హైదరాబాద్ జియాగూడలో భారీ అగ్ని ప్రమాదం... బాలిక మృతి, పలువురి పరిస్థితి విషమం 

హైదరాబాద్‌ పాతబస్తీలోని జియాగూడలో భారీ అగ్నిప్రమాదం  జరిగింది. ఈ ఘటనలో బాలిక మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత జియాగూడ వెంకటేశ్వరనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న ఫర్నీచర్‌ తయారీ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి బిల్డింగ్‌ మొత్తానికి వ్యాపించాయి. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా లాభంలేకపోయింది. ఈ ప్రమాదంలో గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కుల్సుంపుర జియగూడ పరిధిలోని వెంకటేశ్వరనగర్‌లో ఉన్న ఫర్నిచర్ తయారీ గోదాంలో జరిగిందీ ఘటన. భవనం మూడో అంతస్తులో ఈ తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగి పెద్ద ఎత్తున వ్యాపించాయి. దీంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే అగ్నిమాపిక సిబ్బందికి సమాచారం అందించారు. వారు సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. 
గోదాములో చిక్కుకున్న 20 మందిని రక్షించారు. వారిలో  తీవ్రంగా గాయపడిన ఆరుగురిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu