అంబేడ్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు.. బీజేపీ సెల్ఫ్ గోల్?

భారత పార్లమెంట్ లో హోం శాఖ మంత్రి అమిత్ షా అంబేడ్కర్ పై చేసిన వ్యాఖ్యలు దేశంలో మంటలు రేపాయి.   దేశ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన అంబేద్కర్ ను అవమానించేందుకు బీజేపీ సాహసించడమంటే..  భవిష్యత్ లో భారత రాజ్యాంగాన్ని పక్కనబెట్టి వారి సొంత రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు రెడీ అయిపోయిందనడానికి సంకేతమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ వాదులంతా బిజెపి ఆలోచనలు, విధానాలను తీవ్రంగా వ్యతిరేస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బిజెపి, దాని మిత్ర పక్ష పార్టీలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.   ఎన్డీఏ కూటమి ఉన్న రాష్ట్రాల్లో అంబేద్కర్ ను ఆరాధించే వారు జిల్లా కేంద్రాల్లోని అంబేద్కర్ విగ్రహాల వద్దకు వెళ్లి పూలమాలలు వేయడంతో పాటు అంబేద్కర్ కు జేజేలు పలుకుతూ బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ నిరఃసన వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో జమిలి ఎన్నికల  బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఎన్డీఏ ప్రభుత్వం వేసింది. ఈ అంశంపై చర్చ జరిగే సమయంలో హోం మంత్రి అమిత్ షా నోరు పారేసుకున్నారు. అంబేద్కర్... అంబేద్కర్... అంబేద్కర్... అని ఇన్నిసార్లు ఆ పేరు జపించే బదులు... అన్ని సార్లు దేవుడి పేరు జపిస్తే ఏడు జన్మలకు స్వర్గ ప్రాప్తి లభిస్తుందంటూ వ్యాఖ్యానించారు. దీంతో పార్లమెంట్ లో మాటల మంటలు రేగాయి. పదేళ్లుగా అధికారానికి దూరంగా  ఉన్న కాంగ్రెస్ కు, ఇండియా కూటమి పార్టీలకూ అమిత్ షా తన వ్యాఖ్యల ద్వారా మంచి ఆయుధాన్ని అందించారు. దేవుడి పేరు చెప్పి అంబేద్కర్ ను అవమానించారంటూ రాహుల్ గాంధీ పార్లమెంట్ లో గళమెత్తారు.  దీంతో సహనం కోల్పోయిన బిజెపి నేతలు ఒకరి తరువాత ఒకరు విరుచుకు పడ్డారు. ఒకసారి అంబేద్కర్ ను అవమానించిన తరువాత దానిని సరిదిద్దుకునే విధంగా అమిత్ షా ప్రసంగించినా ఫలితం లేకపోయింది. అమిత్ షా వ్యాఖ్యలను సమర్థిస్తూ ఒకటికి మూడు సార్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా స్పందించారు. అయినా మూడు రోజులుగా దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు కూడా ఆందోళనలు వెళ్లాయి. బిజెపి తనను తాను సమర్థించుకునేందుకు ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఇండియా కూటమి ఎంపీలను పార్లమెంట్ లోకి రాకుండా అడ్డుకోవడం సంచలనం సృష్టించింది. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాల ధాటికి బిజెపి కూటమి తట్టుకోలేక పోతోందనడానికి దీనిని ఉదాహరణగా చెప్పవచ్చు.   అంతెందుకు అమిత్ షా వ్యాఖ్యలను సమర్ధించడానికి స్వయంగా ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ రంగంలోకి దిగాల్సి వచ్చిందంటేనే.. ఆ వ్యాఖ్యలు బీజేపీకి ఎంత నష్టం చేకూర్చాయో అవగతమౌతోంది. రాజకీయ పరిశీలకులు అమిత్ షా వ్యాఖ్యలను బీజేపీ సెల్ఫ్ గోల్ గా అభివర్ణిస్తున్నారు.   గౌతమ్ అదాని వ్యాపార లావాదేవీలలో లంచాలు ఇవ్వటానికి ఒప్పందం కుదుర్చుకున్నారని అమరికా దర్యాప్తు సంస్థ తేలుస్తూ అక్కడి కోర్టుకు వివరాలు అందించడంతో అంతర్జాతీయంగా భారత్ పరువు పోయిందని, వెంటనే అదానీపై చర్యలు తీసుకోవాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై పార్లమెంట్ లో చర్చ జరగాలని పట్టుబట్టింది. ఒకవైపు అదానీ వ్యవహారం పార్లమెంటును కుదిపేస్తుండగా దాని నుంచి డైవర్ట్ చేయడానికే అమిత్ షా అంబేద్కర్ పై ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే అమిత్ షా వ్యాఖ్యల కారణంగా బీజేపీ ప్రతిష్ఠ గతంలో ఎన్నడూ లేని స్థాయికి మసకబారింది. అదానీ ముడుపుల వ్యవహారాన్ని మించి అమిత్ షా వ్యాఖ్యలు పార్టీకి నష్టాన్ని చేకూర్చాయి.  భారత రాజ్యాంగ నిర్మాతను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన అమిత్ షా బేషరతుగా క్షమాపణలు చెప్పి, తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష కూటమి డిమాండ్ చేస్తోంది.   ఈ నేపథ్యంలో పార్లమెంట్ బయట నుంచి ఎంపీలు పార్లమెంట్ లోపలికి వచ్చే ద్వారం వద్ద మెట్లపై బిజెపి, దాని మిత్ర పక్ష ఎంపీలు కూర్చొని కాంగ్రెస్ వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించింది కాంగ్రెస్ పార్టీయేనని బిజెపి కూటమి   నిరసనకు దిగింది. కాంగ్రెస్ దాని మిత్ర పక్షాల సభ్యులను సభలోకి వెళ్లనీయకుండా బీజేపీ ఎంపీలు అడ్డుపడటంతో నాలుగు రోజుల కిందట జరిగిన తోపులాటలో రాహుల్ గాంధీ కిందపడిపోయారు. ఓ బీజేపీ ఎంపీ గాయపడ్డారు.   దీంతో గొడవ ముదిరి పాకాన పడింది. తనను కూడా నెట్టి కింద పడేశారని కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే తన బాధను వ్యక్తం చేశారు. ఇరు వర్గాల ఎంపీలు పార్లమెంట్ స్ట్రీట్ లోని పోలీస్ స్టేషన్లో పరస్పరం కేసులు పెట్టుకున్నారు. లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్ ఖడ్ లకు కూడా  ఫిర్యాదులు చేశారు.  ఈ మొత్తం ఎపిసోడ్ లో బీజేపీ డిఫెన్స్ లో పడిందనడంలో సందేహం లేదని పరిశీలకులు చెబుతున్నారు. పార్లమెంట్ లో అంబేద్కర్ ను అవమానిస్తూ అమిత్ షా వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండటంతో బీజేపీలో కంగారు మొదలైందనీ, అందుకు తార్కానమే.. రాహుల్ గాంధీ తో పాటు ఇండియా కూటమి ఎంపీలను లోపలికి పోకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడమని అంటున్నారు. ఖర్గే, రాహుల్ కాంబినేషన్ బాగా కుదరటంతో బిజెపి కూటమిని పార్లమెంట్ లో ఇండియా కూటమి గుక్కతిప్పుకోకుండా చేస్తోంది. అంబేద్కర్ ను అవమానించడమంటే కోన్ని కోట్ల మంది బలహీన వర్గాల వారిని అవమానించడమేననీ, రాజ్యాంగాన్ని అవమానించడమేనన్న భావన ప్రజల్లో బలంగా వ్యక్తం అవుతోంది. ఇది కచ్చితంగా బీజేపీకి ముందున్నది గడ్డుకాలమేనని చెప్పడానికి ఆస్కారమిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఈ గండం నుంచి బీజేపీ ఎలా గట్టెక్కుతుందో చూడాల్సిందేనంటున్నారు. 

కేటీఆర్ వివరణ న్యాయ పరీక్షలో నిలుస్తుందా?

మాజీ మంత్రి కేటీఆర్ కు ఈ ఫార్ములా కార్ రేసు కేసు విషయంలో న్యాయపరమైన చిక్కులు తప్పవన్న భావన పరిశీలకులలో వ్యక్తం అవుతోంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండటం కోసం, పెట్టుబడుల ఆకర్షణ కోసమే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వాహకులకు సొమ్ము ఇవ్వాల్సి వచ్చిందన్న కేటీఆర్ వివరణ న్యాయ పరీక్షకు నిలబడే అవకాశాలు అంతంత మాత్రమేనని అంటున్నారు. ఈ కేసులో ఏసీబీ ఏ క్షణంలోనైనా కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కేటీఆర్ కు తాత్కాలిక ఊరట కల్పించింది. అది పక్కన పెడితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన ఈ ఫార్ములా   రేసులో 55 కోట్ల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఏసీబీ  కేసు నమోదు చేసింది.  అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(1)(ఏ),  13(2), అలాగే భారత శిక్షాస్మృతిలోని సెక్షన్  409  (విశ్వాస ద్రోహం), 120(బి) (నేరపూరిత కుట్ర) కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఈ కేసులో కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. అదే సమయంలో ఈడీ కూడా కేటీఆర్ పై కేసు నమోదు చేసింది.  . ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ ఇప్పటికే అనివార్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వాహకులకు 55 కోట్ల రూపాయలు బదిలీ చేయాల్సి వచ్చిందని అంగీకరించారు. హైదరాబాద్ బ్రాండ్ ను కాపాడటం, పెట్టుబడుల ఆకర్షణ, అలాగే ఎలక్ట్రికల్ వాహనాల వినియోగానికి ప్రోత్సాహం కోసం హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్ రేస్ జరగాలని తాను భావించాననీ, అయితే  స్పాన్సర్లు లేకపోవడం వల్ల హైదరాబాద్ నుండి వైదొలగాలని ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వాహకులు భావించడంతో   తాను చొరవ తీసుకుని 55 కోట్లు నిర్వాహకులకు బదిలీ అయ్యేలా చేశాననీ కేటీఆర్ వివరణ ఇచ్చారు.  ఫార్ములా ఈ కార్ రేస్ వల్ల రాష్ట్రానికి ఆర్థిక ప్రయోజనం ఉంటుందని పేర్కొన్న కేటీఆర్, అదే ఈ రేసు రద్దు అయితే  హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని పేర్కొన్నారు. అలా జరగకూడదన్న ఉద్దేశంతోనే నిర్వాహకులకు రూ.55 కోట్ల బదిలీ చేసినట్లు వివరించారు.   అయితే కేటీఆర్ వివరణ వల్ల చట్టపరమైన చిక్కుల తొలిగిపోయే అవకాశం ఇసుమంతైనా కనిపించడం లేదు.   రూ. 10 కోట్లకు పైగా ఖర్చులకు ఆర్థిక శాఖ,  రాష్ట్ర ప్రభుత్వంనుంచి పరిపాలనా అనుమతి అవసరం. కానీ అలాంటి అనుమతులేవీ తీసుకోకుండానే విదేశీ సంస్థకు రూ.55 కోట్ల బదిలీ జరిగిపోయింది. దీనికి కేబినెట్ ఆమోదం కూడా లేదు. అసలీ బదలాయింపుపై  ఆర్థిక శాఖకు కనీస సమాచారం కూడా లేదు.ఇవేమీ లేకుండానే  ఫార్ములా ఇ ఆపరేషన్స్ లిమిటెడ్ (ఎఫ్‌ఇఒ) కు బదిలీ చేశారు. ప్రభుత్వం విదేశీ బ్యాంకు ఖాతాలకు డబ్బును బదిలీ చేసినప్పుడు ఆర్‌బిఐకి తెలియజేయాలి, కనీసం అది కూడా జరిగిన దాఖలాలు లేవు.  కాబట్టి, ఈ కేసులో కెటిఆర్‌ కు చట్టపరమైన, న్యాయపరమైన చిక్కులు తప్పవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇది కచ్చితంగా విధాన లోపం,  నిధుల దుర్వినియోగం కిందకే వస్తుందని న్యాయనిపుణులు చెబుతున్నారు.  

ఫార్ములా ఈ కార్ రేస్... కేటీఆర్ కు మరో షాక్!

ఫార్ముల-ఈ కార్ రేసు  విషయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. ఏసీబీ కేసు విషయంలో కోర్టు నుంచి వారం రోజుల ఉపశమనం లభించిందని ఊపిరి పీల్చుకునేలోగానే  ఇదే విషయంపై ఈడీ కేసు నమోదు చేసి షాక్ ఇచ్చింది.   ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా.. కేటీఆర్‌పై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద మరో కేసు నమోదు చేసినట్లు ఈడీ వెల్లడించింది.  తెలంగాణ హైకోర్టులో ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించి కేటీఆర్‌కు ఊరట లభించిన గంటల వ్యవధిలోనే ఈడీ రంగంలోకి దిగి కేసు నమోదు చేసింది. ఏసీబీ ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్‌ను నమోదు చేసింది. ఈడీ కేసు నమోదు చేయడంలో ఈ రేసు కేసు మళ్ళీ మొదటికొచ్చినట్లయింది. ఏసీబీ కేసు నమోదు చేసిన క్రమంలో అరెస్ట్ నుంచి ఊరట పొందిన కేటీఆర్.. ఇప్పుడు ఏం చేస్తారన్నది చూడాల్సి ఉంది. అంతేకాకుండా ఏసీబీ కేసులో ఊరట లభించగానే.. రేసు కేసు డొల్లఅని, అందుకే తొలి అడుగులోనే కాంగ్రెస్‌కు చుక్కెదురైందంటూ బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు.  అయితే ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ (ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) నమోదు చేసి మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలు మోపడంతో బీఆర్ఎస్ నేతలకు గొంతులో పచ్చి వెలక్కాయపడినట్లైంది. ఈ కేసులో కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, అప్పటి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజీనీర్ బీఎల్ఎన్ రెడ్డిలను నిందితులుగా ఈడీ పేర్కొంది.  ఫార్ములా ఈ-కార్ రేసింగ్ ఈవెంట్లో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ఏసీబీ కేసు నమోదు చేయడం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్, ఇతర డాక్యుమెంట్ల కాపీలు ఇవ్వాలని ఈడీ   ఏసీబీని కోరింది. నిబంధనలకు విరుద్ధంగా... విదేశీ సంస్థకు విదేశీ కరెన్సీ రూపంలో నిధులు చెల్లించాలని కేటీఆర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. కాగా, ఏసీబీ నమోదు చేసిన కేసుపై కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ నెల 30 వరకు కేటీఆర్ పై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఏసీబీని ఆదేశించింది. ఈ క్రమంలో, కేటీఆర్ ఈడీ కేసుపైనా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.

అల్లు అర్జున్ పై జాతీయ మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించి నటుడు అల్లు అర్జున్ పై జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్ప-2 ప్రీమియర్స్‌కు నటీనటులను ఎవరినీ రావొద్దని చెప్పాలని తాము సంధ్యా థియేటర్ యాజమాన్యానికి ముందుగానే సమాచారం ఇచ్చామని పోలీసులు తెలిపారు. ఘటన జరిగినప్పటి నుంచి స్పందించని సంధ్య థియేటర్ యాజమాన్యం.. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నేపథ్యంలో.. బందోబస్తు చేయాలంటూ పోలీసులను కోరుతూ రాసిన లేఖను విడుదల చేసింది. దీనిపై పోలీసులు కూడా  ప్రీమియర్స్‌కు హీరో, హీరోయిన్ రావడంతో ఇక్కడ తీవ్ర స్థాయిలో జనాలు గుమిగూడే అవకాశాలు ఉన్నాయని థియేటర్ యాజమాన్యానికి సూచించామని చెప్పిన పోలీసులు. ఈ క్రమంలో ప్రీమియర్స్‌కు నటీనటులు, మూవీ టీమ్ ఎవరినీ అనుమతించవద్దంటూ థియేటర్ యాజమాన్యానికి   చిక్కడిపల్లి పోలీసులు రాతపూర్వకంగా సమాచారం ఇచ్చారు. ఆ లేఖను పోలీసులు విడుదల చేశారు.   పోలీసులు సూచనలను ఖాతరు చేయకుండా హీరో అల్లు అర్జున్ ఆరోజు థియేటర్‌కు చేరుకున్నారు. పోలీసులు ఊహించిన విధంగానే భారీ సంఖ్యలో అభిమానులు ఎగబడటం, వారిని కంట్రోల్ చేయడం కోసం అల్లు అర్జున్ పర్సనల్ సెక్యూరిటీ అభిమానులను తోసేయడంతో తోపులాట చోటు చేసుకుందని పోలీసు వర్గాలు చెప్పాయి. అంతే కాకుండా పోలీసుల సూచనలను తుంగలోకి తొక్కి ధియేటర్ కు వచ్చిన అల్లు అర్జున్.. సైలెంట్‌గా థియేటర్‌లోకి వెళ్లకుండా నిబంధనలను ఉల్లంఘించి అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తొక్కిసలాటలో రేవతి అనే యువతి మరణించిందనీ, ఆమె కుమారుడు శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉందనీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే.. ఈ నెల 13న  అల్లు అర్జున్‌ను ఉ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి.. నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు14 రోజుల రిమాండ్ విధించింది.  దీంతో పోలీసులు ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే హైకోర్టు.. అల్లు అర్జున్‌కు వ్యక్తిగత పూచీకత్తుతో మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మరుసటి రోజు ఉదయం అంటే డిసెంబర్ 14న ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నేపథ్యంలోనే  ఓ వ్యక్తి  ప్రచారం మోజులో పడి ఓ యువతి మృతికి కారకులయ్యారంటూ అల్లు అర్జున్ పై జాతీయ మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.  ప్రేక్షకులను నియంత్రించడం కష్టమని పోలీసులు ముందుగానే  చెప్పినా అల్లు అర్జున్ పట్టించుకోలేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.  దీనిపై జాతీయ మానవహక్కుల కమిషన్ స్పందన ఏమిటననది తెలియాల్సి ఉంది. 

ఒక్కడిగా వచ్చాడు ఒక్కడిగా మిగిలిపోయాడు... నేడు వైఎస్ జగన్ బర్త్ డే

అధికారమే పరమావధిగా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మ దినోత్సం డిసెంబర్ 21. ఆయనపై పలు కేసులు, అవినీతిపరుడంటూ ఆరోపణలు రావడంతో  గత ఎన్నికల్లో ప్రజలు ఇంటికి పంపించి వేశారు. ఒక్కడిగా రాజకీయాలు ప్రారంభించిన జగన్ ఒక్కడిగానే మిగిలిపోయారు. .   గెలిచిన ఎమ్మెల్యేలను  పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించిన ధీశాలి వైఎస్ జగన్.   ప్రజా సంకల్ప యాత్రతో  అకారణంగా జనంతో మమేకమైన నేతగా పేరు మూటగట్టుకున్నారు.  యువభేరీ పేరుతో ప్రత్యేకహోదా నినాదాన్ని  మోసిన జగన్ తనకు  ముఖ్యమంత్రి హోదా రాగానే ప్రత్యేక హోదా నినాదాన్ని సజీవంగా  సమాధి చేశారు.  తనని తాను అవకాశ వాద నేతగా ఐడెంటిటీ ఇచ్చుకున్నారు. .  వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క చాన్స్ ఇవ్వండి  అని 2019 ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నారు. ఈ ఒక్క చాన్స్ చివరి చాన్స్ అవుతుందని ఆనాడు జగన్ మోహన్ ఊహించి ఉండరు.   నవ్యాంధ్రలో రెండోసారి జరిగిన ఎన్నికల్లో(2019) గెలిచి వైకాపా కు విక్టరీని అందుకున్నప్పటికీ మూడో సారి జారవిడుచుకున్నారు. తన అధర్మ, అరాచకపాలను ఎపి ప్రజలు తగిన బుద్ది చెప్పారు.  ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్ష నేతగా కూడా ప్రజలు గుర్తించలేకపోతున్నారు. వైనాట్ 175 అనే జగన్ 11 సీట్లకే పరిమితమయ్యారు. రెండు సీట్లు పెరిగి డబుల్ డిజిట్ హోదా దక్కినందుకు జగన్ లోలోపల ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు.  వైఎస్ జగన్ డిసెంబర్ 21 (శనివారం)తో 52 వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. పులివెందులలో రాజకీయ ఎంట్రీ ఇచ్చిన  వైఎస్ జగన్మోహన్​రెడ్డి.. 2004లో రాజకీయ అరంగేట్రం చేశారు. . తండ్రి చనిపోయిన సమయంలో పరామర్శించడానికి వచ్చిన నేతలకు ముఖ్యమంత్రి సీటు కట్టబెట్టాలని రికమెండ్ చేసుకున్న వారసుడు  వైఎస్ జగన్. అప్పట్లో  కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని  కడప పార్లమెంటు  అభ్యర్థిగా గెలుపొందారు. కానీ వైఎస్ జగన్ టార్గెట్ ఎంపీ కాదు . ముఖ్యమంత్రి సీటు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా కాంగ్రెస్ పార్టీలో ఇమేజ్ సృష్టించారు. . ఈ ఇమేజి తన రాజకీయ భవిష్యత్తుకు వాడుకున్న ఊసరవెల్లి వైఎస్ జగన్ . 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండోసారి అధికారం చేపట్టగానే  హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఈ డెత్ మిస్టరీ ఇంకావీడలేదు. సిఎం కుర్చీ కోసం తండ్రిని చంపించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు.  వైఎస్ రాజశేఖరరెడ్డికి ముఖ్యమంత్రి పదవి దక్కడంలో ముఖ్యభూమిక వహించిన సోనియాగాంధీని ఎదిరించి మాతృసంస్థ కాంగ్రెస్​ పార్టీ నుంచి జగన్ బయటికొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వైఎస్ జగన్ అధికార దాహంతోనే కాంగ్రెస్ పార్టీని వీడారు. తండ్రి మరణవార్తతో వైఎస్ అభిమానులు గుండెపగిలి చనిపోయారు. తన క్రిమినల్ బ్రెయిన్ ఉపయోగించి  ఆ కుటుంబాలను పరామర్శించాలని స్కెచ్ వేశారు జగన్ . .ఓదార్పు యాత్ర ప్రారంభించారు.తండ్రిని అడ్డం పెట్టుకుని అక్రమాస్తులు సంపాదించిన ఆరోపణ మీద 16 నెలలు జైలు జీవితాన్ని గడిపారు. ఈ సమయంలో తల్లి, చెల్లి జగన్ కు బాసటగా ఉన్నారు. 2019లో ముఖ్యమంత్రికాగానే వారిని పక్కనపెట్టేసారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు ఫిరాయింపులు ప్రోత్సహించారు. 18 మంది  కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వైకాపాలో చేరారు.  ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సయయంలో వైకాపా  సంక్షోభంలో చిక్కుకుంది. సమైక్యాంధ్ర నినాదాన్ని భుజానికెత్తుకోవడంతో తెలంగాణ ప్రజలకు దూరమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన  వైకాపా రెండు రాష్ట్రాల్లో పరాజయం చెందింది.  ఎపిలో ఒక శాతానికి పడిపోయింది.  గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో  వైకాపా పూర్తిగా చిత్తయ్యింది మాజీ ముఖ్యమంత్రి అనే పేరు తప్ప జగన్ సాధించింది ఏమీ లేదు.అక్రమాస్తులు, అరాచకపాలన తప్ప. 

