తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం(ఫిబ్రవరి 15) తిరుమల వేంకటేశ్వర స్వామిని మొత్తం 78 వేల 873 మంది దర్శించుకున్నారు. వారిలో 30 వేల 65 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 85 లక్షల రూపాయలు వచ్చింది.

ఇక ఆదివారం (ఫిబ్రవరి 16) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 16 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలకు పైగా సమయం పడుతోంది.