భార్యాభర్తల బంధం బాగుండటానికి సాక్షాత్తు సీతారాములు చెప్పిన సలహాలు ఇవి..!

భారతీయ సంస్కృతిలో సీతారాముల వివాహం అయినా, వారి బందం అయినా కేవలం ఒక మతపరమైన సంఘటన మాత్రమే కాదు, ఆదర్శవంతమైన వైవాహిక జీవితానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. రాముడు,  సీత మధ్య సంబంధం త్యాగం, నమ్మకం, గౌరవం,  అంకితభావం వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది నేటికీ సంబంధాలను బలోపేతం చేయడానికి మూలంగా నిలుస్తుంది. నేటికాలంలో విభేదాలు,  స్వార్థం కారణంగా సంబంధాలు తరచుగా బలహీనపడతాయి. సీతారాముల  వైవాహిక జీవితం ప్రేమ,  నమ్మకంతో ప్రతి సవాలును ఎదుర్కోవచ్చని  బోధిస్తుంది. బంధం బలంగా ఉండటానికి సీతారాములు చెప్పిన సలహాలు.. నమ్మకమే పునాది.. రాముడు,  సీత ఒకరికొకరు  నమ్మకాన్ని ఇచ్చుకున్నారు. రాముడితో పాటు వనవాసానికి వెళ్లడానికి సీత ముందుకువచ్చింది. అడవిలో అయినా సరే తన భర్త తనకు రక్షణ ఇవ్వగలడని సీతమ్మ నమ్మింది.  రాముడు తన భార్య గౌరవం,  భద్రతను అన్ని పరిస్థితులలోనూ చూసుకున్నాడు. కష్టాలలో కూడా కలిసి ఉండటం.. సీతారాముడి జీవితాలు పోరాటాలతో నిండి ఉన్నాయి. వనవాసానికి వెళ్లడం, యుద్ధం, అగ్ని పరీక్షలు అనుభవించారు. కానీ ఏ కష్టం వచ్చినా ఒకరిని ఒకరు వదులుకోవాలని అనుకోలేదు. కష్ట సమయాల్లో ఒకరికొకరు మద్దతుగా ఉండటం  గొప్ప బలం అని వారు చెప్పకనే చెప్పారు. సంబంధంలో గౌరవం.. రాముడిని మర్యాద పురుషోత్తముడు అని పిలుస్తారు.  కుటుంబం, సమాజం,  మతం  పరిమితులను ఎప్పుడూ పాటించాలని అనుకున్నాడు. క్రమశిక్షణ,  మర్యాదలకు కట్టుబడి ఉన్నప్పుడే సంబంధాలు విజయవంతమవుతాయని తన జీవితం ద్వారా నిరూపించాడు. త్యాగం, అంకితభావం.. సీతమ్మ తల్లి తన సొంత సుఖాలను త్యాగం చేసి రాముడితో వనవాసాన్ని ఇష్టపూర్వకంగా ఎంచుకుంది. సీతమ్మను వనవాసానికి వెళ్లమని ఎవరూ బలవంతం చేయలేదు.   ఈ త్యాగం ఇప్పటికీ  సంబంధాలు స్వార్థం మీద కాదు, నిస్వార్థత మీద నిలబడి ఉంటాయని బోధిస్తుంది. ప్రాధాన్యత.. రాముడు,  సీత ఒకరి కోరికలను, భావాలను పరస్పరం గౌరవించుకున్నారు. దీర్ఘకాలిక సంబంధానికి పరస్పర గౌరవం చాలా ముఖ్యం. సీత  రాముడి గౌరవార్థం  రాజభవనాన్ని విడిచిపెడితే.. రాముడు రాజు అయినప్పటికీ సీతమ్మ తల్లి కోసం రావణుడితో యుద్దమే చేశాడు. సీతమ్మ కోసం తానే నేరుగా లంకకు వెళ్ళాడు.                               *రూపశ్రీ.

వివాహం అయిన ప్రతి జంట ఈ  దశలను దాటుకుంటూ వెళ్లాలి..!

  ప్రతి వ్యక్తి జీవితంలో వివాహం అనేది చాలా  కీలకమైన దశ. ఇద్దరు వ్యక్తులు పెళ్లికి  ఒప్పుకుని, మూడు ముళ్లతో ఒకటైనంత సులువుగా వారి వైవాహిక జీవితం ఉండదు.  రెండు వేర్వేరు మనస్తత్వాలు కలిగిన వారు ఒకేచోట ఉండటం అంటే చాలా అభిప్రాయ బేధాలు కూడా వస్తుంటాయి. అయితే అభిప్రాయ బేధాలను దాటుకుంటూ.. ఇద్దరూ కలిసి ఉండటంలోనే వైవాహిక బంధాన్ని నిలబెట్టుకునే నేర్పు ఉంటుంది. పెళ్లైన ప్రతి జంట తమ జీవితంలో కొన్ని దశలను తప్పక దాటుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ దశలు ఏంటో.. వాటిని దాటేటప్పుడు జరిగే పరిణామాలు ఏంటో తెలుసుకుంటే..   పెళ్లైన కొత్తలో.. పెళ్లైన కొత్త.. స్త్రీ, పురుషుల జెండర్ అట్రాక్షన్ చాలా బలంగా ఉంటుంది.  అందుకే ఈ దశలో ఇద్దరూ చాలా క్లోజ్ గా, ఒకరంటే ఒకరికి చాలా ఇష్టంగా ఉంటారు. ఆ దశలో ఒకరు చేసే తప్పును మరొకరు పెద్దగా సీరియస్ గా తీసుకోరు. ఒకవేళ తీసుకున్నా అది ఎక్కువ సేపు ఉండదు. దీనికి కారణం శారీరక రిలేషన్. అయితే పెళ్లైన కొత్తలో భార్యాభర్తల మధ్య శారీరక రిలేషన్ సరిగా లేకపోతే.. వారిమధ్య చిన్న విషయాలు, చిన్న తప్పులు కూడా చాలా పెద్ద అగాధాన్ని సృష్టిస్తాయి. కాబట్టి పెళ్లైన కొత్తలో భార్యాభర్తల బంధం బలంగా ఉండాలంటే అది శారీరక బంధంతోనే సాధ్యం.   రియాలిటీ చెక్.. పెళ్లంటే కేవలం భార్యాభర్తల మధ్య సరదాలు, సంతోషాలు, అలకలు, షికార్లు.. ఇవి మాత్రమే కాదు.. పెళ్లయ్యాక ఇద్దరికి బాధ్యతలు పెరుగుతాయి. వాటికి తగ్గట్టు ఇద్దరికి వేర్వేరు అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్ల కారణంగా ఒకరిని మరొకరు దూషించుకుంటూ ఉంటారు. విమర్శించుకుంటూ ఉంటారు. ఇది భార్యాభర్తలకు పెద్ద సవాల్ గా మారుతుంది. ఎప్పుడు కూడా వాస్తవాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇద్దరూ కలిసి జీవితాన్ని ఎట్లా లీడ్ చేసుకుంటారు అనే దాని మీద ఇద్దరి ఆలోచన ఉండాలి. బాధ్యతలను సమర్థవంతంగా డీల్ చేసుకోవడంలోనే బంధం బలం ఎంతో బయటపడుతుంది.   సర్దుబాటు.. అడ్జస్ట్మెంట్.. ఇది చాలా ముఖ్యమైన ఆయుధం. భార్యాభర్తల బంధం అయినా, స్నేహం అయినా, వ్యాపారం అయినా, ప్రేమ అయినా సర్దుబాటు అనేది లేకపోతే అది ఎప్పటికీ విజయవంతం కాదు. ముఖ్యంగా బార్యాభర్తల బంధంలో సర్దుబాటుకు చాలా ప్రాముఖ్యత ఉంది. రాజీ పడటం, ఓర్పుగా ఉండటం, ఏ సమస్య వచ్చినా బ్యాలెన్స్ గా ఉండటం వంటివి బంధాన్ని నిలబెడతాయి.   పేరెంట్స్.. పెళ్లైన ప్రతి జంటకు తల్లిదండ్రులు కావడం ఒక అపురూపమైన దశ. ఇద్దరు కాస్తా ముగ్గురు కావడం, ఆ తరువాత సంఖ్య పెరగడం.. ఇది చాలా అద్బుతంగా ఉంటుంది.  రెండు వేర్వేరు కుటుంబాల నుండి వచ్చిన ఇద్దరు వ్యక్తులు తామే ఒక కుటుంబాన్ని క్రియేట్  చేసుకోవడం వాళ్ళ ఉనికిని తెలిపే విషయం. పెళ్లికి ముందు ఉన్న చాలా విషయాలు ఎట్లాగైతే పెళ్లైన తర్వాత మార్పులకు లోనవుతాయో.. పెళ్లైన తర్వాత ఉండే చాలా విషయాలు.. పేరెంట్స్ అయిన తరువాత మార్పులకు లోనవుతాయి. కొత్త ప్రాధాన్యతలు వస్తాయి.  కొత్త బాధ్యతలు పెరుగుతాయి. తల్లిదండ్రుల దశ చాలా బాధ్యతాయుతమైనది.   మిడ్ లైఫ్ ఛాలెంజెస్.. మిడ్ లైఫ్ అంటే 40 ఏళ్ళు దాటిన తరువాత నుండి 60ఏళ్ళు టచ్ చేసే వరకు. ఈ ఇరవయ్యేళ్ల కాలంలో తల్లిదండ్రులకు చాలా ఛాలెంజెస్ ఎదురవుతాయి. పిల్లలు పెద్దవాళ్లు అవుతూ ఉంటారు. లైఫ్ లో సెటిల్ కావడానికి ఇల్లు కొనడం, పిల్లల చదువుల ఖర్చులు, పిల్లలు పెద్దగవడం, తల్లిదండ్రుల బాధ్యతగా పిల్లల పెళ్లిళ్ళు.. ఆరోగ్యం.. ఇట్లా చాలా విషయాలు ఛాలెంజ్ లు ఇస్తాయి.   సహవాసం.. సహవాసం అంటే కలిసి ఉండటం అని చాలా మందికి తెలుసు. కానీ.. భార్యాభర్తల లైఫ్ లో కలిసి ఉండటం ఒకరికి ఒకరు అనే అభిప్రాయం చాలా దృఢంగా మారేది వృద్దాప్యంలోనే. పెళ్లి అయ్యాక, పిల్లలు వచ్చాక వాళ్ల ప్రాధాన్యతలు మారుతూ ఉంటాయి. కానీ వృద్దాప్యం వచ్చాక, పిల్లల పెళ్లిళ్లు అయిపోయాక.. అప్పుడే భార్యాభర్తలకు ఒకరికొకరు అనే స్థితి కాస్త  స్థిరంగా ఉంటుంది. ఈ జీవిత చివరి దశను ఎంత సంతోషంగా గడపగలిగితే.. ఆ భార్యాభర్తలు తమ అవసాన దశలో అంత తృప్తిగా జీవితాన్ని ముగించగలుగుతారు.   - రూపశ్రీ  

వరల్డ్ హార్ట్ డే.. హార్ట్ అటాక్.. హార్ట్ ఫెయిల్యూర్.. ఈ రెండింటి మధ్య తేడా తెలుసా?

మనిషి శరీరంలో ప్రధాన  అవయవం గుండె.  గుండె ఎప్పుడైతే ఆగిపోతుందో.. అప్పుడు ఇక ఈ శరీరంలో ప్రాణం పోయినట్టే.. శరీరంలో ఏ అవయవ పనితీరు ఆగినా కొద్దికాలం పాటు అయినా శరీరం తట్టుకుని నిలబడుతుందేమో కానీ.. గుండె పని చేయడం ఆగితే క్షణాలలోనే ప్రాణాలు కూడా పోతాయి. గుండెకు సంబంధించిన వ్యాధులు వివిధ రకాలుగా ఉన్నాయి. వాటిలో హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ అటాక్ ముఖ్యమైనవి.  చాలా మందికి ఈ రెండింటి మధ్య తేడాలు తెలియవు.  ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీన వరల్ట్ హార్ట్ డే జరుపుకుంటారు.  ఈ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ఈ హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్ మధ్య తేడా తెలుసుకుంటే..  ప్రపంచవ్యాప్తంగా దాదాపు 18 మిలియన్ల మంది గుండె జబ్బులతో మరణిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది 40 ఏళ్లలోపు వారే కావడం ఆందోళన కలిగించే విషయం. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఇక్కడ గుండెపోటు,  గుండె వైఫల్యం వంటి సమస్యలు చిన్న వయస్సులోనే వస్తున్నాయి. గుండెపోటు.. గుండె కండరాలకు రక్త ప్రసరణకు ఆటంకం కలిగినప్పుడు లేదా అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు గుండెపోటు వస్తుంది. దీనికి ప్రధాన కారణం ధమనులలో ప్లేక్ పేరుకుపోవడం. కొలెస్ట్రాల్,  కొవ్వు నిక్షేపాలు ఫ్లేక్ లాగా ఏర్పడతాయి. ఈ ప్లేక్ పగిలినప్పుడు అది రక్తం గడ్డకట్టేలా చేస్తుంది. ఇది రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. గుండెపోటు  లక్షణాలు.. తీవ్రమైన ఛాతీ నొప్పి లేదా ఒత్తిడి. చేతులు, వీపు లేదా దవడకు  నొప్పి వ్యాపిస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. చెమట పట్టడం,  వికారం ఉంటుంది. గుండెపోటు  తక్షణ వైద్య సహాయం అవసరమయ్యే తీవ్రమైన పరిస్థితి. సకాలంలో చికిత్స తీసుకుంటే ప్రాణాలను కాపాడుతుంది. గుండె వైఫల్యం.. గుండె ఆగిపోవడం అనేది  తీవ్రమైన పరిస్థితి. దీనిలో గుండె కండరం చాలా బలహీనంగా మారుతుంది.  శరీరానికి తగినంత రక్తం,  ఆక్సిజన్‌ను పంప్ చేయలేకపోతుంది. గుండె ఆగిపోవడం అంటే గుండె పూర్తిగా ఆగిపోయిందని కాదు,  గుండె దాని పంపింగ్ సామర్థ్యాన్ని కోల్పోవడం ప్రారంభిస్తుందని అర్థం. దీని అర్థం గుండె శరీరానికి అవసరమైనంత రక్తాన్ని సరఫరా చేయలేకపోతుంది. గుండె పనితీరు క్షీణిస్తుంది. హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఇది నెమ్మదిగా డవలప్ అవుతున్న  పరిస్థితి. ఎక్కువకాలం పాటు అధిక రక్తపోటు, మధుమేహం, పదే పదే గుండెపోటు రావడం, ధూమపానం లేదా ఊబకాయం దీనిని తీవ్రం చేస్తాయి. హార్ట్ ఫెయిల్యూర్ వచ్చిన వ్యక్తిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కాళ్లలో వాపు, అలసట,  హృదయ స్పందన వేగంగా ఉండటం, రాత్రి పదే పదే  మేల్కొనడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. పైన చెప్పుకున్న విధానాన్ని బట్టి గుండెపోటుకు,  గుండె వైఫల్యానికి మధ్య తేడాలు,  అవి రావడానికి గల కారణాలు అర్థం చేసుకుని సమస్యను ముందే గుర్తించడం లేదా జాగ్రత్తలు తీసుకోవడం చేయవచ్చు.                                    *రూపశ్రీ.  

పిల్లల ముందు ఏడుస్తుంటారా? ఈ నిజం తెలిస్తే..!

కాలాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కొన్నిసార్లు కష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా తల్లిదండ్రులు కష్టమైనా, బాధ అయినా పిల్లలకు తెలియకుండా దాస్తుంటారు.  అయితే కొన్నిసార్లు పిల్లల నుండి వాటిని దాచడం కష్టం అవుతుంది.  తల్లిదండ్రులు పిల్లల ముందు భావోద్వేగానికి గురవుతారు. తల్లిదండ్రుల కన్నీళ్లు పిల్లల హృదయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.  చాలా మంది పిల్లలు, వారి తల్లిదండ్రుల బాధను చూసి, విచారంగా,  నిశ్శబ్దంగా మారతారు. అయితే ఇలా పిల్లల ముందు బాధపడటం,  ఏడ్వడం పిల్లల మీద ప్రభావం చూపుతుందా? దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. ఎమోషన్ సెన్సిటివిటీ.. పిల్లల ముందు ఏడుపు అనేది ఒక సహజ భావోద్వేగం, ఇది పిల్లలు భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి,  అంగీకరించడానికి సహాయపడుతుంది. పిల్లల ముందు ఏడ్వడం లేదా బాధపడటం అనేది  పిల్లలు విచారం, ఆందోళన లేదా ఒత్తిడిని దాచాల్సిన అవసరం లేదని తెలుసుకోవడానికి సహాయపడుతుంది.  వారు భావోద్వేగపరంగా తెలివైన వాళ్లుగా మారతారట. వాళ్లు కూడా తమ ఎమోషన్స్ ఎక్ప్రెస్ చేయడం నేర్చుకుంటారట.  ఇది సాధారణ జీవితానికి చాలా అవసరం. తల్లిదండ్రుల ఏడుపు పిల్లల భావోద్వేగ సెన్సిటివిటీ ని ,  సానుభూతిని పెంచుతుంది. బలమైన, సున్నితమైన వ్యక్తిత్వాలను అభివృద్ది చేయడంలో ఇది సహాయపడుతుందట. ప్రతికూల ప్రబావం.. పిల్లల ముందు ఏడవడం వల్ల పాజిటివ్ ఎఫెక్ట్ కంటే  నెగెటివ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందట. తల్లిదండ్రులు తమ పిల్లల ముందు నిరంతరం తమ భావోద్వేగ ఆందోళనలను వ్యక్తం చేస్తే, అది వారిలో అభద్రత, ఆందోళన, భయం వంటి భావాలను క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా తమ భావోద్వేగాలను సరిగ్గా అర్థం చేసుకోలేని చిన్నపిల్లలు తమ తల్లిదండ్రులు ఎందుకు ఏడుస్తున్నారో అర్థం చేసుకోలేరు. ఇది వారి భావోద్వేగ స్థితిని ప్రభావితం చేస్తుంది.   పిల్లలు ఏడ్వడం చూస్తే.. పిల్లలు ఏడుస్తున్నప్పుడు తల్లిదండ్రులు  చూస్తే  తరచుగా  తమ ఎమోషన్స్ ను  దాచడానికి తల్లిదండ్రులు ప్రయత్నిస్తారు. కానీ తల్లిదండ్రులు ఏడవడాన్ని పిల్లలు చూసినప్పుడు దానికి ల కారణాలను పిల్లలకు చెప్పాలి. ఇది పిల్లల భావోద్వేగ అవగాహనను పెంచుతుంది. అబద్దాలు వద్దు.. తల్లిదండ్రులు ఏడుస్తున్నప్పుడు పిల్లలు గమనించే ఏమైంది అని అడిగితే.. ఏం లేదు అని సింపుల్ గా దాటవేస్తుంటారు తల్లిదండ్రులు. కానీ ఇది సరికాదు. సరైన కారణం చెప్పకపోతే పిల్లలు కూడా తేలిగ్గా కాంప్రమైజ్ కారు. తల్లిదండ్రులు పిల్లల దగ్గర నిజాయితీగా ఉంటే.. పిల్లలు కూడా తల్లిదండ్రుల నుండి అలా నిజాయితీగా ఉండటమే నేర్చుకుంటారు. సమస్యలు, పరిష్కారాలు.. సమస్య రావడం, ఇబ్బంది పెట్టడం,  పెద్దలు బాధపడటం ఇదంతా జరిగినట్టే పరిష్కారం కూడా ఖచ్చితంగా వస్తుంది. దీన్ని పిల్లలు తమ తల్లిదండ్రుల నుండి గ్రహించగలిగితే.. సమస్యలు వచ్చినప్పుడు పిల్లలు ఎలాగైతే బాధపడతారో.. ఆ సమస్యలకు పరిష్కారాలు కూడా ఉంటాయనే ధైర్యం కూడా వారిలో ఏర్పడుతుంది. ఇది పిల్లల జీవితంలో మంచి జీవితానికి పునాది అవుతుంది.                               *రూపశ్రీ.

అబద్దం చెప్పే భర్తలకు ఎలా బుద్ధి చెప్పాలి..!

  భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది ఒక విలువైన సంబంధం. అయితే ఈ బంధం  ఎప్పుడూ తగాదాలు,  వాదనలతో నిండి ఉంటుంది.  కానీ గొడవ అయినా, తగాదాలు అయినా  భర్త పదేపదే  అబద్ధం చెప్పడం చాలా ఇబ్బందికర విషయం.  ఇలా  అబద్ధాలు చెప్పడం భార్యను బాధకు గురిచేస్తుంది. భర్త చెప్పేవి అబద్దాలు అని తెలిసినా సరే.. కొందరు భార్యలు తమ భర్తల విషయంలో ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉంటారు. మరికొందరు గొడవ పడుతుంటారు. అయితే ఇలా గొడవ పడటం వల్ల భార్యాభర్తల బంధానికే ముప్పు వాటిల్లుతుంది. అయితే ఇలాంటి విషయాల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భర్త ఇంకోసారి అబద్దం చెప్పకుండా ఉండటానికి సహాయపడే కొన్ని చిట్కాలు ఉన్నాయి.  వాటిని ఫాలో అయితే భర్తలు అబద్దం చెప్పడం మానేస్తారు.  అవేంటో తెలుసుకుంటే.. భర్తకు అబద్ధాలు చెప్పే అలవాటును ఎలా వదిలించాలి..  భర్త  భార్యకు  అబద్ధం చెబితే, అది సంబంధానికి పెద్ద సమస్యగా మారవచ్చు. అబద్ధం చెప్పడం వల్ల భార్యాభర్తల మధ్య నమ్మకం తగ్గిపోతుంది.  సంబంధంలో చీలిక ఏర్పడుతుంది. దీన్ని నివారించడానికి  కొన్ని చిట్కాలను అనుసరించవచ్చు.  భర్తతో బహిరంగంగా మాట్లాడవచ్చు.. భర్త అబద్దాలు చెబుతుంటే భార్య వాటిని ఊరికే సహించడం చేయకుండా నేరుగా  భర్తతో ఓపెన్ గా  మాట్లాడాలి. అబద్ధం ఎంత ప్రమాదకరమూ,  అది భార్యను  ఎలా బాధపెడుతుందో వివరించాలి. ఇలాంటి విషయాలు చెప్పేటప్పుడు భర్తకు ఆ విషయాలు అర్థం కావడం కోసం కొన్నిఉదాహరణలు కూడా చెప్పవచ్చు. అతను చెప్పిన అబద్దాల వల్ల ఏ సందర్భంలో ఎంత బాధ అనుభవించారనేది చెప్పవచ్చు.  ఇలా చేస్తే భర్తలో ఆలోచనలు కలిగి అతను అబద్దం చెప్పడం మానుకునే అవకాశం ఉంటుంది. కారణాలు అర్థం చేసుకోవాలి.. భర్త అబద్దం చెప్పడం అనే విషయాన్ని మాత్రమే కాకుండా.. అతను ఎలాంటి సందర్బంలో, పరిస్థితిలో అబద్దం చెప్పాడు అనే విషయాన్ని కూడా కూడా అర్థం చేసుకోవడం భార్య బాధ్యత.  ఇలా అర్థం చేసుకుంటే  తన భావాలను భార్య అర్థం చేసుకుంటోందని అతను గ్రహిస్తాడు.  అతని అబద్ధాల వెనుక గల కారణాలను అర్థం చేసుకుంటే ఆ తరువాత అతను ఎప్పుడైనా అర్థం చెప్పినా అదంత బాధ లేదా కోపాన్ని కలిగించదు.   పరిష్కారం.. భార్య భర్తకు ఎలాంటి పరిస్థితిలో అయినా  అండగా ఉన్నారని,  ఏవైనా సమస్యలు వస్తే వాటి పరిష్కార మార్గాలు కనుగొనడంలో అతనికి సహాయం చేస్తారని అతనికి  అర్థమయ్యేలా చేయాలి. ఇలా చేస్తే భర్త ఏ సమస్య వచ్చినా తన భార్య కూడా తనకు సమస్య పరిష్కారంలో తోడు ఉంటుందనే భరోసాతో అబద్దాలు చెప్పకుండా ఏ విషయాలు దాపరికం లేకుండా ఉంటారు.   బయటి నుండి సహాయం.. పైన చెప్పుకున్న చిట్కాలన్నింటినీ అనుసరించిన తర్వాత కూడా భర్త ప్రవర్తన మెరుగుపడకపోతే.. భార్య  మంచి సలహాదారుడి సహాయం తీసుకోవచ్చు. అంతేకాదు భర్త అబద్ధం చెప్పడం మానేయడానికి  అతను చేస్తున్నది ఎంత  తప్పు అనే విషయం  అర్థం చేసుకునేలా చేయడానికి  అతనితో సమయం గడపాలి. దగ్గరి వ్యక్తుల  సహాయం..   భర్త అబద్దాలు చెప్పడం అనే  సమస్యను కుటుంబానికి బాగా దగ్గరగా ఉన్న వ్యక్తులు,   స్నేహితులు,  ఆత్మీయులు మొదలైనవారితో  చర్చించవచ్చు. ఈ సమస్యను పరిష్కరించడానికి సమయం పట్టవచ్చు.  కాబట్టి కొంత ప్రశాంతంగా ఉండాలి.  భార్యాభర్తల బంధంలో అబద్దాలు చెప్పడం బంధాన్ని ఎంత ప్రమాదంలో పడేస్తుందో అతనికి అర్థమయ్యే వరకు వేచి ఉండాలి.                                *రూపశ్రీ.

 కోడలు ఈ పనులు చేస్తే ఎలాంటి అత్తగారైనా ఫ్లాట్ అవ్వాల్సిందే..!

  వివాహం అంటే భార్యాభర్తల బంధం అని చాలామంది అనుకుంటారు. అది నిజమే అయినా వివాహం అయిన తరువాత భార్యాభర్తల బంధం కంటే ఎక్కువగా అత్తాకోడళ్ల మధ్య  జరిగేవే ఎక్కువ ఉంటాయి. భార్యాభర్తలు ఉద్యోగస్థులై.. వారు కుటుంబానికి దూరంగా ఉండి ఉద్యోగాలు చేసుకుంటే అత్తాకోడళ్ల సమస్య ఉండదు. కానీ.. అత్తమామలతో కలిసి ఉండే జంటలు ఉంటాయి. ఇలాంటప్పుడు అత్తాకోడళ్ల మధ్య చాలా బేధాభిప్రాయాలు వస్తుంటాయి.  ముఖ్యంగా చాలాసార్లు అత్తగారు పెత్తనం పేరుతో కోడళ్లను తిట్టడం, ఎగతాళి చేయడం, ఇబ్బందిగా మాట్లాడటం,  పనుల పేరుతో విశ్రాంతి లేకుండా చేయడం,  కొడుకు కోడలు సంతోషంగా ఉండకుండా చేయడం వంటివి చేస్తుంటారు. ఇదంతా వారి అహానికి సంబంధించినది.   అయితే.. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు కనీసం భర్త అయినా భార్యకు సపోర్ట్ చేయకుండా తన తల్లికే సపోర్ట్ చేస్తుంటే మాత్రం అది కోడళ్లకు చాలా నరకప్రాయంగా ఉంటుంది.  కానీ ఎలాంటి అత్తలను అయినా తమ వైపు తిప్పుకుని వారిలో తమ పట్ల మంచి అభిప్రాయం ఏర్పడేలా చేసే చిట్కాలు కొన్ని ఉన్నాయి.  ఈ చిట్కాలు పాటిస్తే ప్రతి కోడలు తన అత్తగారి దగ్గర పాజిటివ్ మార్కులు కొట్టేస్తుంది.  అవేంటో తెలుసుకుంటే.. ప్రత్యర్థిగా కాదు.. అత్తగారిని కుటుంబంలో ఒక సభ్యురాలిలా చూసుకోవాలి. చాలా మంది అత్తగారు అంటే  ప్రత్యర్థి అని,  ఆమె తమకు వ్యతిరేకం కాబట్టి తాము కూడా ఆమెకు వ్యతిరేకంగా ఉండాలి అనుకుంటారు. కానీ  ఆమెను గౌరవిస్తున్నట్లు ఆమె అర్థం  చేసుకునేలా చేయాలి. ఎగతాళికి చేసినప్పుడు దానికి వెంటనే రియాక్ట్ అవ్వడానికి బదులు వాతావరణాన్ని చెడగొట్టకుండా ఉండటం తెలివైన పని. ఎందుకంటే భర్త కూడా అత్తవైపు ఉన్నప్పుడు అత్తగారు తప్పుగా ప్రవర్తించినా,  తప్పుగా మాట్లాడినా చివరకు దోషులుగా మిగిలేది కోడళ్లే. అందుకే వాతావరణం వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండేలా చూడాలి. ఇష్టాఇష్టాలు.. చాలావరకు భర్త ఇష్టాఇష్టాలు తెలుసుకుని భార్య మసలుకుంటే సరిపోతుంది అని అనుకుంటారు. కానీ.. కేవలం భర్త విషయమే కాదండోయ్.. అత్తగారి ఇష్టాఇష్టాల మీద దృష్టి పెట్టడం మంచిది.  అత్తగారికి ఇష్టమైన పనులు, ఇష్టమైన ఆహారం, ఇష్టమైన వస్త్రధారణ.. ఇలాంటివన్నీ అత్తగారికి ప్రాముఖ్యత ఇస్తున్నారని చెప్పడంలో సహాయపడతాయి.  తనకు ప్రాధాన్యత ఇస్తున్నారని అనిపిస్తే అత్తగారు కోడలి విషయంలో మారిపోతుంది. బాధ్యత.. ఇంటి పనుల్లో సహాయం చేయడం,  లేదా ఇంటి పనుల విషయంలో  బాధ్యత వహించడం చేయాలి. అడగకుండానే పనులు చేయడం వల్ల  అత్తగారు మంచి అభిప్రాయంలోకి వచ్చేస్తారు. ఇది క్రమంగా ఆమె వైఖరిని మార్చుకోవడానికి సహాయపడుతుంది. ఫిర్యాదులు.. భర్తపై ఫిర్యాదులు చేయడం చాలా మంది చేసే పని. అయితే భర్త మీద చేసే ఫిర్యాదులు అత్తగారి అహాన్ని దెబ్బతీస్తాయి.  అందుకే అతని తప్పులను అత్తగారితో ఎప్పుడూ చెప్పకూడదు.  ముఖ్యంగా  అత్తగారితో నేరుగా మాట్లాడటానికి ప్రయత్నించాలి. ఏవైనా అపార్థాలు ఉంటే వాటిని అర్థమయ్యేలా గౌరవంగా వివరించి చెప్పుకుని పరిష్కరించుకోవాలి. ఎప్పటికీ అత్తగారితో  వాదనలు చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఇది  సంబంధాన్ని మరింత దెబ్బతీస్తుంది. ముఖ్యంగా అత్తగారితో వచ్చే బేధాబిప్రాయాలు భార్యాభర్తల బంధం దెబ్బతినడానికి కారణం అవ్వచ్చు కూడా. నిర్ణయాలు.. కుటుంబ నిర్ణయాల విషయంలో ఎల్లప్పుడూ  అత్తగారి సలహా తీసుకోవడం మరచిపోకూడదు. ఆమె అభిప్రాయం ముఖ్యమని ఆమెకు అనిపించేలా చేయాలి. దీనివల్ల ఆమెకు మీ పట్ల గౌరవం,  ఆప్యాయత పెరుగుతుంది. చురుగ్గా ఉండాలి.. పండుగలు, కుటుంబ కార్యక్రమాలు లేదా చిన్న వేడుకల సమయంలో ఉత్సాహంగా ఉండాలి.  అత్తగారిని కూడా వేడుకలలో పాల్గొనేలా ప్రోత్సహించాలి.  ఆమె ఇష్టాలను పరిగణించండి. ఇది అత్తాకోడళ్ల మధ్య సంబంధాన్ని మధురంగా చేస్తుంది  కుటుంబంలో కోడలి స్థానాన్ని స్థిరపరుస్తుంది. ప్రశాంతత ముఖ్యం.. ఒత్తిడి లేదా కోపం ఉన్న సమయాల్లో ప్రశాంతంగా ఉండాలి. వాదించడానికి బదులుగా సరైన సమయం కోసం వేచి ఉండాలి. విషయాన్ని తెలివిగా పరిష్కరించుకోవాలి.  అత్తగారు తప్పుగా ప్రవర్తిస్తున్నారు అని  నిరూపించడానికి ప్రయత్నించకుండా ఉండాలి.  ఆమెను తప్పుగా చూపించడం కంటే ఆమె ప్రవర్తన మార్చుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలి. ఆమె తప్పుగా ఉన్నానని ఆమెకే అర్థమయ్యేట్టు చేయాలి.  పాజిటివ్ గా ఉండాలి.. ఎల్లప్పుడూ సానుకూల దృక్పథాన్ని,  సహనాన్ని కలిగి ఉండాలి. సంబంధాలు రాత్రికి రాత్రే మారవు. ప్రేమ, అవగాహన,  సమయంతో, ప్రతి ఒక్కరి హృదయంలో స్థానం సంపాదించడం సులభం.                                 *రూపశ్రీ.

భార్యాభర్తల మధ్య విడాకులకు దారి తీసే విషయాలు ఇవే.. వీటిని దూరంగా ఉంచాలి..!

  వివాహం అంటే అన్ని పరిస్థితులలోనూ ఒకరికొకరు అండగా నిలబడటం. కష్టం, నష్టం,  బాధ,  సంతోషం.. ఇట్లా అన్ని విషయాలలోనూ ఒకరికి ఒకరుగా ఉండాలి. కానీ కొన్నిసార్లు చిన్న అపార్థాలు,  విభేదాలు భార్యాభర్తల మధ్య  విడాకుల వరకు వెళతాయి. అందువల్ల భార్యాభర్తల బంధం ఆరోగ్యంగా సాగడానికి.. విడాకుల వరకు వెళ్లకుండా ఉండటానికి  భార్యాభర్తల మధ్య కొన్ని విషయాలు ఎప్పటికీ చోటు చేసుకోకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. వీటిని సకాలంలో పరిష్కరించకపోతే, అవి  వైవాహిక బంధాన్ని ప్రమాదంలో పడేస్తాయి. అహంకారం,  మొండితనం.. భార్యాభర్తల మధ్య సంబంధం నమ్మకం,  అవగాహనపై ఆధారపడి ఉంటుంది. కానీ అహం అడ్డువచ్చినప్పుడు ప్రతి చిన్న విషయం సంఘర్షణకు మూలంగా మారుతుంది. వివాహంలో అహం సమస్యలు సంబంధాన్ని బలహీనపరుస్తాయి . కాబట్టి రాజీ పడటం నేర్చుకోవాలి.  సర్థుకుపోయే తత్వం కేవలం ఒకరిలోనే కాదు.. ఇద్దరిలో ఉండాలి. కమ్యూనికేషన్ లేకపోవడం తరచుగా భార్యాభర్తలు  చిన్న చిన్న విషయాలకు  ద్వేషాలను పెంచుకుంటారు.  ఈ కోపం ద్వేషం కారణంగా ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయరు. క్రమంగా ఈ దూరం కాస్త సంబంధం తెగిపోయే స్థాయికి చేరుకుంటుంది . విడాకులకు ఇది అతిపెద్ద కారణాలలో ఒకటి. సమయం  కేటాయింపు.. నేటి బిజీ జీవితాల్లో పని,  బాధ్యతలు తరచుగా  ఇబ్బంది పెడతాయి. భార్యాభర్తలు  ఒకరికొకరు సమయం కేటాయించకుండా నిరోధిస్తాయి. ఈ నిర్లక్ష్యం సంబంధాన్ని దెబ్బతీస్తుంది. ఇది చాలా కీలకం. లేకుంటే వివాహం కేవలం లాంఛనప్రాయంగా మారుతుంది. ఆర్థిక ఒత్తిడి.. డబ్బు సమస్యలు తరచుగా అతిపెద్ద తగాదాలకు కారణమవుతాయి. పరిష్కరించకపోతే వివాహంలోని ఆర్థిక సమస్యలు విడాకులకు దారితీయవచ్చు . కాబట్టి డబ్బు విషయాలను ఓపెన్ గా  చర్చించడం ముఖ్యం. బయటి జోక్యం.. వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగత సంబంధం. కానీ ఇతరులు జోక్యం చేసుకోవడం ప్రారంభించినప్పుడు సమస్యలు తలెత్తుతాయి. తల్లిదండ్రులు లేదా అత్తమామల నుండి అధిక జోక్యం తరచుగా భార్యాభర్తల మధ్య అన్ని రకాల అటాచ్మెంట్ లను  నాశనం చేస్తుంది. సంబంధాన్ని ఎలా కాపాడుకోవాలి ఒకరు చెప్పేది మరొకరు  జాగ్రత్తగా వినాలి. ఇద్దరూ కలిసి చర్చించుకోవడం  ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి.  సంబంధంలో నమ్మకాన్ని కాపాడుకోవాలి.  ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండాలి.   తప్పులను క్షమించడం నేర్చుకోవాలి.  భార్యాభర్తలు ఇద్దరూ శత్రువులు కాదు. వారిద్దరూ ఒక అపురూపమైన బంధంలో ఉంటారు. ఒకరు తప్పు చేసినప్పుడు ఆ తప్పు గురించి పాజిటివ్ గా చర్చించి వాటిని పరిష్కరించుకోవాలి. అవసరమైతే కౌన్సెలింగ్ తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య సంబంధం చాలా సున్నితమైనది. అహం, కమ్యూనికేషన్ లేకపోవడం, సమయ పరిమితులు, ఆర్థిక ఒత్తిడి లేదా ఇతరుల జోక్యం మొదలైనవి బందం నాశనం కావడానికి  దారితీయవచ్చు. భార్యాభర్తలు ఇద్దరూ తమ  బంధం బలంగా ఉండాలని మీరు కోరుకుంటే పైన  చెప్పుకున్న ఏ విషయాలు వారికి అసలు సమస్యలా అనిపించవు. వాటిని ఇద్దరి మధ్య రానివ్వకుండా చూసుకోవచ్చు.                                       *రూపశ్రీ.

ఆడవారి ఈ అలవాట్లు మగాళ్ల మనసును కొల్లగొడతాయట..!

  ఆకర్షణ అనేది చాలా విచిత్రమైనది.  ఈ భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్టే.. మనుషులకు కూడా ఆకర్షణ శక్తి ఉంటుంది. అయితే కొందరు మాత్రం ఏ పిచ్చి  ఆకర్షణలకు లోను కాకుండా ఉంటారు.  ఈ కాలంలో అమ్మాయిలు అయినా అబ్బాయిలు అయినా తమకు ఎవరైనా నచ్చితే ఎదుటివారు  కూడా తమను ఇష్టపడాలి అనుకుంటారు.  ముఖ్యంగా ఏ అమ్మాయి అయినా తమకు నచ్చిన అబ్బాయిని అట్రాక్ట్ చేయాలనుకుంటే కొన్ని చిట్కాలు బాగా సహాయపడతాయి.  వారు కొన్ని అలవాట్లను ఫాలో అయితే చాలు.. అలాంటి అమ్మాయిలను చూసి అబ్బాయిల మనసు ఫ్లాట్ అవుతుందట. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే..  స్వావలంబన.. నేటి ప్రపంచంలో మహిళలు పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారు. పురుషులు అలాంటి మహిళలను ఎంతో ఇష్టపడతారు. ఒక స్త్రీ తన సొంత నిర్ణయాలు తీసుకుని, స్వావలంబన కలిగి ఉన్నప్పుడు అది ఆమె వ్యక్తిత్వాన్ని పెంచుతుంది.   సానుకూల ఆలోచన.. కష్ట సమయాల్లో కూడా సానుకూలంగా ఆలోచించే   మహిళల పట్ల పురుషులు ఆకర్షితులవుతారు. సానుకూల దృక్పథం ఉన్న మహిళలు ప్రతి పరిస్థితిని అవగాహనతో డీల్ చేస్తారు. అలాంటి మహిళలు సంబంధాలను మెరుగుపరుచుకుంటారు.  కష్ట సమయాల్లో తమ భాగస్వాముల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.   గౌరవం.. గౌరవం, ప్రేమ ప్రతి అబ్బాయి కోరుకుంటాడు. అట్లాగే  ఇతరులను,  ఇతరుల   అభిప్రాయాలను కూడా గౌరవించాలని కోరుకుంటాడు. ఒక స్త్రీ తన భాగస్వామి భావాలను,  అభిప్రాయాలను గౌరవించినప్పుడు అది సంబంధం బలంగా మారడానికి దోహదమవుతుంది. ఆనందం.. నేటి బిజీ జీవితాల్లో ఒక స్త్రీ చిన్న విషయాలలో ఆనందాన్ని అనుభూతి చెందితే.. అలాంటి మహిళలకు అబ్బాయిలు చాలా  ఆకర్షితులు అవుతారు. చిన్న చిన్న విషయాలకే చిరాకు చూపే స్త్రీల వల్ల  సంబంధాలు నాశనమయ్యే అవకాశం ఉంటుంది. నిజాయితీ.. ప్రతి సంబంధంలోనూ నిజాయితీ చాలా కీలకం. ఒక స్త్రీ తన సంబంధంలో నిజాయితీగా ఉంటే, పురుషులు ఆమెను ఎంతో గౌరవిస్తారు. మహిళలలో ఉండే ఈ అలవాటు ఆమె పట్ల వారికి గౌరవాన్ని మరింత పెంచుతుంది.   సెల్ఫ్ లవ్..  పురుషులు తమను తాము ప్రేమించుకుంటూ తమ గురించి తాము  శ్రద్ధ వహించే స్త్రీల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు. తమను తాము గౌరవించుకునే స్త్రీలను ఇతరులు కూడా గౌరవిస్తారు.   పై అలవాట్లు అమ్మాయిలలో ఉంటే వారు అబ్బాయిలకు చాలా నచ్చుతారు. ఇలాంటి అమ్మాయిలు లైఫ్ ను చాలా బాగా లీడ్ చేయగలుగుతారు.  పరిస్థితులను చాలా చక్కగా అర్థం చేసుకోగలుగుతారు.                             *రూపశ్రీ.

వ్యాపారంలో ఎదగడానికి సూపర్ టిప్స్ ఇవి..!

  మనిషి జీవితంలో ఆదాయం రావడానికి ఏదో ఒక ఉపాధి తప్పనిసరిగా ఉండాలి.  కొందరు ఒకరి కింద పనిచేస్తారు. మరికొందరు తమకు తామే ఉపాధి సృష్టించుకుంటారు.  ఇలా తమకు తాము ఉపాధి సృష్టించుకునేవారు వ్యాపారస్తులు అవుతారు. వ్యాపారం బాగా ఎదిగితే వీరే కొందరికి తమ కింద ఉపాధి కల్పిస్తారు.  అయితే వ్యాపారం మొదలుపెట్టిన ప్రతి ఒక్కరు సక్సెస్ కాలేరు. దీనికి కారణం  వ్యాపారానికి సంబంధించి కొన్ని విషయాలు తెలియకపోవడమే.. చేతిలో డబ్బు ఉంటే చాలు వ్యాపారం చేసేయవచ్చు అని కొందరు అనుకుంటారు. కానీ వ్యాపారం చేయాలన్నా, అందులో విజయం సాధించాలన్నా జ్ఞానం చాలా అవసరం. వ్యాపారంలో విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందేమిటో తెలుసుకుంటే.. కష్టపడి పనిచేయడం.. వ్యాపారంలో విజయం సాధించాలంటే కష్టపడి పనిచేయడం ఎప్పుడూ అవసరం.  సోమరితనంతో,  నిర్లక్ష్యంగా పనిచేస్తే ఎప్పటికీ విజయం సాధించలేరు.  తగినంత సమయం ఉన్నప్పుడు లక్ష్యాలను చేరుకోవడానికి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే అది విజయానికి బదులుగా అపజయాన్ని మిగులుస్తుంది. సానుకూల ఆలోచన.. పాజిటివ్  ఆలోచన,  ఆత్మవిశ్వాసం విజయానికి కీలకం. తమ మీద తాము నమ్మకం పెట్టుకోవడం ద్వారా తాము చేసే పనులలో  సానుకూల ఫలితాలను పొందగలుగుతారు. ప్రతికూల ఆలోచనలు  మనసులోకి ఎప్పుడూ రానివ్వకూడదు. ఇది  ఆత్మవిశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. సత్సంబంధాలు..  స్వంత వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు ప్రజలతో మంచి సంబంధాలను కొనసాగించాలి. ఇది  వ్యాపారానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎల్లప్పుడూ  కస్టమర్లకు ప్రాధాన్యత ఇవ్వాలి.  కస్టమర్ల సాటిసిఫ్యాక్షన్ ను దృష్టిలో ఉంచుకోవాలి. దానికి తగినట్టు ప్రణాళికలు మారుస్తూ ఉండాలి. రిస్క్.. కొత్త వ్యాపార అవకాశాలను త్వరగా గుర్తించి, వాటిలో పెట్టుబడి పెట్టడానికి భయపడకూడదు.. అయితే, ఏదైనా రిస్క్ తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. రిస్క్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అన్ని అంశాలను పరిగణిలోకి తీసుకోవాలి. నిజాయితీ.. వ్యాపారస్తులకు ఉండాల్సిన  ఒక ముఖ్యమైన లక్షణం నిజాయితీ.  నిజాయితీగా వ్యవహరించడం వల్ల  ఖ్యాతి,  వ్యాపారం మెరుగుపడుతుంది.  దీని ద్వారా  గొప్ప లక్ష్యాలను సాధించవచ్చు. కస్టమర్‌లు,  ఉద్యోగుల మధ్య నమ్మకమైన వాతావరణాన్ని నిర్మించాలి. ఇది  వ్యాపారాన్ని పెంచుతుంది. దృఢ సంకల్పం.. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు, ప్రతి ఒక్కరూ ఎప్పుడు విజయం సాధిస్తామో అని ఆలోచిస్తారు. విజయం రాత్రికి రాత్రే రాదు. ఓపికగా ఉండి ప్రయత్నిస్తూ ఉండాలి.  వ్యాపారం అంటే  విజయం మాత్రమే కాదు.. అందులో విజయం ఉంటుంది,  వైఫల్యం కూడా ఉంటుంది. కాబట్టి  వైఫల్యాలు ఎదురైతే వాటి  నుండి నేర్చుకుని ముందుకు సాగండి. విజయం సాధిస్తే మళ్లీ కొత్త మార్గాలను జాగ్రత్తగా అన్వేషిస్తూ సాగాలి. లీడర్షిప్ స్కిల్స్.. వ్యాపారం చేయడానికి న్యాయకత్వ నైపుణ్యాలు ఉండాలి.  వాటిని మెరుగుపరుచుకోవాలి.  ఎందుకంటే తన కింద వారిని నడిపించడానికి అవి సహాయపడతాయి.  సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. పై విషయాలను అన్వయించుకోవడం ద్వారా  వ్యాపారంలో విజయం సాధించవచ్చు. వ్యాపారాన్ని  కొత్త శిఖరాలకు తీసుకెళ్లవచ్చు.  జీవితంలో కీర్తిని, ప్రతిష్టను కూడా సాధించవచ్చు.                                        *రూపశ్రీ.

పెళ్లైన కొన్నాళ్లకే భార్యాభర్తల మధ్య ప్రేమ ఎందుకు తగ్గుతుంది?  ప్రేమ పెరగాలంటే ఏం చేయాలి?

వివాహం అన్ని సంబంధాల కంటే విభిన్నమైన కోణం. వివాహం ప్రారంభ రోజుల్లో భార్యాభర్తల  మధ్య ప్రేమ, ఉత్సాహం,  ఆకర్షణ చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ క్రమంగా భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది.  చాలామంది వివాహం అయిన కొద్ది కాలానికే మనుషులు మారిపోయారు అని అంటూ ఉంటారు. అయితే ఇది చాలా వరకు భార్యాభర్తల మధ్య జరిగేదే. కానీ ఇద్దరి మధ్య ప్రేమ తగ్గకుండా తిరిగి ప్రేమను పెంచుకోవడం భార్యాభర్తల ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది. పెళ్లైన కొన్ని సంవత్సరాల తర్వాత భార్యాభర్తల బంధం కొందరికి  బోరింగ్‌గా మారుతుంది.ఒకరిపై ఒకరు ప్రేమను చూపించడం,  బంధంలో ఉత్సాహం వంటివి అస్సలు కనిపించవు.  దీనికి బదులు వారి బంధంలో విసుగు చెందడం,  గొడవ పడటం చాలా సహజం అయిపోతుంది. కానీ వివాహం అయిన కొన్ని రోజులకే   భార్యాభర్తల మధ్య ప్రేమ ముగిసిపోవడం అనేది ఉండదు.  పెళ్లైన కొత్త రోజుల్లో ఉండే ప్రేమ ఎన్నైళ్లైనా భార్యాభర్తల మధ్య అలాగే ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.  అలాగే భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గడానికి కారణమయ్యేవి ఏంటో కూడా తెలుసుకోవాలి. బాధ్యతలు, ఒత్తిడి వివాహం తర్వాత, ఉద్యోగం, ఇంటిని చూసుకోవడం, కుటుంబ అంచనాలు,  పిల్లలను పెంచడం వంటి బాధ్యతలు భార్యాభర్తలపై భారంగా మారతాయి.  ఒకరికొకరు సమయం ఇచ్చుకోవడం కష్టం అవుతుంది. క్రమంగా ప్రేమ కాస్తా బాధ్యతల్లోకి జారిపోతుంది. ఒకే దినచర్య.. ఒకే  దినచర్య సంబంధంలో విసుగును కూడా తెస్తుంది. ప్రతిరోజూ ఆఫీసు, ఇల్లు,  ఇతర పనుల మధ్య,  ప్రేమ ఎక్కడో వెనుకబడిపోతుంది. కొత్త శక్తి,  ఉత్సాహం లేకపోవడం సంబంధాన్ని మందకొడిగా చేస్తుంది. కమ్యూనికేషన్.. భార్యాభర్తల  మధ్య కమ్యూనికేషన్ లేకపోవడం కూడా ప్రేమ తగ్గిపోవడానికి  ఒక పెద్ద కారణం. భార్యాభర్తలు తమ భావాలను, అంచనాలను,  సమస్యలను ఒకరితో ఒకరు పంచుకోనప్పుడు దూరం పెరుగుతుంది.  ఈ దూరం క్రమంగా సంబంధాన్ని బలహీనపరుస్తుంది. ప్రేమ పెరగాలంటే.. వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య  మునుపటిలా  ప్రేమను తిరిగి పుంజుకోవడానికి కొన్ని పద్ధతులను అనుసరించవచ్చు.  ఉదాహరణకు కొన్ని.. ఒకరికొకరు సమయం ఇవ్వడం... రోజంతా బిజీగా ఉన్నప్పటికీ కనీసం అరగంటైనా  ఇద్దరూ సంతోషంగా ఉండటానికి  మాత్రమే కేటాయించాలి. డేటింగ్ నైట్ ప్లాన్ చేసుకోవడం...   డేటింగ్ కి వెళ్లడం వల్ల పెళ్లైన సంవత్సరాల తర్వాత కూడా సంబంధానికి కొత్త జీవం పోస్తుంది. ఆశ్చర్యకరమైన బహుమతులు ఇవ్వడం.. చిన్న బహుమతులు కూడా పెద్ద ప్రేమ బయటకు వ్యక్తం  చేస్తాయి. సంభాషణకు ప్రాముఖ్యత ఇవ్వడం.. ప్రతిరోజూ కొంత సమయం ఒకరితో ఒకరు ఓపెన్ మాట్లాడుకోండి. శారీరక సాన్నిహిత్యంపై.. కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం,  దగ్గరగా కూర్చోవడం కూడా ప్రేమను తిరిగి రేకెత్తించడానికి ఒక మార్గం కావచ్చు. నిజానికి వివాహం అయిన తరువాత పిల్లలు పుట్టగానే శారీరకంగా బంధం బలహీనమవుతుంది.  అందుకే చాలా వరకు ప్రేమ తగ్గినట్టు అనిపిస్తుంది.  సురక్షిత మార్గంలో భార్యాభర్తలు శారీరక బంధాన్ని సాగిస్తే వారి మధ్య ప్రేమ ఎప్పుడూ తాజాగా ఉంటుంది.                                  *రూపశ్రీ.

ఆఫీసు పనిలో ఒత్తిడి ఎదుర్కొంటున్నారా? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..!

ప్రతి వ్యక్తికి నేటికాలంలో ఇల్లు, ఆఫీసు అంటూ రెండు ప్రదేశాలు ముఖ్యంగా మారాయి.  ఒకటి కుటుంబ సభ్యులతో కలసి ఉండేది అయితే రెండవది కుటుంబ సభ్యులను పోషించడానికి మరొక ప్రదేశంలో విభిన్న వ్యక్తులతో కలిసి పనిచేసే స్థలం. చాలామంది ఆఫీసులో ఒత్తిడి ఎదుర్కుంటున్నామని చెబుతూ ఉంటారు. ఆఫీసులో గనుక పని ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటే అది మానసిక ఆరోగ్యాన్ని, వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అయితే కొన్ని చిన్న చిన్న మార్పులు, చిట్కాలతో ఒత్తిడి నుండి బయట పడవచ్చు. ఇవి నేరుగా ఆఫీసుకు వెళ్లి పని చేసే వారికి అయినా,  లేక వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి అయినా చాలా చక్కగా పని చేస్తాయి.  అవేంటో తెలుసుకుంటే.. పనుల జాబితా.. ఈ చిట్కా ఖచ్చితంగా  సహాయపడుతుంది. ఉదయాన్నే డైరీలో రోజు పనులను రాసుకోవాలి. పైన తేలికైన పనులను,  దిగువన ఎక్కువ సమయం,  శ్రద్ధ అవసరమయ్యే పనులను లిస్ట్  చేయాలి. ఇది  మనస్సు గందరగోళం లేకుండా క్లారిటీగా  ఉంచడానికి సహాయపడుతుంది.  రోజులో ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి.. వాటిని ఎప్పుడు చేయాలో అనుకుంటూ  అతిగా ఆలోచించడాన్ని తగ్గిస్తుంది. బ్రేక్ ముఖ్యం..  ఎంత పని ఉన్నా సరే.. గంటల తరబడి కూర్చుని పని చేయడం తప్పు. ప్రతి 25-30 నిమిషాల పని తర్వాత 5 నిమిషాల విరామం తీసుకోవాలి. నీరు త్రాగడం,  కళ్ళు మూసుకోవడం  లేదా కొద్దిగా శరీరాన్ని రిలాక్స్ చేసుకోవడం.. ఇవన్నీ  మనసు అలసిపోకుండా  విశ్రాంతిని ఇస్తాయి.   ఒత్తిడిని తగ్గిస్తాయి. నో చెప్పడం నేర్చుకోండి.. ఇది అతి ముఖ్యమైన చిట్కా ఏమిటంటే.. ప్రతి పనినీ, మీటింగ్‌నీ లేదా పనిని.. ఇట్లా ఏదైనా సరే.. ఆఫీసులో  అదనపు బాధ్యతను ఎప్పుడూ తీసుకోకూడదు. చాలా మంది కాస్త మంచిగా మాట్లాడుతూ,  కాస్త పొగుడుతూ ఏదైనా పని చేసిపెట్టమని అడుగుతూ ఉంటారు.  అలాంటి సందర్భాలలో  మర్యాదగా తిరస్కరించాలి.  ఇది  మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎందుకంటే అదనపు పని భారం ఒత్తిడికి దారి తీస్తుంది.  ప్రతి ఒక్కరూ నో చెప్పడం నేర్చుకోవాలి. ఇది ఎంతో సహాయపడుతుంది. శారీరక శ్రమ..  పనిలో బిజీగా ఉన్నప్పటికీ, ప్రతిరోజూ 15-30 నిమిషాలు నడవడం, యోగా చేయడం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ఇది సహజ ఒత్తిడిని తగ్గించే మార్గం.  ఒత్తిడి హార్మోన్లు వ్యాయామం వల్ల తగ్గుతాయి. వ్యాయమం మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇది  ఫిట్‌గా ఉంచుతుంది. డెస్క్ దగ్గరే కూర్చుని చేయగల యోగా భంగిమలు కొన్ని ఉంటాయి.  అలాంటివి చేసినా బాగుంటుంది.                          *రూపశ్రీ.

చాణక్యుడు చెప్పిన మాట.. ధనవంతులు కావాలంటే ఈ ప్రదేశాలకు దూరంగా ఉండాలట..!

ఆచార్య చాణక్యుడు తనదైన రాజనీతితో చరిత్రలో చెరగని ముద్ర వేశాడు.  ఈయన కేవలం రాజనీతి మాత్రమే కాకుండా తత్త్వ బోధన,  ఆర్థిక సూత్రాలు కూడా బోధించారు. చాణక్యుడి  ప్రణాళికల కారణంగానే మగధ రాజు చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. చాణక్యుడు చెప్పిన ఎన్నో విషయాలు నేటికీ ఆచరించదగినవిగా ఉన్నాయి. ముఖ్యంగా చాణక్యుడు చెప్పిన ఆర్థిక సూత్రాలు పాటిస్తే వ్యక్తి జీవితంలో ఎంతో గొప్ప స్థాయికి వెళ్లవచ్చు.  ఆచార్య చాణక్యుడు చెప్పిన ఆర్థిక సూత్రాలలో ధనవంతులు కావాలంటే కొన్ని ప్రదేశాలకు దూరంగా ఉండాలి అనేది కూడా చాలా ముఖ్యం.  ఇంతకీ ధనవంతులు కావాలని కోరుకునేవారు ఏ ప్రదేశాలకు దూరంగా ఉండాలో.. చాణక్యుడు చెప్పినవి ఏంటో తెలుసుకుంటే.. ఏ ప్రదేశాలకు దూరంగా ఉంటే ధనవంతులు అవుతారు.. చాణక్యుడి ప్రకారం  వ్యాపార కార్యకలాపాలు దగ్గరలో  లేని ప్రదేశంలో నివసించడం మంచిది కాదు. వ్యాపారం లేని ప్రదేశంలో నివసించే ప్రజలు తమ జీవితాలను పెద్దగా అబివృద్ది లేకుండా  గడుపుతారు. అదేవిధంగా, ఒక ప్రదేశంలో వేదాల పరిజ్ఞానం ఉన్న పండితులు లేదా బ్రాహ్మణులు లేకపోతే, అక్కడ నివసించడం ప్రయోజనకరం కాదు. బ్రాహ్మణులు సమాజం  మతపరమైన,  సాంస్కృతిక విలువలను కాపాడతారని చాణక్యుడు చెబుతాడు. వారు లేనప్పుడు ఆ ప్రదేశం పురోగతికి అనుకూలంగా ఉండదట. నీరు లేకుండా జీవితాన్ని ఊహించలేము. అందువల్ల నదులు, చెరువులు లేదా ఇతర నీటి వనరులు అందుబాటులో లేని ప్రదేశాలలో నివసించడం మంచిది కాదు. నీరు లేనప్పుడు జీవితం కష్టమవుతుంది.   అభివృద్ధి కూడా ఆటంకం కలిగిస్తుంది. ముఖ్యంగా నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో నివసించడం వల్ల నీటి సేకరణకే సమయం గడిచిపోతుంటుంది. దీని వల్ల కొన్ని ఆదాయ అవకాశాలకు సమయం వృధా అవుతుంది.  వైద్య సదుపాయాల అవసరం ఈ కాలంలో చాలా చాలా ముఖ్యం. ఈ విషయాన్ని చంద్రగుప్త కాలానికే చాణక్యుడు చాలా గట్టిగా చెప్పాడు. ఏదైనా వ్యాధి, ప్రమాదం లేదా ఆరోగ్య సమస్య ఎదురైతే దాని  పరిష్కారానికి వైద్య సేవలు అవసరం. వైద్యుడు లేదా వైద్య సదుపాయాలు   లేని ప్రదేశంలో నివసించడం మంచిది కాదు. చాణక్యుడు చెప్పినట్టు పైన చెప్పిన వనరులు లేని ప్రదేశాలలో నివసించడం వల్ల ఆర్థికంగా అస్సలు ఎదుగుదల ఉండదు. ఎంత ప్రయత్నించినా సరే.. ఆర్థికంగా బలపడటానికి తగిన అవకాశాలు, సమయాన్ని పొదుపు చేసే మార్గాలు,  ఆరోగ్యాన్ని రక్షించుకునే పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల ఆర్థికంగా ఎప్పటికప్పుడు దిగజారిపోతూ ఉంటారు.  కాబట్టి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుంటే ధనవంతులుగా ఎదిగే మార్గం దొరికినట్టే.                            *రూపశ్రీ.

