ఎన్టీఆర్ రాజు పాడె మోసిన నందమూరి రామకృష్ణ, మోహనకృష్ణ
posted on Dec 19, 2025 8:24AM
.webp)
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వీరాభిమాని, ఆయన పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న ఎన్టీఆర్ రాజు బుధవారం (డిసెంబర్ 17) తిరుపతిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు గురువారం (డిసెంబర్ 18) తిరుపతిలో జరిగాయి.
రాజకీయ రంగంలో ఎన్టీఆర్ కు అఖిల భారత కార్యదర్శిగా ఎన్టీఆర్ రాజు పని చేశారు. ఎన్టీఆర్ కు, తెలుగుదేశం పార్టీకీ నిస్వార్థంగా సేవలందించారు. ఉన్నత పదవులు ఇస్తానని స్వయంగా ఎన్టీఆర్ ఆఫర్ ఇచ్చినా, మీ అభిమానిగా ఉండటమే తనకు చాలని సున్నితంగా తిరస్కరించారు ఎన్టీఆర్ రాజు. ఎమ్మెల్యేగా అవకాశం వచ్చినా వద్దని తిరస్కరించి, ఆజన్మాంతం ఎన్టీఆర్ అభిమానిగానే ఉంటానని చెప్పిన ఉన్నత వ్యక్తి ఎన్టీఆర్ రాజు. పదవులు కాదు.. ఆదర్శాలను వీడకపోవడం, అభిమానించే వ్యక్తికి అండగా నిలవడమే ముఖ్యమని చాటిన ఎన్టీఆర్ రాజు జీవితం అందరికీ స్ఫూర్తిగా నిలస్తుంది.
అటువంటి ఎన్టీఆర్ రాజు అంత్యక్రియలకు నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణ హాజర య్యారు. నందమూరి కుటుంబం తరఫున ఎన్టీఆర్ రాజు పార్ధివ దేహానికి నివాళులర్పించారు. ఆయన అంత్యక్రియలలో పాల్గొని పాడె మోశారు. ఎన్టీఆర్ రాజు మృతి తెలుగుదేశం పార్టీకీ, నందమూరి కుటుం బానికీ తీరని లోటని వారన్నారు. నందమూరి వీరాభిమానిగా ఎన్టీఆర్ రాజు ఎనలేని సేవలందిం చారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుటున్నట్టు పేర్కొన్నారు.