కూరగాయల చందు, గంగవ్వ లొల్లి.. అసలు విషయం ఏంటంటే!

గంగవ్వ.. ఇప్పుడు అందరికి సుపరిచితమే. గంగవ్వ తెలుగు భాషను తెలంగాణ మాండలికంలో అద్భుతంగా మాట్లాడి, మంచి వాక్చాతుర్యం కలిగిన కళాకారిణిగా గుర్తింపు పొందింది. గంగవ్వ తెలుగు రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ 4 లో కంటెస్టెంట్ గా ప్రవేశించింది. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ పాత్రికేయురాలుగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది. గంగవ్వ తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలోని లంబాడిపల్లి గ్రామానికి చెందినది. గంగవ్వ 1వ తరగతి చదివి మధ్యలో పాఠశాల మానేయడంతో ఆమెకు అధికారికంగా పాఠశాల విద్య లభించలేదు. తన ఐదేళ్ళ వయస్సులో వివాహం చేసుకుంది. గంగవ్వకు నలుగురు పిల్లలు. ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. గంగవ్వ మై వీలేజ్ షో లో నటించి గుర్తింపు పొంది ఏకంగా వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో లోనే ఛాన్స్ కొట్టేసింది. మై వీలేజ్ షో లో గంగవ్వ చాలా వీడియోస్ చేసింది. తనకి ఏది అనిపిస్తే అదే చేస్తుంది. అదే మాట్లాడుతుంది. గంగవ్వ బిగ్ బాస్ లో కూడా అందరితో సరదాగా ఉండేది. కానీ అక్కడ వాతావరణం నచ్చక బిగ్ బాస్ లో కొన్ని రోజులు మాత్రమే ఉంది. అయిన ఉన్నన్ని రోజులు తన స్పాంటేనియస్‌ పంచులతో నవ్వించేది. గంగవ్వ సొంత ఇంటి కలను నాగార్జున నిజం చేసాడు. బిగ్ బాస్ తర్వాత గంగవ్వ స్టార్ హీరో, హీరోయిన్ ని కలిసే అవకాశం కుడా దక్కింది. గంగవ్వని తన తోటి హౌస్ మేట్స్ ఇప్పటికి తరచు కలుస్తూనే ఉంటారు. బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు తనకు సపోర్ట్ గా అనిల్ జీల ఉన్నాడు. కాగా బయటకొచ్చాక కూడా  ప్రతీ దాంట్లో గంగవ్వకి సపోర్ట్ గా ఉన్నాడు. గంగవ్వ లవ్ స్టోరీ మూవీలో నటించింది.  గంగవ్వ తాజాగా వచ్చిన 'సేవ్ ది టైగర్స్' వెబ్ సిరీస్ లో నటించింది. ఆ సిరీస్ లో కోడలికి సపోర్ట్ చేసే అత్తగా నటించి అందరిని మెప్పించిన విషయం తెలిసిందే. కాగా మై విలేజ్ షో యూట్యూబ్ ఛానెల్ లో ' కూరగాయల చందు- గంగవ్వ లొల్లి' అనే వీడియో అప్లోడ్ చేశారు.  ఇందులో గంగవ్వ కొడుకు గా చందు, చేశాడు. అతను డ్యుయల్ రోల్ చేసి కామెడీ చేశాడు.  అయితే ఈ వీడియోలో అన్న చందు కష్టపడుతూ కూరగాయలు పండించి, అమ్ముతుంటే.. తమ్ముడు ఆ కూరగాయలని కర్రీలుగా, చట్నీలుగా చేసి ఎక్కువ డబ్బులు సంపాదిస్తాడు. తమ్ముడి స్మార్ట్ వర్క్ చూసిన అన్న చందు ఏం చేశాడు ? వాళ్ళిద్దరికి గొడవ జరిగిందా! అసలు గంగవ్వ లొల్లి ఏంది తెలియాలంటే ' మై విలేజ్ షో' యూట్యూబ్ ఛానెల్ లోని ఈ వీడియోని చూడాల్సిందే. కాగా యూట్యూబ్ లో ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.  

సిరి పోస్ట్ చేసిన బోల్డ్ ఫోటోస్  అందుకేనా!

సిరి హనుమంత్.. ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్న బ్యూటీ. బిగ్ బాస్ సీజన్-5 లో ఫైనలిస్ట్ వరకు వచ్చి వెనుతిరిగింది‌. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తన ఫ్యాన్ బేస్ మాములుగా ఉండేది కాదు. ప్రతీ వారం తనే టాప్ లో ఉండేది. టాస్క్ లో,  గేమ్స్ లో యాక్టివ్ గా ఉండేది. అయితే షణ్ముఖ్ జస్వంత్ తో తను చనువుగా ఉంటూ వచ్చేది. దాంతో తనకి నెగెటివిటి పెరిగి బయటకు వచ్చేసింది. సిరి బిగ్ బాస్ కు వెళ్ళేకంటే ముందు నుండి యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ లతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ లోకి వెళ్ళొచ్చాక సెలెబ్రిటి లిస్ట్ లో చేరింది. దాంతో వరుసగా సినిమా ఆఫర్లు రావడంతో బిజీ అయిన సిరి.. ఓటిటి వెబ్ సిరీస్ లో శ్రీహాన్ తో కలిసి చేస్తున్నట్టుగా ముందుగానే చెప్పింది. కాగా జీ5 లో రీసెంట్ గా రిలీజ్ అయి మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకున్న 'పులి-మేక' వెబ్ సిరీస్ లో సిరి ముఖ్యపాత్రని పోషించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శ్రీహాన్ తో రిలేషన్ లో ఉన్న సిరి.. వెబ్ సిరీస్ లతో, షార్ట్ ఫిల్మ్ లతో బిజీగా ఉంటుంది.  తాజాగా సిరి కొన్ని ఫొటోస్ ని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అందరిలాగే తను కూడా రూట్ మార్చాలని అనుకుంది కాబోలు.. కొన్ని హాట్ అండ్ బోల్డ్ ఫోటోలని షేర్ చేసింది. ఆ ఫోటోలని చూస్తే ఎవరైనా ఆ మాట అనాల్సిందే. సిరి షేర్ చేసిన ఈ ఫోటోస్ కి..  " స్టే ఇట్ " అనే క్యాప్షన్ రాసింది. అందాల ఆరబోతకు నేను సిద్ధం అనేట్టుగా ఉన్న ఈ ఫోటోలు కుర్రాళ్ళ మతిపోగొడుతున్నాయి. అయితే తనని ఈ బోల్డ్ లుక్ లో చూసిన నెటిజన్లు.. " సినిమా అవకాశం కోసమేనా ఇదంతా " అంటూ అనగా, "సూపర్ అండ్ హాట్" అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.  

ఆదిని కిడ్నాప్ చేసిన లేడీస్...పెళ్ళెప్పుడు అని అడిగిన మహిళా రైతులు

బుల్లితెర అంటే చాలు కామెడీ ఎంటర్టైన్మెంట్ కి అస్సలు కొదువే ఉండదు. ఎన్నో షోస్ ఉన్నాయి. కానీ వాటిల్లో సూపర్ గా కామెడీతో కలిపి ఎంటర్టైన్ చేసేది జబర్దస్త్ ఒకటి, శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీలో, ఢీ షోలో ఆది చేసే కామెడీ పంచెస్ కి చాలా మంది ఫాన్స్ ఉన్నారు. అలాంటి ఆది మీద లేడీస్ వైపు నుంచి చాలా కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు అలాంటి లేడీస్ అంతా కలిసి ఆది మీద తిరగబడ్డారు. ఈ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో  చాలామంది సీనియర్ యాక్టర్స్ కనిపించారు.  జయవాణి, ప్రీతి నిగమ్, శిల్పా చక్రవర్తి, భావన లాంటి సీనియర్ యాంకర్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ తో పాటు ప్రస్తుతం చేస్తున్న యాంకర్స్  కూడా ఉన్నారు. వీళ్లందరితో కలిపి చేసిన ఈ షో నెక్స్ట్ వీక్ ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి రాబోతోంది. అది కూడా  ‘ఆది కిడ్నాప్’ అనే కాన్సెప్ట్ తో వస్తోంది. ఆడవాళ్ల మీద పంచ్ లేస్తున్నాడని, ఆడవాళ్లకి  రెస్పెక్ట్ ఇవ్వడం లేదని.. ఆడాళ్లంతా కలిసి ఆదిని కిడ్నాప్ చేసి, సారీ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. చేతిలో చీపురు కట్టలు, కర్రలు కూడా తీసుకొచ్చి మరీ వార్నింగ్ ఇచ్చేసారు. అది చూసిన ఆది " మీరంతా నిజంగా ఎంటర్‌టైన్ చెయ్యండి.. సారీ ఏంటి ?.. పొర్లుదండాలు పెడతాను" అంటూ వాళ్లకు రివర్స్ లో  సవాలు విసిరాడు ఆది.. అలాగే ఈ షోలో  శిల్పా చక్రవర్తి, భావన తమ డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్ తో ఇరగదీసాడు. డిఫరెంట్ టాస్కులు, పెర్ఫార్మెన్సులతో  అదరగొట్టేసాడు. చిన్నప్పుడు అందరూ ఆడుకున్న "మా తాత ఉత్తరం" కాన్సెప్ట్ గేమ్ కూడా అలరించింది. ఇక ఫైనల్ గా పొలం పనులు చేసే మహిళలు కూడా "ఆది నీ పెళ్లెప్పుడు" అని అడగడం హైలెట్ గా నిలవబోతోంది ఈ షోలో . 

తను ఈ స్థాయికి రావడానికి కారణం మురారీనే అని చెప్పిన కృష్ణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -218 లో.. కృష్ణ సన్మానానికి నందు గౌతమ్ వస్తారు. నందు భవానీతో మాట్లాడగా భవాని ఎమోషనల్ అవుతుంది. నాకు మన ఇంటికి రావాలని ఉంది అమ్మ.. మీ అందరితో కలిసి ఉండాలని ఉందని నందు అనగానే.. నీ ఇంటికి నువ్వు రావడానికి, నువ్వు అడగమేంటమ్మ అని దగ్గరికి తీసుకొని హగ్ చేసుకుంటుంది భవాని.  థాంక్స్ కృష్ణ.. నీ వల్లే నా కూతురు ఈ రోజు నా దగ్గరికి వచ్చిందని భవాని అంటుంది. ఆ తర్వాత అందరు సన్మానం దగ్గరికి వెళ్లి కూర్చుంటారు. అయితే అప్పుడే మురారికి ఏదో ఫోన్ వచ్చిందని బయటకు వెళ్తాడు. శ్రీనివాస్ సన్మానం దగ్గరికి వస్తుండగా మురారి చూస్తాడు. అతనితో మాట్లాడతాడు. మీరు కావాలనే ఆదర్శ్ రావట్లేదని పెద్దమ్మతో చెప్పారట ఎందుకని శ్రీనివాస్ ని అడుగుతాడు మురారి. " అవును చెప్పాను నీ ప్రేమ గురించి భవాని గారికి తెలియాలని అలా చెప్పాను"  అని శ్రీనివాస్ అంటాడు. మురారి మౌనంగా ఉంటాడు.  నీ వల్లే నా కూతురు జీవితం అలా అయింది. కృష్ణది నీది అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్పి మళ్ళీ ముకుంద మనసులో ఆశలు రేపావ్... నా కూతురు ఏదైనా చేసుకున్నా.. తనకు ఏదైనా జరిగిన నువ్వే బాధ్యుడివి. నువ్వు మాత్రమే బాధ్యుడివని మురారికి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు శ్రీనివాస్. ఆ తర్వాత మురారి దగ్గరికి ముకుంద వస్తుంది. నువ్వు అదంతా ప్రేమతో కాకుండా బాధ్యత చేసావని కృష్ణ అనుకుంటుందని ముకుంద చెప్తుంది. నీ పట్ల కృష్ణకి గౌరవం తప్ప ప్రేమ లేదని ముకుంద చెప్పి వెళ్తుంది. మరొక వైపు సన్మానం భవాని చేతులు మీదుగా మొదలు అవుతుంది. ఆ తర్వాత భవాని కృష్ణ డాక్టర్ కావడానికి పడ్డ కష్టాన్ని చెప్తుంది. నేనేం చెప్పాలని అనుకున్నానో కరెక్ట్ గా పెద్దమ్మ కూడా అదే చెప్పిందని మురారి అనుకుంటాడు. మొదటగా గౌతమ్ వెళ్లి కృష్ణ గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత కృష్ణ స్టేజి పైకి వెళ్లి మాట్లాడుతుంది. నేను ఈ స్థాయికి రావడానికి కారణం మా ఏసీపీ సర్ అని చెప్తుంది. ఆయన బాధ్యతగా తీసుకొని నన్ను చదివించారని కృష్ణ చెప్పగానే.. వెనకాల నిల్చొని ఉన్న మురారి దగ్గరికి ముకుంద వెళ్ళి .. చూసావా నీపై ప్రేమ ఉంటే ఇలా బాధ్యత అనే పదం వాడదు కదా? నీపై గౌరవం మాత్రమే ఉందని మురారితో ముకుంద చెప్తుంది. మురారి డల్ అయిపోతాడు. నా మనసులో మీపై ప్రేమని ఈ రకంగా చెప్పాను ఏసీపీ సార్ అని కృష్ణ మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత మా రేవతి అత్తయ్య నన్ను సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకుందని కృష్ణ  చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

మిషన్ ఎడ్యుకేషన్ భాద్యతలు రిషి తీసుకునేలా వసుధార చేయగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -824 లో.. నేను చెప్పింది వింటే మీతో పాటు కార్ లో వస్తాను లేదంటే ఆటో లో వెళ్ళిపోతానని వసుధార అంటుంది. మిమ్మల్ని తీసుకొని వెళ్ళామని విశ్వనాథ్ సర్ చెప్పాడని వసుధారతో రిషి అంటాడు. "సరే ఏంటో చెప్పమని రిషి తన రిక్వెస్ట్ ని అంగీకరించినట్టు ఊహించుకుంటుంది" కానీ వసుధార మాట రిషి వినడు దాంతో తను నిరాశ చెందుతుంది. ఆ తర్వాత రిషి కాలేజీకి వచ్చి వసుధార మాటలు గుర్తుచేసుకుంటాడు. చేసిందంతా చేసి ఇప్పుడు వినమంటే ఎలా వింటానని రిషి అనుకుంటాడు. అప్పుడే రిషికి దూరంగా ఉన్న వసుధార.. రిషికి వినపడేటట్లు పాండియన్, అతని ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంది. మన వ్యక్తిగత కారణాల వల్ల వృత్తిధర్మానికి అడ్డురాకూడదని పాండియన్, అతని ఫ్రెండ్స్ కి వసుధార గట్టిగా చెప్తుంది. అలా వసుధార చెప్పడంతో.. అది మాకు ఎందుకు చెప్తున్నారు మేడమ్ అని వసుధారతో పాండియన్ అంటాడు. అది విన్న రిషి.. ఆ విషయం మీకు కాదు నాకు అని తన మనసులో అనుకుంటాడు. చెప్పాల్సింది చెప్పేసాను ఇక సర్ మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు తీసుకుంటాడని వసుధార అనుకుంటుంది. మరొకవైపు జగతి, మహేంద్రలు మీటింగ్ గురించి మాట్లాడుకుంటారు. మీటింగ్ లో మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు ఎవరికి ఇస్తున్నావని వాళ్ళ పేర్లు చెప్పమని అడిగితే ఏం చేస్తావని జగతిని మహేంద్ర అడుగుతాడు. వాళ్ళ పేర్లు చెప్పనని జగతి అంటుంది. మరొకవైపు శైలేంద్ర కాలేజీకి వస్తాడు. ఈ DBST  కాలేజీ సామ్రాజ్యం నాది కావాలి. నన్ను మీటింగ్ కి పిలవకుండా ఏం చెయ్యాలనుకుంటున్నారని శైలేంద్ర అనుకుంటాడు. మరొకవైపు వసుధార ఎలాగైనా రిషి మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు తీసుకునేలా ఒప్పించడానికి ట్రై చేస్తుంటుంది. రిషి లైబ్రరీలో బుక్స్ చదువుతుంటే వసుధార వెళ్తుంది. వసుధారను చూసిన రిషి.. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసని, ఇక్కడ నుండి వెళ్ళండని మెసెజ్ చేస్తాడు. నా ప్రయత్నం నేను చేసుకుంటున్నా అని వసుధార రిప్లై ఇస్తుంది. ఆ తర్వాత వసుధారకి కబోడ్ తాకుతుంటే, రిషి తనకి తాకకుండా వసుధారని పట్టుకుంటాడు. ఆ తర్వాత ఏంజిల్ కాలేజీకి వస్తుంది. ఏంజెల్ వసుధార ఇద్దరు కలిసి బయటకు వెళ్తారు. మరొకవైపు కాలేజీలో బోర్డ్ మీటింగ్ జరుగుతుంది. అప్పుడు శైలేంద్రని పిలవకున్నా మీటింగ్ దగ్గరికి వస్తాడు. మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు ఎవరికి ఇస్తున్నారు పేర్లు చెప్పండని శైలేంద్ర అడుగుతాడు. చెప్పను అయిన అది నీకు అనవసరం. పిలవకుండా వచ్చి ఈ డిస్టబెన్స్ ఏంటని శైలేంద్రపై జగతి కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

దుగ్గిరాల ఇంటిపరువు తీసిన స్వప్న.. కావ్యకి సపోర్ట్ గా నిలిచిన రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -157 లో.. స్వప్న మోడల్ గా తన ఫస్ట్ షూట్ చేస్తుంది. అది పర్ఫ్యూమ్ కి సంబంధించిన ఆడ్. అందులో స్వప్న వేరోక అబ్బాయితో బోల్డ్ గా యాక్ట్ చేస్తుంది. ఈ యాడ్ ఒకసారి బయటకు వెళ్తే మీరు ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోతారని డైరెక్టర్ స్వప్న తో చెప్పగానే.. స్వప్న హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం స్వప్న కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ధాన్యలక్ష్మి ఇంట్లో తనని స్వప్న అన్న మాటలు చెప్పడంతో అందరు స్వప్నపై  కోపంగా ఉంటారు. అప్పుడే స్వప్న కార్ లో, మరొకవైపు కావ్య ఆటోలో ఒకేసారి ఇంటికి వస్తారు. స్వప్న ని ఆ డ్రెస్స్ లో చూసిన కావ్య కోపంగా.. ఏంటి అక్క ఈ డ్రెస్ ఇలా బయటకు వెళ్ళావా? నిన్ను ఇలా ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారని కావ్య అనగానే.. వెళ్ళాను అయితే ఏంటని  చెప్పి స్వప్న లోపలికి వెళ్తుంది. స్వప్నని ఆ డ్రెస్ లో చూసిన దుగ్గిరాల ఇంట్లో వాళ్ళంతా షాక్ అవుతారు. ఏంటి ఈ అవతారమని అపర్ణ అడుగుతుంది. ఇది ఫ్యాషన్ అని స్వప్న సమాధానం చెప్తుంది. దుగ్గిరాల ఇంటి కోడలు ఎలా ఉండాలో తెలియదా? ఇలా బయటకు వెళ్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారని ఇందిరాదేవి అనగానే.. బయట గురించి ఇంట్లో ఉండేవాళ్లకు ఎలా తెలుస్తుందని స్వప్న అంటుంది. నీ గురించి మాకెందుకు గని.. మా ధాన్యలక్ష్మిని ఎందుకు అవమనించావని స్వప్నని అపర్ణ అడుగుతుంది. నన్ను అనేందుకు తనెవరు? అంటే నా భర్తగాని నా అత్త గాని అనాలని స్వప్న అనగానే.. స్వప్నపై కావ్య కోప్పడుతుంది. దాంతో రుద్రాణి మళ్ళీ కావ్య ఫ్యామిలీ గురించి మాట్లాడుతుంది. అలా తను మాట్లాడగానే రాజ్ కి కోపం వస్తుంది. తప్పు చేసింది నీ కోడలు.. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని ఎందుకు అంటావని రుద్రాణిపై కోప్పడతాడు రాజ్. ఈ కావ్య వాళ్ళ చెల్లెలు కదా? తను ఎలా ఉంది.. స్వప్న ఎలా ఉంది. వీళ్ళ ఇద్దరినీ పక్క పక్కన నిల్చొపెట్టి  చూస్తే తెలిసిపోతుంది. దుగ్గిరాల ఇంటి కోడలు ఎలా ఉండాలి.. ఎలా ఉండకూడదని రాజ్ అంటాడు. అలా  కావ్యకి సపోర్ట్ గా రాజ్ మాట్లాడేసరికి కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాహుల్ నీ భార్యని అదుపులో పెట్టుకో అని రాహుల్ కి వార్నింగ్ ఇస్తాడు రాజ్. మరొకవైపు రాజ్ తనని అర్థం చేసుకుంటున్నాడని దేవునికి తన సంతోషాన్ని చెప్పుకుంటుంది కావ్య. ఆ తర్వాత రాజ్ తో మాట్లాడుతుంది అపర్ణ. ఏంటి ఈ మధ్య నీకు ఆ కావ్యపై ప్రేమ మొదలైందా? ప్రతిదానికి  తనని వెనకేసుకొని వస్తున్నావని అపర్ణ అంటుంది. నువ్వు నీ భార్యగా ఒప్పుకున్నా.. నేను ఎప్పటికి తనని కోడలుగా ఒప్పుకోనని అపర్ణ అనగా.. లేదు మమ్మీ సాటి మనిషిని చూస్తున్నా.. ఆ రోజు నాకు ప్రాబ్లమ్ అయితే అంత హెల్ప్ చేసింది. అందుకే నేను సాటి మనిషిగా హెల్ప్ చేస్తున్నాను. నేను ఎప్పటికి భార్యగా ఒప్పుకోనని అపర్ణతో రాజ్ అంటాడు. ఆ మాటలు అన్ని కావ్య విని బాధపడుతుంది. ఆ తర్వాత మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్లి తన బాధని చెప్పుకొని ఎమోషనల్ అవుతుంది. అప్పుడే కావ్య దగ్గరికి ధాన్యలక్ష్మి వచ్చి.. నీకు ఈ రోజు రాజ్ సపోర్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

మన భారత దేశం యూనిఫామ్ నైటీ అన్న సుమ

"సుమ అడ్డా" నెక్స్ట్ వీక్ ప్రసారం కాబోయే ఎపిసోడ్  ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి ఆర్జే కాజల్, విజె సన్నీ, చలాకి చంటి, సిరి హన్మంత్ ఎంట్రీ ఇచ్చారు. వస్తూనే చంటికి సమోసాలు ఆఫర్ చేసింది సుమ. "ఫ్రెష్ వేనా" అని అడిగేసరికి "నిజానికి లాస్ట్ వీక్ షెడ్యూల్ ప్లాన్ చేశారు క్యాన్సిల్ అయ్యింది" అనేసరికి "అది అలా చెప్పాలి కదా అప్పుడు తింటాం కదా" అని చంటి అనేసరికి "ఏమైనా అప్పటి మనుషులు అప్పటివే తింటారుగా" అని కామెడీ చేసింది సుమ. తర్వాత సన్నీ, కాజల్ తో గేమ్ షో ఆడించింది. అందులో "పల్లెటూరు అనగానే గుర్తోచ్చేదిమిటి" అనేసరికి కాజల్ "హాఫ్ సారీస్" అని చెప్పింది...ఐతే బోర్డు ఆన్సర్ రాంగ్ అని చెప్పడంతో సన్నీ షాకయ్యాడు. "ఏమిటి లంగా ఓణీలు వేసుకోవడం మానేసారా" అనేసరికి సుమ మధ్యలో వచ్చింది. "మన భారత దేశం యూనిఫామ్ ఏమిటో తెలుసా" అని అడిగింది "జీన్స్ , టి షర్ట్ ఆ" అని అడిగారు సన్నీ, కాజల్.. "కాదు నైటీ" అనేసరికి అందరూ నవ్వేశారు. తర్వాత ఛత్రపతి మూవీ లోంచి సూరీడు అనే డైలాగ్ తో వచ్చే బిట్ ని సుమ స్పూఫ్ గా చేసి చూపించింది. తర్వాత వెంకటేష్ నటించిన మూవీ పిక్ చూపించేసరికి దానికి ఆ మూవీ టైటిల్ "ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు" మూవీ అని చంటి ఆన్సర్ చెప్పాడు "ఇది టైటిల్ లా లేదు మీ రియల్ స్టోరీ చెప్తున్నారు ఉంది" అని సుమ ఫన్నీ కౌంటర్ వేసింది. తర్వాత చంటి టీమ్ మొత్తం కూడా ఈ మూవీ బిట్ ని స్పూఫ్ గా చేసి అలరించారు. తర్వాత వీళ్ళతో గేమ్ షో ఆడించింది "చిన్నప్పుడు ఎలాంటి దొంగతనాలు చేస్తూ ఉండేవారు" అనేసరికి "నాన్న జేబులో డబ్బులు దొంగతనం చేసేవాళ్ళం" అని చెప్పింది కాజల్. ఇలా నెక్స్ట్ వీక్ ఈ సుమ అడ్డా గేమ్ షో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతోంది. అందరూ కలిసి "నసబెల్లె" అనే సాంగ్ కి డాన్స్ చేశారు. ఈ స్పూఫ్స్ లో భాగంగా ఈ షోకి వచ్చిన స్టూడెంట్స్ అంతా కూడా పార్టిసిపేట్ చేశారు.  

ఈ విషయాన్ని త్వరలో ఒక పెద్ద షోలో చెప్తాను అన్న వర్షా..అది బిగ్ బాసేనా ?

బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి జబర్దస్త్ కమెడియన్ వర్ష రెడీ ఐనట్టు తన మాటల ద్వారా అర్ధమయ్యి కానట్టుగా ఉంది. బిగ్ బాస్ లోగో రిలీజ్ ఐన దగ్గర వాళ్ళు వెళ్తారు, వీళ్ళు వెళ్తారు అంటూ సోషల్ మీడియాలో  హడావిడి మొదలయ్యింది..రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసిన వర్షను యాంకర్ ఆమె చదువు గురించి అడిగారు..దానికి వర్ష గట్టిగా నవ్వుతూ  " ఇది ఇక్కడ చెప్పను..ఒక పెద్ద షో కి వెళ్తున్నాను నెక్స్ట్...ఆ షోలో చెప్తాను" అనేసరికి యాంకర్ " హో మాకు తెలుసు, మీరు ఏ షోకి వెళ్తున్నారో..రివీల్ చేసేయమంటారా" అని అడిగింది. దానికి వర్ష నవ్వేసి "వొద్దొద్దు" అని అంది. "ఏ పేమెంట్ రాదంటారా..అగ్గ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుందంటారా" అని యాంకర్ అనేసరికి. " కొన్ని చెక్స్ ముందే ఇచ్చేసారు నాకు చెప్తే అవి వెనక్కి వెళ్ళిపోతాయని దాచి ఉంచా" అని చెప్పింది వర్ష. "ఎంత ఇచ్చారు చెక్ అడ్వాన్స్" అని యాంకర్ అడిగారు కానీ రివీల్ చేయలేదు వర్ష. షో గురించి ముందే రివీల్ చేయకూడదు అంటే అది బిగ్ బాస్ షో..నెక్స్ట్ ఆ షో అనేసరికి త్వరలోనే బిగ్ బాస్ రాబోతోంది కాబట్టి జబర్దస్త్ నుంచి లేడీ కంటెస్టెంట్ గా వర్ష వెళ్లబోతోందా అనే ప్రశ్న ఆడియన్స్ లో మొదలయ్యింది. అలాగే వర్షకు "జూనియర్ సమంత" అంటూ కొంతమంది కాంప్లిమెంట్స్ ఇచ్చారట. అష్షు రెడ్డిని జూనియర్ సమంతల ఉంటావని నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉండడం మనకు తెలుసు. ఇప్పుడు ఆమెకు పోటీగా వర్ష కూడా జూనియర్ సమంత అంటూ వచ్చేసింది. ఇక ఈ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ అంటే క్రష్ అని ఆయనకు గర్ల్ ఫ్రెండ్ రోల్ లో నటించాలని , అలాగే  ఎన్టీఆర్ కి, రామ్ చరణ్ కి సిస్టర్ రోల్ చేయాలనీ ఉందని కూడా చెప్పేసింది. అలాగే తన ఫామిలీలో జరిగిన ఎన్నో సంఘటనలను కూడా ఈ షోలో షేర్ చేసుకుంది జబర్దస్త్ లేడీ కమెడియన్ వర్ష .  

కమెడియన్ యాదమ్మ రాజుకి యాక్సిడెంట్...హాస్పిటల్ బెడ్ పై కాళ్లకు కట్టుతో ...

కొంతకాలం నుంచి సెలబ్రిటీస్ ఏదో ఒక ఇన్సిడెంట్ లో గాయాల పాలై హాస్పిటల్ బెడ్ మీదో లేదా హ్యాండ్ స్టిక్స్ పట్టుకుని నడుస్తూ కనిపిస్తున్నారు...నవదీప్, వరుణ్ సందేశ్, రౌడీ రోహిణి ఇలా చాలా మంది కూడా కళ్ళకు గాయాలతో రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు బుల్లితెర మీద కాస్తో కూస్తూ పేరు తెచ్చుకుంటూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్న యాదమ్మ రాజు- స్టెల్లా జంట గురించి మనకు తెలుసు. జబర్దస్త్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో కమెడియన్ యాదమ్మ రాజు ఒకరు.  అటు శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్స్ లోనో సందడి చేస్తూ ఉంటారు వీళ్ళు.  లాస్ట్ ఇయర్ స్టెల్లా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక స్టెల్లా అమెరికా వెళ్లి వచ్చి రీసెంట్ గా "నీతోనే డాన్స్" షోకి వెళ్లారు. ఐతే అక్కడ ఎలిమినేట్ ఐపోయి ప్రస్తుతం మిగతా షోస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాంటి యాదమ్మ రాజు   హాస్పిటల్ గౌన్ లో కాళ్లకు కట్టుతో కనిపించాడు. స్టెల్లా రాజుని దగ్గరుండి నడిపిస్తూ కనిపించింది.  ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేసరికి నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. "గెట్ వెల్ సూన్ బేబీ..నేను నీ కోసం ఎప్పుడూ ఉంటాను" అని స్టెల్లా దానికి టాగ్ లైన్ పెట్టింది. అలాగే ఇంకో మెసేజ్ లో "రాజుకి యాక్సిడెంట్ అయ్యింది త్వరలోనే కోలుకుంటాడు. రికవరీ మెసేజెస్ పెడుతున్న అందరికీ థ్యాంక్స్" అని చెప్పింది స్టెల్లా. "మీ ఇద్దరికీ దిష్టి కొట్టినట్టుంది..ఆ దిష్టి పోయిందనుకో అక్క...బ్రో నా ఫేవరేట్ కమెడియన్ నువ్వు..టేక్ కేర్" అంటూ కామెంట్స్ పెడుతున్నారు. జబర్దస్థ్ కమెడియన్ గా యాదమ్మ రాజు ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్నాడు. లేడీ గెటప్స్ తో స్పాంటేనియస్ డైలాగ్స్ తో  అమాయకపు ముఖంతో  ఉంటూ తనదైన కామెడీ యాసతో అందరి ముఖాల్లో నవ్వులు పూయిస్తూ ఉంటాడు.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో సినిమాల్లో ఛాన్స్ లు తెచ్చుకుంటున్నాడు యాదమ్మ రాజు.    

పిజ్జాలో గోంగూర చట్నీ వేసుకుని తిన్నట్టుంది నీ లుక్...

"ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్స్" నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో బుల్లితెర నటీ నటులు ఫుల్ ట్రెండీ లుక్ లో అలాగే ట్రెడిషనల్ గెటప్ లో వచ్చేసారు. అదే ఈ వారం థీమ్ "ట్రెండీ బాయ్స్ వెర్సెస్ ట్రెడిషనల్ గర్ల్స్" పేరుతో రాబోతోంది  ఈ షో. ఇక శ్రీముఖి వచ్చి బ్రహ్మముడి సీరియల్ కావ్యతో "పైన ట్రెండీ కింద ట్రెడిషనల్ గా ఉన్నాను కదా" దీని మీద నీ ఒపీనియన్ అని శ్రీముఖి అడిగేసరికి "పిజ్జాలో గోంగూర చట్నీ వేసుకుని తింటే ఎలా ఉంటుందో అలా ఉంది" అని చెప్పింది. దానికి శ్రీముఖి షాకైపోయింది. తర్వాత బాయ్స్ దగ్గరకు వచ్చి "ట్రెండీ అమ్మాయిలు ఇష్టమా, ట్రెడిషనల్ అమ్మాయిలు ఇష్టమా" అని అడిగేసరికి "అమ్మాయి అంటే ఇష్టం" అని చెప్పాడు  బ్రహ్మముడి సీరియల్ లో విలన్ రోల్ లో చేసే రాహుల్ అలియాస్ శ్రీకర్ కృష్ణ. ఇక లేడీస్ దగ్గరకు వచ్చి "దీపికా నువ్వు ఒకసారి సిగ్గుపడు" అని బ్రహ్మముడి హీరోయిన్ కావ్యని అడిగింది. దానికి దీపికా సిగ్గు పడిపోతూ ఉండేసరికి ఎక్స్ప్రెస్ హరి వచ్చి "సిగ్గుపడితే అబ్బాయిలు పడిపోవాలి..మీరు పడిపోకూడదు పక్కకు" అన్నాడు. ఆ డైలాగ్ కి అందరూ నవ్వేశారు. ఈ షోలో ప్రతీవారం కొత్త కొత్త గేమ్స్ ఆడిస్తూ ఆడియన్స్ ని అలరిస్తోంది శ్రీముఖి. ఇక ఈ షోకి ఫేమస్ సీరియల్స్ నుంచి యాక్టర్స్ వచ్చారు.  శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఈ షోకి మంచి రేటింగ్ వస్తోంది.  ఈ షోలో  ముక్కు అవినాష్, ఎక్స్‌ప్రెస్ హరి కామెడీకి ఫైమా హడావిడి తోడయ్యేసరికి  షో మంచి ఎంటర్‌టైనింగ్‌గా సాగుతోంది.  బ్రహ్మముడి, ఎన్నెన్నో జన్మల బంధం,  జానకి కలగనలేదు, నాగ పంచమి సహా స్టార్ మాలో ప్రసారమయ్యే టాప్ రేటింగ్ సీరియల్స్ సెలబ్రెటీలు అందరూ ఈ షోలో సందడి చేస్తుంటారు.

ఎంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు అని రష్మీ కోసం పాట పాడిన బాబు

ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రతీ వారం లాగే ఈ వారం కూడా నవ్వించడానికి వచ్చేసింది.  ఇందులో జోడీస్ వేసే స్కిట్స్ కొన్ని నవ్విస్తున్నాయి కానీ కొన్ని మాత్రం పేలడమే లేదు. అలాంటి స్కిట్స్ మధ్య ఇమ్ము-వర్ష స్కిట్స్ కొంచెం నవ్వు తెప్పించేవిగా ఉంటున్నాయి. ఇక అలా ఈ వారం వర్ష-ఇమ్ము-బాబు మధ్య జరిగిన స్కిట్ లో బాబు రోడ్డు మీద కొరడాతో కొట్టుకుంటూ బిచ్చం అడిగే రోల్ లో నటించాడు. ఐతే ఇమ్ము తనకు ఈ స్కిట్ లో  ఒక కూతురుంది అని  ...ఆమెకు ఈమధ్యనే పెళ్లి చేశా అని చెప్పాడు. మరో వైపు బాబు - లేడీ కమెడియన్ బెగ్గర్ రోల్స్ లో కనిపించారు. తర్వాత  బాబు స్టేజి మీదకు వచ్చి రష్మీ మీద సీరియస్ అయ్యాడు.."రష్మీ గారు మీకు ముందే చెప్పాను..నేను ఈ లవ్ ప్యాక్ ని చేయను..ఇది దీని ముఖం" అని పక్కన ఉన్న లేడీ కమెడియన్ ని చూపించేసరికి "ఆమె కూడా సీరియస్ అయ్యి మా అన్నయ్య ఏమన్నాడో తెలుసా జబర్దస్త్ లో ఇంతమంది ఉండగా నిన్నే అంటగట్టారేమిటి అని అడిగాడు" అని ఆమె చెప్పేసరికి అందరూ నవ్వేశారు..బాబు తన చేతిలో ఉన్న కొరడాతో అటు వర్షని, ఇటు మరో లేడీ పిచ్చ కొట్టుడు కొట్టేసాడు. ఇంతలో ఇమ్మానుయేల్ బాబు దగ్గరకు వచ్చి "నువ్వు వెళ్లి రష్మీ దగ్గర కొరడాతో వీపు వాయించుకుని వస్తే లక్షలు లక్షలు డబ్బులు వస్తాయి" అని చెప్పాడు. "డబ్బులు కావాలంటే నేను కొట్టాలి" అంటూ రష్మీ బ్లాక్ డ్రెస్ అలా నడుచుకుంటూ వస్తుండేసరికి "ఎంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు" అని పాట పాడాడు బాబు. వెంటనే రష్మీ బాబు చేతిలో కొరడా తీసుకుని లాగి పెట్టి ఒక్కటిచ్చింది. తర్వాత ఈ షోలో  బులెట్ భాస్కర్ అండ్ టీంలోకి ఇన్స్టాగ్రామ్ ఫేమ్ శ్రీదేవి ఎంట్రీ ఇచ్చింది. ఈమె రీల్స్ అన్ని కూడా "ఆంటీ" మీద ఎక్కువగా ఉంటాయి..ఇలా ఫేమస్ ఐన ఈమెను ఈ షోకి తీసుకొచ్చారు.  చాలా కాస్ట్ ఎక్కువగా టమాటో కాన్సెప్ట్ తో ఒక స్కిట్ లో నటించింది శ్రీదేవి. ఉల్లి ఫామిలీగా బులెట్ భాస్కర్ వాళ్ళు, టమాటో ఫామిలీగా శ్రీదేవి ఫామిలీ వాళ్ళు స్కిట్ వేసి ఎంటర్టైన్ చేశారు. ఇలా నెక్స్ట్ వీక్ కమెడియన్స్ అంతా అలరించడానికి రాబోతున్నారు.

డబ్బులిచ్చి ప్రమోట్ చేసుకోవడానికే బిగ్ బాస్ రియాలిటీ షో అన్న సరయు

బిగ్ బాస్ త్వరలో సీజన్ 7  twaralo తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ షో కోసం చాలా మంది ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు కూడా. ఈ షో ద్వారా చాలా మంది చిన్న చిన్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద  సెలబ్రిటీస్ గా మారిపోయి మంచి మంచి అవకాశాలను కూడా తెచ్చుకుంటున్నారు. ఈ షోని పొగిడేవాళ్లు ఎంత మంది ఉన్నారో తిట్టేవాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. ఇప్పుడు ఆ కోవలోకే వచ్చింది సరయు. ఈ బిగ్ బాస్ షో గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ షో అంతా ఫేక్ అని చెప్పారు. కొంతమంది డబ్బులిచ్చి మరీ తమను ప్రమోట్ చేసుకోవడానికి ఈ షోకి వస్తారని చెప్పింది. జనాలందరినీ పిచ్చోళ్లను చేయడానికే ఉంటాయి ఈ రియాలిటీ షోస్ . అసలు ఈ షోని చూడకండి మీ టైం వేస్ట్ అవుతుంది అని చెప్పారు. ఆల్రెడీ కొంతమంది ఒక ప్లాన్డ్ స్ట్రాటెజీతోనే వస్తారు, హౌస్ లో  గేమ్ ఆడతారు. వాళ్లకు లోపల ఉన్న వాళ్ళ నుంచి చాలా సపోర్ట్ కూడా ఉంటుంది. ఇక ఒక్కసారి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక రిలీఫ్ గా ఉంటుంది. లోపల ఉన్నంతసేపు  మెంటల్ స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు సరయు.   బిగ్‌బాస్ కి వెళ్లి వచ్చాను కాబట్టే ఇప్పుడు ఇలా చెప్తున్నాను. హౌస్ లో  ఎంత ఆడినా లోపల వేరే వాళ్లకు సపోర్ట్ ఉంటుంది, మన ఆట  వేస్ట్ అంటూ  సంచలన వ్యాఖ్యలు చేసింది. యూట్యూబర్ గా ఉన్న సరయు బిగ్ బాస్ సీజన్ 5 లో మొదటి వారంలోనే బయటకు వచ్చేసింది. తర్వాత ఓటీటీలో ప్రసారమైన నాన్ స్టాప్ షోలో కూడా కంటెస్టెంట్ గా వెళ్ళింది. అక్కడ  నాలుగో వారంలో బయటకు వచ్చేసింది.  ఇందులో మధ్యలోనే బయటకు వచ్చేసింది. సరయు  కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా  నటించింది. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ నటించిన మూవీ ’18 పేజిస్’లో నిఖిల్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో  అద్భుతంగా నటించారు సరయు.

చిరు సాంగ్ కి రాధతో కలిసి స్టెప్పులేసి "బ్రో" తేజ్

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పటి హిట్ పెయిర్ ఎవరు అంటే చాలు  రాధా, చిరంజీవి అనే యిట్టె చెప్పేస్తారు  ఆడియన్స్. వీళ్ళ డాన్స్ లో ఉండే గ్రేస్ గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. వీళ్ళ కాంబినేషన్ లో ఎలాంటి సినిమా ఐనా సాంగ్ ఐనా హిట్ కొట్టాల్సిందే. ఐతే ఇప్పుడు "నీతోనే డాన్స్" షోలో రాధ, చిరు హిట్ సాంగ్ "అందం హిందోళం" సాంగ్ కి సాయి ధరమ్ తేజ్ తో కలిసి డాన్స్ చేశారు అందాల రాధా. ఇన్నేళ్ళైనా కూడా ఆమె డాన్స్ లో ఎంత మాత్రం ఆ హాట్ నెస్ తగ్గలేదు. ఇంకా చలాకీగా గంతులేస్తూనే ఉన్నారు. నెక్స్ట్ వీక్ "నీతోనే డాన్స్" షో ప్రోమోలో ఈ బిట్ ని చూడొచ్చు. పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ కాంబోలో ఫస్ట్ టైం ఈ నెల  28న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అవుతున్న మూవీ "బ్రో". ఈ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా కేతిక శర్మతో కలిసి తేజ్ ఈ షోకి వచ్చారు. వీళ్ళు వచ్చాక శ్రీముఖి "ఇంకెన్నాళ్లు సోలోగా ఉంటారు" అని తేజ్ ని అడిగేసరికి "జీవితాంతం" అని చెప్పారు.. దాంతో సదా "వెల్కమ్ తో ది క్లబ్ బ్రో" అని  అనేసరికి "మీరు బ్రో అంటే వెళ్లవయ్యా వెళ్లు అంటాం మేం కూడా’ అని  ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు. ఇక ఈ షోలో హైలైట్ ఐన విషయం ఏమిటి అనే మెగాస్టార్ పాటకి రాధతో కలిసి డ్యాన్స్ చేశాడు తేజ్. ‘యముడికి మొగుడు’ మూవీలో సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఐన  ‘అందం హిందోళం’ సాంగ్‌‌కి రాధ ఎనర్జిటిక్‌గా మూమెంట్స్ వేసి ఆశ్చర్యపరిచారు. ‘ఇట్స్ లైక్ ఎ డ్రీమ్.. చిరంజీవి గారితో డ్యాన్స్ చెయ్యలేకపోయినా కానీ మీతో డ్యాన్స్ చేశాను’ అంటూ చాల ఎగ్జైట్ అయ్యాడు. ఇక ఈ నెక్స్ట్ వీక్ షో థీమ్ ఏంటంటే "టాలీవుడ్ మీట్స్ బాలీవుడ్ " అంశంతో రాబోతోంది.. ఇందులో టాలీవుడ్ సాంగ్స్ తో బాలీవుడ్ డాన్స్ ని కూడా కలిపికొట్టారు కంటెస్టెంట్స్.

కావ్య-నిఖిల్ ఇద్దరూ శుభలేఖలు ప్రింటింగ్ చేయించడమే కాదు వాళ్ళ పెళ్లి కూడా ఐపోయింది

  "నీతోనే డాన్స్"  ఎపిసోడ్ లో డాన్స్ పెర్ఫామ్ చేసే జంటలతో శ్రీముఖి ఈ వారం లవ్ లెటర్స్ రాయించింది. ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో అనే కాన్సెప్ట్ తో ఈ లెటర్స్ ని రాయించింది.  ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా అందంగా లెటర్స్ రాయడమే కాదు చదివి కూడా వినిపించారు. ఇక ఇందులో నిఖిల్, కావ్య గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. వీళ్ళ డాన్స్ కి  జడ్జెస్ ఎప్పుడూ ఫిదా ఐపొతూ ఉంటారు. అలాంటి నిఖిల్ తన  కావ్య కోసం లవ్ లెటర్ రాసాడు. "ప్రియమైన కావ్య...నిన్ను మొదటి సారి చూసినప్పుడు నాలో తెలియని ఏదో సంతోషం...ఎలా పరిచయం అయ్యావో తెలియదు. ఎలా దగ్గరయ్యావో కూడా తెలియదు. కానీ నీలో మా అమ్మను, మా అమ్మ ప్రేమను చూస్తున్నాను, ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలీదు కానీ ఏదో చెప్పాలని అనిపిస్తుంది. నీ ఊరేమిటో తెలీదు కానీ ఊహించాను, నీ మనసేమిటో తెలీదు కానీ మనసు పడ్డాను. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు ఏ క్షణం మరువకుండా క్షణం క్షణం నిన్నే ప్రేమిస్తా" అని చెప్పేసరికి జడ్జెస్ తో పాటు శ్రీముఖి కూడా గట్టిగా జారీచేసింది. ఇక కావ్య ఐతే షాకయ్యింది. " నాకోసం లెటర్ రాసాడు కదా" దాని కోసమైనా  అంటూ కావ్య నిఖిల్ నుదిటి మీద ముద్దు పెట్టేసింది..దీంతో శ్రీముఖి ఒక వీళ్ళ గురించి సెన్సేషన్ న్యూస్ కూడా చెప్పేసింది. "వీళ్ళు శుభలేఖలు రాసుకున్నారు కానీ శుభలేఖలు ప్రింటింగ్ తో పెళ్లి కూడా ఐపోయింది" దానికి సంబంధించిన వీడియో తన దగ్గర ఉందని చెప్పింది. దయతో సదా, రాధ షాకింగ్ ఫేసెస్ పెట్టారు. " మనకు ఎవరికీ చెప్పకుండా చేసుకున్న వీళ్ళ పెళ్లిని  మీరు చూసేయండి" అంటూ ఫన్నీ గా చేసిన ఒక వీడియోని ప్లే చేసి చూపించింది శ్రీముఖి. "ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే ఈ వీడియో ఇంకా ఫుల్ గా ఉంది" అని శ్రీముఖి చెప్పింది. ఇక జడ్జి రాధా స్టేజి మీదకు వెళ్లి కావ్య- నిఖిల్ తో కలిసి డాన్స్ చేసింది. అలాగే శ్రీముఖి కొన్ని కొన్ని మాటలకు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలో కూడా చేసి చూపించారు.    

డాన్స్ కిచిడి ఐపోయిందన్న నటరాజ్ మాష్టర్..జనజన్మలకు నువ్వే భార్య కావాలన్న పవన్

"నీతోనే డాన్స్" ఈ శనివారం ఎపిసోడ్ రెట్రో థీమ్ తో మంచి కలర్ ఫుల్ గా ఎంటర్టైన్ చేసింది. కాస్ట్యూమ్స్ కూడా అద్భుతమైనవి వేసుకొచ్చి ఆడియన్స్ ని మెస్మోరైజ్ చేశారు.  ఇందులో ఒక్కొక్కళ్ళు ఎంచుకున్న సాంగ్స్ కూడా ఆడియన్స్ ని మళ్ళీ ఆ కాలానికి తీసుకెళ్లిపోయాయి. ఇక ఫస్ట్ పవన్ - అంజలి వచ్చి "ఎల్లువొచ్చి గోదారమ్మ" సాంగ్ కి డాన్స్ చేసి చూపించారు. ఈ సాంగ్ ఐపోయాక జడ్జెస్ వాళ్ళ అభిప్రాయాలను చెప్పారు. ఐతే  ఈ సాంగ్ కి అంత ఆక్రోబాటిక్స్ అవసరం లేదని చెప్పారు తరుణ్ మాష్టర్..ఇక మిగతా జడ్జెస్ కి కూడా ఈ పెర్ఫార్మెన్స్ అంతగా నచ్చలేదని అర్ధమయ్యింది. వీళ్లకు నటరాజ్ మాష్టర్ జోడి 6 మార్క్స్ ఇచ్చారు. అప్పట్లో ఎన్టీఆర్ లాంటి హీరోలంతా  చాలా గ్రేస్ తో డాన్సస్ చేసేవాళ్ళు. కానీ మీరు వాళ్ళ డాన్స్ ని ఎంచుకుని చేయడంతో  అది కిచిడి ఐపోయింది. సాంగ్ లో  అన్ని లిఫ్టింగ్స్ అవసరం లేదని చెప్పారు. ఈ విషయం మీద అంజలి రివర్స్ కామెంట్స్ చేసింది. మీరు అన్నంత కిచిడిగా  ఐతే లేదు, రెండు లిఫ్టింగ్స్ మాత్రమే ఉన్నాయి. ఇది 6 మార్క్స్ ఇచ్చే పెర్ఫార్మెన్స్ కాదు అని చెప్పారు.  ఇక షో స్టార్టింగ్ లో అబ్బాయిలతో లవ్ లెటర్స్ రాయించింది శ్రీముఖి. అలా పవన్ అంజలి కోసం రాసిన ప్రేమలేఖను చదివించింది. "నన్ను చూసుకోవడంలో ఒక తల్లిలా, నాకు ఎం కావాలో తెలుసుకుని ఇవ్వడంలో ఒక నాన్నలా, నన్ను ఓదార్చడంలో ఒక ఫ్రెండ్ లా, నా జీవితాన్ని సగం తీసుకుని నన్ను అర్థంచేసుకుని నన్ను పంచ ప్రాణంలా ప్రేమించే అర్దాంగిగా, నా జీవితానికి ఒక సంపూర్ణతను అందించిన అంజలి జన్మజన్మల నువ్వే నా భార్యగా ఉండాలి. ఐ లవ్ యు" అని రాసారు. ఇక వీళ్ళ డాన్స్ పెర్ఫార్మెన్సెస్ కి నిఖిల్ - కావ్య, శ్రీవాణి- విక్రమ్ 8 మార్క్స్ ఇచ్చారు. అలాగే వీళ్ళ డాన్స్ లో ఉన్న లోపాల్ని కూడా అందరూ చెప్పారు.  

రేవంత్ అమాయకుడని చెప్పిన ఆదిరెడ్డి!

బిగ్ బాస్ సీజన్-6 లో సింగర్  కేటగిరీలో వచ్చిన రేవంత్ తన సత్తా చాటాడు. హౌస్ లోకి వెళ్ళిన మొదటి రోజు నుండి తనకున్న ట్యాలెంట్ తో , తను బయట ఎలా ఉన్నాడో లోపల కూడా అదే విధంగా ఉన్నాడు. దాంతో బిగ్ బాస్ చూసే ప్రేక్షకులలో కంటెస్టెంట్స్ కి ఉండే ఫ్యాన్ బేస్ లో రేవంత్ కే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. ఎల్.వి. రేవంత్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన నేపథ్య గాయకుడు. పలు సినిమాల్లో 200 కి పైగా పాటలు పాడాడు. ఎం. ఎం. కీరవాణి , కోటి, మణిశర్మ, చక్రి, థమన్ లాంటి సంగీత దర్శకుల దగ్గర పాటలు పాడాడు. 2017లో సోనీ మ్యూజిక్ చానల్ నిర్వహించిన ప్రముఖ పోటీ.. ఇండియన్ ఐడల్-9 లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్-6 లోకి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ సీజన్-6 లో టాప్ 5 కంటెస్టెంట్లుగా రేవంత్, శ్రీహన్, కీర్తి, ఆదిరెడ్డి, రోహిత్ నిలవగా.. నాగార్జున ఆఫర్ చేసిన 40 లక్షల ప్రైజ్ మనీ తీసుకుని టాప్ 2 నుంచి శ్రీహన్ క్విట్ కావడంతో రేవంత్‌ విజేతగా నిలిచాడు. తాజాగా బ్రో సినిమాలోని 'మై డియర్ మార్కండేయ' పాట పాడిన రేవంత్.. ఈ సాంగ్ హిట్ కావడంతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ‌అయితే ఆదిరెడ్డి తన ఇన్ స్టాగ్రామ్ లో ' ఆస్క్ మి క్వశ్చన్ ఎబోట్ బిగ్ బాస్ సీజన్-6' అని పెట్టాడు. దాంతో ఒకరు రేవంత్ గురించి అడిగారు. " బిగ్ బాస్ తర్వాత రేవంత్ తో మీ రిలేషన్ ఎలా ఉందని " ఒకరు‌ ఆదిరెడ్డిని అడుగగా.. " రేవంత్ మామతో నాకు మంచి బాండింగ్ ఉంది. మామ వెరీ డౌన్ టూ ఎర్త్ బిహేవియర్. కొన్నిసార్లు అమాయకుడిగా ఉంటాడు. మొత్తంగా తనొక మంచి స్నేహితుడు " అని ఆదిరెడ్డి చెప్పాడు. అయితే ఆదిరెడ్డి ఇలా రేవంత్ గురించి చెప్పడంతో దానిని స్క్రీన్ షాట్ తీసి తన ఇన్ స్టాగ్రామ్ స్టాటస్ లో‌ షేర్ చేసాడు రేవంత్. కాగా ఈ పోస్ట్ చూసిన బిగ్ బాస్ సీజన్-6 అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.  

మోనాల్ గజ్జర్ అజ్ఞాతవాసి ప్రేమికుడు అతడేనా!

మోనాల్ గజ్జర్.. ఈ పేరు అందరికి సుపరిచితమే. బిగ్ బాస్ 4 దత్తపుత్రిక  మోనాల్ అంటూ అప్పట్లో   న్యూస్ వైరల్ అయిన విషయం తెలిసిందే. మోనాల్ ఆమె తన కెరీర్ ని మొదటగా మోడల్ గా మొదలుపెట్టింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్, మలయాళ బాషల్లో పలు సినిమాల్లో నటించింది. తెలుగులో సుడిగాలి, వెన్నెల 1/2, బ్రదర్ అఫ్ బొమ్మాలి సినిమాలలో నటించింది. కానీ మోనాల్ కి మంచి హిట్ గా తన కెరీర్ లో లేదని చెప్పాలి. ఆ తర్వాత మోనాల్ బిగ్ బాస్-4 లో ఛాన్స్ కొట్టేసి ఒక్కసారిగా మళ్ళీ క్రేజ్ లోకి వచ్చింది. మోనాల్ కి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అనడంలో ఆశ్చర్యం లేదు. మోనాల్  బిగ్ బాస్ లో ఎక్కువ రోజులు ఉంది. హౌస్ లో తన మిస్టేక్ చేసిన బిగ్ బాస్ చుసి చూడనట్టు ఉండడంతో బిగ్ బాస్ అప్పట్లో ఫేవరేటిజం చూపిస్తున్నారనే నెగెటివ్ టాక్ మోనాల్ వల్ల బిగ్ బాస్ కి వచ్చింది.  కారణం అప్పుడు మోనాల్ ఏ తప్పు చేసినా ఏం అనలేదు‌. దాంతో బిగ్ బాస్  దత్తపుత్రిక మోనాల్ అని అప్పట్లో ట్రోల్స్ కూడా వచ్చాయి. హౌస్ లో మోనాల్ ట్రయంగిల్ లవ్ స్టోరీ నడిపించి, బిగ్ బాస్ లో ఎక్కువ రోజులు ఉందన్న టాక్ కూడా వచ్చింది. అయితే మోనాల్ బిగ్ బాస్ లో మొదటగా అభిజిత్, ఆ తర్వాత అఖిల్ సార్థక్ తో సన్నిహితంగా ఉంది. ఒకానొక సిచువేషన్ లో అఖిల్, మోనాల్ లవర్స్ అన్న అనుమానం రాకపోలేదు. బిగ్ బాస్ తర్వాత కూడా కొన్ని సందర్భాలలో అఖిల్, మోనాల్  ల గురించిన న్యూస్ తెగ వైరల్ అయింది. ఈ మధ్య జరిగిన బిబి జోడిలో తేజస్వినితో అఖిల్ జోడీ కట్టాడు. ఫ్యాన్స్ మాత్రం మోనాల్ తో అఖిల్ జోడి కడుతాడని ఊహించగా అది జరుగలేదు. తాజాగా మోనాల్ తన ఇన్ స్టాగ్రామ్ లో తనకి ఎవరో ఒన అజ్ఞాత వ్యక్తి లెటర్, ఒక ఫ్లవర్స్ బొకే, చాక్లెట్ ప్యాక్ ని మోనాల్ కి పంపించడట.. " స్టే హ్యాపీ సి యూ సూన్ " అని ఒక మెసేజ్ గల లెటర్ ని పంపించడంట. అయితే ఆ లెటర్ తో‌ కూడిన బొకేని పంపిందెవరని మోనాల్ కూడా తెలియదట. అందుకే " ఎవరు నువ్వు " అని మోనాల్ షేర్ చేసింది. దాంతో నెటిజన్లు మాత్రం.. అఖిల్ సార్థక్ అని ఇతని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.   

స్వప్నని బోల్డ్ గా చూపించాలని చెప్పి‌న రాహుల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -156 లో... కావ్యని రాజ్ వాళ్ళ పుట్టింట్లో దింపి వెళతాడు. హాస్పిటల్ ఖర్చుల కోసం చెవి కమ్మలు అమ్మి డబ్బులు తీసుకొని రా అని కనకం తన చెవి కమ్మలు కృష్ణమూర్తికి ఇస్తుంది. కృష్ణమూర్తి వెళ్తుండగా అప్పుడే కావ్య వస్తుంది. ఆ తర్వాత కావ్య కనకం దగ్గరికి వెళ్లి హగ్ చేసుకుని.. ప్రేమగా మాట్లాడుతుంది. ఎలా ఉన్నావ్ అమ్మ అని కావ్యని కృష్ణమూర్తి అడుగుతాడు. సంతోషంగా ఉన్నానని కావ్య చెప్పగానే.. అత్తింటి కష్టాలు ఆ గడపలోనే ఉంచి వచ్చావా అని కృష్ణమూర్తి అంటాడు. లేదు నాన్న నా సంతోషాన్ని పుట్టింటి వాళ్ళతో పంచుకోవడానికి వచ్చానని కావ్య అంటుంది. కావ్య తను డిజైన్స్ వేసి సంపాదించన డబ్బులు కృష్ణమూర్తికి ఇస్తుండగా.. వద్దని అంటాడు. ఆ తర్వాత కావ్య బలవంత పెట్టడంతో డబ్బులు తీసుకుంటారు. ఆ తర్వాత అన్నపూర్ణ గురించి‌ కావ్య తెలుసుకొని.. నీ హాస్పిటల్ ఖర్చు మొత్తం నేనే బరిస్తానని కావ్య చెప్పగానే అన్నపూర్ణ ఎమోషనల్ అవుతుంది. మరొక వైపు స్వప్న అన్న మాటలకు ధాన్యలక్ష్మి బాధపడుతు కూర్చొని ఉంటుంది అప్పుడే రుద్రాణి వస్తుంది. నా కోడలిని ఇంట్లో నుండి పంపించడానికి నిన్ను వాడుకుంటన్నా ధాన్యలక్ష్మి అని రుద్రాణి తన మనసులో అనుకుంటుంది. ఏమైంది ధాన్యలక్ష్మి అని రుద్రాణి అడుగుతుంది. స్వప్న అన్న మాటలు రుద్రాణికి చెప్పగానే.. ఇంట్లో  అందరిని పిలుస్తుంది. నిన్ను అన్ని మాటలు అందా.. అసలు దాన్ని ఈ రోజు వదిలిపెట్టొద్దని రుద్రాణి కావాలనే ఓవర్ చేస్తుంటుంది. అక్కడికి ఇంట్లో అందరూ వస్తారు. అసలు ఏమైందని రుద్రాణిని అపర్ణ అడుగుతుంది. ధాన్యలక్ష్మిని స్వప్న అవమానించిందని రుద్రాణి చెప్పగానే.. అసలు ఏమైంది నువ్వు చెప్పు ధాన్యలక్ష్మి అని ఇందిరాదేవి అడుగుతుంది. దాంతో స్వప్న అన్న మాటలు ధాన్యలక్ష్మి ఇంట్లో వాళ్లకి చెప్తుంది. మరొక వైపు స్వప్న మోడల్ షూట్ కి వెళ్తుంది. అక్కడ మేనేజర్ స్వప్నకి అందరిని పరిచయం చేస్తాడు. ఒక్కప్పుడు ఈ స్టూడియో లోకి రానిచ్చే వారు కాదు. ఇప్పుడు ఇంత మంచి అవకాశం దుగ్గిరాల ఇంటికి కోడలు అంటే ఇలాగే ఉంటుందని స్వప్న అనుకుంటుంది. అప్పుడే  మోడల్ షూట్ డైరెక్టర్ స్వప్న దగ్గరికి వస్తాడు. ఈ షూట్ చాల స్పైసి గా చేద్దామని అనుకుంటున్నట్టుగా డైరెక్టర్ అనగానే.. మీ ఇష్టం సర్ మీరు ఎలాగంటే అలాగే అని స్వప్న అంటుంది. ఆ  తర్వాత డైరెక్టర్ కి రాహుల్ కాల్ చేసి చాలా బోల్డ్ గా షూట్ జరగాలి. ఆ ఫొటోస్ ని చూసిన వాళ్ళంతా ఇబ్బంది పడేలా చెయ్యాలని రాహుల్ అనగానే.. సరే అని డైరెక్టర్ అంటాడు. మరొకవైపు కావ్య తన పుట్టింటి వాళ్ళతో కలిసి సరదాగా భోజనం చేస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

రిషి, వసుధారల మౌన పోరాటం.. మీటింగ్ లిస్ట్ నుండి శైలేంద్రని తప్పించిన జగతి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -823 లో.. వసుధార, ఏంజెల్ కలిసి రిషిని భోజనానికి పిలవడానికి వెళ్తుంటే.. రిషి వాళ్ళకి ఎదురుగా వస్తాడు. వసుధార కూడా భోజనం చెయ్యడానికి వస్తుందని తన మనసులో అనుకొని.. నేను భోజనం చెయ్యడానికి రాను. నా గదిలోనే తింటానని రిషి అంటాడు. ఆ మాటలు విన్న ఏంజిల్.. అసలేంటి నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో తెలియదని రిషితో అంటుంది.  ఆ తర్వాత నాతో కలిసి భోజనం చెయ్యకూడదని, మీరు రావట్లేదు.. నాకు తెలుసు రిషి సర్ అని వసుధార తనలో తానే అనుకుంటుంది. అయిన తప్పు చేసినవాల్లే పక్కన కూర్చొని భోజనం చేస్తుంటే నాకెందుకు భయం. వాళ్ళకి నేను భయపడి గదిలో భోజనం చేయడం ఎందుకని రిషి అనుకుంటాడు. నేను గదిలోకి భోజనం పంపిస్తానని ఏంజిల్ అనగానే.. లేదు ఏంజిల్ నేను వస్తాను. అక్కడే భోజనం చేస్తానని రిషి అంటాడు. రిషి నువ్వు ఎప్పటికి అర్ధం కావని ఏంజిల్ అంటుంది. ఆ తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తుంటారు. వెన్నెలని చూస్తూ భోజనం చేద్దాం అనుకున్నాం కదా, మర్చిపోయా అని ఏంజిల్ అంటుంది. మనకు ఇష్టమైన వాళ్ళు పక్కన ఉంటే.. ఎక్కడ తిన్నా తృప్తిగానే ఉంటుంది. మనకు కష్టమైన వాళ్ళు పక్కన ఉంటే ఎక్కడ తిన్న తిన్నట్టు అనిపించదని రిషి అంటాడు. సర్ నేను ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అనుకుంటున్న అని విశ్వనాథ్ తో వసుధార అనగానే.. ఎందుకు అమ్మ మీ నాన్న గారు ఊళ్ళో లేరు కదా అని విశ్వనాథ్ అంటాడు. నాన్న గారు లేకుంటే వాళ్ళ అమ్మ ఉంటుంది కదా వెళ్లొచ్చు కదా  అని రిషి తన మనసులో అనుకుంటాడు. సర్ వెళ్తానని‌ మళ్ళీ వసుధార అంటుంది. ఇప్పుడు ఎందుకు నీకు ఏమైనా ఇబ్బంది ఉందా? మీ నాన్న వచ్చాక వెళ్ళు అని వసుధారతో విశ్వనాథ్ చెప్తాడు. మీరు ఒకరికొకరు చాలా హెల్ఫ్ చేసుకుంటారు. మాట్లాడుకోరు.. మీ ప్లేస్ లో ఎవరు ఉన్నా డీప్ కనెక్షన్ లో ఉంటారు కానీ మీ మధ్య అసలు కమ్యూనికేషన్ లేదని ఏంజెల్ అంటుంది. అలా ఏంజిల్ అనగానే ఇద్దరు సైలెంట్ గా ఉండిపోతారు. ఆ తర్వాత  రిషికి మెసేజ్ చేస్తుంది వసుధార. మీరు ఆలా ఉంటే ఏంజిల్ కి డౌట్ వస్తుంది. అది మీకు మంచిది కాదు. నార్మల్ గా ఉండండి  అని వసుధార మెసేజ్ చెయ్యగానే.. రిషి చూస్తాడు కానీ రిప్లై ఇవ్వడు.  మరొక వైపు ఇంట్లో మహేంద్ర చేసిన గొడవ గురించి శైలేంద్ర, దేవయాని మాట్లాడుకుంటారు. అప్పుడే కాలేజీ లెక్చరర్ ఫోన్ చేసి.. ఈ రోజు కాలేజీ లో బోర్డు మీటింగ్ ఉంది. లిస్ట్ లో మీ పేరు కూడా లేదని శైలేంద్రకు చెప్తాడు. ఆ తర్వాత శైలేంద్ర కోపంగా.. వీళ్ళేం చేస్తున్నారని శైలేంద్ర కాలేజీకి వెళ్తాడు. మరొకవైపు వసుధార కాలేజీకి వెళ్తుంటే.. అక్కడే ఉన్న రిషితో వసుధారని తీసుకొని వెళ్ళామని చెప్తాడు. ఆ తర్వాత నేను మీతో రావాలంటే నేను చెప్పింది చేస్తేనే వస్తానని వసుధార అంటుంది. ఏంటి చెప్పు అని రిషి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.