ipac employs jobless

ఆక్.. పాక్.. ఐప్యాక్.. కరేపాక్!

మాజీ ముఖ్యమంత్రి జగన్ లండన్‌కి వెళ్ళే ముందురోజు తాను 2019లో అధికారంలోకి రావడానికి సహకరించి, ఈ ఐదేళ్ళు జగన్ కోసం భారీ స్థాయిలో జనానికి అబద్ధాలు చెప్పి తరించిన ఐప్యాక్ సంస్థ కార్యాలయానికి వెళ్ళారు. ఆ ఎన్నికలలో, ఈ ఎన్నికలలో తనకు సహకరించిన ఐప్యాక్ ఉద్యోగులకు థాంక్స్ చెప్పడానికి జగన్ అక్కడకి వెళ్ళారు. తమ కార్యాలయానికి వచ్చిన జగన్ని చూసి ఐపాక్ ఉద్యోగులు మందుకొట్టిన మంకీల్లా అరిచారు. కాలుగాలిన పిల్లుల్లా గంతులు వేశారు. తోక తెగిన బల్లుల్లా హడావిడి చేశారు. ‘సీఎం... సీఎం’ అని పూనకం వచ్చినట్టు కేకలు వేశారు. ఆడలేదు, మగలేదు.. అందరూ జగన్‌తో రాసుకుని పూసుకోవడానికి ఉత్సాహపడిపోయారు. లండన్‌కి వెళ్ళిన జగన్ తిరిగి వస్తాడో రాడో అనుకున్నారోగానీ, ఆయనని చివరిసారి చూస్తున్నట్టుగా తెగ ఆత్రపడిపోయారు. ఈ సందర్భంగా జగన్ ‘ఈసారి మనం 156 ఎమ్మెల్యే సీట్లు, 22 పార్లమెంట్ సీట్లు గెలవబోతున్నాం’ అనగానే అందరూ అమ్మవారు పూనినట్టు ఆనందంతో ఊగిపోయారు. చివరాకరికి జగన్ ఈ ఐపాక్ గుంపుతో జగన్ సెల్ఫీలు దిగడం, కొన్ని సెల్ఫీలు అయితే జగనే స్వయంగా తీయడం చూసి ఐప్యాక్ ఉద్యోగులు నక్కతోక తొక్కినంతగాఆనందపడిపోయారు. మొత్తమ్మీద ఆ సీన్ ఆనందోత్సాహాల మధ్య ముగిసింది. పైన చెప్పుకున్న కామెడీ సీన్ ముగిసిన రెండ్రోజుల తర్వాత ట్రాజెడీ సీన్ మొదలైంది. ఐప్యాక్ సంస్థ తమ ఉద్యోగులు 150 మందిని తీసి అవతల పారేసింది. జగన్ వచ్చినప్పుడు చెప్పిన గెలిచే సీట్ల సంఖ్యలు విని ఇంకో ఐదేళ్ళు ఐప్యాక్ నీడలో అబద్ధాలు ప్రచారం చేస్తూ బతకొచ్చు అని కలలు కన్న ఆ 150 మందికి పెద్ద షాక్ తగిలింది. జగన్ పైకి అయితే అంకెలు చెప్పారుగానీ, లోపల గెలుస్తాననే నమ్మకం ఎంతమాత్రం లేదు. అందుకే ఐప్యాక్ సేవలు ఇక చాలు అని చెప్పేసినట్టున్నారు. అందుకే జగన్ వచ్చి వెళ్ళిన రెండ్రోజులకే ఐప్యాక్ బాస్‌లు 150 మంది ఉద్యోగుల బొచ్చెలో రాళ్ళు వేశారు. పాపం ఈ 150 మంది ఇంతకాలం అబద్ధాలు ప్రచారం చేస్తూ పొట్టపోసుకున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఇలాంటి ఉద్యోగాలు దొరకడం ఎంత కష్టమో కదా! జగన్, ఐప్యాక్ ఇద్దరూ కలసి ఉద్యోగులను కరేపాకులా వాడుకుని విసిరేశారు. జగన్ భజన చేయడం కోసం ఐప్యాక్ ఉద్యోగులు జూనియర్ ఆర్టిస్టుల రేంజ్‌లో యాక్టింగ్ ఇరగదీసేశారు. పథకాలు అందుకుంటూ పులకరిచి పోతున్న పాపగా, జగనన్న నుంచి ఇల్లు అందుకుని, ఆనందబాష్పాలు వర్షిస్తున్న ఆడపడుచుగా, జగన్ పాలన అదిరిపోతోందని చెబుతున్న పొరుగురాష్ట్రం కుర్రాడిగా, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన పారిశ్రామికవేత్తలుగా... ఇలా రకరకాల సందర్భాల్లో తగిన పాత్రలను అద్భుతంగా పోషించిన ఐప్యాక్ ఉద్యోగుల చేతుల్లో ఇప్పుడు ముష్టిపాత్ర వచ్చిపడింది. వీళ్ళకి ఇలాగే జరగాలి... ఇన్నాళ్ళూ అబద్ధాలు ప్రచారం చేసి జనం బుర్రలు పాడుచేశారు!

vallabhaneni vamshi to join bjp

బీజేపీ గూటికి వ‌ల్ల‌భ‌నేని వంశీ?

ఏపీ రాజ‌కీయాల్లో  పోలింగ్ త‌రువాత కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫ‌లితాలు రాక‌ముందే వైసీపీ నేత‌లు ప‌క్క‌ చూపులు చూస్తున్నారు. వైసీపీ ఓట‌మి ఖాయ‌మ‌ని, కూట‌మి 140 నుంచి 150 సీట్ల‌తో తెలుగుదేశం అధికారంలోకి రాబోతుంద‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా ఏపీలో పోలింగ్ శాతం న‌మోదైంది. విదేశాలు, ఇత‌ర రాష్ట్రాల్లో ఉంటున్న ఏపీ ఓట‌ర్లు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లి వ‌చ్చి ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. దీనికితోడు స్థానికంగా ఉన్న ఓట‌ర్లు సైతం పోలింగ్ కేంద్రాల వ‌ద్ద గంట‌ల త‌ర‌బ‌డి క్యూలైన్ల‌లో నిల‌బ‌డి మ‌రీ ఓటు వేశారు. దీంతో ప‌లు ప్రాంతాల్లో తెల్లవారు జామున 2గంట‌ల వ‌ర‌కు  పోలింగ్ జ‌రిగింది. భారీ సంఖ్య‌లో న‌మోదైన పోలింగ్‌తో కూట‌మి విజ‌యం ఖాయ‌మ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు, నేత‌ల్లో కంగారు మొద‌లైంది. ఫ‌లితాలు రాక‌ముందే కూట‌మి పార్టీలైన తెలుగుదేశం, జ‌న‌సేన‌, బీజేపీల్లో చేరేందుకు ఆ పార్టీ పెద్ద‌ల వ‌ద్ద‌కు రాయ‌బారాలు న‌డుపుతున్నారు. వీరిలో గ‌న్న‌వ‌రం వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి వ‌ల్ల‌భ‌నేని వంశీ కూడా ఉన్నారు.  ప్ర‌స్తుతం వంశీ అమెరికా వెళ్లాడు. త‌న కొడుకు చ‌దువుకోస‌మ‌ని ఆయ‌న‌ డ‌ల్లాస్ వెళ్లిన‌ట్లు అనుచ‌రులు చెబుతున్నారు. అస‌లు విష‌యం మాత్రం టీడీపీ పెద్ద‌ల‌తో రాజీకోసం వంశీ ఉన్న‌ట్లుండి డ‌ల్లాస్ లో ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్లు తెలుస్తోంది. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత తెలుగుదేశం నుంచి రాజ‌కీయంగా ఎలాంటి ఇబ్బంది ఉండ‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా తెలుగుదేశం ఎన్ఆర్ ఐల‌ ద్వారా రాయ‌బారాలు న‌డుపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇదే స‌మ‌యంలో బీజేపీలో చేరేందుకు సైతం వంశీ పావులు క‌దుపుతున్న‌ట్లు స‌మాచారం.  వ‌ల్ల‌భ‌నేని వంశీ రాజకీయ ఎంట్రీ తెలుగుదేశంతోనే ఆరంభమైన సంగతి తెలిసిందే.   గ‌న్న‌వ‌రం నుంచి రెండు సార్లు టీడీపీ అభ్య‌ర్థిగా విజ‌యం సాధించారు. 2019 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం అభ్య‌ర్ధిగా విజ‌యం సాధించిన వంశీ ఆ త‌రువాత   సీఎం జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ కండువా క‌ప్పుకున్నాడు. వైసీపీలో చేరిన కొద్దిరోజుల‌కే టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రిపై  అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ఆ స‌మ‌యంలో తెలుగుదేశం నేత‌లు, కార్య‌క‌ర్త‌లు వంశీపై తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప‌లు రాజ‌కీయ పార్టీల్లోని సీనియ‌ర్ నేత‌లు సైతం వంశీ వ్యాఖ్య‌ల‌ను తప్పుపట్టారు. ఖండించారు.   ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా వంశీ పోటీ చేయ‌గా.. టీడీపీ నుంచి యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు పోటీ చేశారు. వంశీ వైసీపీలోకి వెళ్లిన త‌రువాత గ్రామ‌స్థాయిలోని టీడీపీ నేత‌లు పార్టీని బ‌లోపేతం చేస్తూ వ‌చ్చారు. చంద్ర‌బాబు కుటుంబంపై వ్యాఖ్య‌ల త‌రువాత వంశీ అనుచ‌రులు సైతం ఆయ‌న‌కు దూరంగా ఉంటూ వ‌చ్చారు. ప్ర‌స్తుతం జ‌రిగిన ఎన్నిక‌ల్లో యార్ల‌గ‌డ్డ‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు. దీంతో వంశీ ఓట‌మి ఖాయ‌మ‌ని నియోజ‌క‌వ‌ర్గంలో చ‌ర్చ జ‌రుగుతున్నది. వైసీపీ అధికారం కోల్పోతుండ‌టం, నియోజ‌క‌వ‌ర్గంలో త‌న ఓట‌మి ఖాయ‌మ‌వ్వడంతో వంశీ బీజేపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.  వ‌ల్ల‌భ‌నేని వంశీ తిరిగి తెలుగుదేశంలోకి వెళ్లే ప‌రిస్థితి లేదు. దీంతో ఆయ‌నకు ప్ర‌త్యామ్నాయం భార‌తీయ జ‌న‌తా పార్టీయేన‌ని ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు. బీజేపీలోని త‌న స‌న్నిహితుల ద్వారా పార్టీ పెద్ద‌లతో చ‌ర్చించి కాషాయం కండువాను క‌ప్పుకునేందుకు వంశీ ప్ర‌య‌త్నాల‌ను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.  ప్ర‌స్తుతం అమెరికాలో ఉన్న వంశీ,  బీజేపీలో చేరేందుకు మార్గం సుగ‌మం చేసుకోవ‌టంతోపాటు తెలుగుదేశం పెద్ద‌ల‌తో రాజీకి కూడా  ప్ర‌య‌త్నాలు చేస్తున్నారని ఆయన అనుచరులే చెబుతున్నారు‌. డ‌ల్లాస్ లోని తెలుగుదేశం ఎన్ఆర్ ఐల ద్వారా చంద్ర‌బాబు, లోకేశ్ ల‌తో మాట్లాడేందుకు వ‌ల్ల‌భ‌నేని వంశీ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. చంద్ర‌బాబు కుటుంబ స‌భ్యుల‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు ఇప్ప‌టికే ప‌లు ద‌ఫాలుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పిన వంశీ, నేరుగా లోకేశ్ తో మాట్లాడ‌టం ద్వారా త‌న‌పై ఆగ్ర‌హాన్ని త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చూస్తున్నారని అంటున్నారు. అయితే, చంద్ర‌బాబు, లోకేశ్‌, ఇత‌ర టీడీపీ ముఖ్య‌నేత‌లంతా కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. కూట‌మి అధికారంలోకి రాగానే ముందుగా వారిద్ద‌రికి స‌రైన గుణ‌పాఠం చెప్పాలని భావిస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు, లోకేశ్ లు వంశీతో మాట్లాడేందుకు ఇష్ట‌ప‌డ‌ర‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే జ‌రిగితే బీజేపీలో చేర‌డం ద్వారా కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌వ్వ‌వ‌ని వంశీ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.  బీజేపీలోని ముఖ్య‌ నేత‌ల‌తో వ‌ల్ల‌భ‌నేని వంశీతో పాటు మ‌రికొంద‌రు వైసీపీ నేత‌లు ట‌చ్ లోకి వెళ్లిన‌ట్లు ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. వీరంతా ఫ‌లితాలు రాగానే వైసీపీని వీడి బీజేపీ కండువా క‌ప్పుకుంటార‌ని స‌మాచారం. వంశీ ఇప్ప‌టికే రాష్ట్ర బీజేపీ పెద్ద‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపార‌ని, దేశ స్థాయిలో లోక్ స‌భ ఎన్నిక‌లు పూర్తికాగానే కేంద్ర పార్టీ పెద్ద‌ల అనుమ‌తితో ఆయ‌న కాషాయం కండువా క‌ప్పుకుంటార‌ని గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో చ‌ర్చ జ‌రుగుతున్నది. మొత్తానికి ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన కొద్ది రోజుల‌కే వ‌ల్ల‌భ‌నేని వంశీ బీజేపీలోకి వెళ్ల‌డం ఖాయ‌మ‌ని, త‌ద్వారా కూట‌మి ప్ర‌భుత్వం నుంచి ఎదుర‌య్యే రాజ‌కీయ‌ ఇబ్బందుల నుంచి బ‌య‌ట‌ప‌డాలని చూస్తున్నారని వంశీ అనుచరులు చెబుతున్నారు‌.  

stones in woman stomach

మహిళ కడుపులో 570 రాళ్ళు!

మామూలుగా మన తెలుగు ప్రాంతాన్ని ‘రత్నగర్భ’ అని పిలుస్తూ వుంటారు. ఎందుకంటే, మన ప్రాంతంలో రత్నాలు బాగా దొరికేవి కాబట్టి. ఇప్పుడు ఈ న్యూస్‌లో చెప్పబోయేది మన రత్నగర్భ గురించి కాదు.. మన తెలుగింటి ‘రాళ్ళగర్భ’ గురించి. కోనసీమ జిల్లా అమలాపురానికి సమీపంలోని దేవగుప్తం గ్రామానికి చెందిన జాలెం నరసవేణి అనే 31 సంవత్సరాల వయసున్న మహిళ గాల్‌స్టోన్స్ సమస్య, విపరీతమైన కడుపునొప్పి సమస్యలతో అమలాపురంలోని ఎ.ఎస్.ఎ. ఆస్పత్రిలో చేరింది. ఆమెకు ఆపరేషన్ చేసిన డాక్టర్లు షాకైపోయారు. ఆమె కడుపులో ఒకటి కాదు.. రెండు కాదు.. పోనీ వంద కూడా కాదు.. ఏకంగా ఐదు వందల డెబ్భై (570) రాళ్ళున్నాయి. డాక్టర్లు జాగ్రత్తగా ఆపరేషన్ చేసి ఆమె కడుపులో వున్న ఆ రాళ్ళను బయటకి తీసేశారు. ఒక వ్యక్తి కడుపులో ఇన్ని రాళ్ళు వుండటం చాలా అరుదైన విషయమని డాక్టర్లు చెబుతున్నారు. 570 రాళ్ళను పొట్టలో భద్రపరుచుకున్న ‘రాళ్ళగర్భ’ నరసవేణి ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా వుంది. 

A plan to send without posting! If the government takes revenge...

పోస్టింగ్‌ ఇవ్వకుండానే పంపించే పన్నాగం! ప్రభుత్వమే పగబడితే...

సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు పెద్ద సమస్య వచ్చిపడింది. క్యాట్‌ తీర్పు ఇచ్చినా ఆయనకు పోస్టింగ్ దక్కలేదు. ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసినా స్పందన లేదు. ఈ నెల 31తో ఆయన పదవీకాలం పూర్తి కాబోతోంది.  2019 ఎన్నికల తర్వాత, ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ లేకుండా పోయింది. ఆయన్ను రెండుసార్లు సస్పెండ్ చేసింది జ‌గ‌న్ ప్రభుత్వం. క్యాట్‌ను ఆశ్రయించిన తర్వా త తీర్పు అనుకూలంగా వచ్చింది.  చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నిఘా విభాగం అధిపతిగా ఉన్న సమయంలో నిఘా పరికరాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని జ‌గ‌న్ ప్రభుత్వం ఆయ‌న‌పై ఆరోపించింది. దీంతో ఆయ‌న  రెండు సార్లు సస్పెండ్ కు గురైయ్యారు.  దీనిపై ఆయన క్యాట్ ను ఆశ్రయించారు. కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ మాత్రం ఆయనకు తక్షణమే పోస్టింగ్ ఇవ్వాలని, సస్పెన్షన్ కాలంలో జీతం కూడా చెల్లించాలని తీర్పు చెప్పింది.  ఆ తీర్పుకు సంబంధించిన పేపర్లు మూడు రోజుల తర్వాత బయటకు వచ్చాయి. ఆ వెంటనే ఏబీ వెంకటేశ్వరరావు సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి ఆ తీర్పు ప్రతుల్ని అందజేశారు. తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు.. ఈ మేరకు దరఖాస్తును కూడా అందజేశారు.  ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈసీ దగ్గర అనుమతి పొందిన తర్వాత ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది.  ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ఫైల్‌ను ఎలక్షన్ కమిషన్‌కు పంపాలి. కానీ చీఫ్ సెక్రటరీ,  ఏబీ వెంకటేశ్వర రావు ఫైల్‌ను సీఎం జగన్‌కు పంపించారు. పదవీ విరమణ చేసేవరకూ విధుల్లోకి తీసుకోకూడదనే ఎత్తుగడతోనే ఇలా వ్య‌వ‌హ‌రించార‌నే చర్చ ఐపీఎస్‌ వర్గాల్లో నడుస్తోంది. ఏబీ వెంకటేశ్వరరావుపై, సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లు విధించి, ఐదేళ్లూ అక్రమ కేసులతో వేధించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇంకా అదే ధోరణి కొనసాగిస్తోంది.   మరోవైపు ఏబీవీ సస్పెన్షన్‌ను ఎత్తేస్తూ క్యాట్‌ ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం ఏపీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌లో సీఎస్‌ జవహర్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ అనుమతి లభించకపోవడంతో ఆ పిటిషన్‌ అడ్మిట్‌ కాలేదు. ఈలోగా ఏబీవీపై ప్రాసిక్యూషన్‌కు  కేంద్రం నుంచి అనుమతి పొందారు. రాష్ట్రంలోని ఓ ప్రముఖ దేవస్థానం ఈఓ.. కేంద్ర హోంశాఖలో మంత్రాంగం నడిపించి ఏబీవీ ప్రాసిక్యూషన్‌కు అనుమతి తెచ్చారని సమాచారం.  క్యాట్‌ ఆదేశాలు అమలుచేసి ఏబీవీకి పోస్టింగ్‌ ఇవ్వడానికి, ప్రాసిక్యూషన్‌తో సంబంధం లేకపోయినా సరే ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వట్లేదు.    జగన్ సీఎం అయ్యాక.. అనేక మంది అధికారులపై కుట్రలు చేసి తప్పుడు కేసులు పెట్టారు. ఇందు కోసం సవాంగ్ అనే డీజీపీ హోదాలో ఉన్న అధికారి ఫోర్జరీ కూడా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో ఒక్క ఏబీవీ మాత్రమే బయటకు కనిపిస్తున్నారు. ఆయన ఐదేళ్ల సర్వీస్ ను తప్పుడు పద్దతిలో సస్పెన్షన్ పేరు చెప్పి నాశనం చేశారని క్యాట్ చెప్పింది. సుప్రీంకోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని స్పష్టం చేసింది. అయినా పోస్టింగ్ ఇవ్వలేదు.  ఆయన రిటైరయ్యే వరకూ పోస్టింగ్ ఇవ్వకుండా ఉండాలని ప్ర‌భుత్వం అనుకుంటోంది. ఇదంతా సీఎస్ కనుసన్నల్లోనే జరుగుతోంది.   ప్రభుత్వం మారిన త‌రువాత‌.. ఇప్పుడు జ‌గ‌న్ ఆడించిన‌ట్లు ఆడుతున్న అధికారుల ప‌రిస్థితి ఏమిటి? రాజకీయ పార్టీల ట్రాప్ లో పడిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తమ నెత్తి మీద తాము చేయి పెట్టుకున్నట్లే. - ఎం.కె.ఫ‌జ‌ల్‌

A rare honor for a Telugu woman

తెలుగు మహిళకు అరుదైన గౌరవం 

 తెలుగు మహిళ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. సప్త సముద్రాలు దాటిన ఈ వనిత భారత దేశ కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింజేసింది.  అగ్ర‌రాజ్యం అమెరికాలో తెలుగు మ‌హిళ జ‌య బాదిగ‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. కాలిఫోర్నియాలోని శాక్ర‌మెంట్ కౌంటీ సుపీరియ‌ర్ కోర్టు జ‌డ్జిగా ఆమె నియ‌మితుల‌య్యారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి కాలిఫోర్నియాలో జ‌డ్జిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన తొలి వ్య‌క్తిగా నిలిచారు. 2022 నుంచి ఇదే కోర్టులో క‌మీష‌న‌ర్‌గా కొన‌సాగుతున్నారు.  ఏపీలోని విజ‌య‌వాడ‌కు చెందిన జ‌య బాదిగ.. హైద‌రాబాద్‌లో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు. అనంత‌రం అమెరికా వెళ్లిన ఆమె బోస్ట‌న్ విశ్వ‌విద్యాల‌యంలో ఎంఏ పూర్తి చేశారు. ఆ తర్వాత‌ శాంటా క్లారా విశ్వ‌విద్యాల‌యం నుంచి లా ప‌ట్టా అందుకున్నారు. 2009లో కాలిఫోర్నియా స్టేట్‌ బార్ ఎగ్జామ్ క్లియ‌ర్ చేశారు.  10 ఏళ్ల‌కు పైగా న్యాయ‌వాద వృత్తిలో ప్రైవేట్ ప్రాక్టీస్‌లో కొన‌సాగుతున్నారు. ఈ క్ర‌మంలో లాభాపేక్ష లేకుండా ప‌లు కేసుల్లో ప్ర‌భుత్వం త‌ర‌ఫున వాదించారామె. అలాగే మెక్‌జార్జ్ స్కూల్ ఆఫ్ లాలో అధ్యాపకురాలిగాను ప‌ని చేశారు.

Extension of judicial remand of Kavita

కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు 

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో అరెస్ట్ అయి కస్టడీలో భాగంగా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఆమెకు మరోసారి జ్యుడీషియల్ కస్టడీని పొడిగించారు. నేటితో ఆమె కస్టడీ ముగియగా.. ఆమెను సీబీఐ అధికారులు తీహార్ జైలు నుంచే వర్చువల్‌గా రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి ఆమె రిమాండ్‌ను జూన్ 3 వరకు పొగడిస్తూ తీర్పును వెలువరించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం పొడిగించింది. కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగిస్తూ జడ్జి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం పాలసీ కేసులో కవితను రెండు నెలల క్రితం ఈడీ అరెస్ట్ చేసింది. రెండు నెలలుగా ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు. ఆమె జ్యుడీషియల్ రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు పలుమార్లు పొడిగించింది. జూన్ 3వ తేదీ వరకు కవిత రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. అధికారులు కవితను వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు. 

mental treatment for jagan

జగన్‌కి లండన్‌లో మానసిక చికిత్స?

‘ఓడిపోవడం ఖాయం అని తెలిసిపోవడంతో జగన్ లండన్‌కి పారిపోయాడు’ ఇప్పుడు దేశంలో ఎవర్ని కదిలించినా ఇదే మాట చెబుతున్నారు. కానీ, అలా అనడం తప్పు కదా? ఇండియాలో ఇన్ని లక్షల కోట్ల ఆస్తులు పెట్టుకుని జగన్ లండన్ ఎందుకు పారిపోతాడు? ఒకవేళ పారిపోయాడే అనుకోండి.. విజయ్ మాల్యాలాగా, నీరవ్ మోడీలాగా దొంగ బతుకే కదా.. పులివెందుల పులి అలా దొంగ బతుకు బతుకుతుందా చెప్పండి? ఎన్నికేసులనైనా ఎదుర్కొనే ధైర్యం, జైల్లో ఎంతకాలం వుండటానికైనా సిద్ధపడే నైజం జగన్ సొంతం. పైగా పదహారు నెలల జైలు అనుభవం కూడా ఆయనకి వుంది. అందువల్ల జగన్ పర్మినెంట్‌గా లండన్‌కి పారిపోయే ఛాన్సే లేదు కాబట్టి.. ఆ పారిపోయే టాపిక్‌ ఇక్కడితో క్లోజ్. అయితే జగన్ లండన్ ఎందుకు వెళ్ళినట్టు? ఆయనకి ఇక్కడ లేనిది లండన్లో ఏముంది? ఒక్కసారి బెంగళూరు ప్యాలెస్‌‌ లోపలకి అడుగు పెడితే లండన్ మహారాణి ప్యాలెస్‌ కంటే నాలుగింతలు ఎక్కువ బిల్డప్పు వుంటుంది. బెంగుళూరు ప్యాలెస్‌లో వున్నామా.. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో వున్నామా అనేది కూడా అర్థం కానట్టుగా వుంటుంది. పోనీ విహారయాత్రకు వెళ్ళారా అంటే, లండన్‌ని మించిన విహారయాత్రకు అనువైన ప్రదేశాలు, భూతల స్వర్గాలు ప్రపంచంలో చాలా వున్నాయి. అఫ్‌కోర్స్ స్విట్జర్లాండ్‌లో కూడా జగన్ టూర్ వుందనుకోండి. అయినా టూరిజం విషయంలో లండన్‌ని తక్కువ చేయడం కాదుగానీ, జగన్ లండన్ వెళ్ళింది కేవలం టూరిజం పర్పస్ కోసమే కాదని.. లండన్ టూర్ వెనుక ఇంకేదో వుందనే సందేహాలున్నాయి.  లండన్‌లో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన, ఎంతో నైపుణ్యం వున్న మానసిక నిపుణులు వున్నారు. ఎంతటి మానసిక సమస్యనైనా సరిదిద్దే చాతుర్యం వాళ్ళ దగ్గర వుంటుంది. జగన్ లండన్ వెళ్ళడం వెనుక మానసిక వైద్యం అనే కోణం కూడా వుందని తెలుస్తోంది. జగన్ ‘నార్సీ’ అనే మానసిక వ్యాధి కలిగి వున్నారని కొంతమంది మానసిక వైద్య నిపుణులు ఇప్పటికే ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా జగన్‌కి వున్న ‘నార్సీ’ మానసిక వ్యాధి గురించి అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. అబద్ధాలు చెప్పీ చెప్పీ ఆ అబద్ధాలే జనం నిజం అనుకునేలా చేయడం, తనకంటే ఎవరూ ఉన్నత స్థాయిలో వుండకూడదని కోరుకోవడం, అలా వున్నవారిని కిందకి దించే ప్రయత్నాలు చేయడం, హింసను ప్రేరేపించడం, ఎవరు ఏమైపోయినా పర్లేదు, తన ఇగో మాత్రమే గెలవాలి అనుకోవడం... ఇలాంటి లక్షణాలన్నీ జగన్‌లో వున్నాయి. 2019 ఎన్నికలలో జనం 151 అసెంబ్లీ సీట్లు ఇచ్చి రాష్ట్రాన్ని చక్కగా పరిపాలించుకోవయ్యా అంటే, అలా చేయకుండా అధికారంలోకి వచ్చిన మొదటి రోజునుంచే విధ్వంస రచన చేయడమే ‘నార్సీ’ వ్యాధి ఏ స్థాయిలో వుందనేదానికి నిదర్శనం. తనను తాను మహారాజులా భావించుకోకుండా నీతిగా, నిజాయితీగా పరిపాలిస్తే జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యేవారు.. కానీ, ఆయన అనుసరించిన ధోరణుల వల్ల ‘ఒక్కసారి చాలు బాబోయ్’ అని జనం చేత అనిపించుకుని, తన కుర్చీని తానే కాలితో తన్నుకున్నారు. చివరికి జనంలో కూడా పలచనైపోయారు. తనకు కలిసి వస్తుందనుకున్న ‘నార్సీ’ మానసిక పరిస్థితి ఇప్పుడు జగన్‌ని పాతాళంలోకి పడేసింది. ఈ ‘నార్సీ’ మానసిక ధోరణిని వదిలించుకోవడంతోపాటు మరికొన్ని మానసిక సమస్యలకు కూడా చికిత్స పొందే ఉద్దేశంతోనే జగన్ లండన్ వెళ్ళారని అభిజ్ఞ వర్గాల భోగట్టా. జగన్‌కి తనలో తాను మాట్లాడుకునే అలవాటు వుంది. అది ఎన్నో సందర్భాల్లో బయటపడింది. అలాగే తనకు గిట్టనివాళ్ళతో మాట్లాడుతున్న సమయంలో వాళ్ళని చెంపమీద కొట్టే షార్ట్ టెంపర్ కూడా వుంది. గతంలో ఒక వెలుగు వెలిగి కుప్పకూలిపోయిన సాఫ్ట్.వేర్ దిగ్గజాన్ని జగన్ చెంపమీద కొట్టారని చెబుతారు. అలాగే బాబాయ్ మర్డర్‌కి కొంతకాలం ముందు ట్రైలర్‌గా చెంపదెబ్ద కొట్టారని అంటారు. అలాగే అమ్మ విజయమ్మ, చెల్లి షర్మిలమ్మని కూడా జగన్ కొట్టారనేది బహిరంగ రహస్యం. ఇలాంటి ‘టెంపరి’తనాన్ని వదిలించుకోవడానికి మానసిక చికిత్స, కౌన్సిలింగ్ అవసరం. అందుకే జగన్ లండన్ వెళ్ళారని అంటున్నారు. జగన్ చూసి కూడా తప్పులు చదవడం, ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయడానికి జంకడం, మీడియా ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు తడబడుతూ వుండటం, వెర్రి నవ్వులు నవ్వడం, చెప్పాల్సిందేదో చెప్పకుండా దిక్కులు చూడటం... ఇలాంటి లక్షణాలన్నిటినీ బాగు చేసుకోవాలని అనుకుంటున్నట్టు సమాచారం.  ప్రస్తుతం జగన్ భయంతో వణికిపోతున్నారు. అధికారం పోయిన తర్వాత తన పరిస్థితి ఏమిటి? తన మీద వున్న కేసుల పరిస్థితి ఏమిటి? జైలుకు వెళ్ళక తప్పదా? హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు సమాధానం దొరికితే ఏం జరుగుతుంది. అయిదేళ్ళపాటు మహారాజులా బతికిన తాను జూన్ 4 నుంచి ఎలా బతకాలి... అవమానాలను ఎలా భరించాలి.. ఇలాంటి మానసిక వేదనతో ఆయన బాధపడుతున్నట్టు సమాచారం. ఇలాంటి మానసిక సమస్యలన్నిటికి నిపుణుల చేత గంపగుత్తగా చికిత్స చేయించుకోవడానికే జగన్ వెళ్ళినట్టయితే, ఆయన ఆ చికిత్సలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకుని, సంపూర్ణ ఆరోగ్యవంతుడై తిరిగి రావాలని కోరుకోవడం సాటి మనుషులుగా అందరి బాధ్యత. అలాగే, ముఖ్యమంత్రిగా తనకు లభించిన అవకాశాన్ని ఆయన ఎలాగూ సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా రెండోసారి అవకాశం దక్కబోతోంది. మారిన మనిషిగా ఆయన ఈ అవకాశాన్ని అయినా సద్వినియోగం చేసుకుంటారని ఆశిద్దాం.

The appointment of EC is in place of the transferred officers

కొత్త అధికారులను నియమించిన ఈసీ

ఏపీలో ఎన్నికల నేపథ్యంలో హింసాత్మక ఘటనలు జరగ్గా, పలువురు పోలీసు అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. బదిలీ అయిన వారి స్థానంలో ఈసీ నేడు కొత్త నియామకాలు చేపట్టింది. డీఎస్పీలుగా ఐదుగురిని, ఇన్ స్పెక్టర్లుగా ఏడుగురిని నియమిస్తూ ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.  గురజాల డీఎస్పీగా సీహెచ్ శ్రీనివాసరావు, నరసరావుపేట డీఎస్పీగా ఎం సుధాకర్ రావు, తాడిపత్రి డీఎస్పీగా జనార్దన్ నాయుడు, తిరుపతి డీఎస్పీగా రవి మనోహరాచారి, తిరుపతి స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా వెంకటాద్రిని నియమించారు.

change in ias and ips

మారిన ఐఏఎస్, ఐపీఎస్ ల తీరు.. అధికారం ఎవరిదో తేలిపోయినట్లేగా?

జనం మొగ్గు ఎటువైపు ఉంది.. ఏ పార్టీ పట్ల జనంలో అభిమానం మెండుగా ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న సర్కార్  ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ గద్దె ఎక్కుతుందా? లేక పరాజయం పాలై  అధికారం కోల్పోతుందా వంటి ప్రశ్నలకు సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే సర్వేల మీద ఆధారడుతుంది. అయితే  విషయాన్ని సర్వేలతో సంబంధం లేకుండా జనం మూడ్ ఏమిటి, ఎన్నికలలో విజయం సాధించే పార్టీ ఏది? పరాజయం పాలయ్యే పార్టీ ఏది అన్న విషయాన్ని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారులు ముందుగానే పసిగట్టేయగలరు. ఔను రాజకీయ పరిభాషలో బాబూస్ గా పిలవబడే ఐఎస్ఎస్ అధికారులకు జనం నాడి అందరికంటే ముందే తెలిసిపోతుంది.   అందుకే ఏపీలో  ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం మరో సారి గద్దె నెక్కే పరిస్థితి లేదని వారు ఎప్పుడో పసిగట్టేశారు. వారి విధేయతను మార్చేయడానికి, ప్లేటు ఫిరాయించడానికి ఎప్పుడో రెడీ అయిపోయారు. అయితే అతి కొద్ది మంది మాత్రం తమ విధేయతలను మార్చినా ఫలితం లేని స్థితికి వచ్చేశారు. జగన్ అక్రమ పాలనలో, నిబంధనలను తుంగలోకి తొక్కి అడ్డగోలు విధానాలను అమలు చేయడంలో జగన్ తో అంటకాగి నిండామునిగిపోయిన వారు మాత్రం నిండా మునిగిన వాడికి చలేమిటి అన్నట్లుగా ఎన్నికల కోడ్ ను సైతం లెక్క చేయకుండా అధికార పార్టీ ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారు.  మిగిలిన వారు మాత్రం ఇప్పుడు  తమ ఉద్దేశం ప్రకారం రాబోయేది తెలుగుదేశం కూటమి సర్కారే అన్న నిర్ధారణకు వచ్చేశారు.   ఇప్పటి వరకూ తామరాకు మీద నీటిబొట్టులా వ్యవహరించిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారులు, కొందరు ఐపీఎస్ అధికారులు కాబోయే సీఎం అన్న నమ్మకానికి వచ్చేసి చంద్రబాబు ప్రాపకం కోసం తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. అసలు బాబూస్ లో ఈ ప్రయత్నాలు ఎప్పుడో ఆరేడు నెలల కిందటే మొదలయ్యాయి. ఇప్పుడు అవి మరింత ముమ్మరమయ్యాయి. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబుతో కాంట్రాక్ట్ లోకి వెళ్లి మరీ తమ సచ్ఛీలతను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలీ ఒరవడి ఆరేడు నెలల కిందటే మొదలైంది.  ఇంత కాలం జగన్ సర్కార్ కు అడుగులకు మడుగులొత్తిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు  ఆరేడు నెలల నుంచీ జగన్ సర్కార్ కు దూరం జరగడం మొదలైంది.  ఇంత కాలం జగన్ చూసి రమ్మంటే కాల్చి వచ్చిన చందంగా ప్రభుత్వం ఇంత చెప్తే అంత చేసి విపక్షాన్ని చీకాకు పెట్టేందుకు మాత్రమే తమ అధికారాన్ని వాడిన అధికారుల వైఖరి గత ఆరేడు నెలలుగా పూర్తిగా మారిపోయింది. వి జగన్ కరుణా కటాక్షాల కోసం పరిధి దాటి మరీ పనులు చేసిన కొందరు అధికారులు గత ఆరేడు నెలల నుంచీ చంద్రబాబుతో భేటీకి తహతహలాడుతున్నారు. కొందరైతే రహస్యంగా ఆయనను కలిసి  క్షమాపణలకు కోరుకోవడమే కాదు.. అలా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందో వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఒక సందర్భంలో చంద్రబాబు ఈ విషయాన్నిస్వయంగా చెప్పారు. ఒక సీనియర్ అధికారి తనను మారువేషంలో కలిసి రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన గురించి వివరించారనీ, తానేం చేయలేకపోతున్నానని మధనపడ్డారనీ, ఎదిరిస్తే ప్రాణాలకే ముప్పని భయపడ్డారని చంద్రబాబు చెప్పారు. అంటే కేవలం జగన్ ఒత్తిడితోనే   తాము  తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా  పని చేయాల్సి వచ్చిందని అధికారులు చెప్పుకున్నారు.  బరితెగించి మరీ ఇంత కాలం జగన్ కు భజన చేసిన అధికారులే   బాబు ప్రాపకం కోసం వెంపర్లాడారు. ఇప్పుడు ఎన్నికల ముగిసిన తరువాత మరింత మంది అదే బాటలో నడుస్తున్నారు. బాబూస్ మారిన వైఖరే రాష్ట్రంలో ప్రభుత్వం మారోబోందన్న సంకేతాలను బలంగా ఇస్తున్నది.   అయితే జగన్ ప్రాపకం కోసం పరిధి దాటి వ్యవహరించి తెలుగుదేశం శ్రేణులనూ నేతలనూ వేధింపులకు గురి చేసిన ఐఏఎస్, ఐపీఎస్ లకు ఇప్పుడు బాబు ప్రాపకం కోసం వెంపర్లాడే ధైర్యం రావడానికి కారణం.. ఇప్పుడు సర్వీస్ అధికారుల తీరే రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం కూటమిదేనన్న భావనను బలపరిచేదిగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

vijaya sai reddy escape

ఆ పాపం ఎ2 విజయసాయిదే... అందుకే...!

జగన్ ప్రభుత్వ పుట్టికి ఆల్రెడీ ఓటర్లు చిల్లు పెట్టేశారు. మెల్లమెల్లగా నీళ్ళు లోపలకి వస్తున్నాయి. జూన్ 4వ తారీఖున జగన్ ప్రభుత్వ పుట్టి ‘మునిగిపోవడం’ ఖాయమని ‘తేలిపోయింది’. జగన్ ప్రభుత్వం మీద ప్రజల్లో మొదటి నుంచే వ్యతిరేకం వుంది. తాను ప్రవేశపెట్టిన పథకాల వల్ల ప్రజలు చాలా హ్యాపీగా వున్నారని, తాను, తన దండుపాళెం బ్యాచ్ ఎన్ని పనికిమాలిన వేషాలు వేసినా జనం తనకు ఓట్లు వేస్తారని కలలు కన్న జగన్‌కి జనం బుద్ధి చెప్పేశారు. జగన్ పరిపాలన తీరు ఎన్నో విషయాలలో జనానికి నచ్చలేదు. ఆయన అధికారంలోకి వచ్చిన నెల నుంచే ‘జగన్ మరోసారి అధికారంలోకి వస్తే అడుక్కు తినడమే.. ఈ ఐదేళ్ళూ భరించక తప్పదు’ అనే ఆలోచనకి జనం వచ్చేశారు. ఈసారి జగన్ బుడుంగ్‌మనడానికి కారణం అతని ప్రభుత్వ అవినీతి, అక్రమాలతోపాటు ముఖ్య కారణంగా చెప్పుకోవలసింది ‘లాండ్ టైటిలింగ్ యాక్ట్’. జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఈ యాక్ట్ ద్వారా తమ భూములకు మొగుడై కూర్చుంటాడన్న భయం జనాన్ని వేధించింది. అందుకే అతన్ని సాగనంపేలా తీర్పు చెప్పారు. ‘లాండ్ టైటిలింగ్ యాక్ట్’ తన కొంప ఇంతలా ముంచుతుందని జగన్ ఎంతమాత్రం ఊహించలేకపోయారు. ఈ చట్టాన్ని తేవడం ఇంత ఘోరం చేస్తుందని తెలిస్తే దానిజోలికే వెళ్ళేవాడు కాదన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. నిజానికి లాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద జగన్‌కి అంత ఇంట్రస్ట్ లేదట. ఏ2 విజయసాయిరెడ్డి ఒత్తిడి కారణంగానే ఈ చట్టాన్ని జనం మీద రుద్దడానికి జగన్ ఒప్పుకున్నారట. అలాగే రైతుల పట్టాదార్ పాసు పుస్తకాల మీద, భూముల సరిహద్దు రాళ్ళ మీద జగన్ ముఖారవిందం వుండాలన్న ఐడియా కూడా విజయసాయిరెడ్డిదేనట. అప్పుడు పట్టాదార్ పాస్ బుక్ వ్యవహారం, ఇప్పుడు లాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యవహారం... ఈ రెండూ జగన్ మీద రైతుల్లో వ్యతిరేకత పెంచాయి. ఎలక్షన్లలో సీన్ రివర్స్ అయ్యేలా చేశాయి.  పోలింగ్ ముగిసిన తర్వాత ఓటరు నాడిని అర్థం చేసుకున్న జగన్ విజయసాయిరెడ్డికి చాలా సీరియస్‌గా క్లాస్ పీకినట్టు సమాచారం. నేను వద్దు మొర్రో అంటున్నా, అద్భుతాలు చేయొచ్చంటూ నన్నుఒప్పించావు. రేపు నేను ఓడిపోతే నువ్వే కారణం అని ఆగ్రహం వ్యక్తం చేశాడట. దాంతో చిన్నబుచ్చుకున్న విజయ సాయిరెడ్డి పోలింగ్ తర్వాత ఎవరికీ కనిపించకుండా పోయినట్టు తెలుస్తోంది.

INTELEGENCE REPORT ON KAKINADA

కాకినాడ, పిఠాపురంపై ఈసీకి ఇంటెలిజెన్స్ నివేదిక

ఆంధ్ర ప్రదేశ్ లో పోలింగ్ సందర్భంగానూ, ఆ తరువాత కొన్ని ప్రాంతాలలో హింస చెలరేగింది. దీంతో ఆయా ప్రాంతాలలో పరిస్థితిని అదుపు చేయడానికి నిరవధికంగా 144వ సెక్షన్ విధించారు. ఇలా ఉండగా  ఇదే తరహా హింస కౌంటింగ్ సందర్భంగా కూడా చెలరేగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ విభాగం అనుమానిస్తోంది. ఆ మేరకు జూన్ 4న కౌంటింగ్ సందర్భంగానే, ఫలితాల ప్రకటన తరువాత కాకినాడ టౌన్, పిఠాపురం నియోజకవర్గాలలో హింసాకండ చెలరేగే అవకాశం ఉందని ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది.  ముఖ్యంగా ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావు పేటలలో పెద్ద ఎత్తున హింస ప్రజ్వరిల్లే అవకాశం ఉందని ఆ నివేదిక సారాంశం. దీంతో పోలీసులు ఆయా ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. అలాగే కాకినాడ సిటీ, పిఠాపురం నియోజకవర్గాల పరిధిలో గత ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలతో ప్రమేయమున్నవారిపై దృష్టికేంద్రీకరించారు.  ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా  గట్టి చర్యలు తీసుకుని హింసను నివారించాలని ఈసీ పోలీసు అధికారులను ఆదేశించింది. అదే విధంగా సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఏపీఎస్పీ బలగాలను ఆ రెండు నియోజకవర్గాలలోనూ మోహరించనున్నారు.  ఇప్పటికే  పోలింగ్ సందర్భంగా కాకినాడలో వైసీపీ, తెలుగుదేశం వర్గాల మధ్య ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఇరు వర్గాలూ ఒకరిపై ఒకరు కేసులు కూడా నమోదు చేసుకున్నారు. కాగా తాజా ఇంటెలిజెన్స నివేదికతో కేంద్ర ఎన్నికల సంఘం కాకినాడ పిఠాపురం నియోజకవర్గాలపై సీరియస్ గా దృష్టి సారించింది. కౌంటింగ్ సందర్భంగా ఎలాటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా గట్టి చర్యలకు ఉపక్రమించింది.  

kapu and settibaliji communities favour tdp alliance this time

తూర్పు తీర్పే.. రాష్ట్రం తీర్పు!

ఆంధ్రప్రదేశ్ లో ప్రజల తీర్పు ఎలా ఉందో చెప్పడానికి ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఫలితం చూస్తే సరిపోతుందని అంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచీ ఇదే ఓరవడి కొనసాగుతూ వస్తోంది. విభజిత ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రెండు ఎన్నికలలోనూ కూడా తూర్పు గోదావరి జిల్లా ప్రజల ఆదరణ పొందిన పార్టీయే అధికారంలోకి వచ్చింది. ఈ సారి కూడా అదే జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరి ఈ సారి తూర్పు ప్రజల దీవెన ఎవరి ఉంది అంటే.. జిల్లాలో గెలపు ఓటములను ప్రభావితం చేయగలిగే రెండు సామాజిక వర్గాల మొగ్గు ఎటువైపు ఉందన్నది పరిశీలిస్తే సరిపోతుందంటున్నారు. జిల్లాలలో కాపు, సెట్టిబలిజ సామాజిక వర్గాల ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ రెండు సామాజిక వర్గాలలో శెట్టిబలిజ సామాజిక వర్గం బీసీల కిందకి వస్తుంది. సంప్రదాయకంగా శెట్టిబలిజలు అంటే బీసీలు తెలుగుదేశం పార్టీతోనే ఉంటూ వస్తున్నారు. మధ్యలో ఒకటి రెండు సార్లు ఈ జిల్లాలో వారి మొగ్గు వేరే పార్టీవైపు మళ్లినా అది తాత్కాలికమే. ఎందుకంటే శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన వారిలో అత్యధికులు చిన్న చిన్న చేతి వృత్తులు చేసుకుంటూ పొట్టపోసుకునే వారు. వారికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ అండగా నిలుస్తూ వచ్చింది. ఆదరణ వంటి పథకాల ద్వారా చేతి వృత్తుల వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు దోహదపడింది. అలాగే రాజకీయంగా కూడా వారి ఎదుగుదలకు తెలుగుదేశం అండగా నిలిచింది.  ఇక కాపు సామాజికవర్గం విషయానికి వస్తే.. ఈ సారి కాపు సామాజికవర్గం మొత్తం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతుగా నిలిచింది. అంటే తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఆ సామాజికవర్గం నిలి చింది.   ఒక అంచనా ప్రకారం కాపుసామాజిక వర్గ ఓటర్లలో 70శాతం మందికి పైగా ఈ సారి తెలుగుదేశం క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం మేరకు కాపు నేతం పథకం లబ్ధిదారులైన మహిళలు కూడా ఈ సారి తెలుగుదేశం కూటమికే జై కొట్టారు.  2017లోనూ కూటమి ప్రభావం ఏమిటన్నది చవి చూసిన జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ బీసీలను తెలుగుదేశం పార్టీకి దూరం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.   బీసీల కోసం కార్పొరేషన్లు పెట్టారు. అయితే వాటి ద్వారా అందిన ఆర్థిక సహాయం ఏమీ లేదనుకోండి అది వేరే  విషయం.   ఇక శెట్టిబలిజ సామాజిక వర్గంలో  గౌడ, యాత, ఈడిగ వంటి ఉపకులాల వారు ఆర్థికంగా ఒకింత మెరుగైన స్థితిలో  ఉంటారు. ఈ ఉప కులాలకు చెందిన వారంతా ప్రధానంగా  మద్యం వ్యాపారం అంటే బార్లూ, వైన్ షాపులు నిర్వహించే వారు. జగన్ మోహన్ రెడ్డి మద్యం విధానం కారణంగా వీరంతా బాగా దెబ్బతిన్నారు. కాకినాడ రూరల్, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట ప్రాతాలలో వీరి జనాభా ఎక్కువ.  అలాగే  పి.గన్నవరం, ముమ్మిడివరం, కొత్తపేట, రామచంద్రాపురం, అమలాపురం, రాజోలు లలో కూడా వీరు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు.  అదే విధంగా అనపర్తి, రాజమహేంద్రవరంలలో కూడా విరి ప్రభావం కనిపిస్తుంది. చివరి క్షణంలో కూటమిని దెబ్బ కొట్టేందుకు జగన్  జిల్లాలో శెట్టిబలిజలకు ఎక్కువ స్థానాలు కేటాయించడం ద్వారా వారి మద్దతు సాధించాలన్న ప్రయత్నం చేశారు. రాజమహేంద్రవరం రూరల్, రాజమహేంద్రవరం సిటీ, రాజమహేంద్రవరం లోక్ సభ నియోజకవర్గాలలో జగన్ శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులకు టికెట్లిచ్చారు.  అదే సమయంలో   సీట్ల సర్దుబాట్ల కారణంగా  తెలుగుదేశం కూటమి శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వారికి పెద్దగా సీట్లు కేటాయించడానికి అవకాశం లేకుండా పోయింది.  ఇది తమకు లాభిస్తుందని వైసీపీ ధీమాగా ఉంది. అయితే క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం మేరకు  కాపు, శెట్టిబలిజ సామాజికవర్గాలు తెలుగుదేశం కూటమివైపే ఉన్నారని తెలుస్తోంది. మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మొగ్గు తెలుగుదేశంవైపే ఉందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  

Tet exam starts from today

నేటి నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 80 పరీక్ష కేంద్రాల్లో టెట్ నిర్వహించనున్నారు. టెట్ పరీక్షలు సోమవారం  నుంచి జూన్ 2వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు ఒక సెషన్... మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించనున్నారు. ఈ మేరకు టెట్ కన్వీనర్ వెల్లడించారు. టెట్ కు ఈసారి మొత్తం 2.86 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1కి 99,958 మంది దరఖాస్తు చేసుకోగా, పేపర్-2కి 1,86,428 మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలిసారిగా టెట్ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తున్నారు. టెట్ కు హాజరయ్యే అభ్యర్థులకు బయోమెట్రిక్ విధానం అమలు చేయనున్నారు. పరీక్ష ప్రారంభమయ్యే నిర్ణీత సమయం కంటే 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తారు. అందుకే అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలి.

ముగిసిన కవిత జ్యుడిషియల్ రిమాండ్  

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన కవిత.. సుమారు 46 రోజులుగా తీహార్ జైల్లోనే ఉన్నారు. కోర్టు అనుమతితో పలు పుస్తకాలను చదువుతూ... ధ్యానం, ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు. అప్పుడప్పుడు కుటుంబ సభ్యులతోనూ ములాఖాత్ అవుతున్నారు.టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగుస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ, సీబీఐ రెండు రిమాండ్లు నేటితో ముగియనున్నాయి. ఈ క్రమంలో తీహార్ జైల్లో ఉన్న కవితను అధికారులు ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కవిత కస్టడీని కోర్టు పొడిగిస్తుందా? లేక ఆమెకు బెయిల్ మంజూరు చేసి స్వేచ్ఛను ప్రసాదిస్తుందా? అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే బెయిల్ కోసం కవిత పలుమార్లు న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయితే, ప్రతిసారి ఆమెకు నిరాశే ఎదురయింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మాత్రం జైల్లోనే మగ్గుతున్నారు.

చంద్రబాబే మళ్లీ సిఎం : కాంగ్రెస్ నేత చింతామోహన్ 

 ఎపిలో సర్వేలన్నీ త్రికూటమి వైపే ఉన్నాయి. తెలుగు దేశం పార్టీ అధికారంలో రాబోతుందని జోస్యం చెబుతున్నాయి. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇదే విషయం చెబుతున్నారు. తాజాగా కాంగ్రెస్ నేతలు కూడా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు. ఏపీలో కూటమి విజయం సాధించబోతోందని తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ జోస్యం చెప్పారు. చంద్రబాబు మళ్లీ సీఎం కాబోతున్నారని అన్నారు. ఏపీలో సీఎం జగన్, దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. టీడీపీకి సీట్లు భారీగా పెరగబోతున్నాయని... అయితే, బీజేపీతో పొత్తు కారణంగా టీడీపీ కచ్చితంగా కొన్ని సీట్లను కోల్పోబోతోందని చింతా మోహన్ తెలిపారు. బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే 150కి పైగా సీట్లు వచ్చేవని అన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ 4 నుంచి 5 వేల కోట్ల వరకు ఖర్చు చేసిందని చెప్పారు. ఇంత డబ్బును జగన్ ఎలా తీసుకురాగలిగారని ప్రశ్నించారు. జగన్ కు పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలు కూడా తక్కువేనని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని చెప్పారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి 150కి మించి సీట్లు రావని తెలిపారు.

ప్రశాంత్ కిషోర్ పవర్ ఫుల్ పంచ్.. జగన్ కు దిమ్మతిరిగిందా?

పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేదీ సినిమాలో  చివరి పంచ్ మనదైతే ఆ క్కిక్కే వేరప్పా అని ఓ డైలాగ్ ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు ప్రముఖ ఎన్నికల  వ్యూహకర్త, 2019 ఎన్నికలలో జగన్ విజయానికి కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ అలాంటి కిక్ నే ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు.  ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ పూర్తయిన తరువాత మూడు రోజులకు తీరిగ్గా ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్.. అక్కడ తమ పార్టీ విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ ప్రశాంత్ కిషోర్ పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలలో వైసీపీ ఘోరంగా ఓటమి పాలౌతుందంటూ ఆయన ఓ ఇంటర్వ్యేూలో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ సారి తాము మరింత ఘన విజయం సాధించి అధికారం చేపడతామన్న ధీమా వ్యక్తం చేశారు. అంతే కాదు ప్రశాంత్ కిషోర్ లెక్కలన్నీ తప్పులని కొట్టి పారేశారు. ఆయన ఏపీ ఫలితాలు చూసి కంగుతింటారన్నట్లుగా మాట్లాడారు.  ఆ జగన్ వ్యాఖ్యలకే ప్రశాంత్ కిషోర్ గట్టి రిటార్ట్ ఇచ్చారు. ప్రముఖ జర్నలిస్టు బర్ఖాదత్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాజకీయ నాయకులు ఓటమి గురించి ఎన్నడూ ప్రస్తావించరనీ, కౌంటింగ్ పూర్తయ్యే వరకూ కూడా గెలుపు ధీమా వ్యక్తం చేస్తారనీ అంటూ  ఇప్పడు జగన్ కూడా అదే చేస్తున్నారని చెప్పారు. అయినా మరో పక్షం రోజులలో కౌంటింగ్ జరుగుతుందనీ, ఒక వేళ తన అంచనాలు నిజమైతే  బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలలో  అమిత్ షా  గెలుపు ధీమా వ్యక్తం చేసి ఎలా ఓడిపోయి తలదించుకున్నారో అలాగే జగన్ రెడ్డి కూడా తలదించుకుంటారని ప్రశాంత్ కిషోర్ చురకలు వేశారు. ఒక వేళ తన అంచనా తప్పైతే తాను తలదించుకోవలసి వస్తుందని అన్నారు. అయితే దేశ వ్యాప్తంగా తన అంచనాలపై ప్రజలలో ఉన్న నమ్మకం, తన ఇమేజ్ దృష్ట్యా  ఇలాంటి అంచనాల విషయంలో తాను చాలా జాగ్రత్తగా ఉంటానన్న ప్రశాంత్ కిషోర్  ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అన్నది పక్కన పెడితే జగన్ పార్టీ ఓడిపోబోతోంది. ఇది నిజం అని కుండబద్దలు కొట్టారు.    

వంగా గీత.. ప్లేటు ఫిరాయించేశారా?

రాష్ట్రంలో హాట్ నియోజకవర్గాలలో ఒకటైన పిఠాపురంలో అత్యధికంగా 86.86శాతం పోలంగ్ నమోదైన సంగతి విదితమే. ఇక్కడ నుంచి జనసేనాని పవన్ కల్యణ్ పోటీ చేయగా ఆయనకు ప్రత్యర్థిగా వైసీపీ నుంచి కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీత బరిలోకి దిగారు.  వైసీపీ అధినేత జగన్ ఇక్కడ నుంచి పవన్ ను ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో సర్వశక్తులూ ఓడారు. ఒక వైపు ముద్రగడ పద్మనాభం తన స్థాయిని దిగజార్చుకుని మరీ పవన్ పై అనుచిత వ్యాఖ్యలతో, అసందర్భ సవాళ్లతో విరుచుకుపడితే.. మరో వైపు జగన్ తన ఎన్నికల ప్రచార చివరి సభను ఇక్కడే నిర్వహించి, జనసేనానిపై తన పాత పెళ్లిళ్ల విమర్శలనే పునరుద్ఘాటించారు.  ఇక పవన్ తరఫున ప్రచారాన్నంతా పిఠాపురం తెలుగుదేశం ఇన్ చార్జ్  ఎస్పీఎస్ఎన్ వర్మ పర్యవేక్షణలో సాగింది. ఆయన ప్రచారానికి అద్భుత స్పందన కూడా కనిపించింది. మరో వైపు వంగా గీత ప్రచారానికి జనస్పందన కరవైంది. పోలింగ్ అనంతరం క్షేత్ర స్థాయి నుంచి అందుతున్న సమాచారం, పోలింగ్ తరువాత వైసీపీ అంచనాలు అన్నీ కూడా ఇక్కడ నుంచి పవన్ కల్యాణ్ ఘన విజయాన్నే సూచిస్తున్నాయి.  పవన్ విజయం కంటే కూడా ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఆయన సాధించబోయే మెజారిటీపైనే అందరి ఆసక్తి కేంద్రీకృతమై ఉంది.  ఇక వంగీ గీత కూడా నేరుగా కాకపోయినా పరోక్షంగా తన పరాజయాన్ని అంగీకరించేశారు. ఇటీవల అంటే పోలింగ్ తరువాత ఆమె ఒక సందర్భంగా పవన్ కల్యాణ్ పట్ల సానుకూల వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హైకమాండ్ నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా తాను ప్రచారంలో ఎన్నడూ పవన్ కల్యాణ్ ను విమర్శించలేదనీ, ఆయనపై వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు. అలాగే చిరంజీవి అన్నా ఆయన కుటుంబం అన్నా తనకు ఎంతో గౌరవం అని చెప్పుకొచ్చారు. 2009 ఎన్నికలలో ఇదే పిఠాపురం నియోజకవర్గం నుంచి తాను ప్రజారాజ్యం అభ్యర్థిగా విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేస్తూ తనకు మెగాఫ్యామిలీ పట్ల అంతులేని గౌరవాభిమానాలు ఉన్నాయని చెప్పుకున్నారు.  అయితే నెటిజనులు మాత్రం వంగీ గీత మాటలను కొట్టి పారేస్తున్నారు. నిజంగా ఆమెకు పవన్ కల్యాణ్ పై అంత గౌరవం, అభిమానం ఉంటే.. వైసీపీ నాయకులు ద్వారంపూడి, ముద్రగడ వంటి వారు పవన్ కల్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు, దూషణలను అప్పడే ఖండించి ఉండాలి కాదా అని నిలదీస్తున్నారు. పోలింగ్ పూర్తయిన తరువాత, ఓటమి ఖాయమని నిర్ణయానికి వచ్చిన తరువాత ఇప్పుడు తీరిగ్గా సెంటిమెంట్ డైలాగులు వల్లిస్తున్న వంగా గీతను తెగ ట్రోల్ చేస్తున్నారు.  ఆమె చెబుతున్న గౌరవం, అభిమానం వంటి మాటలన్నీ ఒట్టి నటనగా కొట్టి పారేస్తున్నారు.