వివాహం తర్వాత మగవాళ్లు ఈ పనులు చేస్తే వైవాహిక జీవితం నాశనమే..!

కాలేజీలకు వెళ్లి చదువుకోవడం, మంచి ర్యాంకులు తెచ్చుకోవడం,  ఉద్యోగాలు సాధించడం,  ఇల్లు, కారు,  బ్యాంక్ బాలెన్స్ సమృద్దిగా ఉండటం.. ఇవన్నీ చదువులో రాణించడం వల్ల మంచి ఉద్యోగం వల్ల సాధించుకోవచ్చు ఏమో.. కానీ వివాహం చేసుకోవడం, వైవాహిక బంధాన్ని పదిలంగా ఉంచుకోవడం అలాంటిది కాదు. వైవాహిక బంధానికి చదువు,  లెక్కలు,  లాజిక్ ల కంటే.. అవగాహన,  అర్థం చేసుకునే తత్వం, సర్థుబాటు చేసుకునే గుణం ఇవన్నీ చాలా ముఖ్యం. నేటికాలానికి తగ్గట్టు భార్యాభర్తలు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు రావు అన్నది వాస్తమే.. కానీ వివాహం తర్వాత భార్య అయినా,  భర్త అయినా కొన్ని తప్పులు చేస్తారు. ముఖ్యంగా వివాహం తర్వాత మగవాళ్లు చేసే కొన్ని తప్పుుల వల్ల  వైవాహిక బంధాలు నాశనం అవుతాయి.  అవేంటో తెలుసుకుంటే.. వివాహం తర్వాత మరొక స్త్రీ పట్ల ఆకర్షితులవడం నైతికంగానే కాకుండా సామాజిక దృక్కోణం నుండి కూడా తప్పు. ఇది వైవాహిక జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టడమే కాకుండా, అవతలి వ్యక్తి మనోభావాలను కూడా దెబ్బతీస్తుంది. ఇటువంటి ప్రవర్తన వల్ల మొత్తం కుటుంబం చాలా డిస్టర్బ్ అవుతుంది.  జీవితంలో సంతృప్తిని కూడా చాలా ముఖ్యం.   ఎప్పుడూ ఎక్కువ పొందాలనే కోరిక కలిగి ఉండటం,  ప్రస్తుతం ఉన్న వాటితో అసంతృప్తి చెందడం మగవాడిని  అశాంతి,  అసంతృప్తికి గురి చేస్తుంది.  ఇది  వైవాహిక జీవితానికి మంచిది కాదు. మగవాడు తీసుకునే నిర్ణయం అతని కుటుంబ భవిష్యత్తు పై ఆధారపడి ఉంటుంది. ఒక  నిర్ణయం తీసుకునే ముందు దాని  అన్ని అంశాలను తీవ్రంగా పరిగణించడం చాలా ముఖ్యం. తొందరపడి తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో ఇబ్బందులను కలిగిస్తుంది.                                     *రూపశ్రీ.

ఇలా చేస్తే.. మీ భాగస్వామి ఎప్పటికీ మిమ్మల్ని వదలిపెట్టరు..!

ఈ సృష్టిలో ప్రతి వ్యక్తి ఎవరికి వారు ప్రత్యేకమైనవారు.   అందుకే ఏ ఇద్దరు వ్యక్తులు పూర్తిగా ఒకేలా ఉండలేరు అని అన్నారు. ఈ తేడాలు మొదట్లో బంధాల మధ్య  ఆకర్షణను సృష్టిస్తాయి.  కానీ తరువాత ఈ తేడాలు పగ లేదా సంఘర్షణకు కూడా కారణం కావచ్చు. కానీ సంబంధాన్ని విచ్ఛిన్నం చేయడానికి బదులుగా, ఈ తేడాలను తెలివిగా ఉపయోగించడం  వలన బంధం  మరింత బలపడుతుంది. ఏదైనా ఒక గొడవ జరగగానే అది చిన్న గొడవే అయినా సరే.. వీళ్లతో కలిసి ఉండలేం.. విడిపోదాం అనే ఆలోచన చాలా మందికి పెళ్ళైన  తర్వాత అప్పుడప్పుడూ అయినా వస్తూ ఉంటుంది.  అలా కాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాలో అవ్వాలి.  తేడాలు? కొంతమంది తమ జీవితాలను క్రమబద్ధంగా,  ప్రణాళికాబద్ధంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు, మరికొందరికి మార్పు,  స్వేచ్ఛ అవసరం. కొందరు స్వభావరీత్యా ప్రశాంతంగా ఉంటారు, మరికొందరు గందరగోళంలో కూడా ఓదార్పు కావాలి అనుకుంటారు. విభిన్న స్వభావాలు కలిగిన ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు, వారికి తేడాలు ఉండటం సహజం. అయితే ఇది చెడ్డ విషయం కాదు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి,  నేర్చుకోవడానికి ఒక అవకాశం అనుకోవాలి. అప్పుడు ఈ తేడాల వల్ల గొడవలకు బదులు అర్థం చేసుకునే గుణం అలవాటు అవుతుంది తేడాలను ఎలా నిర్వహించాలి? వ్యక్తుల మధ్య తేడాలు ఉన్నప్పుడు అది సంబంధంలో కూడా కనిపిస్తూ ఉంటుంది.  ఇలా  తేడాలు తలెత్తినప్పుడు వెంటనే ఏదో ఒకటి  స్పందించడం కంటే తగిన విధంగా రియాక్ట్ కావడం ముఖ్యం. మార్పు కాదు..  సమన్వయం కావాలి..  భాగస్వామిని మార్చడానికి ప్రయత్నించే బదులు వారితో సమన్వయం చేసుకోవడం నేర్చుకోవాలి. ఇద్దరూ  సరిగ్గా ఒకేలా ఉండనవసరం లేదు, కానీ ఒకరి కోసం ఒకరు ప్రయత్నం చేయడం ముఖ్యం. తిరస్కారం కాదు..అంగీకారం ముఖ్యం..  భాగస్వామిని వారు ఉన్న విధంగానే అంగీకరించండి. ఒకరి అంతర్గత స్వభావాన్ని మార్చమని బలవంతం చేయడం మంచిది కాదు.  భాగస్వామిని వారి లోపాలతో అంగీకరించినప్పుడే నిజమైన ప్రేమ ఉన్నట్టు అర్థం. తేడాలు ఉంటే వాటిని ఇబ్బందిగా కాదు.. వాటిని ఇద్దరూ మానసికంగా డవలప్ అవ్వడానికి  అవకాశంగా  చూడాలి. వాటిని పోరాడటానికి కారణాలుగా కాకుండా, ఒకరి నుండి ఒకరు నేర్చుకుని ఇద్దరి  పరిధులను విస్తరించుకునే అవకాశాలుగా పరిగణించాలి. సంభాషణాత్మకంగా,  కరుణతో ఉండాలి.. గొడవ జరిగినప్పుడు  ఇరిద్దరూ భిన్నంగా ఉన్నారని తెలియజేసే సమాచారంగా దాన్ని చూడాలి. ఒకరినొకరు అగౌరవపరచకుండా మీ దృక్పథాన్ని వ్యక్తపరచాలి.   భాగస్వామిని మీలాగే ఉండమని బలవంతం చేయకుండా ప్రేమ,  కరుణతో వారికి సపోర్ట్ ఉండాలి. అతను నాలాగా లేడు, ఆమె నాలాగా లేదు.. అతని పద్దతి నాకు నచ్చట్లేదు.. ఆమె అలవాట్లు బాలేవు.. ఇలా అనుకోవడం మానేయాలి.  మనం మనకు ఎలా నచ్చుతామో.. వారికి కూడా వారంటే ఇ,్టం,  వారి అలవాట్ల పట్ల ఒక కారణం ఉంటుంది. దాన్ని చూపించి వ్యతిరేకించకూడదు. ఇద్దరూ ఒకరినొకరు అంగీకరించాలి. అంగీకరించడం అంటే వ్యక్తి అలవాట్లు,  ప్రవర్తన, పద్దతి తో సహా.. అన్నీ అంగీకరించడం. ఇలా చేస్తే గొడవ జరిగినప్పుడు ఇది తన పద్దతి అనే విషయం అర్థమై దాన్ని విడిపోదాం అనే ఆలోచన వరకు తీసుకెళ్లరు.                                 *రూపశ్రీ.

ఇంజనీర్స్ డే.. భారతదేశపు మోడర్న్ విజార్డ్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య..!

  ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న భారతదేశంలో ఇంజినీర్స్ డే ని ఎంతో గౌరవంగా జరుపుకుంటారు. ఈ రోజు భారతదేశంలోని మహానీయ ఇంజనీరు, రాష్ట్రనిర్మాణ శిల్పి, గొప్ప దూరదృష్టి కలిగిన శాస్త్రవేత్త భారతరత్న గ్రహీత మొక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి.  ఈయన జయంతి  సందర్భంగా ఇంజనీర్స్ డే నిర్వహించబడుతుంది. ఆయన గౌరవ సూచకంగా 1968,  సెప్టెంబర్ 15 నుండి  ఇంజినీర్స్ డే జరుపుకోవడం ప్రారంభమైంది. మొక్షగుండం విశ్వేశ్వరయ్య గారి విశిష్టత.. విశ్వేశ్వరయ్య గారు 1861 సెప్టెంబర్ 15న కర్ణాటకలోని ముడ్డెనహళ్ళి గ్రామంలో జన్మించారు. ఇంజనీరింగ్ రంగంలో ఆయన చేసిన వినూత్న కృషి కారణంగా “భారతదేశపు మోడర్న్ విజార్డ్”  అని  ఆయన్ను పిలుస్తారు. మొక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కేవలం ఒక గొప్ప ఇంజనీరు మాత్రమే కాదు ఒక విజనరీ ప్లానర్, సామాజిక సంస్కర్త కూడా. ఆయన చేసిన కృషి భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు, అంతర్జాతీయ స్థాయిలోనూ ఆయన ప్రతిభ ప్రతిఫలించింది. నీటిపారుదల , ఆనకట్టల నిర్మాణంలో కృషి.. కృష్ణరాజసాగర డ్యామ్ (KRS Dam).. మైసూరులోని కృష్ణరాజ సాగర ఆనకట్ట ఆయన రూపకల్పన. ఆ కాలంలో కాంక్రీటుతో ఇంత పెద్ద ఆనకట్ట నిర్మించడం ఒక అద్భుతం. ఈ ఆనకట్ట వల్ల మైసూరు, మాండ్యా, బెంగళూరు ప్రాంతాలు వ్యవసాయంలో విప్లవాత్మక మార్పు చూశాయి. ఫ్లడ్ గేట్ల సాంకేతికత.. ఆయన అభివృద్ధి చేసిన “ఆటోమేటిక్ స్లూయిస్ గేట్లు”  ఆ కాలంలో ఒక విప్లవాత్మక ఆవిష్కారం. ఈ సాంకేతికతను గ్వాలియర్‌లోని టి గ్రా డ్యామ్, కృష్ణరాజ సాగర డ్యామ్‌లలో ఉపయోగించారు. నీటి పారుదల పథకాలు..  ముంబైలో 1900లో వచ్చిన ఘోర వరదల తర్వాత ఆయన రూపొందించిన డ్రైనేజి సిస్టమ్ కారణంగా భవిష్యత్‌లో ఆ నగరం వరదల బారిన పడకుండా కాపాడబడింది. పరిశ్రమ,  ఆర్థిక రంగంలో కృషి.. మైసూరు పరిశ్రమల అభివృద్ధి మైసూరు రాష్ట్ర దివాన్‌గా ఉన్నప్పుడు, ఆయన భద్రావతి ఐరన్ & స్టీల్ వర్క్స్ (ప్రస్తుతం విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్)ను ప్రారంభించారు. మైసూరు సాండల్‌వుడ్ ఆయిల్ ఫ్యాక్టరీ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. మైసూరు విశ్వవిద్యాలయం  స్థాపనలోనూ ఆయనదే ప్రధాన పాత్ర. ఆర్థిక సంస్కరణలు పరిశ్రమలు, విద్య, వ్యవసాయం, సాంకేతిక రంగాల సమన్వయం ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన నమ్మకం. “Planned Development” అనే కాన్సెప్ట్‌ను భారతదేశంలో ముందుగా పరిచయం చేసిన వారిలో విశ్వేశ్వరయ్య గారు ముఖ్యులు. ఇంజనీరింగ్,  అభివృద్ధి.. ఆయన రాసిన “Planned Economy for India” (1934) పుస్తకం భారత ఆర్థిక ప్రణాళికల రూపకల్పనకు ప్రేరణనిచ్చింది. మరో పుస్తకం **“Reconstructing India”**లో శాస్త్రసాంకేతిక అభివృద్ధి ద్వారానే దేశాన్ని బలపరచవచ్చని ఆయన వివరించారు. ఆయనకు దక్కిన గౌరవాలు.. ఆయన ప్రతిభను గుర్తించి ప్రపంచంలోని అనేక దేశాలు సలహాదారుగా ఆహ్వానించాయి. 1955లో భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న పురస్కారం ప్రదానం చేసింది. ఇంజనీరింగ్ రంగంలో చేసిన విశేష సేవల కారణంగా ఆయనను “Father of Modern Mysore State” అని పిలుస్తారు. ఇంజినీరింగ్ రంగ ప్రాధాన్యం ఇంజనీర్లు ఆధునిక సమాజానికి వెన్నెముకలుగా నిలుస్తారు. రహదారులు, వంతెనలు, భవనాలు, ఆనకట్టలు – అన్నీ ఇంజనీర్ల సృజనే.. సాంకేతిక విజ్ఞానంలో భాగమైన  కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, అంతరిక్ష సాంకేతికత..  ఇవన్నీ ఇంజనీర్ల ప్రతిభా ఫలితమే. పరిశ్రమలలో భాగమైన.. విద్యుత్, రవాణా, సమాచార సాంకేతిక రంగం, వైద్య రంగంలోనూ ఇంజనీర్ల పాత్ర అపారమైనది. సమస్యలకు పరిష్కారం చూపుతూ, కొత్త ఆలోచనలతో మానవజాతి అభివృద్ధికి దోహదపడటం ఇంజనీర్ల ముఖ్య కర్తవ్యంగా చెప్పవచ్చు.                                    *రూపశ్రీ.

పిల్లల జీవితాన్ని బలి చేసే పీకాక్ పేరేంటింగ్.. చాలా మంది తల్లిదండ్రులు చేసే తప్పు ఇది..!

ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు బాగా రాణించాలని కోరుకుంటారు. మంచి మార్కులు సాధించాలి, మంచి ఉద్యోగం సాధించాలి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందాలి. ఇందుకోసం బాగా డబ్బు కూడా ఖర్చు పెడతారు. పిల్లలను పెద్ద పెద్ద కార్పోరేట్ పాఠశాలలు, కళాశాలలో చేర్పిస్తారు. ప్రత్యేకంగా ట్యూషన్లు చెప్పిస్తారు, కోచింగ్ లు ఇప్పిస్తారు. ఇవన్నీ పిల్లల ఉన్నతికి మంచివే.. కానీ చాలా సార్లు తల్లిదండ్రుల మితిమీరిన అంచనాలు పిల్లలపై ఒత్తిడిగా మారుతాయి. ఇది పిల్లల మానసిక,  భావోద్వేగ పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. తరువాత ఇది ఒక సమస్యగా మారుతుంది. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే చాలా సార్లు తల్లిదండ్రులు తమ పిల్లలపై ఈ విధంగా అధిక ఒత్తిడి తెస్తున్నామని కూడా వారికి తెలియదు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను  ఇతరుల ముందు పదే పదే.. సందర్భం కాకపోయినా  పొగుడుతూ ఉండటం చూసి ఉంటారు.  తమ పిల్లలు  గెలిచిన ట్రోఫీలు,  పతకాల గురించి చెబుతుంటారు.  పిల్లలకు వచ్చిన ర్యాంకులు, మార్కుల గురించి గొప్పగా చెబుతారు.  మొదట్లో ఇది మంచిగా అనిపిస్తుంది.  తమ తల్లిదండ్రులు తమ గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారో అని పిల్లలు కూడా చాలా సంతోషిస్తారు.  కానీ క్రమంగా అది పిల్లలపై ఒత్తిడిని పెంచుతుంది.  తమ చిన్న తప్పు కూడా  తమ తల్లిదండ్రుల ఆశల మీద ప్రబావం చూపిస్తుందని అనుకుంటారు. ఈ రోజుల్లో   పీకాక్ పేరెంటింగ్ అని చాలా ట్రెండ్ లో ఉంది. ఇది పిల్లల మానసిక,  భావోద్వేగ పెరుగుదలకు హాని కలిగించే పద్ధతి. దాని గురించి తెలుసుకుంటే.. పీకాక్ పేరెంటింగ్ అంటే ఏమిటి? పీకాక్  పేరెంటింగ్ అంటే పిల్లలను తల్లిదండ్రులు తమ  గర్వానికి,  సమాజంలో పేరు సంపాదించడానికి ఒక మార్గంగా మార్చడం. నెమలి తన రంగురంగుల ఈకలను విప్పి అందరి దృష్టిని ఆకర్షించినట్లే, కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతరుల ముందు తాము  గర్వంగా ఉండటం  కోసం విజయాల  వెంట పరుగులు తీయిస్తారు. మొదట్లో ఇది  బానే ఉంటుంది కానీ క్రమంగా ఈ అలవాటు పిల్లలపై ఒత్తిడి పెంచుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల విజయాల గురించి అందరి ముందు చెప్పుకోవడం గొప్పగా అనిపించవచ్చు. కానీ పోటీ ప్రపంచంలో ఎల్లప్పుడూ ఒకరే విజేతగా ఉండరు. ఎప్పుడైనా పిల్లలకు నిరాశ కలిగించే ఫలితాలు ఎదురైనప్పుడు తల్లిదండ్రుల ప్రవర్తన మారిపోతుంది. ఇది పిల్లలను కూడా చాలా ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. పీకాక్ పేరెంటింగ్ పిల్లల ఆలోచనలను ఎలా ప్రభావితం చేస్తుంది? పీకాక్ పేరెంటింగ్ ప్రభావం ఏమిటంటే, పిల్లలు చప్పట్లు కొట్టినప్పుడు లేదా ప్రశంసించినప్పుడు మాత్రమే తాము మంచివాళ్ళమని, గొప్పవాళ్లమని  అనుకుంటారు. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా పిల్లలు లోపల నుండి బలహీనంగా మారతారు.  తమను ప్రశంసించనప్పుడు తాము విఫలమయ్యామని  భావిస్తారు.  దీని కారణంగా పిల్లలు తమ తల్లిదండ్రులు లేదా వ్యక్తులు ఇష్టపడేది చేస్తారు తప్ప  తమకు నచ్చినది చేయరు. పీకాక్ పేరెంటింగ్ కారణంగా ఎల్లప్పుడూ గెలవాలి  చేయాలనే భయం వారి మనస్సులో ఉంటుంది. ఎప్పుడైతే భయం మనసులో ఉంటుందో అప్పుడు గెలవడం కూడా కష్టమవుతుంది. దీనిని నివారించడానికి పిల్లల మంచిని,  చెడును   ప్రేమించడం ముఖ్యం. అలాగే వారు గెలిచినా, ఓడినా వారిని ప్రోత్సహించడం ముఖ్యం.  తల్లిదండ్రుల గొప్పకు పిల్లలను ఒక మార్గంగా ఎంచుకోవడం మానేయాలి.  పిల్లలు ఎలా ఉన్నా తల్లిదండ్రులు ఎప్పుడూ వారిని ప్రేమిస్తారని, వారి వెంట ఉంటారనే విషయం వారికి  అర్థమవ్వాలని. ఇలా ఉన్నప్పుడు పిల్లలు మంచి దారిలోనే వెళ్తారు.                *రూపశ్రీ.

భర్త ఇలా ప్రవర్తిస్తుంటే.. భార్య మీద ప్రేమ లేదని అర్థం..!

భార్యాభర్తల బంధం ఈ సృష్టిలో చాలా అపురూపమైనది.  దాదాపు పాతికేళ్లు వేర్వేరు కుటుంబాలలో పెరిగిన ఇద్దరు వ్యక్తులు పెళ్లి పేరుతో ఒక్కటిగా మారతారు.  ఇద్దరి జీవితం ఒక్కటే అనే అభిప్రాయం తెచ్చుకుంటారు. ఇద్దరూ ఒకరికి  ఒకరు అనేలా బ్రతుకుతారు.  కష్టం అయినా, సంతోషం అయినా, బాధ అయినా కలిసి పంచుకుంటారు.  అయితే భార్యాభర్తల బంధం అందరి విషయంలో ఇలా ఉంటుందని చెప్పలేం.  కొందరి విషయంలో చాలా విభిన్నంగా ఉంటుంది.  భార్యాభర్తలు ఒకరంటే ఒకరికి ఇష్టం లేకుండా ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు.  కొన్ని బంధాలలో భర్తకు భార్య మీద ప్రేమ  ఉండదు.  కానీ భార్య మాత్రం కేవలం బంధం కోసం, పిల్లల కోసం భర్తతో కలిసి ఉంటుంది. మరికొందరు భార్యలు అమాయకంగా తన భర్త ఏం చేసినా.. ఇలా చేస్తున్నాడు అని అంటారు కానీ  నిజానికి అతనికి తన మీద ప్రేమ లేదు అనే విషయం తెలుసుకోలేరు.  భర్తకు భార్య మీద ప్రేమ లేకపోతే.. అతని ప్రవర్తన ఎలా ఉంటుందో.. కొన్ని సింపుల్ విషయాల ద్వారా చెప్పేయవచ్చు.  అవేంటో తెలుసుకుంటే.. అబద్దం చెప్పడం.. అబద్దం చెప్పడం కొందరికి వెన్నతో పెట్టిన విద్య.  సందర్భానుసారంగా చాలా ఈజీగా అబద్దాలు చెప్పేస్తుంటారు. ఇలా అబద్దాలు చెప్పే మనస్తత్వం ఉన్నవారిలో మోసం చేసే ప్రవృత్తి ఉంటుంది. భార్య దగ్గర ప్రతి విషయం గురించి చాలా బాగా అబద్దాలు అల్లేస్తారు.  బయటి స్నేహాలు,  డబ్బు,  ఎక్కడి వెళుతున్నారు, ఎవరిని కలుస్తున్నారు.. ఇలా ప్రతి విషయం ఎప్పుడూ స్పష్టంగా నిజం చెప్పరు. దీనికి బదులు అబద్దాలు చెబుతారు. మరికొన్ని సార్లు సాకులు చెబుతారు.   పైగా అతను చెప్పేది అబద్దం అని తెలిసి తిరిగి అతన్ని ప్రశ్నించినప్పుడు కావాలని గొడవ పెట్టుకుని భార్యనే నిందిస్తాడు.  చివరకు భార్యే బాధితురాలిగా మారుతుంది. అవసరాలు పట్టించుకోకపోవడం.. భార్య అవసరాలను పూర్తీగా పట్టించుకోని భర్తలో నిజమైన ప్రేమ అస్సలు లేదని అర్థం.  భార్య ఏమడిగినా ఏదో ఒక కారణం చెప్పడం, తప్పించుకోవడం, ఆమె అవసరాలు తీర్చకపోవడం,  ఎప్పుడైనా గట్టిగా అడిగినప్పుడు భార్యనే తిరిగి నిందించడం, బార్య నోరు మూయించడానికి గొడవ పెద్ది చేయడం, భార్య పుట్టింటి వాళ్లను ప్రస్తావిస్తూ గొడవ చేయడం.. ఇలా చాలా చేస్తారు.  అతను తన అవసరాలు తీర్చుకోవడానికి, తన తల్లిదండ్రులు,  తోబుట్టువుల కోసం ఏం చేయడానికైనా సిద్దంగా ఉంటాడు. కానీ  భార్య దగ్గరకు వచ్చేసరికి అతనికి ఏం చేయడానికి ఇష్టం ఉండదు. ఆ ఇష్టం లేకపోవడానికి బయటకు చెప్పలేక ఏవో కారణాలు చెబుతూ ఉంటాడు. ఎగతాళి చేయడం.. భార్య మీద ప్రేమ ఉన్న ఏ మగాడు అయినా సరే.. స్నేహితుల ముందు కావచ్చు, బయటి వ్యక్తుల ముందు కావచ్చు, కుటుంబ సభ్యుల ముందు కావచ్చు.. భార్యను చాలా గౌరవిస్తాడు. కానీ దీనికి వ్యతిరేకంగా భార్య మీద ప్రేమ లేకపోతే.. సింపుల్ గా.. అందరి ముందు అవమానించడం, చిన్నతనం చేసి మాట్లాడటం,  అస్సలు గౌరవించకపోవడం చేస్తారు.  ఇలా ఏ భార్య పట్ల అయినా భర్త ప్రవర్తిస్తే అతనేదో కోపంలో చేశాడు.. అనే పిచ్చి సమర్థింపు ఏ భార్య చేయకూడదు.  అది అతను ప్రేమ లేకపోవడం వల్ల చేసిన పనే అని గుర్తించాలి.                                   *రూపశ్రీ.

కష్టపడి సంపాదించిన డబ్బును ఇలాంటి వ్యక్తుల చేతుల్లో పెడితే నాశనమే..!

డబ్బు నేటికాలంలో చాలా అవసరం. డబ్బు లేకపోతే ఏ పని జరగదు.  ఆఖరికి నీళ్లు కూడా డబ్బు పెట్టి కొనుక్కుంటున్నాం.  డబ్బు సంపాదన కోసం చాలా కష్టపడతాం.  రాత్రి, పగలు కష్టపడి మరీ డబ్బు సంపాదిస్తుంటారు.  చాలా వరకు డబ్బు సంపాదనలో ప్రస్తుత అవసరాల గురించే కాకుండా భవిష్యత్తు అవసరాలకు,  భవిష్యత్తు పరిస్థితులకు కూడా భాగం ఉంటుంది.  అయితే డబ్బు సంపాదించడమే కాదు.. డబ్బును జాగ్రత్త చేసుకోవడం కూడా చాలా ముఖ్యమైన అంశం.  కష్టపడి సంపాదించిన డబ్బును ఎలాగంటే అలా.. ఎవరి చేతిలో అంటే వారి చేతిలో పెట్టకూడదు. దీని వల్ల కష్టపడి సంపాదించిన డబ్బు అంతా నాశనం అవుతుంది.  కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది.  ఇంతకీ డబ్బును ఎలాంటి వ్యక్తుల చేతుల్లో పెట్టకూడదు? తెలుసుకుంటే.. మోసం చేసే స్నేహితులు.. కొంతమందికి మోసం చేయడం అనే అలవాటు ఉంటుంది. వాళ్ళు ఎంత బాగున్నా.. వారికి ఏ ఇబ్బందులు లేకపోయినా సరే.. అప్పు పేరుతో లేక బదులు పేరుతో లేక వడ్డీ ఆశ చూపి డబ్బు తీసుకుని ఆ తర్వాత డబ్బు ఎగ్గొట్టేవారు ఉంటారు. ఇలాంటి అనుభవాలు ఒకటి రెండు సార్లు జరిగినా సరే.. వడ్డీ వస్తుందనే ఆశతోనో లేక ఎదుటి వ్యక్తులు మాట్లేడే మాట చాకచక్యంతోనో వారిని పదే పదే నమ్మేస్తూ ఉంటారు.  అలాంటి వారి చేతిలో డబ్బు పెడితే ఆ డబ్బు, మన కష్టం రెండూ నాశనం అవుతాయి. దురాశతో ఉండే పెట్టుబడిదారులు.. కొంతమంది ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలను చూపించి  డబ్బును తీసుకుంటారు. వడ్డీ ఎక్కువ వస్తుందనో.. ఏవైనా ఆఫర్ లు ఉంటాయనో.. తక్కువ కాలంలో ఎక్కువ మొత్తం తిరిగి ఇస్తారనో చెప్పి ప్రజల నుండి డబ్బు తీసుకుంచారు.  పెద్ద పెద్ద క్లెయిమ్స్ చేయడం ద్వారా డబ్బు పెట్టుబడి పెట్టమని అడుగుతుంటారు. పైగా తాము చాలా పేరొందిన వారమని,  తమకు గొప్ప వ్యక్తులు తెలుసునని చెప్పుకుంటారు. ఇలాంటివారు పెద్ద మొత్తంలో తమ చేతికి డబ్బు అందిన వెంటనే మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడతారు. కేవలం తమ గురించి మాత్రమే మాట్లాడేవారు.. కేవలం తమ గురించి మాత్రమే మాట్లాడేవారు స్వార్థపరులని అర్థం. ఇలాంటివారు ఎప్పుడూ తమ గురించి చూసుకుంటారు. తమ పని జరిగడం కోసం ఎన్ని మాటలైనా చెప్తారు. తాము తప్ప సమస్యలు ఎవ్వరూ ఫేస్ చేయడం లేదనే ఫీలింగ్ లో ఉంటారు.  తమ బాధను ఎంతో క్రిటికల్ గా చెబుతారు.  వీరి మాటలలో ఎమోషన్ ను చూసి చాలామంది పాపం అనే ఫీలింగ్ తో డబ్బు ఇచ్చేస్తుంటారు.  కానీ ఇలాంటివారు తమ అవసరం తీరిపోగానే తర్వాత ఏమీ మాట్లాడరు.  కనీసం అందుబాటులోకి కూడా రారు.  అందుకే ఇలా తమ గురించి మాత్రమే చెబుతూ.. ఎదుటివారి పరిస్థితి అర్థం చేసుకోకుండా డబ్బు గురించి అడిగే వారి చేతిలో ఎప్పుడూ డబ్బు పెట్టకూడదు. కష్టపడని వారు.. కొందరు కష్టపడరు..కానీ అవసరానికి డబ్బు అడుగుతూ ఉంటారు. తమకు ఎలాంటి ఉద్యోగం రాకపోవడానికి కారణం చుట్టూ ఉన్న సమాజం, తన కుటుంబం అంటూ కారణాలు చెబుతూ ఉంటారు. ఇలాంటివారు కేవలం  సులువుగా డబ్బు చేతికి వస్తే సుఖపడిపోదాం అనే ఆలోచనతో ఉంటారు. వీరికి డబ్బు విలువ, కష్టం విలువ అస్సలు తెలియదు. ఇలాంటివారు ఇతరులకు డబ్బు ఇవ్వకుండా మోసం చేసినా.. అదేం పెద్ద విషయం కాదని అనుకుంటారు. కాబట్టి ఇలాంటి కష్టం విలువ తెలియకుండా జులాయిగా ఉంటూ,  సోమరితనంతో ఉండేవారి చేతిలో డబ్బు పెట్టకూడదు.                         *రూపశ్రీ.

భాగస్వామి దగ్గర ఈ  మాటలు అస్సలు మాట్లాడకపోవడం మంచిది..!

  ప్రతి వ్యక్తి తమ జీవితంలో ఒక్కో దశ దాటుతూ వెళ్లక తప్పదు.  ఈ క్రమంలో వివాహం చేసుకుని వైవాహిక బంధాన్ని ముందుకు తీసుకెళ్లక తప్పదు. అయితే గత 10 ఏళ్ల నుండి భార్యాభర్తల బంధం విషయంలో చాలా  మార్పులు చోటు చేసుకున్నాయి.  అమ్మాయిలు కూడా కెరీర్ ను సీరియస్ గా తీసుకోవడం.  లక్ష్యాలు సాధించడం,  భవిష్యత్తు గురించి ప్లానింగ్స్ లో ఉండటం.. మొదలైన  దేంట్లో తాము తీసిపోము అన్నట్టు  అబ్బాయిలకు ధీటుగా ఉంటున్నారు. ఆ కారణంగా బార్యాభర్తల జీవితంలో భర్త ఎక్కువ,  భార్య తక్కువ అనే స్లోగన్ క్రమంగా తగ్గుతూ వస్తోంది. అమ్మాయిలు కూడా అబ్బాయిల లాగే తమకు కూడా వైవాహిక జీవితంలో తగిన ప్రాధాన్యత, నిర్ణయాలు తీసుకునే అధికారం,  తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటున్నారు. సింపుల్ గా చెప్పాలంటే భార్యాభర్తల బంధం అప్డేట్ అయ్యింది. దీనికి తగినట్టుగానే మనుషులు కూడా మారాలి.  లేకపోతే బంధం దృఢంగా ఉండదు. ఇలాంటి పరిస్థితిలో భాగస్వామి ముందు అస్సలు మాట్లాడకూడని మాటలు కొన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి.  దీని వల్ల బంధం నాశనం కాకుండా ఉంటుంది. భాగస్వామితో అనకూడని మాటలు..  భాగస్వామితో ఎప్పుడూ " అతిగా స్పందిస్తున్నావు" అని అనకూడదు. ఇది భార్యాభర్తల  సంబంధాన్ని బాధించడమే కాకుండా పాయిజన్  చేస్తుంది. ఇది సంబంధాన్ని మరింత బలహీనపరుస్తుంది. ఏ వ్యక్తి అయినా పరిస్థితికి అనుగుణంగా తమ మనసులో ఉన్న ఎమోషన్ ఆధారంగానే స్పందిస్తారు. కాబట్టి దానికి అతి అనే పేరును ఆపాదించకూడదు. ఏదైనా పని చేసిన తర్వాత లేదా  సహాయం పొందిన  తర్వాత  భాగస్వామితో  "ఇదేమంత పెద్ద విషయం కాదులే" అని ఎప్పుడూ అనకూడదు. ఇది  సంబంధాన్ని దెబ్బతీస్తుంది. సహాయం అయినా,  పని అయినా ఏదైనా సరే.. ఆ పనికి తగిన ఎఫర్ట్ పెట్టే అవతలి వ్యక్తులు చేస్తారు.  ముఖ్యంగా అందులో నా భర్త లేదా భార్య అనే ఫీలింగ్ తో సహాయపడటమే ఉంటుంది.  అలా చేసిన సహాయాన్ని లేదా పనిని పెద్ది కాదులే అని అనడం వల్ల ఎదుటి వ్యక్తి చిన్నతనంగా ఫీలవుతారు. నేను ఇంత చేసినా ఎందుకు ఇలా మాట్లాడతారు అనే బీజం మనసులో పడితే.. అది చాలా అపార్థాలకు దారి తీస్తుంది.   ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడో.. లేదా గొడవ జరిగినప్పుడో.. ఎదుటి వ్యక్తి బాధపడితే అప్పుడు "నువ్వుచాలా సెన్సిటివ్ గా ఉన్నావ్" అంటూ వారిని తక్కువ చేసి మాట్లాడకూడదు.  స్పందన అనేది ఎమోషన్ ఆధారంగా,  అది వ్యక్తికి కనెక్ట్ అయ్యే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అలా వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడటం అంటే వ్యక్తిని తక్కువ చేసినట్టే. ఇది బంధాన్ని విచ్చిన్నం చేసే వైపు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కొన్ని సార్లు ఏదైనా గొడవ లేదా వాదన జరిగితే.. కొందరు పాత వాటిని కూడా పైకి తీస్తుంటారు. చివరిగా ఎవరు క్షమాపణ చెప్పారో, ఇంటి పని ఎవరు చేస్తారో, లేదా ఎవరు ప్రారంభించారో లెక్కించడం తప్పు. ఇలాంటి  విషయాలను లెక్కిస్తూ ఉంటే అది సంబంధంలో అసంతృప్తిని పెంచుతుంది.  ఒకరి మధ్య ఒకరికి  దూరాన్ని పెంచుతుంది.                            *రూపశ్రీ.