ఔనన్నా..కాదన్నా బిల్లు ప్రవేశపెడతాం.. మోడీ

 

మంగళవారం నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఢిల్లీలో అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ విపక్ష నేతలూ.. మీరు ఔనన్నా.. కాదన్నా భూసేకరణ బిల్లును ప్రవేశపెట్టితీరుతామని.. యూపీఏ పాలనలో ఉన్న భూసేకరణ బిల్లుకు ఎన్డీఏ ప్రభుత్వం సవరణలు చేసిన నేపథ్యంలో ఈ బిల్లు ఆమోదం పొందేలా అన్ని పార్టీలు సహకరించాల్సిన అవసరముందని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్ సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఉందని.. సమావేశాలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు విపక్షాలపై కూడా ఉందన్నారు. మరోవైపు.. భూసేకరణ వంటి ముఖ్యమైన బిల్లులపై సర్కారు ముందడుగు వేస్తే దాన్ని తీవ్రంగా ప్రతిఘటించాలని కాంగ్రెస్‌తో సహా ఇతర విపక్ష పార్టీలు గట్టిగా ఉన్నాయి. మొత్తానికి ఈ సారి పార్లమెంట్ సమావేశాలు వేడిగా జరుగుతున్నాయన్నది మాత్రం అర్ధమవుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu