బస్సు బోల్తా- 40 మందికి గాయాలు

 

కర్నూలు జిల్లా పాణ్యం సమీపంలో ఓ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో 40 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారికి సమీప ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన కొంతమంది తీర్థయాత్రల కోసం జనతా ట్రావెల్స్కు చెందిన ఓ బస్సును బుక్ చేసుకున్నారు. వీరంతా హైదరాబాద్ నుంచి శబరిమలై వెళుతున్నారు. మహానంది వద్ద అడ్డు వచ్చిన చిన్నరాయిని డ్రైవర్ తప్పించబోయాడు. అయితే బస్సు అదుపు తప్పటంతో బోల్తా పడింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu