తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం(ఫిబ్రవరి 15) తిరుమల వేంకటేశ్వర స్వామిని మొత్తం 78 వేల 873 మంది దర్శించుకున్నారు. వారిలో 30 వేల 65 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 85 లక్షల రూపాయలు వచ్చింది.

ఇక ఆదివారం (ఫిబ్రవరి 16) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 16 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలకు పైగా సమయం పడుతోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu