41 మంది మావోయిస్టులు సరెండర్
posted on Dec 19, 2025 2:10PM

మావోయిస్టులుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ముగ్గురు రాష్ట్ర నాయకులతో పాటు ఛత్తీస్ గఢ్ కు చెందిన మావోయిస్టులు సరెండర్ అయినారు. లొంగిపోయిన వారిలో హిడ్మా బెటాలియన్ కమాండర్స్ ఉన్నారు. సరెండర్ అయిన మావోయిస్టుల నుంచి 24 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
లొంగిపోయిన వారిలో కామారెడ్డికి చెందిన రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి ఎలియాస్ సంతోష్, మంచిర్యాలకు చెందిన కనికారపు ప్రభంజన్, ఒడిశా, ఛత్తీస్గఢ్కు చెందిన ఆరుగురు డివిజన్ కమిటీ సభ్యులు, ఇద్దరు సెంట్రల్ విజన్ కమాండర్లు ఉన్నారు. మిగతా మావోయిస్టులంతా ఛత్తీస్గఢ్కు చెందినవారిగా డీజీపీ శివధర్రెడ్డి పేర్కొన్నారు.