శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు

 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం (డిసెంబర్ 31) ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి  ఆరు గంటల సమయం పడుతోంది. ఇక సోమవారం శ్రీవారిని మొత్తం 68 వేల 298 మంది దర్శించుకున్నారు. వారిలో 16 వేల 544 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.  శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 10 లక్షల రూపాయలు వచ్చింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu