విభజనపై ఏడుస్తున్న లగడపాటి

 

 

 

సమైక్యవాదుల సభలో రాష్ట్రవిభజనను తలుచుకొని లగడపాటి రాజగోపాల్ కన్నీళ్ల పర్యంతం అయ్యారు. ఢిల్లీలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రామ్‌లీలా మైదానంలో సోమవారం భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ...మరో నాలుగు రోజులు పార్లమెంటు నడుస్తుందని, తమను సస్పెండ్ చేసి బయట పెట్టినా ఈ నాలుగు రోజుల్లో కచ్చితంగా లోనికి వెళ్లేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా తెలంగాణ బిల్లు పార్లమెంటులో వచ్చే సమయానికి లోపల అడుగుపెట్టి తీరుతామని ఆవేశంగా ప్రకటించారు. ఆ సమయంలో ఆయన హఠాత్తుగా విలపిస్తూ కూర్చుండిపోయారు. మధ్యలోనే తన ప్రసంగాన్ని ఆపేశారు. కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. వేదికపై ఉన్న అశోక్‌బాబు తదితరులు లగడపాటిని సముదాయించారు.