జయలలిత విడుదలపై అప్పీల్ చేస్తాం

అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై ఉన్న కేసును కొట్టిపారేస్తూ కర్ణాటక హైకోర్టు తీర్పు నిచ్చిన సంగతి తెలిసిందే. అయితే కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును పార్టీ సవాల్ చేస్తుందని డీఎంకే అధ్యక్షుడు ఎం.కరుణానిధి తెలిపారు. ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యే హక్కు ఉందని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు రెండుసార్లు చెప్పిందని అన్నారు. అందుకే తాము అప్పీలు చేద్దామని అనుకుంటున్నామని పార్టీ జిల్లా కార్యదర్శకుల సమావేశంలో పాల్గొన్న ఆయన వెల్లడించారు. జయలలితపై వేసిన కేసులో ముందుగా ఫిర్యాదు చేసిన బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యం కూడా అప్పీలు చేయడానికే మెగ్గు చూపుతున్నారని వెల్లడించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu