పొన్నూరు ఘటనపై వైసీపీ కావాలనే రాజకీయం చేస్తుంది : ధూళిపాళ్ల

 

పొన్నూరు దాడి ఘటనపై వైసీపీ నాయకులు కావాలనే రాజకీయం చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్‌ నాగమల్లేశ్వరరావుపై దాడి జరిగిన రోజు వైసీపీ నేతలు  కాపు కాశారని ఆరోపించారు. గతంలో టీడీపీ నేత బండ్లమూడి బాబురావు, అశోక్‌పై దాడి చేసేందుకు వైసీపీ వర్గీయులు కుట్రపన్నారని ఆరోపించారు. 

గుంటూరు జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో ధూళిపాళ్ల నరేంద్ర మీడియాతో మాట్లాడారు. కూటమిమ ప్రభుత్వంపైన బురద జల్లేందుకు, తమను అప్రతిష్ట  పాలు చేసేందుకు వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నాగమల్లేశ్వరరావుపై దాడి జరిగిన రోజు వైసీపీ నేతలు ప్లాన్ చేశారని  ధూళిపాళ్ల  ఆరోపించారు