కాశ్మీర్ లో విజయవాడ విద్యార్థి మృతి

విజయవాడ నుంచి జమ్మూకాశ్మీర్‌కు విహారయాత్రకు వెళ్లిన ఓ విద్యార్థి కాశ్మీర్‌లోని కుప్వారా వద్ద గుర్రంపై స్వారీ చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. విజయవాడ పీబీ సిద్ధార్థ పబ్లిక్ స్కూలులోని విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ఈనెల 17న విహారయాత్రకు జమ్ము కాశ్మీర్‌లోని శ్రీనగర్ ప్రాంతానికి తీసుకొని వెళ్ళింది. శ్రీనగర్ నుంచి కుప్వారా ప్రాంతానికి విద్యార్ధులు గుర్రాలపై స్వారీ చేసేందుకు వెళ్ళారు. హేమంత్ ఎక్కి స్వారీ చేస్తున్న గుర్రం అదుపు తప్పి ప్రమాదవశాత్తు మంచుగడ్డలపై జారిపడి ఊపిరాడక అక్కడికక్కడే మరణించాడు. హేమంత్ బంధువులకు పాఠశాల యాజమాన్యం ఈ సమాచారాన్ని అందజేసింది. శ్రీనగర్‌లోని ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్నినగరానికి తీసుకురానున్నట్టు చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu