కేజ్రీవాల్ కు కోర్టు వారెంట్...


ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీ విషయంలో పరువు నష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో భాగంగా ఆయనకు అసోం కోర్టు  వారెంట్‌ జారీ చేసింది. ఈ కేసులో కేజ్రీవాల్‌ నిన్న విచారణకు హాజరు కావాల్సి ఉండగా... ఆయన హాజరుకాలేదు. దీంతో కోర్టు ఆయనపై బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. మరోవైపు దిల్లీ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంతో పాటు ముఖ్యమంత్రిగా ఆయనకున్న పనుల కారణంగా ప్రస్తుతం కోర్టుకు హాజరుకాలేకపోతున్నారని, మరింత సమయం ఇవ్వాలని కేజ్రీవాల్‌ తరపు లాయర్‌.. న్యాయమూర్తిని కోరారు. అయితే లాయర్‌ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.  తదుపరి విచారణను మే 8వ తేదీకి వాయిదా వేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu