తమిళనాడుకు.. ఏపీకి ఉమ్మడి రాజధాని ఉందా? ప్రత్తిపాటి

తమిళనాడు పోలీసుల్ని ఏపీలో అనుమతిస్తారా? అని ఒక రిటైర్డ్ జడ్జి చేసిన వ్యాఖ్యలపై ఏపీ వ్యవసాయశాఖ మంత్రి పత్రిపాటి పుల్లారావు మండిపడ్డారు. రెండు రాష్ట్రాల రాజధాని అయిన హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు అవసరమా? లేదా? అనే విషయం ఆయనకు తెలియదా? న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తికి ఈమాత్రం తెలియదా? అని ప్రశ్నించారు. తమిళనాడు పోలీసుల్ని ఏపీలో అనుమతిస్తారా అని అడుగుతున్నారు.. తమిళనాడు, ఏపీ కి ఉమ్మడి రాజధాని లేదని.. ఒకవేళ ఉంటే అనుమతిస్తామని అన్నారు. ఏపీకీ, తెలంగాణకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాబట్టి తెలంగాణ తో పాటు ఏపీకి కూడా సమాన హక్కులు ఉంటాయని.. అందుకే హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాలని కోరుతున్నామని అన్నారు. ఈ విషయంపై గవర్నర్ వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu