kcr comments on budget

కేసీఆర్ ఆ ఏడుపేదో అసెంబ్లీలో ఏడ్వచ్చు కదా?

తాను జీవించి వున్నంతకాలం తెలంగాణ రాష్ట్రానికి తానే ముఖ్యమంత్రి అనే భ్రమల్లో బతికిన కేసీఆర్ అహంకారపూరిత పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారు. అందుకే, తెలంగాణ ప్రజలు కేసీఆర్ భ్రమల్ని వదిలించారు. కేసీఆర్ అధికారాన్ని ఊడబెరికి, కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చారు. దాంతో అధికార వైరాగ్యంలో పడిపోయిన కేసీఆర్ ఇంతకాలం అసెంబ్లీ ముఖాన్ని చూడకుండా ఫామ్‌హౌస్ రాజకీయాలు చేస్తూ ఏడునెలలపాటు టైమ్‌పాస్ చేశారు. దాదాపు పదేళ్ళపాటు అధికారాన్ని వెలగబెట్టిన కేసీఆర్‌కి ఇంతకాలం ఒక్కరోజు కూడా ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతంగా వ్యవహరించలేదన్న విమర్శలు భారీ స్థాయిలో వినిపిస్తున్నాయి. అందుకేనేమో, ‘కేసీఆర్ ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వెళ్ళలేదు’ అనే మాట వినిపించకుండా చేయడం కోసమేమో, ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీకి వచ్చి వెళ్ళారు. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమర్పిస్తున్న సమయంలో కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ సమయంలో ఆయన ముఖంలో ఏదో చిరాకు. తన సొంత ఆస్తిని ఎవరో అనుభవించేస్తున్నారన్న బాధ. తాను కష్టపడి, చెమటోడ్చి సంపాదించిన ఆస్తిని తనకు కాకుండా చేశారన్న ఆవేదన ఆయన ముఖంలో కనిపించాయి. కొద్దిసేపు అసెంబ్లీలో కూర్చున్న ఆయన బయటకి వచ్చి, మీడియా ముందు తనదైన శైలిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, బడ్జెట్ మీద ఏడ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్‌ని చులకన చేస్తూ మాట్లాడారు. ఈ సందర్భంలో కేసీఆర్ పక్కనే వున్న వెకిలి బ్యాచ్ వెకిలి నవ్వుల సంప్రదాయాన్ని కొనసాగించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్ మీద ఏడ్చిన కేసీఆర్, ఆ తర్వాత బడ్జెట్ మీద చర్చ జరుగుతున్న సమయంలో అసెంబ్లీకి రాకుండా ఫామ్‌హౌస్‌లోనే సెటిలైపో్యారు. కేసీఆర్ ఒక్కరోజు... అది కూడా కొద్దిసేపు అసెంబ్లీకి వచ్చింది ఎవర్ని ఉద్ధరించడానికి? అలా మొక్కబడిగా అసెంబ్లీకి వచ్చి పోవడానికేనా ప్రజలు ఆయనకి ప్రతిపక్ష నాయకుడి హోదా ఇచ్చింది? బడ్జెట్ జరుగుతున్న సమయంలో అసెంబ్లీకి వచ్చింది, బడ్జెట్ మీద మీడియా ముందు ఏడ్చిన కేసీఆర్, ఇప్పుడు బడ్జెట్ మీద చర్చ జరుగుతున్న సమయంలో కూడా అసెంబ్లీకి వచ్చి, మీడియా ముందు ఏడ్చిన ఏడుపేదో అసెంబ్లీలో కూడా ఏడ్వచ్చు కదా? ఆ ఏడుపు విని, బడ్జెట్ ప్రతిపాదనల్లో ఏవైనా పొరపాట్లు వుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరిదిద్దుకుంటుంది కదా? ఏడ్వాల్సిన చోట ఏడ్వకుండా, ఏడ్వాల్సినప్పుడు ఏడ్వకుండా వుండటం ఎంతవరకు కరెక్ట్?

india qualify 4x400

4x400 మీటర్స్ రిలే.. భారత్ అద్భుత ప్రదర్శన

పారిస్ ఒలింపిక్స్ ను భారత్ అద్భుత ప్రదర్శనతో ఆరంభించింది. కనీస అంచనాలు కూడా లేకుండా బరిలోకి దిగిన భారత పురుషుల జట్టు అద్భుత ప్రదర్శేన చేసింది.  4x400 మీటర్ల రిలేలో భారత పురుషుల జట్టు క్వాలిఫయింగ్ రౌండ్ లో రెండో స్థానంలో నిలిచి క్వాలిఫై అయ్యింది. వ్యాఖ్యతలు కానీ, క్రీడీ పండితులు కానీ అసలు భారత పురుషుల 4x00 మీటర్ల రిలే జట్టును గుర్తించను కూడా గుర్తించలేదు. క్వాలిఫయింగ్ రౌండ్ రేస్ ప్రారంభమైన తొలి మూడు నిముషాలలో వ్యాఖ్యాతలు అసలు ఇండియన్ టీమ్ ఈ రౌండ్ లో పోటీలో ఉందన్న విషయాన్ని ప్రస్తావించలేదు. అటువంటిది రౌండ్ పూర్తయ్యే సరికి అమెరికా తరువాత రెండో స్థానంలో నిలిచి భారత్ జట్టు అద్భుతం సృష్టించింది. 

pablo escobar senior to jagan

జగన్‌కి సీనియర్... అసలు ఎవరీ ఎస్కోబార్?

వైసీపీ ఎమ్మెల్యే జగన్ ఈ పేరు పలకడానికి కూడా తడబడిపోయాడు. ఆ పేరు పాబ్లో ఎస్కోబార్. జగన్ ఇంతకాలం చేసింది ఎస్కోబార్ తరహా పనులే. కానీ, ముఖ్యమంత్రి పదవిని వెలగబెట్టిన అయ్యగారికి ఎస్కోబార్ ఎవరో తెలియదు. ఇంతకీ ఎవరీ పాబ్లో ఎస్కోబార్?  పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గావిరియా కొలంబియాకు చెందిన మత్తుపదార్థాల అక్రమవ్యాపారి, నార్కో తీవ్రవాది. అతను అత్యున్నత స్థితిలో ఉన్నప్పుడు అమెరికాకు అక్రమ రవాణా అయిన కొకైన్‌లో 80 శాతం అతని ముఠానే రవాణా చేసేది. ఎస్కోబార్ ఏటా 21.9 బిలియన్ డాలర్లు వ్యక్తిగత ఆదాయంగా సంపాదించేవాడు. అతన్ని కొకైన్ రాజు అంటే, కింగ్ ఆఫ్ కొకైన్ అని అంటారు. ఎస్కోబార్ చరిత్రలోకెల్లా అత్యంత ధనికుడైన నేరస్తుడిగా పేరొందాడు. 1990ల్లో ఏటా 30 బిలియన్ అమెరికన్ డాలర్లు సంపాదించేవాడు. తద్వారా అతను అత్యున్నత దశలో ఉన్నప్పుడు ప్రపంచంలోకెల్లా అత్యంత ధనికుల్లో ఒకడయ్యాడు. కొలంబియా ప్రాంతంలోని రియోనెగ్రోలో జన్మించిన ఎస్కోబార్, సమీపంలోని మెడెలిన్‌లో పెరిగాడు. యూనివర్శిడాడ్ ఆటోనామా లాటినో అమెరికనా ఆఫ్ మెడెలిన్‌లో కొద్దికాలం పాటు చదువుకున్నా, డిగ్రీ లేకుండా విశ్వవిద్యాలయం నుంచి బయటకు వచ్చేశాడు. నేర కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రారంభించి, క్రమేపీ తప్పుడు బ్రాండ్ సిగరెట్లు, ఫేక్ లాటరీ టిక్కెట్లూ అమ్మసాగాడు. మోటారు వాహనాల దొంగతనాల్లోనూ పాల్గొన్నాడు. 1970ల్లో నిషిద్ధ వస్తువుల అక్రమ రవాణాదారుల కోసం పనిచేయడం ప్రారంభించాడు. తరచుగా జనాన్ని కిడ్నాప్ చేసి డబ్బు సంపాదించడమూ చేసేవాడు. ఎస్కోబార్ 1975లో యునైటెడ్ స్టేట్స్‌లో తొలి అక్రమరవాణా మార్గాన్ని ఏర్పరిచి, పౌడర్ కొకైన్ తానే అమ్మడం మొదలుపెట్టాడు. మాదక ద్రవ్యాల వ్యాపారంలో అతను వేగంగా విస్తరిస్తూ పోయాడు. ఇదే సమయంలో కొకైన్‌కు అమెరికా వ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో అతనికి లాభించింది. 1980ల నాటికి నెలనెలా 70 నుంచి 80 టన్నుల కొకైన్ కొలంబియా నుంచి యుఎస్‌కి రవాణా చేసేవాడని అంచనా. తన వ్యాపారంలో భాగంగా ఎస్కోబార్ హత్యాకాండకు పాల్పడేవాడు. పోలీసు అధికారులు, న్యాయమూర్తులు, స్థానికులు, ప్రముఖ రాజకీయ నాయకులను హత్యలు చేసేవాడు. 1982లో ఎస్కోబార్ లిబరల్ ఆల్టర్నేటివ్ ఉద్యమం కింద కొలంబియా ఛాంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కి ప్రత్యామ్నాయ సభ్యునిగా ఎస్కోబార్ ఎన్నికయ్యాడు. ఈ అధికారం ఉపయోగించి తన మనుషులందరికీ పశ్చిమ కొలంబియాలో ఫుట్‌బాల్ మైదానాలు, ఇళ్ళు నిర్మించి ఇచ్చాడు. దాంతో ఆ పట్టణాల స్థానికుల్లో అతనికి మంచి ప్రాచుర్యం లభించింది. ఎస్కోబార్‌కు అతని ప్రత్యర్థులకూ మధ్య జరిగిన హత్యల కారణంగా, కొలంబియా ప్రపంచ హత్యా రాజధానిగా పేరుగాంచింది, ఎస్కోబార్‌ను పట్టుకోవడానికి కొలంబియన్, అమెరికన్ ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించాయి. 1993లో ఎస్కోబార్‌ని అతని 44వ పుట్టినరోజుకు ఒకరోజు తర్వాత స్వంత పట్టణంలో కొలంబియన్ నేషనల్ పోలీసులు కాల్చిచంపారు. ఈ ఎస్కోబార్‌కి, మన జగన్‌కీ చాలావరకు పోలికలు కనిపిస్తున్నాయి కదూ!

ntr name to gannavaram international airport

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు!

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రాయినికి తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపింది. అలాగే రాష్ట్రంలోని మరో రెండు విమానాశ్రయాల పేర్లను కూడా మార్చాలని కేంద్రాన్ని కోరింది. కర్నూలు విమానాశ్రాయనికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును, తిరుపతి విమానాశ్రయానికి తిరుమలేశుడి పేరు పెట్టాలని భావిస్తున్నది. ఈ మేరకు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖకు ఏపీ సర్కార్ ప్రతిపాదనలు పంపింది. అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే విమానాశ్రయాల పేర్లు మార్చాలని నిర్ణయించింది.  

change started in tirumala

తిరుమల కొండపై మార్పు మొదలైంది!

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కార్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో తిరుమల పవిత్రతకు భగం వాటిల్లింది. తిరుమలేశుని దర్శనానికి వచ్చే భక్తులకు జగన్ పాలనలో  కనీస సౌకర్యాలు కూడా కరవయ్యాయి. అంతే కాకుండా తిరుమలేశుని దర్శనాన్ని కూడా క్లిష్టతరం చేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో కూడా రాజకీయాలు జొప్పించి తిరుమల పవిత్రతను మంటగలిపేలా కొండపై నానా రకాల అరాచకాలకూ పాల్పడ్డారు.  దీంతో దేశ విదేశాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు నానా ఇబ్బందులూ పడ్డారు. అన్న ప్రసాదం నాణ్యత నుంచి, కొండపై పరిశుభ్రత వరకూ ప్రతి విషయంలోనూ ప్రమాణాలకు తిలోదకాలిచ్చేశారు. తిరుమలకు భక్తులు రావద్దు అనే వరకూ జగన్ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం తెగించేసింది. భక్తుల రద్దీ అధికంగా ఉంది, సౌకర్యాలు కల్పించలేం. రద్దీ తగ్గే వరకూ భక్తులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవడం మేలు అని ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక కొండపై అన్యమత ప్రచారం, అన్యమతస్థులకు టీటీడీలో కొలువులు ఇలా అన్ని రకాలుగానూ నింబంధనలకు తిలోదకాలిచ్చేశారు.  ఒకరిద్దరి కనుసన్నలలోనే  తిరుమలలో అంతా జరిగేది. చివరాఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా కూడా తిరుమలేశుడిని నల్లరాతితో పోల్చిన వ్యక్తినే నియమించారు. తిరుమలేశునికి భక్తులు సమర్పించిన కానుకల సొమ్మును కూడా తమ రాజకీయ అవసరాలకు వినియోగించుకోవడానికి వీలుగా నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల ప్రక్షాళనపై ఫోకస్ పెట్టారు. ఏళ్ల తరబడి అక్కడే ఉంటూ కొండపై అరాచకాలన్నిటికీ ఊతం ఇచ్చిన ఈవో ధర్మారెడ్డికి ఉద్వాసన పలికారు. అలాగే ఆయనకు వంత పాడి అక్రమాలు, అన్యాయాలకు పాల్పడిన అధికారులనూ బదిలీ చేశారు. ధర్మారెడ్డి స్థానంలో వచ్చిన ఈవో శ్యామలరావు.. తిరుమల ప్రక్షాళనపై దృష్టి సారించారు.  తిరుమల లడ్డూ నాణ్యత తగ్గిపోవడానికి కారణమేమిటి? క్యూలైన్లో భక్తులకు అందించే అన్న ప్రసాదాన్ని ఆపివేయడానికి కారణమేంటి?  అలాగే వృద్ధుల‌కు,  త‌ల్లుల‌కు వెయిటింగ్ కంపార్టుమెంట్ లో  తిరుమల తిరుపతి దేవస్థానం పాలు సరఫరా చేసే విధానానికి కూడా తిలోదకాలిచ్చేశారు.  ఇలా గతంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు గతంలో ఉన్న సౌకర్యాలన్నిటినీ ఆపివేశారు. కొత్తగా వచ్చిన ఈవో వీటిపై దృష్టి పెట్టారు. ముందుగా  శుభ్ర‌త‌కు   ప్రాధాన్య‌త ఇచ్చారు. నిత్యం ఆక‌స్మిక త‌నిఖీలు, రివ్యూలు, హెచ్చ‌రిక‌లతో పరిస్థితిని గాడిలోకి తీసుకువచ్చారు. …. ఫ‌లితంగా టీటీడీలో మార్పు మొద‌లైంది. గ‌తంలో ఉన్న సౌక‌ర్యాలు తిరిగి మొద‌ల‌య్యాయి. ల‌డ్డూ ద‌గ్గ‌ర నుండి తిరుమ‌ల కొండ‌పై అధిక రేటుకు అమ్మే వాట‌ర్ బాటిల్స్ వ‌ర‌కు అన్నింటిపై కొత్త ఈవో ఫోక‌స్ చేశారు. వ్యాపారుల‌ను పిలిచి నిబంధ‌న‌లు ఏంటో… అవి పాటించ‌కుంటే ప‌ర్య‌వ‌స‌నాలేంటో విశదీకరించారు. అవినీతి అధికారుల‌పై వేటు ప‌డ‌టం మొద‌లైంది. నాణ్య‌త‌పై ఫోక‌స్ పెరిగింది. అంతేందుకు తిరుమ‌ల శ్రీ‌వారి ప్ర‌సాదాలకు స‌ప్లై చేసే వ‌స్తువుల నాణ్య‌త కూడా పెరిగింది. ఈవో భ‌క్తుల‌తో నేరుగా మాట్లాడుతున్నారు. సౌక‌ర్యాల గురించి ఆరా తీస్తున్నారు.  ఫ‌లితంగా ఒక్కొక్కొటిగా మార్పులు క‌నిపి స్తున్నాయి. త్వ‌ర‌లో రాబోయే పాల‌క‌మండ‌లిలో కూడా నిబ‌ద్ధ‌తతో ప‌నిచేసే వారే ఉంటారంటున్నారు.    తిరుమలకు వచ్చే భక్తులకు  సరసమైన ధరలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యమని ఈవో జె. శ్యామలరావు చెబుతున్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఫుడ్ సేఫ్టీ విభాగం, అన్నప్రసాదం సిబ్బందికి, పెద్ద మరియు జనతా క్యాంటీన్‌ల నిర్వాహకులకు త్వరలో శిక్షణ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.  

aditional ips alloted to ap

ఆంధ్రప్రదేశ్ కు అదనంగా ఐపీఎస్ ల కేటాయింపు

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ఓ వైపు జగన్ ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి తన వంతు ప్రయత్నాలను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర బడ్జెట్ లో  ఏపీకి నిధుల వరద పారింది. కేంద్రం ఏపీకి భారీ కేటాయింపుల వెనుక చంద్రబాబు ఒత్తిడి ఉందన్న సంగతి తెలిసిందే. మరో వైపు జగన్ పాలనలో అక్రమాలు, అన్యాయాలను కళ్లకు కట్టే విధంగా శ్వేతపత్రాలను విడుదల చేస్తూ జగన్ శిబిరంలో భూకంపం వచ్చేలా చేస్తున్నారు. అంతే కాకుండా జగన్ హయాంలో ప్రతిష్ట కోల్పోయిన పోలీసు శాఖను ప్రక్షాళన చేసే విషయంలో కూడా చంద్రబాబు వేగంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్రానికి అదనంగా ఐపీఎస్ లను కూటాయించాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఆయన వినతి పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్రం రాష్ట్రానికి అదనపు ఐపీఎస్ లను కూటాయించేందుకు కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రానికి అదనంగా 30 మంది ఐపీఎస్ లు రాబోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి ఐపీఎస్ క్యాడర్ స్ట్రెంక్త్ 144 కాగా ఆ సంఖ్యను 174కు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ కు అదనపు ఐపీఎస్ ల కేటాయింపు ఇదే మొదటి సారి.  

jagan conspiracy for distruction

దోపిడీ సొమ్ముతో విధ్వంసానికి కుట్ర!?

ఇటీవలి ఎన్నికలలో ఎదురైన ఘోర పరాజయాన్ని వైసీపీ అధినేత  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జీర్ణించుకోలేక పోతున్నాడు. త‌న రాజ్యాన్ని శ‌త్రువులు ఆక్ర‌మించుకున్నార‌న్న రీతిలో ఆయన వ్య‌వ‌హార‌శైలి ఉంది. ప్ర‌జాస్వామ్యంలో ఉన్నాం.. ప్ర‌జ‌లు మ‌న ఐదేళ్ల అరాచ‌క పాల‌న‌ను ఛీ కొట్టార‌ని జ‌గ‌న్ అంగీకరించలేకపోతున్నారు. తన రాజ్యాన్ని కబళించేశారన్న కక్షతో రగిలిపోతున్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉంది. అందుకు తగ్గట్టుగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి స‌ల‌హాలు ఇచ్చే నేత‌లు సైతం ఉండ‌టంతో ఆయ‌న‌ పిచ్చి ప‌రాకాష్ట‌కు చేరుతోంది. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి ప‌ నిండా రెండు నెల‌లుకాలేదు. అప్పుడే రాష్ట్రంలో ఏదో జ‌రిగిపోతుంద‌ని జ‌గ‌న్ గ‌గ్గోలు పెట్ట‌డం చూసి జనం న‌వ్వుకుంటున్నారు. సాధార‌ణంగా కొత్త‌గా ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే.. స‌ర్దుబాటు కావ‌టానికి క‌నీసం ఆరు నెల‌లు స‌మ‌యం ప‌డుతుంది. గ‌త ప్ర‌భుత్వంలో చేసిన అప్పులు, రాబ‌డి త‌దిత‌ర అంశాల‌పై అవ‌గాహ‌న‌కు రావ‌డంతో పాటు.. శాఖ‌ల వారిగా అధికారుల‌ను స‌ర్దుబాటు చేసుకోవ‌టం, పాలనపై ప‌ట్టు సాధించడం కోసం స‌మ‌యం ప‌డుతుంది.  కానీ, జ‌గ‌న్ తీరు చూస్తుంటే.. కుర్చీ నాది, దానిలో కూర్చోవ‌డానికి చంద్ర‌బాబు ఎవ‌రు అనే ఆక్రోశంతో, ఆవేశంతో ఉడికిపోతున్నట్లు కనిపిస్తోంది. వీలైనంత త్వ‌ర‌గా ఆ కుర్చీని లాక్కోవాల‌నే దుగ్ధతో  ఎంత‌కైనా తెగించేందుకు జ‌గ‌న్‌, ఆయ‌న టీం సిద్ధ‌మ‌వుతోంది. ఇందుకోసం నెల‌కు వంద కోట్లు ఖ‌ర్చు చేసేందుకు స‌న్న‌ద్ద‌మైన‌ట్లు వైసీపీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతుంది.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఐదేళ్ల పాల‌న‌లో అరాచ‌కాల‌కు హ‌ద్దు లేకుండా పోయింది. ఆయ‌న అనుచ‌రులు రాష్ట్ర‌ వ్యాప్తంగా పెద్ద మొత్తంలో దోపిడీకి పాల్ప‌డ్డారు. ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లపై అక్ర‌మ కేసులు పెట్టి చిత్ర హింస‌ల‌కు గురిచేశారు. ప్ర‌భుత్వం తీరును ప్ర‌శ్నించిన వారిని అక్ర‌మ కేసుల‌లో ఇరికించి మరీ జైళ్ల‌కు పంపించారు. మొత్తంగా చెప్పాలంటే జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో వైసీపీ నేత‌లు ఉన్మాదుల్లా వ్య‌వ‌హ‌రించారు. త‌మ‌ అరాచ‌క పాల‌న‌తో ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేసి మ‌రోసారి అధికారంలోకి రావాల‌న్న జ‌గ‌న్ వ్యూహాల‌కు జనం ఎన్నికలలో చెక్ పెట్టారు.  ప్ర‌జ‌లంతా ఏక‌మై వైసీపీని ఘోరంగా ఓడించారు. ఘోర ఓట‌మిని త‌ట్టుకోలేక జ‌గ‌న్ మాన‌సిక  ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌ని ఆయన  ఆంత‌రంగికులే చెబుతున్నారు. నెల‌న్న‌ర రోజుల్లో స‌రైన తిండి, నిద్ర లేక జ‌గ‌న్ బ‌రువు కూడా త‌గ్గారంటున్నారు. 2019లో జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి ప్ర‌భుత్వ భ‌వ‌నాలు కూల్చివేత‌లు, ప్ర‌తిప‌క్ష నేత‌ల అక్ర‌మ అరెస్టుల‌తో అరాచ‌క పాల‌న‌కు తెర‌లేపారు. ప్ర‌స్తుతం అధికారంలోకి వ‌చ్చిన కూట‌మి ప్ర‌భుత్వం ఎక్క‌డా ఘ‌ర్ష‌ణ‌లు త‌లెత్త‌కుండా, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జ‌రిగేలా ప్ర‌ణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. దీంతో ప్ర‌జ‌లు కూట‌మి ప్ర‌భుత్వం తీరుప‌ట్ల సంతోషంగా ఉన్నారు. నెల‌న్న‌ర వ్య‌వ‌ధిలోనే కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల ప్ర‌జల నుంచి వ‌స్తున్న మంచి స్పంద‌న‌ను చూసి జ‌గ‌న్ రగిలిపోతున్నారు. ఈ సానుకూల వాతావరణాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా  రాష్ట్రంలో అల్ల‌ర్ల‌కు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసిన‌ట్లు ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. సీఎం చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు   ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తి , పోల‌వ‌రం ప్రాజెక్టుల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించిన చంద్ర‌బాబు.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జ‌రిగేలా, కంపెనీలు ఏర్పాట‌య్యేలా ప్ర‌ణాళిక‌తో ముందుకెళ్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు ప్ర‌ముఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. కూట‌మి ప్ర‌భుత్వంలో ప్ర‌శాంత పాల‌నకు స‌హ‌క‌రిస్తే  రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు కంపెనీలు క్యూ క‌డ‌తాయ‌ని, త‌ద్వారా చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ కు మంచి పేరు వ‌స్తుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. అదే జ‌రిగితే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వైసీపీ ఉనికిమాత్రంగా కూడా మిగిలే అవకాశం లేదని   జ‌గ‌న్, ఆయ‌న వ‌ర్గీయులు ఆందోళ‌న చెందుతున్నారు. దీంతో రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం హ‌యాంలో అరాచ‌కాలు, హ‌త్య‌లు పెరిగిపోయాయ‌ని, 36 మంది వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను హ‌త్య‌లు చేశార‌ని జ‌గ‌న్ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి కూట‌మి ప్ర‌భుత్వం 50రోజుల పాల‌న‌లోనే రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు పూర్తిగా అదుపు త‌ప్పాయ‌ని, రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టాలంటూ జ‌గ‌న్ గ‌గ్గోలు పెట్టారు. ఢిల్లీలో ధ‌ర్నాకు కోట్లాది రూపాయ‌లు జ‌గ‌న్ ఖ‌ర్చు చేశారు.  కానీ, కూట‌మి పార్టీల నేత‌ల దాడుల వ‌ల్ల చ‌నిపోయిన 36 మంది వివ‌రాలు ఇవ్వాల‌ని కోరితే మాత్రం జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లు నీళ్లు నములుతున్నారు. కేవ‌లం రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు కంపెనీల ప్ర‌తినిధులు ముందుకు రాకుండా ఉండాల‌నే జ‌గ‌న్ ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నారని కూట‌మి పార్టీల నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.  రాబోయే కాలంలోనూ రాష్ట్రంలో ఘ‌ర్ష‌ణ‌లు సృష్టించేలా జ‌గ‌న్, ఆయ‌న బృందం ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్ర‌భుత్వం ప‌నిచేయ‌లేని ప‌రిస్థితి క‌ల్పించాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్ర‌మంలో అన్ని జిల్లాల్లో, అన్ని ప‌ట్ట‌ణ కేంద్రాల్లో ధ‌ర్నాలు, ప్ర‌ద‌ర్శ‌న‌లు, ఆందోళ‌న‌లు, అల్ల‌ర్ల‌తో రాష్ట్రం మొత్తం అశాంతి సృష్టించాల‌న్న‌ది వైసీపీ ప్లాన్ గా తెలుస్తోంది. ఇందుకోసం జ‌గ‌న్ నెల‌కు వంద కోట్లు ఖ‌ర్చుచేసేందుకు సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం. ఈ బాధ్య‌త‌ల‌ను మాజీ ఐఏఎస్ అధికారి ధ‌నుంజ‌య‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డికి అప్ప‌గించిన‌ట్లు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. వైసీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో ధ‌నుజ‌య రెడ్డి, మిథ‌న్ రెడ్డితోపాటు జ‌గ‌న్ కు ద‌గ్గ‌ర‌గా మెలిగిన వైసీపీ నేత‌లు వంద‌ల కోట్ల ప్ర‌జా సొమ్మును దోపిడీ చేశారు. ఆ సొమ్మును బ‌య‌ట‌కు తీసి జిల్లాల్లో అల్ల‌ర్లు సృష్టించేందుకు ఉప‌యోగించ‌బోతున్నార‌ని వైసీపీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి జ‌గ‌న్, ఆయ‌న బ్యాచ్ కుట్ర‌ల‌ను చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలోని కూట‌మి ప్ర‌భుత్వం ఏ విధంగా తిప్పికొడుతుంద‌నే అంశం ఆస‌క్తిక‌రంగా మారింది.

kesineni chinni welcome cbn

సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన ఎంపి కేశినేని చిన్ని

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు  ఢిల్లీ విమానాశ్రయంలో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. శనివారం (జులై 27) ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ భేటీలో  పాల్గొనేందుకు చంద్రబాబు  శుక్రవారం (జులై 26) సెక్రటేరియట్ నుంచి హెలికాప్టర్‌లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో చంద్రబాబుకు ఎంపీ కేశినేని చిన్ని స్వాగతం పలికారు.  కాగా నీతి ఆయోగ్  సమావేశంలో ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. ప్రధానంగా పోలవరం  కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి నీతి ఆయోగ్ ముందు ప్రతిపాదనలు ఉంచనున్నారు.

jagan waste press meet

జగన్ కుర్చీలో నల్లులు!

జగన్ పెట్టక పెట్టక శుక్రవారం నాడు తాడేపల్లి ప్యాలెస్‌ పక్కనే వున్న పార్టీ ఆఫీసులో ఒక ప్రెస్‌మీట్ పెట్టారు. ఆ ప్రెస్‌మీట్‌కి జర్నలిస్టులను ఆహ్వానించారు. కెమెరాలు మాత్రం వద్దన్నారు. ఎందుకంటే, జగనన్న ఏదేదో సొల్లు అంతా మాట్లాడతారు. ఆ ఫుటేజ్‌తో మీమర్లు, ట్రోలర్లు పండగ చేసుకుంటారు. అందుకని వేరే కెమెరాలేవీ వద్దు. మీరు మాత్రం రండి.. జగన్ చెప్పిందంతా విని వెళ్ళండి అని పిలిచారు. ప్రెస్‌మీట్‌లో జగన్ తాను చెప్పాలని అనుకున్న అబద్ధాలు రెండు గంటలపాటు చెప్పీ చెప్పీ బుర్ర తిన్నారు. ఆ వీడియో ఫుటేజ్‌ని చక్కగా ఎడిటింగ్ చేసి, ట్రిమ్మింగ్ చేసి, జగనన్న తడబాట్లు, పొరపాట్లు, అలవాట్లు, గ్రహపాట్లు,  అన్నీ తీసేసి మిగిలిన ఫుటేజ్‌ని మీడియాకి విడుదల చేశారు. ఎంత ట్రిమ్ చేసినా, ఆ ఫుటేజ్‌లో జగనన్నయ్య లీలలు లేకుండా వుంటాయా? ఇప్పుడు విడుదల చేసిన ఫుటేజ్‌లో కూడా ట్రోలర్స్.కి, మీమర్స్.కి కావలసినంత ఫుటేజ్ వుంది. తెలుగు పండిట్ జగన్ గారు కనిపెట్టిన కొత్తకొత్త తెలుగు పదాలు వున్నాయి. ఇంకా ఎన్నెన్నో వింతలు, విశేషాలు వున్నాయి. వీడియో సంగతి అలా వుంచితే, జగన్ మాట్లాడాల్సిందంతా అయిపోయింది. ఈలోపుగా ఈ జగన్ ఎప్పుడు సుత్తి ఆపుతాడా, ఎప్పుడు ప్రశ్నలు అడుగుదామా అని ఎదురు చూస్తున్న జర్నలిస్టులు తమ ప్రశ్నలను ఆయన మీద సంధించారు. ఇద్దరు జర్నలిస్టులు ప్రశ్నలు అడిగితే, జగన్ వాటికి చెప్పాల్సిన సమాధానం కాకుండా వేరే రకమైన సమాధానాలు చెప్పారు. చివరికి సదరు ప్రశ్నలు అడిగిన జర్నలిస్టులకు కూడా తాము ఏ ప్రశ్నలు అడిగామో కూడా మర్చిపోయే పరిస్థితిని జగన్ తెచ్చారు. ఇంతలో ఒక లేడీ జర్నలిస్టు ‘‘రెండు ప్రశ్నలు సర్’’ అని అడగటం ప్రారంభించగానే, జగన్ తన కుర్చీలో నల్లులు కుట్టినట్టుగా టక్కుమని లేచి నిల్చున్నారు. జగన్ లేచి నిల్చున్న తీరు చూసి, అక్కడున్న జర్నలిస్టులకి జగన్ని కుర్చీలో వున్న  నల్లులు బాగా కుట్టాయేమో అనిపించింది. కానీ ఆ తర్వాత జగన్ ఎక్స్.ప్రెషన్ చూసి నల్లులు కుట్టడం కాదు.. ఆయన మీడియా నుంచి పిల్లిలాగా పారిపోతున్నారని అర్థమైంది. చిట్టచివరికి, ఇంతకీ జగన్ తమని ఎందుకు పిలిచారో అర్థం కాని జర్నలిస్టులు బుర్రలు గోక్కుంటూ బయటపడ్డారు.

