మాజీ మంత్రి అనిల్ యాదవ్కు బిగిస్తున్న ఉచ్చు
posted on Jul 22, 2025 7:14PM

వైసీపీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్రెడ్డిని ఏపీ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. క్వార్జ్ మైనింగ్ స్కామ్లో అనిల్కుమార్ యాదవ్ పాత్రపై కీలక వివరాలు వెల్లడించినట్లు సమాచారం. అనిల్, కాకాణితో నాకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయని శ్రీకాంత్ పోలీసులకు తెలిపినట్లు టాక్. 2023 ఆగస్టు నుంచి అనిల్, కాకాణితో క్వార్జ్ వ్యాపారం చేశాను. లీజు గడువు ముగిసిన రుస్తుం మైన్ నుంచి క్వార్జ్ తీశామని వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి క్వారీ పనులు చూసుకున్నారు.
పర్యవేక్షించినందుకు నాకు టన్నుకు రూ.1000 ఇచ్చేవారు.. క్వార్జ్ను ఏనుగు శశిధర్రెడ్డి పొలంలో డంప్ చేసేవాళ్లం. శశిధర్రెడ్డికి ఎకరాకు రూ.25 వేలు ఇచ్చేలా ఒప్పందం. రుస్తుం మైన్ నుంచి తీసిన క్వార్జ్ను చైనా పంపాం.’’ అని శ్రీకాంత్రెడ్డి తెలిపారు. దీంతో తదుపరి చర్యలపై పోలీసులు ఆలోచనలు చేస్తున్నారు. నాయుడుపేట వద్ద 50 ఎకరాల్లో వెంచర్ వేశామని హైదరాబాద్లోనూ రెండు హౌసింగ్ ప్రాజెక్టులు చేశామని మణికొండ అల్కాపురి, తుర్కయాంజల్లో వెంచర్లు వేశామని శ్రీకాంత్ పేర్కొన్నారు. మణికొండ అల్కాపురిలో హెవెన్లీ హోమ్స్ పేరిట వెంచర్ - తుర్కయాంజల్లో గ్రీన్ మెడోస్ పేరిట వెంచర్ వేశాం - 2024లో ప్రభుత్వం మారాక హైదరాబాద్కు మకాం మార్చాని కేసులకు భయపడి హైదరాబాద్కు మకాం మార్చాని శ్రీకాంత్రెడ్డి పోలీసుల విచారణలో తెలిపారు.