తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి పది గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. సోమవారం (జూన్ 30) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 10 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి పది గంటల సమయం పడుతోంది.

ఇక ఆదివారం (జూన్ 29) శ్రీవారిని మొత్తం 88 వేల497 మంది దర్శించుకున్నారు. వారిలో 29 వేల 54 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 34 లక్షల రూపాయలు వచ్చింది.