ఢిల్లీ క్యాబ్ ఓనర్లకు సుప్రీం ఝలక్.. సీఎన్జీ కార్లకే అనుమతి


 

ఢిల్లీలో క్యాబ్ ఓనర్లకు దిమ్మతిరిగే నిర్ణయాన్ని ఒకటి సుప్రీం కోర్టు తీసుకుంది. ఇక నుండి ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ క్యాబ్ లను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అయితే గతంలోనే దీనిపై విచారణ జరిపిన సుప్రీం.. ఏప్రిల్ 30 లోగా పెట్రోల్, డీజిలేతర సీఎన్జీ వాహనాలుగా మార్చుకోవాలని ఆదేశించింది. అయితే ఈ గడువును పొడిగించాలని క్యాబ్స్ యాజమాన్యం కోర్టులో పిటిషన్ వేయగా దీనిపై ఈరోజు విచారణ జరిపిన సుప్రీం.. గడువు పెంచేది లేదని.. మే 1నుంచి సీఎన్జీతో ఉన్న క్యాబులను మాత్రమే అనుమతిస్తామంటూ పిటిషన్ కొట్టివేసింది. అయితే, ఆల్ ఇండియా పర్మిట్ ఉన్న వాహనాలకు మాత్రం మినహాయింపునిచ్చింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu