తొక్కలో పిల్లి అన్న ఆది..నాలాంటి అమ్మాయి దక్కాలంటే యుద్దాలు చేయాలన్న దీపికా

ఢీ ప్రీమియర్ లీగ్ ఈ వారం  స్టైలిష్ కొరియోగ్రాఫర్స్ వచ్చి అద్దిరిపోయే పెర్ఫార్మెన్సెస్ చేసి ఫుల్ ఎంటర్టైన్ చేశారు. లాస్ట్ వీక్ నాలుగు ప్రాంతాల నుంచి నాలుగు టీమ్ లు వచ్చి తమ సత్తా చూపించాయి.  ఈ వారం మరో నాలుగు ప్రాంతాల నుంచి నాలుగు టీమ్ లు వచ్చాయి. అందులోంచి సాయి మాస్టర్ టీం "కోనసీమ పందెం కోళ్లు" పేరుతో వచ్చారు. వీళ్ళ టీంని  రిప్రెజంట్ చేయడానికి గెటప్ శీను వచ్చాడు. తర్వాత  సందీప్ మాస్టర్ టీం "వాల్తేర్ వారియర్స్" పేరుతో ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళను రిప్రెజంట్ చేయడానికి సిరి హన్మంత్ వచ్చింది. థర్డ్ టీమ్ గా ప్రభు "సైరా రాయలసీమ" పేరుతో వచ్చి దుమ్ము దిలిపారు..వీళ్ళను రిప్రెజంట్ చేయడానికి హరితేజ రాగా ఫైనల్ గా కృష్ణ మాస్టర్ అండ్ టీం "కింగ్స్ ఆఫ్ కరీంనగర్" పేరుతో వచ్చారు. ఈ టీమ్ ని రిప్రెజంట్ చేయడానికి సింగర్ మధుప్రియ వచ్చింది. ఒక్కొక్కళ్ళ ఎంట్రీ అదిరిపోయింది. ఇలా ఇప్పటికి 8 టీములు ఎనిమిది ప్రాంతాల నుంచి వచ్చాయి. నెక్స్ట్ వీక్ నుంచి ఈ టీమ్ పెర్ఫార్మెన్సెస్ అనేవి స్టార్ట్ కాబోతోన్నాయి. ఐతే పూర్తిగా డాన్స్ షో మాత్రమే ఉంటే చూసే ఆడియన్స్ లో మొనాటనీ వస్తుందని భావించిన మేకర్స్ హైపర్ ఆదిని, దీపికా పిల్లిని తీసుకొచ్చారు. వీళ్ళు మధ్య మధ్యలో కామెడీ కంటెంట్ ఇస్తూ ఆడియన్స్ ని నవ్వించబోతున్నారు. లాస్ట్ వీక్ ఆది తన మ్యారేజ్ కోసం ఈ షోకి వచ్చే టీమ్స్ నుంచే మంచి అమ్మాయిని సెలెక్ట్ చూసుకుంటాను అన్నాడు. కానీ ఈ వారం మాట మార్చి "సంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా తిరగడం ఎందుకు..పక్కనే దీపికా పిల్లి ఉండగా"   అని ప్రదీప్ తో చెప్పాడు. అప్పుడు ప్రదీప్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. కంగారు పడకు ఈ వారం మరో నాలుగు టీమ్స్ రాబోతున్నాయి అనేసరికి "తొక్కలో పిల్లితో మనకు పనిలేదు కానీ వాళ్ళను ప్రవేశ పెట్టు" అన్నాడు కామెడీగా. తర్వాత వచ్చిన టీమ్స్ అన్నిటినీ చూసాక ఫైనల్ లో మళ్ళీ మాట మార్చాడు ఆది..కొత్తవాళ్లను పరిచయం చేసుకుని ఇంప్రెస్ చేయడం కష్టం పాత పరిచయమే బెస్ట్ అనుకుంటున్నా అన్నాడు  దానికి దీపికా పిల్లి స్పందించి "నా లాంటి అమ్మాయి దక్కాలంటే యుద్దాలు చేయాలి..అసలు నా కోసం ఎంత మంది క్యూ కట్టారో తెలుసా" అంది దీపికా.."సరే నేను నీకు నచ్చేలా చేసుకుంటా ఓకే నా" అన్నాడు ఆది. "నువ్వు నాకు నచ్చడమే కాదు ప్రతీ వారం వచ్చే నా ఫామిలీ మెంబర్స్ కి కూడా నచ్చాలి..అప్పుడు మన పెళ్లి విషయం ఆలోచిస్తాను" అంది. "నువ్వు ఒక్కో ఫామిలీ మెంబర్ ని పిలువు ..నేను ఒక్కో గెటప్ లో వచ్చి మీ ఫామిలీ మెంబర్స్ ని ఇంప్రెస్ చేయకపోతే అడుగు" అని సవాల్ విసిరాడు ఆది. ఇలా వీళ్ళ కామెడీ ప్లస్ డాన్స్ కలిపి నెక్స్ట్ వీక్ నుంచి సందడి చేయబోతోంది ఢీ ప్రీమియర్ లీగ్.  

విడాకులు కోరిన స్టెల్లా..గ్రాండ్ గా సెలెబ్రేట్ చేయాలంటూ కండిషన్

  శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ చాలా కొత్తగా డిజైన్ చేశారు మేకర్స్. రావడం రావడమే విడాకుల అంశం మీద ఫోకస్ చేశారు యాదమ్మ రాజు-స్టెల్లా జంట. "ఫోన్ చూపించు నీది" అని రాజుని అడిగింది స్టెల్లా..."ఏంటి పాస్వర్డ్ పెట్టావ్..నేను యూఎస్ కి వెళ్లే ముందు సెల్ కి పాస్వర్డ్ లేదు...కానీ ఇప్పుడు పాస్వర్డ్ పెట్టావ్..నువ్వు తప్పు చేస్తున్నావ్..నాకు విడాకులు కావాలి" అని స్టెల్లా అనేసరికి తనకు కూడా విడాకులు కావాలని సెల్ ని కిందకి విసిరేసాడు రాజు. " పెళ్లి ఎంత గ్రాండ్ గా చేసుకున్నావో విడాకులు కూడా అంతే గ్రాండ్ గా కావాలి" అని అడిగింది స్టెల్లా...ఇలా ఈ వారం షో విడాకుల టాపిక్ మీద రాబోతోందని అర్ధమవుతోంది. తర్వాత ఈ షోలో చాలామంది సీరియల్స్ లో చేసిన సీనియర్ కపుల్స్ వచ్చారు. వీళ్లకు గులాబ్ జామున్ ఒకరికి ఒకరు తినిపించుకునే పోటీ పెట్టారు. తర్వాత బైక్ డ్రైవింగ్ పోటీలు పెట్టారు. ఇక చాలా రోజుల తర్వాత ఈ షోకి హైలైట్ గా సింగర్ బేబీ నిలిచారు ఈమె టాలెంట్ గురించి తెలిసి రఘు కుంచె పాటలు పాడే అవకాశాన్ని ఇచ్చారు. ఇలా ఈమె బాగా ఫేమస్ అయ్యారు.  ఈ షోలో ఆమె పాడిన "ప్రేమ ఓ ప్రేమ" అనే సాంగ్ కి ఇంద్రజ ఫిదా ఇపోయారు. అలాగే ఒక జాబ్ చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకునే ఒక వర్కింగ్ లేడీని ఈ షోలో ఇంట్రడ్యూస్ చేశారు. ఆమె కూడా డాన్స్ ఇరగదీసి వేసేసింది.  ఇక ఫైనల్ గా ప్రెగ్నెంట్ గా ఉన్న లహరిని లేడీస్ అంతా కలిసి వెళ్లి  తీసుకొచ్చి సీమంతం లాంటి చిన్న వేడుకను చేశారు. "ప్రతీ అమ్మాయికి ఇదొక మెమరబుల్ మూమెంట్...అలాంటి మూమెంట్ ని ఇంత స్పెషల్ గా అందించిన శ్రీదేవి డ్రామా కంపెనీకి బిగ్ థ్యాంక్స్" అని చెప్పింది లహరి. ఇలా నెక్స్ట్ సండే ఆడియన్స్ ని  ఎంటర్టైన్ చేయడానికి రాబోతోంది ఈ షో. ఐతే ఈ షోలో హైపర్ ఆది మాత్రం ఈ వారం కనిపించలేదు.  

నావికా సాగర్ పరిక్రమలో ఈ గ్లోబ్ మొత్తం చుట్టి వచ్చా..

ఈ వారం సూపర్ క్వీన్స్ షో మాత్రం చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. ఈ షోలో సూపర్ క్వీన్స్ అంతా కూడా కింగ్స్ వేషధారణలో వచ్చి ఎంటర్టైన్ చేశారు. లిఖిత.. పుష్పరాజ్ గెటప్ లో, సుష్మిత.. ధరణి మేకప్ తో, ప్రియాంక ..నారప్పలా, కండక్టర్ ఝాన్సీ.. భీమ్లా నాయక్ లా, మౌనిక ..ఖైదీ మూవీలో ఢిల్లీ గెటప్ లో, ఎస్తేర్.. రోలెక్స్ లా, విద్యుల్లేఖ.. కొమరంభీంలా,  ప్రశాంతి.. డీజే టిల్లు గెటప్ తో,  సుహాసిని.. బాహుబలిలా,  పవిత్ర.. అఖండ గెటప్ లో వచ్చారు. వీళ్లకు ఎన్నో రకాల ఫిజికల్ టాస్కులు ఇచ్చి ఆడించాడు ప్రదీప్.  ఇక ఈ షోకి స్పెషల్ అట్రాక్షన్ గా నేవీలో లెఫ్ట్నెంట్ కమాండర్ గా ఉన్న ఐశ్వర్య గారిని ఇన్వైట్ చేసాడు. "మీరు ఈ షోకి రావడం చాలా ఆనందంగా ఉంది. కొన్ని స్ట్రాంగ్ ప్రొఫెషన్స్ ని తీసుకునేటప్పుడు చాలా ఛాలెంజెస్ ఎదురవుతాయి...ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి...ఇలాంటి ప్రొఫెషన్ ని తీసుకోవాలి అని అంటారు. మీరు ఈ ప్రొఫెషన్ తీసుకునే ముందు ఏం అనుకున్నారు" అని ప్రదీప్ ఆమెను అడిగాడు "ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారంటే మాత్రం ఏం చదవాలి, ఏం ఉద్యోగం చేయాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనేవి ఆల్రెడీ డిసైడ్ చేసేస్తూ ఉంటారు. ఈ విషయంలో నేను మాత్రం చాలా లక్కీ...ఓపెన్ మైండెడ్ పేరెంట్స్ ఉన్నారు. ఏం చేయాలన్నా నీ ఇష్టం అనే  ఛాయస్ ని నాకే వదిలేసేవారు. అప్పుడు నేను ఇండియన్ నేవీలో జాయిన్ కావాలని డిసైడ్ అయ్యాను. నేవీలో చూసినా మెన్ , విమెన్ రేషియో ఏమీ సమానంగా లేదు. లేడీస్ ఒక అడుగు ముందుకు వేసి జెంట్స్ తో సమానం అనే విషయాన్ని ప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి. నా కెరీర్ లో అలాంటి ఎన్నో ఛాలెంజెస్ ని ఫేస్ చేసి సక్సెఫుల్ గా 2021 కి టెన్ ఇయర్స్ సర్వీస్ ని  పూర్తి చేసాను. నేను ఇండియన్ నేవీలో టెక్నికల్ ఆఫీసర్ ని. బేసిక్ వర్క్ ఏమిటి అంటే వార్ షిప్స్ ని, సబ్ మెరీన్స్ ని డిజైన్ చేసి వాటి పని తీరు చూస్తూ ఉంటాం. ఐతే నేను నేవీలో చేరాక తెలుసుకున్నది ఒకటి. రెగ్యులర్ వర్క్ కాకుండా ఏదైనా అచీవ్ చేయాలనీ అనిపించింది. అప్పుడే ఒక అవకాశం వచ్చింది. విమెన్ క్రూతో ఇండియన్ నేవీ ఒక అడ్వెంచర్ చేయాలనీ చూస్తోందని తెలిసింది. అప్పుడు ఒక ఆరుగురం సెలెక్ట్ అయ్యాము. దాని కోసం మూడేళ్లు ట్రైనింగ్ తీసుకున్నాం...2017 లో జరిగిన  ఈ మిషన్ పేరు "నావికా సాగర్ పరిక్రమ". ఈ అడ్వెంచర్  పూర్తిగా సెయిలింగ్ బోట్ మీదే సాగింది. అలా మేం ఆరుగురం ఈ గ్లోబ్ మొత్తాన్ని చుట్టి వచ్చాం...ఈ టైములో  చాలా ఛాలెంజెస్ ని ఫేస్ చేసాం. చివరికి  ఈ మిషన్ ని 2018 లో పూర్తి చేసాం. ఇక గ్యాలెంటరీ అవార్డుని తెలంగాణ నుంచి  అందుకున్న మొదటి మహిళను నేనే.." అంటూ తన అఛీవ్మెంట్స్ గురించి చెప్పారు. ఆమె బ్రేవరీకి సెల్యూట్ చేస్తూ సూపర్ క్వీన్స్ అంతా కూడా సత్కరించారు.    

జర్మనీలో నేహా చౌదరి హాఫ్ ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్స్!

నేహా చౌదరి.. బిగ్ బాస్ ప్రేక్షకులకు సుపరిచితే. ఈ మధ్య పెళ్ళి చేసుకొని జర్మనికీ వెళ్ళి అక్కడ వ్కాగ్స్ చేస్తూ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. కాగా తను జర్మనీకి వెళ్ళాక ... ఇండియాలోని వాళ్ళ అమ్మ చేతి వంట మిస్ అవుతున్నట్టు ఒక వ్లాగ్, వాళ్ళ హస్బెండ్ కి సర్ ప్రైజ్ ఇద్దామని ఒక వ్లాగ్ , ఆదివారం క్రికెట్ ఆడటం ఒక వ్లాగ్ ఇలా అప్డేడ్స్ చేస్తూ మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకుంటుంది నేహా. నేహా చౌదరి.. స్పోర్ట్స్ రిప్సెంటర్ గా కొంతమందికి తెలిసింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఎంట్రీతో ఒక్కసారిగా అందరికి తెలిసిపోయింది. బిగ్ బాస్ లో నేహా ఉంది కొన్ని రోజులే అయిన మంచి ఎంటర్టైన్మెంట్ చేసింది. దాంతో అభిమానులు తనకి సపోర్ట్ చేసారు. నేహా తన కెరీర్ ని యాంకరింగ్ తో మొదలుపెట్టింది. చిన్నప్పటి నుండి తనకి యాంకరింగ్, యాక్టింగ్ మీద ఆసక్తి ఉండేదంట. మొదట ఒక ప్రముఖ ఛానల్ లో యాంకర్ గా చేసిన నేహా చౌదరి.. మల్టీ ట్యాలెంటెడ్ అనే చెప్పాలి. న్యూస్ రీడర్ గా కొన్ని రోజులు చేసి, ఆ తర్వాత ఒక సీరియల్ లో యాక్ట్ చేసింది. అంతేకాకుండా నేహా అథ్లెటిక్, యోగా ట్రైనర్ ఇలా చెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయి. ఐపీల్ మ్యాచ్ కి స్టార్ స్పోర్ట్స్ తెలుగులో రెప్రెజెంటర్ గా చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఎంట్రీతో ఒక్కసారిగా సెలెబ్రిటీ జాబితాలోకి చేరింది నేహా.  బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాకే నేహాకి పెళ్లి జరిగింది అది కూడా బిగ్ బాస్ 6 గ్రాండ్ ఫినాలే రోజే నేహా పెళ్లి జరిగింది. నేహా పెళ్లి కూతురు గెటప్ లోనే గ్రాండ్ ఫైనల్ కి అటెండ్ అయి అందరిని ఆశ్చర్యపరిచింది. నేహా తన సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి అందులో వ్లాగ్స్ ని రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తుంటుంది. తన పెళ్ళి జరిగి సరిగ్గా ఆరు నెలలు పూర్తయ్యాయని హాఫ్ ఇయర్ యానివర్సరి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు నేహా దంపతులు. కాగా అక్కడ వారి పెళ్ళి రోజున నేహా ఆమె భర్త  కలిసి ఒక ప్లేస్ కి వెళ్ళారు. అదంతా ఆ వ్లాగ్ లో చెప్పింది నేహా.  

రిషి గురించి తెలుసుకున్న మహేంద్ర.. ప్రాణాపాయ స్థితిలో వసుధార!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్‌-800లో.. చక్రపాణి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా మహేంద్ర చూసి పిలుస్తాడు. మహేంద్రని చూసి చక్రపాణి ఆశ్చర్యపోతాడు. కాలేజీలో అడిగితే.. మీ కూతురు వసుధార ఎక్కడికో వెళ్ళిందని చెప్పారని చక్రపాణిని మహేంద్ర అడుగగా.. ఓహో వసుధార అబద్ధం చెప్పిందా అని మనసులో అనుకుంటాడు చక్రపాణి. పక్కనే మా ఇల్లు ఉంది రండి అన్ని విషయాలు మాట్లాడుకుందామని చక్రపాణి అనగా.‌ మహేంద్ర తన కార్ చెడిపోయిందని చెప్తాడు. మెకానిక్ వచ్చి రిపేర్ చేస్తుంటాడు. నా కొడుకు ఎక్కడ నాకు నిజం చెప్పండని మహేంద్ర అడుగగా.. ఇంటికి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడుకుందామని చక్రపాణి అంటాడు. చక్రపాణి వాళ్ళ ఇంటికి వెళ్ళిన మహేంద్ర.. తన కొడుకు రిషి ఎక్కడ అని అడిగితే.. నాకు తెలియదని చక్రపాణి అంటాడు. కాఫీ తీసుకురావడానికి చక్రపాణి లోపలికి వెళ్ళగా.. వసుధార వాళ్ళ అమ్మ ఫోటోకి దండ వేసి ఉండటం గమనిస్తాడు మహేంద్ర. ఏంటని చక్రపాణిని అడుగగా.‌. రిషి సర్ ఇంట్లో నుండి వెళ్ళాడని తెలిసిన వెంటనే గుండెపోటుతో చనిపోయిందని చక్రపాణి ఏడ్చేస్తాడు. ఒక్కసారిగా షాక్ అవుతాడు మహేంద్ర. మీకు మీ  భార్య దూరమైంది.. నాకు నా కొడుకు దూరమయ్యాడు ఎలా ఉన్నాడో ఏమో అని మహేంద్ర బాధపడుతుండగా.. రిషి సర్ బాగానే ఉన్నాడని చక్రపాణి అంటాడు. ఏం అన్నారు? నిజం చెప్పండని మహేంద్ర గట్టిగా అడిగేసరికి.. రిషి సర్ వసుధార ఉన్న కాలేజీలోనే లెక్చరర్‌గా చేస్తున్నాడని చెప్తాడు. దాంతో ఆలోచనలో పడిన మహేంద్ర.‌. మరి వసుధార నాకెందుకు అబద్ధం చెప్పిందని మహేంద్ర అనగా.. నేనే చెప్పొద్దని చెప్పా అని మహేంద్రతో చక్రపాణి అంటాడు. సరే అని సంతోషంతో మహేంద్ర రిషి ఉన్న కాలేజీకి వెళ్తాడు. అదే సమయంలో రిషిని ఫాలో అవుతూ వసుధార నడుస్తుంది. కాసేపు తన గతాన్ని తల్చుకుంటాడు రిషి. అలా తన కార్ దగ్గర ఉండగా.. అందరూ పరుగెడుతుంటారు. ఏం అయిందని ఒకరిని అడుగుతాడు రిషి‌.. వసుధార మేడమ్ కి యాక్సిడెంట్ అయిందని అతను చెప్తాడు. వెంటనే రిషి పరుగెత్తుకుంటూ వసుధార దగ్గరికెళ్ళి తనని చేతులతో మోసుకెళ్ళి కార్ లో పడుకోబెట్టి, వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. అలా బయటకు రిషి కార్ లో వెళ్ళగా.. ఇటునుండి మహేంద్ర కాలేజీలోకి వస్తాడు.  మహేంద్ర వచ్చి కేడీబ్యాచ్ లోని ఒకతడిని రిషి ఎక్కడ అని మహేంద్ర అడుగగా.. సర్ ఇప్పుడే బయటకు వెళ్ళాడని చెప్తాడు.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్‌ వరకు ఆగాల్సిందే.  

బొప్పాయి తిన్న స్వప్నపై సీరియస్ అయిన దుగ్గిరాల ఫ్యామిలీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -133 లో.. స్వప్న హాల్లో కూర్చొని బొప్పాయి తింటూ ఉంటుంది. అక్కడే అందరు ఉంటారు. స్వప్న బొప్పాయి తినడం అపర్ణ చూసి.. ఏం తింటున్నావని అడుగుతుంది. బొప్పాయి తింటున్న అని స్వప్న అనగానే.. అందరూ షాక్ అవుతారు. కడుపుతో ఉన్న అమ్మాయి ఎవరైనా బొప్పాయి తింటారా? నీకు తెలియపోతే ఎవరినైనా అడగాలి కదా అని అపర్ణ స్వప్నపై కోప్పడుతుంది. వెంటనే డాక్టర్ ని పిలిచి చెకప్ చెయ్యాలని అపర్ణ అంటుంది. డాక్టర్ వస్తే నేను ప్రెగ్నెంట్ కాదన్న విషయం విషయం తెలుస్తుందని స్వప్న టెన్షన్ పడుతుంది. రాజ్ ని డాక్టర్ కి కాల్ చేసి రమ్మని ఇందిరాదేవి అంటుంది. మరొక వైపు అప్పు.. వాళ్ళ ఫ్రెండ్స్ ముందు కళ్యాణ్ తో కబడ్డీ ఆడి గెలుస్తానని మాట ఇస్తుంది. అందుకు కళ్యాణ్ కి రన్నింగ్ ప్రాక్టీస్ చేపిస్తుంది అప్పు. మరొక వైపు స్వప్నని గదిలోకి తీసుకొని వచ్చిన కావ్య.. నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? ఇప్పుడు డాక్టర్ వచ్చి నీకు కడుపు లేదన్న విషయం చెప్తే అందరూ నిన్ను ఇంట్లో నుండి గెంటేస్తారు. నీకు సపోర్ట్ చేసినందుకు నన్ను కూడా అసహ్యించుకుంటారు. ఇంట్లో వాళ్ళకి మనం నిజం చెబ్దామని కావ్య అంటుంది. నిజం చెప్తే నన్ను బయటకు పంపిస్తే.. ఈ దుగ్గిరాల ఫ్యామిలీలో నీకు అడ్డు చెప్పేవాళ్లు ఉండరని ఆలోచిస్తున్నావు అంతే కదా. నువ్వేం అందరికి నిజం చెప్పాల్సిన పని లేదు. టైమ్ వచ్చినప్పుడు చెప్తాను. నువ్వు మాత్రం సైలెంట్ గా ఉండని కావ్యకి స్వప్న చెప్పి వెళ్తుంది. మరొక వైపు సేట్ నోటికి వేసిన ప్లాస్టర్ తీస్తుంది కనకం. నువ్వు ఎందుకు మా ఇంటిని తీసుకుంటాన్నానని అంటున్నావ్. నీకు ప్రతీ నెల వడ్డీ కడుతున్న అయినా ఎందుకు ఇలా చేస్తున్నారని సేటుని కనకం అంటుంది. నన్ను కిడ్నాప్ చేస్తారా? మీ సంగతి చెప్తానని సేట్ అనగానే.. నాకేం తెలియదని మీనాక్షి  అంటుంది. అసలు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చిందే నువ్వు. నువ్వు ఇంటికి రావడం. నన్ను తీసుకురావడం. అంతా సిసిటీవీలో రికార్డు అయి ఉంటుందని సేట్ చెప్పగానే.. మీనాక్షి కంగారు పడుతుంది.  ఆ తర్వాత సేటు అలా మాట్లాడుతుంటే కనకంకి కోపం వచ్చి మళ్ళీ నెత్తిపై కర్రతో కొడుతుంది. మరొక వైపు డాక్టర్ వచ్చి నేను ప్రెగ్నెంట్ కాదని ఇంట్లో వాళ్లకి చెప్తే రాహుల్ కూడా నన్ను బయటకు పంపించేస్తాడని టెన్షన్ పడుతుంది స్వప్న. అప్పుడే డాక్టర్ వస్తుంది. స్వప్నని గదిలోకి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.   

మురారి ప్రేమను కృష్ణ తెలుసుకోగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్‌-194లో..  కృష్ణ, మురారి ఇద్దరు కలిసి కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటారు. అయితే ఉల్లిపాయలను తరిగి ఒక ప్లేట్ లో వాటిని లవ్ షేప్ లో సెట్ చేసి, కృష్ణకి తెలియాలని ఇస్తాడు. కానీ తను చూడకుండా ఒక టవల్ ని ఆ ప్లేట్ మీద వేసి పాటు చేస్తుంది. దాంతో మురారి ప్రయత్నం విఫలమవుతుంది. కాసేపటికి చేపల ఫ్రై చేస్తాడు మురారి. ఆ తర్వాత చేపలు ఫ్రై అయ్యాక.. ఒక ప్లేట్ లో మళ్లీ లవ్ సింబల్ తో సెట్ చేసి కృష్ణకి ఇద్దామని అనుకుంటాడు. అప్పుడు ముకుంద అక్కడున్న రాజనర్స్ కి కాల్ చేసి.. "మురారి ఫిష్ ని సెట్ చేస్తున్నాడు.. దానిని నాకు అర్జెంట్ గా తెప్పించు" అని అంటుంది. ఒక అబ్బాయి వచ్చి ఆ ఫిష్ ముక్కని తీసుకుంటాడు. ఏం చేస్తున్నావ్ అని మురారి అడుగగా.. రాజనర్స్ మేడం ఒక పీస్ తీసుకురమ్మన్నారని అతను చెప్తాడు. ఆవిడ తీసుకురమ్మంటే తీసుకుంటావా అని కోపంగా అడుగుతాడు.. పక్కనే ఉన్న కృష్ణ.. పర్లేదు ఒక్కటే కదా తీసుకుపోనీవండని అంటుంది. ఆ తర్వాత కాసేపటికి గులాబీ పూవులతో ఒక టబ్ వాటర్ లో లవ్ సింబల్ ని సెట్ చేస్తాడు. అది చూడకుండా కృష్ణ వచ్చి అందులో టమాట పడేసి చేతులు కడుక్కుంటుంది. ఏం చేస్తున్నావని మురారి అడుగగా.. చేతులకి టమాట రసం అంటుకుందని అందుకే కడుక్కున్నానని కృష్ణ అంటుంది. దాంతో చిరాకు పడతాడు మురారి. ఏం అయింది ఏసీపీ సర్ అని కృష్ణ అడుగగా.. కొన్ని పరిస్థితులలో అంతే మనకు కనిపించేవాటిని సరిగ్గా చూడలేం.. చూసేవటిని కరెక్ట్ గా అర్థం చేస్కోలేమని మురారి అనగా.. ఏసీపీ సర్ అప్పుడప్పుడు మీరు అర్థం కాకుండా భలే మాట్లాడతారని కృష్ణ అంటుంది.  అప్పుడప్పుడు నువ్వు కూడా అర్థం కానట్టు భలే నటిస్తావని మురారి అంటాడు.   అదంతా చూసిన ముకుంద.. తన తగదిలోకి వెళ్ళి కృష్ణ, మురారీల గురించి ఆలోచిస్తుంది. ముకుంద, మురారీలు ఒకప్పుడు దిగిన ఫోటోలని మురారికి పంపిస్తుంది. ఒక బాయ్ ద్వారా పంపిస్తుంది. కొరియర్ వచ్చిందని చెప్పి ఇవ్వమని ముకుద పంపిస్తుంది. అతను అలాగే ఇస్తాడు. అది చూసిన మురారి.. రేవతి పంపించిదనుకుంటాడు. అతను విప్పి చూడగా అందులో ముకుందతో మురారి కలిసి ఉన్న ఫోటోలు ఉంటాయి. "నా దృష్టిలో నువ్వు ఆదర్శ్ భార్యవే అని ఎన్నిసార్లు చెప్పినా తనకి అర్థం కావట్లేదు.. ఇదంతా ముకుంద కావాలనే చేస్తుంది. నా మీద హోప్స్ పెట్టుకోవద్దని ముకుందకి చెప్పేస్తాను " అని మురారి అనుకుంటాడు‌. అప్పుడు కృష్ణ వస్తుంది. ‌ వెంటనే ఆ ఫోటోలని దాచేస్తాడు మురారి. ఏం అయింది సర్ అలా ఉన్నారని కృష్ణ అడుగగా.. ఏమీ లేదని మురారి అంటాడు. ఏమీ లేదంటున్నాడంటే ఏదో ఉందని అర్థం. అదేంటో ఏసీపీ సర్ చెప్తే గాని నాకు తెలియదని కృష్ణ అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్‌ వరకు ఆగాల్సిందే.  

ముద్దుల్లేకుండా తీస్తారా...ఆర్జీవీ గారు నన్ను వదలటంలేదు!

ఈటీవీలో రీసెంట్ గా "ఆలీతో ఆల్ ఇన్ వన్" అనే గేమ్ షో ఒకటి స్టార్ట్ అయ్యింది. ఈ షో కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేశారు మేకర్స్. ఇక హోస్ట్ ఆలీ చేసే కామెడీ గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పక్కర్లేదు. ఇక ఈ వారం ఎపిసోడ్ కి ఆరియానా, మెహబూబ్, అలీ రెజా వచ్చారు. ఇందులో హోస్ట్ ఆలీని బావా, బావా అంటూ రకరకాలుగా టీజ్ చేసింది ఆరియానా. వీళ్ళ ముగ్గురితో రకరకాల గేమ్స్ ఆడించారు ఆలీ. ఫస్ట్ రౌండ్ "నేడే చూడండి" లో మెహబూబ్ వచ్చి గేమ్ ఆడి టవర్ ఫ్యాన్ ని గెలుచుకున్నాడు. ఇక నెక్స్ట్ రౌండ్ "నేనైతే"లో స్క్రీన్ మీద ఇచ్చిన పిక్చర్స్ ని అల్లి ఒక కథ చెప్పాలన్నమాట...ఇందులో ముగ్గురూ రకరకాల కథలు చెప్పారు. ఆరియానా కథ అల్లేసి వెళ్ళిపోయాక అలీ రెజా ఒక షార్ట్ ఫిలిం స్టోరీ చెప్పాడు..దానికి ఆరియానా కౌంటర్ ఇచ్చింది. "ఒక క్రిటిక్ గా చెప్పాల్సి వస్తే నేను ఈ సినిమాని అఫెండ్ చేస్తున్నా..అసలు ఏమిటా స్క్రీన్ ప్లే..డైరెక్టర్ కి ఒక క్లారిటీ లేదు..పాడు లేదు..సినిమాలు తియ్యడానికి వచ్చేస్తున్నారు. ఒక ముద్దు లేదు, ఒక రొమాన్స్ లేదు..సినిమా అంటే ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ తో వస్తాం కదా. ఒక ఫైట్ లేదు, ఒక ముద్దు లేదు...ఏం సర్ ఆ పెదాలు అక్కడ పెట్టాడు కానీ అవి పోస్టర్ల వరకే" అని ఆరియానా అనేసరికి "ఇనీషియల్ గా పెడదాం అనుకున్నా కానీ హీరోయిన్ నువ్వు అని తెలిసాక అది కట్ చేసాను..డైరెక్టర్ కి ఒక విజన్ ఉంటుంది. కానీ నిన్ను అలా చూడలేకపోతున్నా " అన్నాడు అలీ రెజా. ఐతే ఈ సెకండ్ రౌండ్ లో ఆరియానా విన్నర్ అని అనౌన్సర్ చేశారు ఆలీ..."సర్ మేము ఎందుకు ఓడిపోయామో తెలుసా..మా సినిమాలో మిమ్మల్ని తీసుకోలేదు కాబట్టి" అని చెప్పాడు అలీ రెజా ఫన్నీగా. ఆ తర్వాత ఆమెకు కూడా గిఫ్ట్ ని అందించారు ఆలీ. "నువ్వు ఎక్సరసైజ్ చేస్తావా బాగా" అని ఆరియానని అడిగేసరికి "ఎస్ సర్ నేను ఎక్సరసైజ్ స్టార్ట్ చేస్తాను. జిమ్ వీడియోతో నేను ఫేమస్ కానీ నేనెప్పుడూ జిమ్ కి వెళ్ళను..కానీ మీరు ఇస్తున్న ఈ ఎయిర్ బైక్ చూసేసరికి నేను కూడా జిమ్ కి వెళదామని ఫిక్స్ అయ్యాను " అని చెప్పింది. "పెద్దాయన ఒకాయన ఉన్నాడు కదా..మన గురువు..ఆయనకు ఈ బైక్ అంటే చాలా ఇష్టం" అని చెప్పారు ఆలీ. "పెద్దాయన అనేసరికి కాదు బాలుడు అంది ఆరియానా.. ఆర్జీవీ గారు ఏంటి ఎక్కడి కెళ్ళినా వదలట్లేదు మీరు నన్ను" అని కామెడీ చేసింది ఆరియానా.

నేను బాగానే ఉన్నాను...ఆ పుకార్లను నమ్మొద్దు

షూటింగ్ టైములో తన  కాలికి గాయం అయ్యిందని దాంతో  హాస్పిటల్ లో చేరినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై సింగర్ మంగ్లీ క్లారిటీ ఇచ్చింది. దానికి సంబంధించిన ఒక మెసేజ్ ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది.  "ప్రియమైన అందరికీ , నేను ఆరోగ్యంగానే ఉన్నాను, షూటింగ్ సమయంలో నేను ప్రమాదానికి గురయ్యానని సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను మీరంతా దయచేసి నమ్మొద్దు. నేను బాగున్నానన్న విషయాన్ని  మీ అందరికీ తెలియజేయడానికి ఇది రాస్తున్నాను.  బోనాలు పండుగ నేపథ్యంలో ఒక సాంగ్  షూటింగ్ కోసం వెళ్ళాను..షూటింగ్ లో నాకు ఎలాంటి గాయాలు కాలేదు...ఇక నేను చేసిన డాన్స్ సూపర్ డూపర్ గా ఉండబోతోంది. దాన్ని మీరంతా ఆదరిస్తారని అనుకుంటున్నాను. అందరికీ బోనాలు శుభాకాంక్షలు." అని ఆ మెసేజ్ లో చెప్పారు. జానపద గేయాలకు పెట్టింది పేరు మంగ్లీ..ప్రైవేట్ సాంగ్స్ తో ఆమె ఎంతో పేరు సంపాదించుకున్నారు. యాంకర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి నెమ్మదిగా అంచలంచెలుగా  స్టార్ సింగర్ గా ఎదిగారు. మూవీస్ లో ఆమె తన సాంగ్స్ తో ఆకట్టుకుంటూ ఉంటారు. రీసెంట్ గా వచ్చిన "బలగం" మూవీ "ఊరు పల్లెటూరు" అనే పాట ఆమెకు మరింత  క్రేజ్ ని సంపాదించిపెట్టింది.  చాలా  తక్కువ టైములో ఎక్కువ సాంగ్స్ పాడిన సింగర్ గా మంగ్లీకి మంచి గుర్తింపే ఉంది.  ప్రతీ పండగకు ఆమె ఒక సాంగ్ ని రిలీజ్ చేస్తారు. అందులో భాగంగానే రీసెంట్ గా  ఆమె చేసిన ఒక సాంగ్ షూటింగ్ లో ఆమె కాలికి గాయమైందంటూ పుకార్లు వచ్చాయి. దానికి ఆమె క్లారిటీ ఇచ్చేసింది. ఇక మంగ్లీ  పాడే పాటలకు సోషల్ మీడియాలో మంచి డిమాండ్ ఉంది. ఇలా ఒక సాంగ్ ఆమె పోస్ట్ చేస్తారో లేదో అలా మిలియన్లకొద్దీ వ్యూస్ వచ్చేస్తూ ఉంటాయి.    

రాహుల్ సిప్లిగంజ్ తన గుండెల్లో ఉన్నాడని చెప్పి‌న అషురెడ్డి!

రాహుల్ సిప్లిగంజ్.. ఇప్పుడు అందరికి సుపరిచితమే. ఆర్ఆర్ఆర్ మూవీలోని 'నాటు నాటు' పాట పాడి ప్రపంచమంతా పరిచయమయ్యాడు. తన వాయిస్ తో  ఎన్నో ఫోక్ సాంగ్స్ పాడిన రాహుల్ సిప్లిగంజ్.. సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే తాజాగా 'క్రేజీ టాక్స్ విత్ ఆర్జే కాజల్' లో అషురెడ్డితో కలిసి కొన్ని రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ కి సమాధానమిచ్చాడు రాహుల్. ఆర్జే కాజల్ .. తన వాయిస్ తో కోట్లాది మందికి పరిచయమైంది. సోషల్ మీడియాలో తనకు క్రేజ్ మాములుగా లేదనే చెప్పాలి. బిగ్ బాస్ సీజన్-5  ముందువరకు తన వాయిస్ తో బిగ్ బాస్ రివ్యూలు చెప్పిన కాజల్.. బిగ్ బాస్ సీజన్-5 లో ఎంట్రీతో లైవ్ లో తన నడవడితో తనకున్న ఫ్యాన్ బేస్ ని పెంచుకుంది. బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక తనకి సినిమా అవకాశాలు పెరిగాయి. ఆర్జే కాజల్ తన సంబంధించిన విషయాలని ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా షేర్ చేస్తుంటుంది. అదే కాకుండా తన యూట్యూబ్ ఛానెల్ లో కూడా వ్లాగ్ లుగా అప్లోడ్ చేస్తుంటుంది. అయితే తాజాగా తను ఫ్యామిలితో కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేసి వ్లాగ్ చేయగా దానికి అత్యధిక వీక్షకాధరణ లభించింది. 'క్రేజీ టాక్స్ విత్ ఆర్జే కాజల్' లో మరొక వీడియోని తన ఛానెల్ లో అప్లోడ్ చేసింది కాజల్. మొన్న అషురెడ్డి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినప్పుడు రాహుల్ ఎక్కడ అని ఒక ఫ్యాన్ అడిగేసరికి.. నా గుండెల్లో ఉన్నాడని చెప్పిందని అషురెడ్డిని కాజల్ అడుగగా.. "అవును.. రాహుల్ నా గుండెల్లోనే కాదు ఇప్పుడు అందరి గుండెల్లో ఉన్నాడు" అని తెలివిగా చెప్పి తప్పించుకుంది అషురెడ్డి. అయితే మీ ఇద్దరి మధ్య ఉంది స్నేహమా? లేక ఏంటని కాజల్ అడుగగా.. మా మధ్య ఏం లేదు. అప్పుడప్పుడు అలా చిల్ అవుతుంటాం. చిన్నచిన్న వాటికి గొడవపడతామని, వాటిని కవర్ చేసుకోడానికి ఇలా క్లోజ్ గా ఉన్న ఫోటోలు పెడతామని రాహుల్ చెప్పాడు. మరి వీళ్ళ మధ్య ఏం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.    

నీ డాన్స్ నచ్చలేదు...నా కాళ్ళు విరిగిపోయినా కూడా డాన్స్ చేస్తాను

  "నీతో డాన్స్" ఈ వారం ఎపిసోడ్ లో టీం బిలో  రెండు జంటల మధ్య మార్క్స్ విషయంలో కొన్ని క్లాషెస్ వచ్చాయి. ఆట సందీప్-జ్యోతి  చేసిన డాన్స్ కి 8 మార్క్స్ ఇచ్చారు అమరదీప్-తేజు జంట. ఆ తర్వాత ప్రియాంక-శివ్ ఇద్దరూ చేసిన పెర్ఫామెన్స్ కి కూడా 8 మార్క్స్ ఇచ్చారు..దీపా-సాగర్ మాత్రం 6 మార్క్స్ ఇచ్చారు. సందీప్-జ్యోతి జంట కూడా 6 మార్క్స్ ఇచ్చారు. ఇక శివ్ డాన్స్ మీద సందీప్ మాట్లాడాడు. "శివ్ నీ డాన్స్ నాకు నచ్చలేదు. ఇదంతా మీ కొరియోగ్రాఫర్ దే తప్పు. స్టేజి మీద ఎప్పుడు పెర్ఫార్మ్ చేసినా కూడా గర్ల్స్ , బాయ్స్ అలా పరిగెత్తుకుని రాకూడదు ..కొంచెం స్పేస్ ఇవ్వాలి. మీరు బాగా చేయగలరు..నేను ఇలా చేయొచ్చో లేదో తెలీదు...నేను గనక కొరియోగ్రాఫ్ చేస్తే చింపి చాట చేస్తాను..ప్రతీ సాంగ్ కి డిఫరెన్స్ అనేది చూపించాలి. అంతా బాగా చేశారు కానీ యాక్ట్ లో కొంచెం మిస్ అవుతోంది" అని చెప్పాడు. ఇక తర్వాత అమరదీప్ ని ఒక ప్రశ్న అడిగింది జ్యోతి. "మా పెర్ఫార్మెన్స్ కి ప్రియాంక - శివ్ పెర్ఫార్మెన్స్ కి 8 మార్క్స్ ఇచ్చావ్..రెండూ సమానంగా అనిపించాయా" అని అడిగింది. "తప్పులు ఉన్నా కూడా సాంగ్ నచ్చి ఒక మార్క్ ఇచ్చాను" అని చెప్పాడు అమరదీప్.."మనస్ఫూర్తిగా చెప్పు" అని సందీప్ అడిగేసరికి "నేను చెప్తాను..మీరు ఆల్రెడీ కొరియోగ్రాఫర్" అని శివ్ చెప్పబోతుండగా "ఆ మాట అనొద్దు..అందరం ఒకే సీట్స్ లో కూర్చుంటున్నాం..ఒకే ఫ్లోర్ మీద డాన్స్ చేస్తున్నాం..నాకు రెండు కాళ్లకు ఆపరేషన్ అయ్యింది. లిగమెంట్ ఉంది..ఐనా కూడా డాన్స్ చేయడాన్ని ప్రేమిస్తాను ..కాళ్ళు విరిగిపోయినా కూడా ఇక్కడే డాన్స్ చేస్తా ..మళ్ళీ ఈ మాట నాకు..మనమంతా ఇక్కడ ఈక్వల్ ..మీరు బాగా చేస్తున్నారు. కానీ మీకు తగ్గట్టు మీ కొరియోగ్రాఫర్ చెయ్యట్లేదు అనేదే నా బాధ" అని చెప్పాడు. ఎలిమినేషన్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మార్క్స్ ఇవ్వండి అని చెప్పింది శ్రీముఖి.  

ఆయన నన్ను హగ్ చేసుకోకపోతే ఆరోజు ఇరిటేటింగ్ గా ఉంటుంది

"నీతోనే డాన్స్" షోలో ఈ వారం జంటలన్నీ బాగా డాన్స్ చేసి అందరినీ ఫిదా చేసేశాయి. కాస్ట్యూమ్స్, తీసుకున్న థీమ్ తో ఓ రేంజ్ దుమ్ము దులిపేసారు. అలాంటి జోడీస్ లో సాగర్-దీప జోడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీళ్ళు లాస్ట్ వీక్ కూడా మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. ఈ వారం కూడా చేసారు కానీ లాస్ట్ వీక్ వచ్చినన్నీ మార్క్స్ మాత్రం ఈ వారం రాలేదు. "సాగర్ నిన్ను ఎంత ఇష్టపడతాడు అనే టాపిక్ చాలామందిలో ఉంది..సాగర్ నిన్ను ఎంత ఇష్టపడతాడో చెప్పు:అని శ్రీముఖి అడిగేసరికి " ఈరోజు మార్నింగ్ ఫైట్ అయ్యింది. సెట్ కి రావడం ఆలస్యమైపోతుందని దీపాని క్యాబ్ బుక్ చేయమన్నాను...ఐతే దీపా పుచ్చకాయ కట్ చేస్తోంది. నేను క్యాబ్ బుక్ చేయమనేసరికి బాగా కోపం వచ్చేసింది నన్నే బుక్  చేయమంది.. ఇక్కడికి వచ్చాక కూడా ఆ డిస్టర్బన్స్ పోలేదు.. ఆమె కోపం తగ్గించడానికి నేనే ఆమెకు దోశ తినిపించాను." అని సాగర్ ఫన్నీగా తమ మధ్య జరిగిన విషయాలను చెప్పారు. "అవును నేను విన్నాను..దోశ ఎలా ఉంది అని అడిగారు" అంటూ ప్రియాంక మధ్యలో వచ్చి చెప్పేసరికి "ఐనా పక్కింటివాళ్ల విషయాలు ఎందుకు వింటున్నావు.. " అని శ్రీముఖి అడిగింది. "ఆయన మరి అంత గట్టిగా అడిగారు..అది నాకు వినిపించింది" అని చెప్పింది సీరియస్ గా. "శివ్ మీ ఆవిడని కంట్రోల్ లో ఉంచుకో" అని మళ్ళీ శ్రీముఖి అనడంతో "ప్రేమ ఎక్కడ ఉంటుందో గొడవలు కూడా అక్కడే ఎక్కువగా ఉంటాయి.. ఐనా ఆవిడే నన్ను కంట్రోల్ లో పెడుతుంది" అంటూ టంగ్ స్లిప్ అయ్యాడు శివ్. "మరి రాధమ్మ మీరు మీ ఆయన మధ్య ఎప్పుడైనా ఐ లవ్ యు, ఐ మిస్ యు లాంటి మెసేజెస్ ఉంటాయా" అని శ్రీముఖి అడిగింది. "ఆయన బయటికి వెళ్ళేటప్పుడు నా నుదిటి మీద ఒక ముద్దు ఇస్తారు...అలాగే ఇంటికి తిరిగి వచ్చాకా ఏదో పదేళ్ల తర్వాత కలుసుకున్నట్టుగా ఒక హగ్ , కిస్ ఇస్తారు. నాకు ఆయన అలా ఇవ్వకపోతే మాత్రం కొంచెం ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది ఆరోజు " అని చెప్తూ సిగ్గుపడిపోయారు రాధ.  

పద్మావతి కళ్యాణం సెట్ లో హరిత జాకీ దావత్!

హరిత జాకీ.. టెలివిజన్ సీరియల్స్ లో నటిస్తూ పాపులారిటీ సంపాదించుకున్న నటి. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న 'పద్మావతి కళ్యాణం' సీరియల్ లో మహాలక్ష్మి పాత్రలో నటిస్తుంది. చెన్నై లో పుట్టి పెరిగిన హరిత.. తన పదిహేనవ ఏటనే సినిమాలలో నటించింది. అయితే తనకి సీరియల్స్ తో మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి. జాకీని పెళ్ళి చేసుకుంది హరిత. వాళ్ళిద్దరు దూరదర్శన్ లో వచ్చే కార్యక్రమాలలో కలిసి నటించేవారు. ఆ తర్వాత ఈటీవిలో ప్రసారమైన 'సంఘర్షణ' సీరియల్ లో తొలిసారి తన భర్త జాకీతో‌ కలిసి నటించింది. అప్పటి నుండి చాలా సీరియల్స్ లలో ఇద్దరు కలిసి నటించారు. అయితే జీ తెలుగులో ప్రసారమైన 'కలవారి కోడళ్ళు' సీరియల్ లో తను చేసిన నటనకి గాను అవార్డ్ కూడా వచ్చింది. ఆ తర్వాత వరుసగా సీరియల్స్ లో నటిస్తూ టాప్ మోస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ గా ఎదిగింది. అయితే జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'ముద్ద మందారం' లో అఖిలాండేశ్వరి గా చేసిన తనకి  విమర్శకుల  ప్రశంసలు దక్కాయి.  అయితే తనకి సంబంధించిన ప్రతీ అప్డేట్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్ లుగా చేస్తూ అప్లోడ్ చేస్తుంటుంది. నేచర్ ఇచ్చింది ఇది అంటూ వర్షాల గురించి ఒక వ్లాగ్, వాళ్ళ అమ్మ బర్త్ డే కి తిరుపతికి వెళ్తున్నట్టుగా ఒక వ్లాగ్ చేసి తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయగా.. అవి ఎంతగా వైరల్ అయ్యాయో అందరికి తెలిసిందే. ఇప్పుడు తాజాగా పద్మావతి కళ్యాణం సీరియల్ సెట్ లో ఒక వ్లాగ్ ని చేసింది హరిత జాకీ. అక్కడ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారంటూ ఖాళీ దొరికినప్పుడు ఇలా సరదగా మాట్లాడుకుంటామని హరిత ఈ వ్లాగ్ లో చెప్పింది. కాగా ఇప్పుడు ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.  

కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో కీలక మలుపు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'.  ఈ సీరియల్  సరికొత్త మలుపుకి తిరగనుందా అంటే అవుననే చెప్పాలి. తాజా మంగళవారం నాటి ఎపిసోడ్‌ ప్రోమోలో కృష్ణకి ముకుంద ఎదురవుతుంది. అక్కడ ఫామ్ హౌస్ లో ముకుందని చూసిన కృష్ణ షాక్ అవుతుంది. ఇక్కడ నువ్వేంటి ముకుంద  అని అడిగిన కృష్ణని.. పక్కకి తీసుకెళ్తుంది ముకుంద.. ఈ సీరియల్ లో మొదటగా మురారి, ముకుంద ప్రేమించుకుంటారు. ఆ తర్వాత కొన్ని రోజులకి వాళ్ళిద్దరూ దూరమవుతారు. మురారి పోలీస్ గా ఉద్యోగం వచ్చాక.. ఒక క్రిమినల్ ని పట్టుకునే పరిస్థితులలో.. మురారి కింద హెడ్ కానిస్టేబుల్ గా చేస్తున్న కృష్ణ వాళ్ళ నాన్న చనిపోతాడు. అయితే వాళ్ళ నాన్నని మురారి చంపడం చూసిన కృష్ణ షాక్ అవుతుంది. తను చనిపోతున్నానని తెలుసుకున్న కృష్ణ వాళ్ళ నాన్న.. మురారీతో కృష్ణ పెళ్ళి జరిపిస్తాడు. అయితే మురారి వాళ్ళ అన్న ఆదర్శ్, ముకుందని పెళ్ళి చేసుకుంటాడు. అయితే అదే సమయంలో ముకుంద, మురారిని ప్రేమిస్తుందని తెలుసుకున్న ఆదర్శ్ ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. అలా ముకుంద ఒక్కతే ఉండి, కృష్ణ మురారీలు కలిసి ఉండటాన్ని చూడలేకపోతుంది. ఎలాగైనా కృష్ణ, మురారీలను విడదీయాలని ముకుంద చూస్తుంటుంది. అయితే తాజాగా జరుగుతున్న ఎపిసోడ్‌ లలో కృష్ణ, మురారీ ఇద్దరు కలిసిపోవాలని రేవతి వాళ్ళ ఫామ్ హౌస్ కి పంపిస్తుంది. అయితే వాళ్ళకంటే ముందే ముకుంద వెళ్ళి.. అక్కడ ఫామ్ హౌస్ మి చూసుకుమే ఆమెకు డబ్బులు ఇచ్చి తను కొన్నిరోజులు అక్కడ ఉంటానని చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరిని ఫాలో అవుతూ ఉంటుంది. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో కృష్ణకి ముకుంద నిజం చెప్పినట్టే తెలుస్తుంది. మురారి ప్రేమించింది తననే అని కృష్ణతో, ముకుంద చెప్తున్నట్టుగా ఉంది. అయితే ఇది నిజంగా జరిగిందా? లేక కృష్ణతో ముకుంద చెప్తున్నట్టు మురారి కలగన్నాడా?  లేక ముకుందనే కలగంటుందా లాంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ సీరియల్ మరింత హైప్ ని క్రియేట్ చేసింది. అయితే మురారి ప్రేమించిన అమ్మయి ముకుందనే అని కృష్ణకి తెలిసిపోయిందా తెలియాలంటే ఈ సీరియల్ చూడాల్సిందే.   

రిషి కోసం వసుధార చెప్పిన అబద్ధం .. అందరికి క్షమాపణలు చెప్పిన కేడీబ్యాచ్! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -799 లో.. రిషి ఏంజెల్ కోసం చపాతి చేస్తుంటాడు. నువ్వు ఎందుకు ఎప్పుడు లవ్ లో ఫెయిల్ అయిన వాడిలాగా డల్ గా ఉంటావ్? నీకు లవ్ స్టోరీ ఏమైనా ఉందా అని రిషిని అడుగుతుంది ఏంజెల్. రిషి సైలెంట్ గా ఉంటాడు. అప్పుడే ఏంజెల్ కి  వసుధార  కాల్ చేస్తుంది. నొప్పి తగ్గిందా అని అడుగుతుంది వసుధార.. తగ్గింది నువ్వు మా ఇంటికి రావొచ్చు కదా వసు.. నేను చపాతి చేస్తున్నాను, రిషి నాకు హెల్ప్ చేస్తున్నాడని వసుధారతో ఏంజెల్ అంటుంది. అలా ఏంజెల్ చెప్పగానే.. వసుధార, రిషి ఇద్దరు కలిసి చపాతీలు చేసిన విషయాన్ని గుర్తుచేసుకుంటుంది వసుధార. కాసేపు‌ వాళ్ళిద్దరి మాటలు విన్న రిషి మౌనంగా ఉంటాడు. నాతో కలిసి చపాతి చేసినట్లే ఏంజెల్ తో కూడా కలిసి చేస్తున్నాడా... రిషి సర్ గురించి తప్పుగా అనుకోవద్దని వసుధార అనుకుంటుంది. మరొకవైపు మహేంద్ర రెడీ అయి బయటకు వెళ్తుంటే.. ఏంటి మహేంద్ర ఎక్కడికి వెళ్తున్నాడని జగతి అనుకొని తనకి మెసేజ్ చేస్తుంది. అలా మెసేజెస్ చేయగానే మహేంద్ర చూసి.. ధరణికి ఫోన్ చేసి ఫోన్ ని స్పీకర్ లో పెట్టమంటాడు.. పక్కనే జగతి ఉంటుంది. "నీ ప్రాబ్లెమ్ ఏంటి? నాకు ఎందుకు మెసేజ్ చేస్తున్నావ్? నేను ఎక్కడికి వెళ్తే నీకేంటి? నా కొడుకుని నాకు దూరం చేసావ్" అని మహేంద్ర ఇండైరెక్ట్ గా జగతితో అంటాడు. మహేంద్ర అన్న మాటలకు జగతి బాధపడుతుంది. ఆ తర్వాత మహేంద్ర కాల్ కట్ చేస్తాడు. చిన్నఅత్తయ్య.. ఎన్ని రోజులు ఇలా ఉంటారు. ఇప్పటికైనా నిజం చెప్పండని జగతితో ధరణి అంటుంది. మరొక వైపు మహేంద్ర వసుధారని కలవడానికి కాలేజీ వస్తాడు. మహేంద్రని చూసిన వసుధార.. కాలేజీ ఫ్యూన్ తో తను లేనని చెప్పిస్తుంది. మహేంద్ర తిరిగి వెళ్లిపోతుండగా మహేంద్రను రిషి చూస్తాడు. ఈ వసుధార నా గురించి ఏమైనా చెప్పిందా అని కోపంగా ఉంటాడు రిషి. నిజం చెప్పలేదు.. నేను ఇక్కడ లేనని ఫ్యూన్ తో చెప్పించానని.. మీకోసమే అబద్ధం చెప్పానని రిషికి వసుధార వాయిస్ మెసేజ్ చేస్తుంది. అప్పటిదాకా కోపంగా ఉన్న రిషి.. అది విని నార్మల్ అవుతాడు. ఆ తర్వాత కేడి బ్యాచ్ తమ తప్పు తెలుసుకొని కాలేజీలో మోకాళ్ళ పై కూర్చొని ఉంటారు. వాళ్ళు చేసిన తప్పులకి  లెక్చరర్లని క్షమాపణ అడుగుతారు కేడీబ్యాచ్. రిషి సర్ వల్లే మా తప్పు తెలిసిందని కేడి బ్యాచ్ అంటారు. మరొకవైపు దారిలో వెళ్తుండగా..  మహేంద్ర కార్ ఆగిపోవడంతో మెకానిక్ కోసం చూస్తుంటాడు‌. అటుగా వెళ్తున్న చక్రపాణిని మహేంద్ర చూసి ఎలాగైనా నిజం తెలుసుకోవాలని అనుకుంటాడు. చక్రపాణిని మహేంద్ర పిలుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

కృష్ణ, మురారీల అన్యోన్యత చూసి అసూయపడుతున్న ముకుంద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్‌-193 లో.. కృష్ణ, మురారీ ఇద్దరు ఫామ్ హౌస్ లో ఉంటారు. వాళ్ళనే గమనిస్తూ ముకుంద ఉంటుంది. మురారి తన డైరీ కోసం గదిలోకి వెళ్ళి కృష్ణ తీసుకొచ్చిన బ్యాగ్ లో చూస్తుంటాడు. అందులో ఉన్న కృష్ణ వాళ్ళ అమ్మ, నాన్నల ఫోటోలు చూసి వారికి థాంక్స్ చెప్పుకుంటాడు. బ్యాగ్ మొత్తం వెతికినా డైరీ కనిపించకపోయేసరికి.. అది ముకుంద తీసిందేమోనని అనుమానం వస్తుంది. మరి ముకుంద చదివితే ఏం అవుతుంది.. కృష్ణని ప్రేమిస్తున్నాని, మమ్మల్ని విడదీయాలని చూస్తుందని మురారి అనుకుంటాడు. అది జరుగకూడదు ఒకసారి అమ్మకి కాల్ చేద్దామని రేవతికి కాల్ చేస్తాడు మురారి. రేవతికి మురారి కాల్ చేయగానే.. మురారిని ఏం మాట్లాడనీయకుండా కృష్ణ ఎక్కడుందని రేవతి అడుగుతుంది. తను కిచెన్ లో ఉంది.. నేను రూంలో ఉన్నానని మురారి అంటాడు. ఇద్దరిని ఒకేదగ్గర ఉండమని చెప్పాను కదా.. నేను ఇప్పుడు కృష్ణకి కాల్ చేస్తాను.. నువ్వు ఎక్కడున్నా తనకి ఫోన్ చేసేసరికి నువ్వు తన పక్కన ఉండాలని మురారీతో రేవతి చెప్తుంది‌. ఆ తర్వాత కృష్ణ దగ్గరికి మురారి వెళ్తాడు. కృష్ణకి కాల్ చేసిన రేవతి.. మురారి పక్కన ఉన్నాడా? అని అడుగగా.. ఉన్నాడని కృష్ణ చెప్తుంది. సరే కలిసి హ్యాపీగా ఉండండని చెప్పి కాల్ కట్ చేస్తుంది రేవతి. ఆ తర్వాత ఇద్దరు కలిసి తోటలోకి వస్తారు.  కాసేపు ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇక ఇద్దరు కలిసి వెళ్తుండగా.. కట్టెల పొయ్యిని చూస్తుంది కృష్ణ. దాని మీద వంట చేసకొని తిందామని కృష్ణ చెప్పగా సరేనని మురారి అంటాడు. ఆ తర్వాత కట్టెల కొట్టుకురమ్మని ముకుందకి కృష్ణ చెప్తుంది. ఆ తర్వాత కట్టెలపొయ్యి మీద అన్నం వండుతుంది కృష్ణ. ఇదంతా చాటుగా చూస్తూ ముకుంద అసూయతో రగిలిపోతుంది. అయితే మురారి కట్టెలు తీసుకొచ్చాక.. ఆకలి అవుతుందని అడుగగా.. సరే మీరు కూరగాయలు కట్ చేయండని మురారికి కృష్ణ చెప్తుంది. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వాటిని లవ్ సింబల్ లో సెట్ చేస్తాడు మురారి. తన ప్రేమని కృష్ణ ఇలాగైనా కనిపెట్టాలని మురారి అనుకుంటాడు. మరొకవైపు ఇదంతా చాటుగా చూస్తున్న ముకుంద.. ఆ లవ్ సింబల్ లో ఉన్న ఉల్లిపాయ ముక్కలని  చూస్తుంది. ఆ తర్వాత ఏం జరుగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్‌ వరకు ఆగాల్సిందే.

స్వప్నని పట్టించుకోవడం లేదని రాహుల్ చెంప చెళ్లుమనిపించిన రుద్రాణి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -132 లో.. తనని రాహుల్ పట్టించుకోవడం లేదని  స్వప్న ఇంట్లో అందరికి చెప్తుంది. రోజు ఇంటికి లేట్ గా రావడం.. ఇప్పుడు ఫోన్ చేసిన తియ్యట్లేదు కట్ చేస్తున్నాడు. మీరు పెళ్లి చేసి మీ బాధ్యత అయిపోయిందని అనుకుంటున్నారా? ఆ తర్వాత వాళ్ళ కాపురం ఎలా ఉందో చూడాలని మీకు లేదా అని స్వప్న అంటుంది. ఆ తర్వాత అవును స్వప్న మీకు పెళ్లి చేసి పట్టించుకోవడం మానేసాం. దానికి తప్పు మాది. ఈ అమ్మాయి ఇంత మంది ముందు చెప్తుందంటే తను ఎంత బాధపడితే  ఇలా చెప్తుందని సీతారామయ్య అంటాడు. అత్త అని పెత్తనం చెలాయించడం కాదు. అత్త చేసే బాధ్యతలు కూడా తెలుసుకోవాలని రుద్రాణిని అపర్ణ అంటుంది. వాళ్ళంతా అలా మాట్లాడుతుండగా అప్పుడే రాహుల్ వస్తాడు. ఎక్కడికి వెళ్ళావ్ రాహుల్ అని రాజ్ అడుగుతాడు. పని మీద బయటకు వెళ్ళానని రాహుల్ అనగానే..  ఆఫీస్ పని మీదా? నీ పని మీద వెళ్ళవా అని రాజ్ కోపంగా అంటాడు. ఎందుకు ఇలా అడుగుతున్నారని రాహుల్ అంటాడు. ఇంట్లో భార్య ఉందని, తొందరగా రావాలని, ఆమెకు కోరికలు ఉంటాయని తెలియదా అని రాహుల్ తో సుభాష్ అంటాడు.  ఏం చెప్పింది నా గురించి అని రాహుల్ అనగా.. రుద్రాణి వచ్చి రాహుల్ చెంప చెళ్లుమనిపిస్తుంది. తప్పు చేసింది కాకుండా స్వప్నని ఎందుకు అంటావని రాహుల్ ని తిట్టి.. అమ్మాయిని తీసుకొని లోపలికి వెళ్ళని రుద్రాణి అంటుంది. ఇకముందు నా కొడుకు తప్పు చేయకుండా నేను చూసుకుంటానని రుద్రాణి అంటుంది. మరొక వైపు కావ్య నేలపై పడుకుందనే విషయం ధాన్యలక్ష్మికి తెలియకుండా ఉండడానికి.. రాజ్ కావ్య ఇద్దరు ధాన్యలక్ష్మి వాళ్ళ గదికి వచ్చినప్పుడు కవర్ చెయ్యలేక ఇబ్బంది పడతారు. మరొక వైపు సేటుని వెతుక్కుంటు పోలీసులు కనకం ఇంటికి వస్తారు. అర్థం లేని మీనాక్షి మాటలకు పోలీసులు చిరాకుపడతారు. సేటుని చూసారా కన్పించడం లేదని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని పోలీస్ అనగానే.. ఏమో తెలియదని కనకం అబద్ధం చెప్తుంది. మరొక వైపు రాహుల్ దగ్గరికి రుద్రాణి వస్తుంది. మనం స్వప్నని బాగా చూసుకుంటున్నట్లు నటించాలి. లేదంటే వాళ్లకి మనమీద డౌట్ వస్తుందని రాహుల్ తో రుద్రాణి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

నటరాజ్ మాస్టర్ తో, యాదమ్మ రాజుతో డాన్స్ చేసిన రాధా, సదా

"నీతోనే డాన్స్" షో అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో ఇరగదీస్తున్నారు కంటెస్టెంట్స్. ఈ వారం "ధూమ్ ధామ్ " టీంలోని నాలుగు జోడీలు అద్దిరిపోయే డాన్సులు చేసి జడ్జెస్ ని మెప్పించేసారు. జడ్జెస్ కూడా కంటెస్టెంట్స్ తో స్టేజి షేర్ చేసుకున్నారు. రావడంరావడమే మంచి కలర్ ఫుల్ డ్రెస్సెస్ లో వచ్చారు . లాస్ట్ వీక్ చూసుకుంటే గోల్డెన్ సోఫాలో కూర్చునే ఛాన్స్ ని  కావ్య, నిఖిల్ పొందారు. ఇక ఈ వారం ఆ ఛాన్స్ ని అందుకున్నారు నటరాజ్ మాస్టర్-నీతూ జోడి. లాస్ట్ వీక్ నటరాజ్ మాస్టర్ డల్ గా అస్సలు సరిగా పెర్ఫార్మ్ చేయలేదు. కానీ ఈ వారం మాత్రం ధూమ్ ధామ్ గా డాన్స్ చేసేసారు. నటరాజ్ మాస్టర్ - నీతూ కలిసి స్టేట్ రౌడీ మూవీ నుంచి "1234 డాన్స్ డాన్స్ " అనే సాంగ్ ని అప్పట్లో చిరంజీవి, రాధా వేసుకున్నట్టుగానే కాస్ట్యూమ్స్ వేసుకుని చేశారు. ఇక జడ్జి రాధా ఆ సాంగ్ వస్తున్నంత సేపు కూడా ఆ రోజుల్లోకి వెళ్ళిపోయి ఆ స్టెప్స్ వేస్తూ కనిపించారు. ఇక వీళ్ళ పెర్ఫార్మెన్స్ పూర్తయ్యాక ఇదే సాంగ్ కి రాధ నటరాజ్ మాస్టర్ తో కలిసి డాన్స్ చేశారు. ఇక చివర్లో స్టెల్లా-యాదమ్మ రాజు చేసిన "ప్రియతమా తెలుసునా" సాంగ్ పెర్ఫార్మెన్స్ అద్దిరిపోయింది. ఇక ఈ పెర్ఫార్మెన్స్ చూసేసరికి సదా యాదమ్మ రాజుతో కలిసి స్టెప్స్ వేసింది. ఇలా ఈ వారం ఇద్దరు లేడీ జడ్జెస్ కంటెస్టెంట్స్ తో కలిసి డాన్స్ చేసి ఎంటర్టైన్ చేశారు. ఇక ఈ నాలుగు జోడీల్లో టాప్ లో నిఖిల్- కావ్య ఉండగా, లీస్ట్ లో యాదమ్మ రాజు - స్టెల్లా ఉన్నారు. నటరాజ్ మాస్టర్ కి, పవన్ కి మధ్యన ఏవో క్లాషెస్ ఉన్నాయని..అవన్నీ మర్చిపోయి ఇక నుంచి ఫ్రెండ్స్ గా ఉండాలని చెప్పింది శ్రీముఖి. దాంతో నటరాజ్ మాస్టర్ వైఫ్ నీతూ, పవన్ వైఫ్ అంజలి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈవారం నటరాజ్ మాస్టర్ చేసిన డాన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు. దాంతో పవన్ - అంజలి జంట వెళ్లి వాళ్ళని హగ్ చేసుకుని విషెస్ చెప్పారు. ఇలాగే తమ మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ కంటిన్యూ కావాలని కోరుకున్నారు.  

ఇక నవ్వడం నేనెప్పటికీ ఆపను...

"అనుమానస్పదం" మూవీ తో వెండితెరకు పరిచయమైన మెరుపు  హంసానందిని. ఆ తర్వాత ఎన్ని మూవీస్ లో నటించినా తనకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఈగ మూవీలో కనిపించింది  కాసేపే ఐనా కూడా కొంత పేరైతే వచ్చింది. కానీ ఆమె కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే ఈ ముద్దుగుమ్మ క్యాన్సర్ బారిన పడింది. మనీషా కోయిరాలా, సోనాలి బింద్రే, మమతా మోహన్ దాస్ వంటి ఎంతో మంది స్టార్  హీరోయిన్స్ క్యాన్సర్ బారిన పడి నెమ్మదిగా  కోలుకుని.. తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వీళ్ళలో హంసానందిని కూడా ఒకరు. అలాంటి హంసానందిని ఆధ్యాత్మికత దిశగా అడుగులు వేస్తోంది. కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో అప్ డేట్ గా ఉంటోంది. తన కొత్త లుక్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అలాంటి హంసానందిని రీసెంట్ గా ఇషా ఫౌండేషన్‌ కి వెళ్ళింది. దానికి సంబంధించిన ఎన్నో ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసుకుంది.  "ఆత్మసాక్షాత్కారం పొందడం అంటే మనలో ఉన్న మూర్కత్వాన్ని వదిలిపెట్టడమే. ప్రతిదీ మనలోనే ఉంది కానీ మనమే దాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఇక్కడ నేను ఒక విషయం నేను చెప్పాలి అంటే  నేను ఆశ్రమంలోకి అడుగుపెట్టిన క్షణంలో ఒక అనిర్వచనీయమైన శక్తిని అనుభవించాను. ఇప్పుడే ఈ క్షణాన్ని ఆస్వాదించాలి, బతకాలి అనే అందమైన అనుభూతి నాలో కలిగింది. ఇక నేను నవ్వడం ఎప్పటికీ ఆపను. కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌కి ధన్యవాదాలు..ఇక్కడి  నన్ను ఆహ్వానించి, నాలో ఈ ఫీలింగ్ ని కలిగేలా చేసినందుకు" అని చెప్పారు హంసానందిని. రీసెంట్ గా ఆమె ఎన్టీఆర్ లెజెండరీ నేషనల్ అవార్డుని కూడా అందుకున్నారు. రెండేళ్ల క్రితం తనకు బ్రెస్ట్ క్యాన్సర్ , ఒవేరియన్ కాన్సర్  ఉందని దానికి  కీమోలు కూడా తీసుకున్నానని చెప్పారు.. అలాగే కీమోలు తీసుకునేటప్పుడు జుట్టు ఓడిపోవడంతో గుండుతో ఉన్న ఫోటోని కూడా పోస్ట్ చేశారు. కానీ ఇప్పుడు హంసానందిని ట్రీట్మెంట్ తీసుకుని మరింత ఎనెర్జీతో, మరింత అందంతో మళ్ళీ అందరి ముందుకు రావడంతో నెటిజన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ పాజిటివ్ కామెంట్స్ ని పోస్ట్ చేస్తున్నారు.