అక్షరాల రూ 46 లక్షలు.. అయినా ప్రాణాలు దక్కలేదు..
posted on May 28, 2021 11:30AM
కరోనా మనుషుల ప్రాణాలు తీయడమే కాదు. కరోనా వచ్చిన కొందరి ఇంట్లో భవిష్యత్ తరానికి ఆస్తులు కూడా మిగలడం లేదు. కరోనా కొందర్ని వెంటాడి వేటాడి మరి ప్రాణాలు తీస్తోంది. కరోనా కారణంగా ఎంతో మంది ఆనాధలు అయ్యారు. మరోవైపు కరొనకి ఎంత ఖర్చుపెట్టిన బూడిదిలో పోసిన పన్నీరే అవుతుంది. లక్షలు ఖర్చు పెట్టినా ప్రాణాలు దక్కడం లేదు. తాజాగా ఓ కుటుంబం కరోనా సోకిన వ్యక్తిని బ్రతికించుకునేందుకు రూ.46 లక్షలు ఖర్చు చేశారు. అయినా ప్రాణాలు దక్కలేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా.. వివరాల్లోకి వెళితే..
అది వరంగల్ జిల్లాలోని 16 డివిజన్ ధర్మారం. అతని పేరు పోలెబోయిన రాజన్ బాబు. అతను వ్యాపారం చేసుకుంటూ హైదరాబాద్ లోని కూకట్ పల్లి లి నివాసముంటున్నాడు. రాజన్కు కరోనా సోకడంతో ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం మూడు ఆస్పత్రులు మారారు. లక్షల రూపాయలు ఖర్చు చేశారు.
కొద్దీ రోజులక్రితం రాజన్ బాబు, భార్య, ఇద్దరు కుమారులకు కరోనా వైరల్ సోకింది. అందరు హోమ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే రాజన్ బాబు ఆరోగ్యపరిస్థితి విషమించడంతో అతడిని స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రిలో చేర్చారు. ఆలా మూడు ఆసుపత్రులు మార్చారు. రోజుకు లక్ష చొప్పున 46 లక్షల రూపాయలను వైద్యం కోసం ఖర్చు చేశారు. చివరకు పరిస్థితి మరింత విషమించడంతో బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు.
లక్షలు వెచ్చించినా ఆయన ప్రాణాలు దక్కలేదు. భార్య, ఇద్దరు కుమారులు ఇంకా చికిత్స పొందుతున్నారు. చికిత్స కోసం హైదరాబాద్ లోని ప్లాట్ను కూడా అమ్మారు కుటుంబ సభ్యులు. కాగా, ఇటీవల రాజన్బాబు తల్లి, సోదరి కూడా కరోనాతో మృతి చెందారు. కరోనా కాటుకు ఒకే కుటుంబంలో ముగ్గురు బలికావడంతో స్థానికంగా విషాదఛాయలు నెలకొన్నాయి.