కెటీఆర్ అరెస్ట్ తెలంగాణ రాష్ట్రంలో అల్లకల్లోలానికి కారణమవుతుందా..?

మాజీ మంత్రి కెటీఆర్ అరెస్ట్ తెలంగాణ రాష్ట్రంలో అల్లకల్లోలానికి కారణమవుతుందా..? అసలు కేటీఆర్ అరెస్ట్ ఎందుకు జరగాలి ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్కా ఆధారాలతో సిద్ధంగా ఉందా..!? కేటీఆర్ అరెస్ట్ అనంతరం ఎదురు కాబోయే పరిస్థితులను తట్టుకుని నిలబడేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుంటుందా...   అసలు కేటీఆర్ అరెస్ట్ ఎందుకు జరగాలి..ఆయన ఏం తప్పు చేశారు..ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్లబోతోంది..  ఆ వివరాలు తెలుసుకుందాం.. ఫార్ములా 1 కార్ రేస్ ఉదంతంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అక్రమాలు జరిగాయని.. అప్పటికి మంత్రిగా ఉన్న కేటీఆర్ ఈ వ్యవహారంలో నిధుల గోల్మాల్ కు పాల్పడ్డారని ప్రధానంగా ఆరోపిస్తూ ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం..కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేయడానికి తెలంగాణ గవర్నర్ ఇప్పటికే అనుమతి ఇచ్చినట్టు కూడా వార్తలు ఉన్నాయి.  ప్రతి ఉదంతంలో జరిగినట్టే  ఈ వ్యవహారంలో కూడా ప్రధాన నిందితుడుగా పేర్కొనే కేటీఆర్ తాను ఏ తప్పు చేయలేదని..ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను గురించి ప్రశ్నిస్తున్నందుకే తమపై ఇలా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని  ఆరోపిస్తున్నారు.  ఈ విషయంలో న్యాయపోరాటానికి తాము సిద్దంగా ఉన్నామని ఆయన ఇప్పటికే ప్రకటించారు. తన వంతుగా ఆయన ఈసరికే న్యాయస్థానాన్ని ఆశ్రయించి తన అరెస్టును అడ్డుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు నిజానికి ఫార్ములా 1 రేసు ఉదంతంలో తాను మంత్రిగా విధాన నిర్ణయం తీసుకున్నానని.. ఈ విషయంలో ఎటువంటి అవినీతి జరగలేదని ఆయన నిర్డవంధ్వంగా చెబుతున్నారు. ఇప్పటి వరకు తనను అరెస్ట్ చేయడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించిన రేవంత్ ప్రభుత్వం అది సాధ్యపడకపోవడంతో ఇప్పుడు మరో కొత్త తప్పుడు ఆరోపణతో తన అరెస్టుకు రంగం సిద్ధం చేసుకుంటోందని ఆయన దుయ్యబడుతున్నారు. ఏదోలా తనను జైలుకు పంపాలని రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు  ఇదిలా ఉండగా కేటీఆర్ ను అరెస్టు చేయడం అంటూ జరిగితే అల్లర్లు సృష్టించి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కేటీఆర్ అభిమానులు..బిఆర్ఎస్ కార్యకర్తలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.ప్రభుత్వం కూడా అరెస్టు విషయంలో వెనకంజ వేయకుండా ముందుకు వెళ్లాలని.. ఒకవేళ అరెస్టు అనంతరం ఎటువంటి పరిణామాలు ఏర్పడినా ఎదుర్కొనేందుకు సిద్ధపడే ఉన్నట్టుగా అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాగా తెలంగాణ ఏసీబీకి ఈడి అధికారులు ఇప్పటికే ఒక లేఖ రాసినట్టు సమాచారం ఉంది. కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలను ఎఫ్ఐఆర్ కాపీలతో సహా తమకు అందజేయాలని.. ఈ విషయంలో డబ్బు ఎంత మేరకు చేతులు మారిందో  ఆ వివరాలు కూడా తమకు చెప్పాలని ఈడి ఏసీబీని కోరింది..కేటీఆర్ అరెస్ట్ విషయంలో ఇప్పటికే ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయని.. ఏ క్షణానైనా అరెస్టు జరగొచ్చని తెలుస్తోంది.  కేటీఆర్ అరెస్టు విషయంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని అప్పుడే అడుగు ముందుకు వేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం.మొన్నటికి మొన్న సినిమా హీరో అల్లు అర్జున్ అరెస్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కొంత అభాసు పాలయింది..అల్లుఅర్జున్ అరెస్టు నిజంగా అవసరమా కాదా..సంధ్య థియేటర్ ఉదంతంలో అల్లు అర్జున్ కు ఎంతవరకు బాధ్యత ఉంది.. ఈ విషయంలో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసినా అది ఏ మేరకు నిలబడుతుంది.. ఇత్యాది అంశాలను కూలంకషంగా పరిశీలించకుండా...  చట్టపరమైన కొన్ని అంశాలను నిశితంగా పరిగణనలోకి తీసుకోకుండా అదేదో  కాకతాళీయ వ్యవహారం అన్నట్టు బన్నీ అరెస్టు విషయంలో దుందుడుగ్గా వ్యవహరించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరా ఒక రోజులోనే పుష్పరాజ్ కు బెయిల్ రావడంతో ఒక రకంగా చెప్పాలంటే నవ్వులు పాలైంది. ఈ చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ అరెస్టు విషయంలో పకడ్బందీగా వ్యవహరించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు సమాచారం.. ఇప్పటికే ప్రాథమిక వ్యవహారాలన్నీ పూర్తయ్యాయి గనుక పక్కా ఆధారాలతో కేటీఆర్ అరెస్టు విషయంలో ముందడుగు వేయాలని రేవంత్ ప్రభుత్వం నిశ్చయించింది.  ఇదిలా ఉండగా కేటీఆర్ అరెస్ట్ అనగానే బిఆర్ఎస్ పార్టీలో కొందరు పనిగట్టుకొని ఒక రకమైన ప్రకారాన్ని ఇప్పటికే జనాల్లోకి వదులుతున్నారు. రాజకీయ ప్రముఖులు ఎవరు అరెస్టు అయినా వారు వచ్చే ఎన్నికల నాటికి ముఖ్యమంత్రి అవుతున్నారని..ఈ లెక్కన ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం తద్యమనే టాక్ తెలంగాణలో ఇప్పుడు బలంగా నడుస్తోంది. వైసీపీ అధినేత జగన్ అరెస్టు అయి జైల్లో ఉండి విడుదలైన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారని..తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా జగన్ ప్రభుత్వంలో అరెస్టై విడుదలైన కొన్నాళ్లకే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు కనుక ఇప్పుడు అదే సెంటిమెంట్ వచ్చే ఎన్నికల నాటికి పనిచేసి కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కావడం గ్యారంటీ అని ఆయన అభిమానులు అంటున్నారు. ఇదంతా ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే అన్న సామెత చందాన లేదూ.. అన్నట్టు మరో విషయం.. ఇంతకు ముందు కవితని అరెస్టు చేసినప్పుడు తెలంగాణ ప్రజలు ఎటువంటి యాగీ చెయ్యలేదు. చాలా కూల్ గా తీసుకున్నారు. కవితలు బెయిల్ వచ్చిందా లేదా అనే విషయం పట్ల కనీస ఆసక్తి కూడా కనబరచలేదు..తమకు సంబంధం లేని వ్యవహారం అన్నట్టు ఉండి పోయారు. మరి ఇప్పుడు కేటీఆర్ అరెస్టు అయితే మాత్రం తెలంగాణ ప్రజలు వేరుగా రియాక్ట్ అవుతారని..అల్లర్లు.. నిరసనలు..ఆందోళనలకు తెగబడతారని ఎలా అనుకోవడం. మరి అల్లర్ల విషయంలో వినిపిస్తున్న హెచ్చరికలు ముందస్తు ప్రణాళికతో బీఆర్ ఎస్ పార్టీ చేస్తున్నవేనా.. ప్రజలు అప్పుడొకలా ఇప్పుడొకలా రియాక్ట్ అవడం అంటూ జరిగితే మాత్రం రేవంత్ సర్కార్ పాలనపై కొంత విముఖత మొదలైందని భావించవచ్చా..అదే జరిగితే ఇదంతా దేనికి సంకేతం అనుకోవచ్చు..చూద్దాం..

హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూత

ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధినేత  హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూశారు. హర్యానా రాష్రానికి ఐదు సార్లు సీఎంగా సేవలందించిన నాయకుడు ఓం ప్రకాశ్ చౌతాలా శుక్రవారం (డిసెంబర్ 20) మధ్యాహ్నం కార్డియాక్ అరెస్ట్ తో తుదిశ్వాస విడిచారు.  గురుగ్రావ్ లోని తన నివాసంలో కార్డియాక్ అరెస్ట్ తో చౌతాలా చనిపోయారని ఐఎన్ఎల్ డీ వర్గాలు తెలిపాయి. చౌతాలా వయసు 89 ఏళ్లు.  హర్యానా రాజకీయాల్లో చౌతాలా తనదైన ప్రత్యేక ముద్ర వేశారు.   1989 నుంచి 2005 వరకు హర్యానాకు ఐదుసార్లు సీఎంగా చౌతాలా సేవలందించారు. వృద్ధాప్యం కారణంగా చౌతాలా కొంతకాలంగా రాజకీయాల్లో ఇన్ యాక్టివ్ అయ్యారు.

కొత్త సంవత్సరం.. అమరావతికి నవశకం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి  కొత్త సంవత్సరంలో నవశకం ఆరంభం కానుంది. జగన్ ఐదేళ్ల హయాంలో అన్ని విధాలుగా భ్రష్ఠుపట్టించిన రాజధాని నిర్మాణ పనులు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జోరందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచ స్థాయి రాజథాని ఉండాలన్న ఉద్దేశంతో చంద్రబాబు 2014లో అధికారం చేపట్టిన తరువాత చేసిన ప్రయత్నాలు ఫలించే దశలో రాష్ట్రంలో 2019లో ప్రభుత్వం మారింది. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానులంటూ మూడుముక్కలాటకు తెరతీసి అమరావతిని నిర్వీర్యం చేశారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను నానా కష్టాలూ పెట్టారు. ఇటు అమరావతిని పాడుపెట్టారు. దీంతో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలింది. అయితే 2024ఎన్నికలలో రాష్ట్రప్రజలు జగన్ ను తిరస్కరించి మళ్లీ చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం కూటమికి అధికారం కట్టబెట్టారు.  దీంతో అమరావతికి జవసత్వాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధాని అమరావతేనని నిర్ద్వంద్వంగా చాటిన చంద్రబాబు రాజధాని నిర్మాణ పనులను పరుగులెత్తిస్తున్నారు.    జనవరి నుంచి నిర్మాణ పనులు షురూ కానున్నాయి. ఆంధ్రప్రదేశ్  కలల రాజదాని అమరావతి కొత్త ఏడాదిలో సరి కొత్త రూపం సంతరించు కోనున్నది. గత ఐదేళ్ల వైసిపి పాలనలో రాజధాని నిర్మాణ పనులు అటకెక్కాయి. ఆ ప్రాంతం అంతా కీకారణ్యంగా మారింది. రెండు మాసాల క్రితం ఈ  ప్రాంతాన్ని  నిర్మాణాలకు అనువుగా మార్చేందుకు గాను జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించి పూర్తి చేశారు. అంతే కాక సీడ్ యాక్స్చేస్ రోడ్డు   దేదీప్యమానంగా వెలుగులీనడం మొదలైంది.  అంతే కాక ఇటీవల సిఎం  చంద్రబాబు నాయుడు మంత్రి పొంగూరు నారాయణతో కలసి పలు మార్లు నిర్వహించిన సీ ఆర్ డి ఎ సమీక్షల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జనవరి నుంచి రాజధాని నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. వేలాది కోట్ల రూపాయల పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.   మూడు రాజధానులంటూ డ్రామాలాడిన వైసీపీ   ఎన్నికలకు ముందు విశాఖలో సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ ప్రారంభించి లబ్ధి పొందాలని చూసింది. అదే సమయంలో విపక్షంలో ఉన్న కూటమి పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ తాము అమరావతి రాజధానికే మద్దతిస్తున్నట్లు ప్రకటించేశాయి.  అదే సమయంలో ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చే తీర్పు రాజధానికి కీలకంగా మారింది. మరోవైపు అమరావతి రాజధానికి ప్రజల మద్దతు సంపాదించేందుకు కూటమి పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేశాయి.   ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అనూహ్య స్ధాయిలో భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో వైసీపీ మూడు ముక్కలాటకు చెక్ పడింది. అమరావతికి తిరిగి ప్రాణం వచ్చింది. గత ఐదేళ్లుగా వైసీపీ ఆడిన మూడు రాజధానుల  ఆటతో అమరావతి నష్టపోయింది. ముఖ్యంగా అక్కడ ప్రభుత్వాన్నినమ్మి ఏకంగా 36 వేల ఎకరాల భూమిని స్వచ్చందంగా ఇచ్చిన రైతులు ఐదేళ్ల పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరికి వారికి సకాలంలో ఇస్తామన్న కౌలు రావడం అందలేదు. ప్రతీ ఏటా హైకోర్టుకు వెళ్లి మరీ రైతులు కౌలు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది.  అసెంబ్లీ ఎన్నికలలో  ప్రజలు ఇచ్చిన తీర్పుతో  రాజధాని అమరావతే అన్న స్పష్టత వచ్చేసింది. ఐదేళ్ల పాటు ఏపీ రాజధాని అంటే ఏదనే ప్రశ్నకు ఇక తావు లేకుండా పోయింది. ఇక కోర్టుల్లో గతంలో రైతులు దాఖలు చేసిన కేసులు వెనక్కి తీసుకునే ప్రక్రియ ప్రారంభం కానుంది.  కూటమి సర్కార్ కూడా అమరావతిలో వేగంగా అడుగులేస్తోంది. వచ్చే జనవరి నుంచి అమరావతిలో పనులు పునఃప్రారంభం కాబోతున్నాయి. అలాకూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోనే  రాజధానిపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. మూడేళ్ల కాల వ్యవధి పెట్టుకుని తెలుగుదేశం కూటమి సర్కార్ అమరావతి పూర్తి లక్ష్యంగా ముందుకు కదులుతోంది.  

ఫార్ములా ఈ కార్ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చించాలి: హరీష్ రావ్

ఫార్ములా ఈ కార్ రేస్ అంశంపై  తెలంగాణ అసెంబ్లీలో రగడ జరిగింది. ఈ అంశంపై చర్చించాలని బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావ్  డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయం రద్దు చేసిన నేపథ్యంలో ఫార్ములా ఈ కార్ రేస్ అంశంపై చర్చించాలని ఆయన పట్టు బట్టారు. ఒక ప్రజాప్రతినిధిని అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో కేసు నమోదు చేయడాన్ని హరీష్ రావ్ తప్పు పట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కల్సి అసెంబ్లీలో చర్చపెట్టాలని డిమాండ్ చేశారు. ఇది అక్రమ కేసు అని హరీష్ రావ్ వాదించారు.  తెలంగాణ ప్రతిష్టను పెంచడానికే ఈ ఈవెంట్  కండక్ట్ చేసినట్టు హరీష్ రావ్ చెప్పుకొచ్చారు.   

హైకోర్టులో కెటీఆర్ క్వాష్ పిటిషన్ 

ఫార్ములా ఈ కార్ రేస్  కుంభకోణంలో ఎ 1 గా మాజీ మంత్రి కెటీఆర్ ఉన్నట్లు ఎసిబి కేసు నమోదు చేసిన నేపథ్యంలో శుక్రవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. తనను అరెస్ట్ చేయకూడదని కెటీఆర్ క్వాష్   పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే కెటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టారు.  ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని  కెటీఆర్ మొదట్నుంచి చెబుతూ వస్తున్నారు. కెటీఆర్ ఏ క్షణమైనా అరెస్ట్ కావొచ్చు. న్యాయపరంగా పోరాడి గట్టెక్కాలని కెటీఆర్ భావిస్తున్నారు.  కెటీఆర్ పిటిషన్ పై  సింగిల్ బెంచ్ జడ్జి శ్రావణ్ ముందు విచారణకు వచ్చింది. జస్టిస్ లక్ష్మణ్ సెలవులో ఉండటంతో మరో బెంచ్ అయిన జడ్జి  శ్రావణ్ ముందు విచారణకు వచ్చింది.

జమిలీ పై తొలిఅడుగు .. ఇక్కడ నుంచి ముందడుగు అనుమానమే!?

భారతీయ జనతా పార్టీ జమిలీ ఎన్నికల ప్రక్రియ లో తొలి అడుగు వేసింది. 129వ రాజ్యాంగ సవరణకు ప్రథమ అంకాన్ని పూర్తి చేసింది.  వారం క్రితం  వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు కేబినెట్  ఆమోదించిన అనంతరం దీనిని పార్లమెంట్ లో  ప్రవేశపెట్టింది.  220-148 ఓట్లతో లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టడానికి అనుమతి లభించింది. దాంతో జేపీసీ కి బిల్లు పంపడానికి మార్గం సుగమం అయింది. జాయింట్ పార్లమెంట్ కమిటీ ఈ బిల్లుపై కేవలం ప్రజలు,అధికారులు,మాజీ స్పీకర్లు తదితరుల  అభిప్రాయాలను సేకరిస్తుందే తప్ప నిర్ణయం తీసుకోదు. దానికి 90 రోజుల గడువు ఇస్తారు. అవసరమైతే గడువు పోడిగిస్తారు.ఈ కమిటీలో 31 మంది సభ్యులుంటారు. అత్యధికంగా అధికారపార్టీ సభ్యులు ఉంటారు. ఈ బిల్లుకు అనుకూలంగా తెలుగు రాష్ట్రాలలోని టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు ఓటు వేశాయి.  బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్,సమాజ్ వారీ పార్టీ, వామపక్షాలు సహా ఇండియా కూటమి పార్టీలు ఓటు వేశాయి.జమిలీ ఎన్నికలకు ఐదు రాజ్యాంగ సవరణలు చేయాలి. 129వ రాజ్యాంగ సవరణ చేయాలంటే సభలో మూడింట రెండు వంతుల మేజార్టీ లభించాలి.  .అలాగే 82ఏ నిబంధన, 83 నిబంధన, అసెంబ్లీ ఎన్నికల కాలపరిమితికి 172వ నిబంధన, 327 నిబంధన లకు పార్లమెంట్ ఆమోదిస్తేనే జమిలీ ఎన్నికలు సాధ్యమౌతుందని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. ప్రస్తుత లోక్ సభ  ఎన్నికల తర్వాత రాష్ట్ర పతి గెజిట్ నోటిఫికేషన్ చేయాలి. అప్పటి నుంచి ఐదేళ్ల కాల పరిమితి లెక్కిస్తారు. ఆ తరువాతే జమిలి ఎన్నికలు .అంటే టెక్నికల్ గా 2034 వరకూ వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యం కాదు.  పార్లమెంట్లో ఈ బిల్లు ఆమోదం పొందాలంటే 67 శాతం మంది సభ్యుల  మద్దతు అవసరం. అంటే 362మంది లోక్ సభలో,164మంది రాజ్యసభలో ఈ బిల్లుకు మద్దతు పలకాల్సి ఉంటుంది. కాని 543 సభ్యులున్న లోక్ సభ లో ఎన్డీఏకు 293, ఇండియాకూటమి 234 మంది సభ్యుల బలం ఉంది. రాజ్యసభలో245 సభ్యుల్లో ఎన్డీఏకు 125,మిగిలిన పార్టీలకు 88 మంది సభ్యుల బలం ఉంది. ఈ పరిస్థితుల్లో రెండు సభల్లో బిల్లు ఆమోదం పొందడం దాదాపు అసాధ్యం. ఈ బిల్లు చట్టమయితే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. ఇవి జరిగిన 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఒకే సారి జరుగుతాయి. కాని ఐదేళ్ల కాలపరిమితి లోగా అసెంబ్లీలో  అధికార పార్టీ బలం తగ్గితే ఏమి చేయాలన్న దానిపై స్పష్టత లేదు. .అలాగే పార్లమెంటులో హంగ్ ఏర్పడి మధ్యలో ప్రభుత్వం కుప్ప కూలితే మధ్యంతర ఎన్నికలకు అవకాశం ఉంటుందా? అప్పుడు అసెంబ్లీల పరిస్థితి ఏమిటని ప్రశ్నకూ సమాధానం లేదు. జమిలీ  ప్రస్తావన రాజ్యాంగంలో లేకపోవడం కూడా  ఒక అవరోధమేనని చెప్పాలి. అన్నిటికీ మించి జమిలి ఎన్నికలు అన్నది ఏదో కొత్తగా కొండను తవ్వి కనుగొన్నది కాదు.  స్వాతంత్య్రానంతరం 1952,1967లలో దేశంలో జరిగినవి జమిలి ఎన్నికలే. కనుక జమిలి అంటూ ఇప్పుడు బీజేపీ చేస్తున్న హడావుడి అఃసంబద్ధంగానే కనిపిస్తోంది. రాష్ట్రాలలో లేదా కేంద్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తే పరిస్థితి ఏమిటన్నదానిపై స్పష్టత లేకుండా కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ చేస్తున్న హడావుడి ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. 

వెంకటాపురం.. వంద శాతం తెలుగుదేశం సభ్యత్వం

ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికలలో ఘన విజయం సాధించి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి నుంచీ బలపడేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో పార్టీ ఇప్పటికే అన్ని వర్గాల మద్దతూ సాధించింది. ఆ సంగతి ఇటీవల  టీడీపీ తన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నిర్ద్వంద్వంగా రుజువైంది. తెలుగుదేశం సభ్యత్వ నమోదు డ్రైవ్ ద్వారా దాదాపు 73 లక్షల మంది  పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. వీరిలో   54శాతం మంది కొత్త వారే.  ఒక రాజకీయ పార్టీ సభ్యత్వ నమోదు లో ఇంత పెద్ద సంఖ్యలో కొత్త వారు సభ్యత్వం తీసుకోవడం ఒక రికార్డు అనుకుంటే..దానిని తలదన్నే రీతిలో ఒక గ్రామంలో మొత్తం జనాభా అంతా తెలుగుదేశం సభ్యులుగా నమోదు చేసుకోవడం ద్వారా నభూతో.. నభవిష్యతి అన్న రికార్డు కూడా తెలుగుదేశం వశమైంది. ఇంతకీ ఆ గ్రామం ఏదో తెలుసా.. దివంగత పరిటాల రవి స్వగ్రామం వెంకటాపురం.  ఆ  గ్రామంలోని ఓటర్లందరూ తెలుగుదేశం సభ్యత్వం తీసుకున్నారు. ఇలా ఒక గ్రామంలో నమోదైన ఓటర్లందరూ పార్టీ సభ్యత్వం తీసుకుని అనితర తెలుగుదేశం పార్టీకి అనితర సాధ్యమనదగ్గ రికార్డును అందించారు.   వెంకటాపురంలో మొత్తం 581 మంది ఓటర్లు ఉండగా, వారిలో  11 మంది మరణించారు. మిగిలిన 570 మంది ఓటర్లు అందరూ తెలుగుదేశం సభ్యత్వం తీసుకున్నారు. తద్వారా తెలుగుదేశం పార్టీ, పరిటాల కుటుంబం పట్ల తమకున్న అభిమానాన్ని చాటారు. ఈ విషయంపై రాప్తాడు ఎమ్మెల్యే, పరిటాల రవి భార్య పరిటాల సునీత మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత   ఈ ఘనత సాధించిన మొదటి గ్రామం వెంకటాపురం అని చెప్పారు. పార్టీ పట్ల, తమ కుటుంబం పట్ల ప్రజలు చూపుతున్న అభిమానానికి కృతజ్ణతలు తెలిపారు. 

రేవంత్ ఉచ్చులో కేటీఆర్‌.. త‌ప్పించుకునేదెలా! ?

తెలంగాణలో రాజ‌కీయాలు మ‌రింత‌ హీటెక్కాయి. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు సినిమా హీరో అల్లు అర్జున్ అరెస్టుతో జాతీయ మీడియా మొత్తం తెలంగాణపై ఫోక‌స్ పెట్టగా.. దేశంలోని రాజ‌కీయ నాయ‌కులు రాష్ట్రంలో ఏం జ‌రుగుతోంది? రేవంత్ స‌ర్కార్ ఏం చేస్తోంది? అనే అంశాల‌పై ఆరా తీయ‌డం మొద‌లు పెట్టారు. దాదాపు వారం రోజుల పాటు అల్లు అర్జున్ అరెస్టు ఘ‌ట‌న‌ రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. అయితే,  ఈ వ్య‌వ‌హారం స‌ర్దుమ‌ణ‌గ‌క ముందే తాజాగా రేవంత్ స‌ర్కార్ మ‌రో బాంబు పేల్చింది. ఈసారి ఏకంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు గురిపెట్టింది. ఫార్ములా ఈ-కార్ రేసు వ్య‌వ‌హారంలో రేవంత్ స‌ర్కార్ కేటీఆర్ కు ఉచ్చు బిగిస్తోంది. అయితే, గ‌త నెల రోజులుగా ఫార్ములా ఈ-కార్ రేసు వ్య‌వ‌హారంలో కేటీఆర్ అరెస్టు ఉంటుంద‌ని తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృత ప్ర‌చారం జ‌రుగుతోంది. సీఎం రేవంత్ స‌హా ప‌లువురు మంత్రులు కేటీఆర్ అరెస్టు కావ‌టం ఖాయ‌మంటూ గ‌తంలో పేర్కొన్నారు. కేటీఆర్ సైతం స్పందిస్తూ.. అరెస్టు చేసి జైలు పంపిస్తే హాయిగా వెళ్తా.. జైల్లో యోగా చేసి మంచి ఫిట్ నెస్ తో బ‌య‌ట‌కు వ‌చ్చి పాద‌యాత్ర చేస్తా అంటూ కౌంట‌ర్ ఇచ్చారు. తాజాగా కేటీఆర్‌ను విచారించేందుకు గ‌వ‌ర్న‌ర్ నుంచి అనుమ‌తులు   రావ‌డంతో ఏసీబీ రంగంలోకి దిగింది.  ఫార్ములా ఈ-కార్ రేసు వ్య‌వ‌హారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదైంది. ఆయ‌న‌తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పైనా, అలాగే ప్రైవేట్ కంపెనీ సీఈవో బీఎల్ఎన్ రెడ్డిపై కూడా కేసు నమోదు అయ్యింది. ఏ1గా కేటీఆర్, ఏ2 ఐఏఎస్ అరవింద్‌ కుమార్‌‌, ఏ3గా బీఎల్ఎన్ రెడ్డిని చేరుస్తూ ఏసీబీ కేసు ఫైల్ చేసింది. అవినీతి నిరోధక చట్టం కింద నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు పెట్టింది.  తాము కేటీఆర్ పై  కేసులు పెట్టామని నాంపల్లి కోర్టుకు ఏసీబీ అధికారులు తెలిపారు. నాన్ బెయిలబుల్ సెక్షన్లు కావడంతో నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టుచేయడానికి అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. త‌న‌పై కేసు న‌మోదు కావ‌డంపై కేటీఆర్ స్పందించారు. ఫార్ములా ఈ-కారు రేసులో కుంభ‌కోణం జ‌రిగింద‌ని అంటున్నారు. ప్ర‌భుత్వానికి చిత్త‌శుద్ది ఉంటే ఈ వ్య‌వ‌హారంపై శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ‌పెట్టాలి. ఫార్ములా ఈ-కారు రేసుపై అన్ని వాస్త‌వాలు వివ‌రిస్తా అని పేర్కొన్నారు. మ‌రోవైపు రేవంత్ స‌ర్కార్ పై ఎమ్మెల్సీ క‌విత తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేసీఆర్‌, బీఆర్ఎస్‌ను రాజ‌కీయంగా ఎదుర్కోలేక‌నే ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు.   2023, ఫిబ్రవరి 11న ఎంతో ప్రతిష్టాత్మకంగా అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం హుస్సేన్ సాగర్ చుట్టూ దాదాపు 2.8 కిలోమీటర్ల ఈ కార్ రేసింగ్ పెట్టింది. అయితే ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి దాదాపు రూ.55 కోట్ల వరకు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, సంబంధిత డిపార్ట్‌మెంట్ అనుమతి లేకుండానే విదేశీ కంపెనీకి నిధులు విడుదలయ్యాయి. అయితే రూ.55 కోట్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని, నిధుల దుర్వినియోగం జరిగిందని  కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఈ నిధుల గోల్‌మాల్‌పై విచారణకు సర్కార్ ఆదేశించింది. ఆర్థికశాఖ అనుమతులకు సంబంధించి ఎక్కడా రికార్డ్స్‌లో లేకపోవడంతో నిధుల గోల్ మాల్ వాస్తవమేనన్న అనుమానాలు   వ్యక్తమయ్యాయి. విదేశీ కంపెనీలకు ఇంత భారీ మొత్తాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా ఏ విధంగా అప్పగించారన్న దానిపై స్పష్టత లేకుండా పోయింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రజా ప్రతినిధులపై కేసులు నమోదు చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పని సరి. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితమే రాష్ట్ర గవర్నర్ అనుమతి ఇవ్వగా.. మూడు రోజుల క్రితం సీఎస్ కూడా ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ఏసీబీకి లేఖ రాశారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి మొదటగా ఈ ముగ్గురికి నోటీసులు జారీ చేసి అనంతరం విచారణ జరుపనున్నారు. కేటీఆర్ ను విచార‌ణ‌కు పిలిచి అరెస్టు చేస్తార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు ఈ కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు ఏసీబీ ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేస్తోంది. బంజారాహిల్స్ ఏసీబీ కార్యాల‌యంలో అధికారులతో ఏసీబీ డీజీ విజయ్ కుమార్ సమావేశం అయ్యారు. మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచి, ఆయనను   ఎలా విచార‌ణ‌ చేయాలి, ఒకవేళ విచారణకు కేటీఆర్ సహకరించకపోతే,  న్యాయస్థానాలకు వెళితే ఎలా డిఫెండ్ చేయాలి, అందులో విధివిధానాలు ఏంటి.. అనే అంశంపై ఒక ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు. లీగల్ టీమ్, ఎవిడెన్స్ టీమ్, ఐటీ సెల్ టీమ్.. ఇలా అన్ని విభాగాలకు చెందిన అధికారులతో స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేశారు. ఈ టీమ్‌లో మొత్తం ఐదుగురు సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. విదేశీ కంపెనీలకు నిధుల విడుదల నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని, అన్ని డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాతే కేసు నమోదు చేసినట్లు ఏసీబీ చెబుతోంది. ఈ క్ర‌మంలో కేటీఆర్ విచార‌ణ‌కు హాజరైతే ఆయ‌న్ను అరెస్టు చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఏసీబీ అరెస్టు నుంచి త‌ప్పించుకునేందుకు కేటీఆర్ సైతం త‌న ప్ర‌య‌త్నాల‌ను షురూ చేశారు. ఆయ‌న  హైకోర్టును ఆశ్రయించనున్నారని సమాచారం. శుక్ర‌వారం (డిసెంబర్ 20) హైకోర్టులో క్వాష్​ పిటీషన్​ వేయనున్నారని తెలిసింది.  మ‌రోవైపు.. కేటీఆర్ ను అరెస్టు చేస్తే రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ అదుపు త‌ప్పే అవ‌కాశాలు   ఉన్నాయ‌ని స‌ర్కార్ భావిస్తోంది. ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ‌ను డీజీపీ ఇప్ప‌టికే అలెర్ట్ చేసిన‌ట్లు స‌మాచారం.

ఫార్ములా ఈ కార్ రేసులో  కెటీఆర్ పై నాన్ బెయిలబుల్ కేసు 

తెలంగాణలో మరో సంచలనం జరిగింది. ఫార్ములా ఈ కార్  రేస్ లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ పై కేసు నమోదయ్యింది. నిన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రదానకార్యదర్శి శాంతకుమారి ఎసిబికి  రాసిన లేఖ ప్రకారం ఎసిబి కేసు నమోదు చేసింది. ముగ్గురిపై కేసులు నమోదయ్యాయి. ఎ1 గా కెటీఆర్, ఎ 2గా అరవింద్  కుమార్ , ఎ 3గా బిఎన్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి.  గత కొంతకాలంగా  కెటీఆర్ అరెస్ట్ అనే వార్తలు గుప్పు మంటున్నాయి. తాజాగా కేబినెట్ భేటీలో ఫార్ములా ఈ  కార్ రేస్ లో అవకతవకలు జరిగినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. విదేశాల్లో ఉన్న కంపెనీకి నిబంధనలను ఉల్లంఘించి నిధులు ట్రాన్స్ ఫర్ చేసినట్లు ప్రభుత్వం అభియోగాలు మోపింది. కెటీఆర్ పై నాలుగు సెక్షన్ల క్రింద కేసులు నమోదుచేశారు. ఇప్పటికే గవర్నర్ ఆమోదం తెలపడంతో కెటీఆర్ పై కేసు నమోదయ్యింది

అప్రతిహతంగా  ముగిసిన నారాలోకేశ్ యువగళం  యాత్ర

రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే రోజు ఇది. యువగళం నేత మంత్రి నారాలోకేశ్ ఈ యాత్ర చేపట్టి గురువారానికి 3132 కిలో మీటర్లకు చేరుకుంది. కుప్పం నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. 226 రోజుల పాటు యాత్ర కొనసాగింది. గురువారానికి అంటే డిసెంబర్ 19 నాటికి  ఈ యువగళం యాత్ర  ముగిసింది.  ఎపిలోని 97 నియోజకవర్గాలు చుట్టుముట్టింది. యువగళం నేత ఈ యాత్ర ప్రారంభం నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  సవాళ్లను స్వీకరించిన నేతగా నిలిచారు. పేదరికం, నిరుద్యోగం, అవినీతి, వైకాపా అవినీతికి వ్యతిరేకంగా యాత్ర సాగింది.   పాద యాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటానని నారాలోకేశ్ ముగింపు వేడుకలో అన్నారు. టిడిపి, జనసేన నేతలు భారీగా ఈ కార్యక్రమానికి తరలిరావడంతో  అంగెనపూడి పసుపు సంద్రంగా తయారయ్యింది. ఈ ఏడాది జనవరి 27న యాత్ర ప్రారంభమైంది. చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీ కోసం పాద యాత్ర అంగెనపూడిలో ముగిసింది. అదే సెంటిమెంట్ తో లోకేశ్ కూడా అక్కడే ముగించారు.  యువగళం తొలి రోజు నుంచి  అప్పట్లో అధికారంలో ఉన్నవైకాపా ప్రభుత్వం  అవరోధాలు కలిగించింది. జీవో నెంబర్ 1 అడ్డుపెట్టుకుని అరాచకాలు చేసింది. తారకరత్న మరణం, ఎమ్మెల్సీ ఎన్నికల సమయం, చంద్రబాబు అక్రమ అరెస్ట్ సమయంలో యువగళం యాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది. కుప్పంలో ఈ యాత్ర ప్రారంభమై తంబెళపల్లి చేరుకునే లోపు వైకాపా ప్రభుత్వం నారాలోకేశ్ పై 25  అక్రమ కేసులు బనాయించింది. పోలీసులు, వైకాపా శ్రేణులు తెదాపా శ్రేణులపై కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి.  40 మంది యువగళం వాలెంటీర్లపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.  గన్నవరం నియోజకవర్గంలోని 46 మందిపై తప్పుడు కేసులు పెట్టారు. విదేశాల్లో ఉన్న వారిపై కూడా కేసులు నమోదయ్యాయి. అనేక ఆటు పోట్లను అధిగమించిన ఈ యాత్ర ముగిసిన  సంధర్భంగా మా యువ నాయకుడు  నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.  

పేర్ని జయసుధ బెయిల్ పిటిషన్ ఈ నెల20కి వాయిదా 

వైకాపా నేత పేర్ని నాని భార్య పేర్ని జయసుధ రేషన్ బియ్యం మాయం కేసులో గురువారం మచిలీపట్నం కోర్టులో విచారణ జరిగింది. పేర్ని నాని భార్యకు చెందిన గోదాములో రేషన్ బియ్యం నిల్వలు ఉండేవి. కాకినాడ పోర్టులో  విదేశాలకు తరలిస్తున్న రేషన్  బియ్యం పట్టుపడిన సంగతి తెలిసిందే. జయసుధ గోదాములో నుంచి 185 టన్నులు మాయం కావడంపై ప్రభుత్వం సీరియస్ గానే ఉంది. బందరు పోలీస్ స్టేషన్ లో పేర్నినాని భార్య  పేరు మీద క్రమినల్ కేసు నమోదైంది. జయసుధ అరెస్ట్ పక్కా అని తెలియడంతో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నెల 16న విచారణ చేపట్టిన న్యాయస్థానం  పోలీసుల నుంచి సిడిఫైల్ రాకపోవడంతో విచారణ ఈ నెల 19కి వాయిదాపడింది. తాజాగా శుక్రవారానికి వాయిదా పడినట్లు సమాచారం  పేర్ని వైకాపాలో కీలక నేత కావడంతో రేషన్ బియ్యం గుట్టు కాలేదు. పౌరసరఫరా అధికారులు  కూడా రేషణ్  బియ్యం పట్టుకోవడంలో వైఫల్యం చెందారు.  కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక తీగలాగితే డొంక కదిలింది. 

కాళేశ్వరం కమిషన్ ఎదుట  స్మితా సబర్వాల్ 

పదేళ్ల బిఆర్ ఎస్ ప్రభుత్వం కూలిపోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఓ కారణం, సరిగ్గా  ఎన్నికల ముందు ఈ ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు కుంగిపోయాయి. ఈ ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని భావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ ఘోష్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఇంజినీర్లను మాత్రమే విచారణ చేసిన కమిషన్ బుధవారం  నుంచి  ఐఏఎస్ అధికారులను విచారిస్తుంది. రెండో రోజు కూడా విచారణ కొనసాగింది.  ఐఏఎస్ స్మితా సబర్వాల్ ను కమిషన్ విచారణ చేసింది. ఆమె బిఆర్కే భవన్ లో జరిగిన విచారణకు హాజరయ్యారు. బుధవారం విచారణ కమిషన్ ఎదుట  రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు రజత్ కుమార్, ఎస్ కె జోషి హాజరయ్యారు.