలో మూడు సార్లు, కుటుంబ సభ్యులు వారంలో రెండు సార్లు ములాఖత్లకు కోర్టు వీలు కల్నించింది.