Honorary doctorate for articles on Chandrababu

చంద్రబాబుపై కథనాలకు గౌరవ డాక్టరేట్

చంద్రబాబునాయుడు  తీసుకున్న నిర్ణయాలు సైతం ఇప్పటికీ ఎప్పటికీ నిత్య నూతనంగానే ఉంటాయి.తాను రాసిన విశ్లేషణాత్ క కథనాలతో పాటు ఎన్నికల ముందు జనబాహుళ్యంలో అత్యంత ఆదరణ పొందిన చంద్రబాబు ఎక్స్ ఓ అనంత భావ జాలికుడు పుస్తకం లోని అంశాలు తనకు గౌరవం దక్కేందుకు దోహదపడ్డాయని  గుంటూరుకు చెందిన సీనియర్ పాత్రికేయుడు శాఖమూరు శ్రీనివాస ప్రసాద్ అన్నారు. ఆయన కు గౌరవ డాక్టరేట్ లభించింది.  అమెరికాలోని సౌత్ వెస్టర్న్ అమెరికన్ యూనివర్సిటీ జర్నలిజం విభాగానికి సంబంధించి ఈ డాక్టరేట్ అందజేసింది. ఢిల్లీలోని హోటల్ సామ్రాట్ లో  జరిగిన కార్యక్రమంలో కెనడా కాన్సులేట్ జనరల్ డాక్టర్ జానీష్ దర్బియా చేతుల మీదుగా ఈ డాక్టరేట్ అందుకున్నారు. కార్యక్రమంలో సౌత్ వెస్టర్న్ అమెరికన్ యూనివర్సిటీ ట్రస్టీ డాక్టర్ కె ఎల్ కంజు, ప్రఖ్యాత గజల్ గాయకురాలు పద్మశ్రీ పెనాజ్ మసానీ, నేపాల్ కాన్సులెట్ జనరల్ డాక్టర్ కే ఎల్ శర్మ, సీనియర్ జర్నలిస్టు అభిషేక్ తదితర ప్రముఖులతో పాటు, పారిశ్రామిక, వ్యాపార, సామాజిక సేవా రంగాలకు చెందిన పలువురు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై రాసిన విశ్లేషణాత్మక కథనాలు, చంద్రబాబు X.O -  అనంత భావజాలికుడు పుస్తకం ను పరిగణలోకి తీసుకొని తనకు ఈ పురస్కారాన్ని అందజేసినట్లు భావిస్తున్నాను అని శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. తనకు ఈ  గౌరవం లభించటానికి ఎపి రేరా మాజీ చైర్మన్ డాక్టర్ రామనాథ్ వెలమాటి మార్గదర్శనమే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. తనకు లభించిన ఈ గౌరవం డాక్టర్ రామనాథ్ కే దక్కుతుందని ఆయన చెప్పారు.

Kavitha as approver in liquor case

అప్రూవర్ బాటలో కవిత..!

కేసీఆర్ ముద్దుల కూతురు కవిత జీవితంలో తాను ఎదుర్కొంటానని ఎంతమాత్రం ఊహించని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కవిత మాత్రమే కాదు.. ఆమె ఇప్పుడున్న పరిస్థితి ఆమె శత్రువులు కూడా ఊహించనిది. తీహార్ జైల్లో ఇన్ని నెలలు వుండటం అనేది మామూలు విషయం కాదు. కవిత లాంటి మహిళ ఇన్ని నెలలపాటు జైల్లో వున్న తర్వాత ఎంత పేరు, ప్రఖ్యాతి వున్నా ఏం లాభం.. ఎన్ని కోట్లు సంపాదించినా ఏం లాభం? తాజా పరిస్థితులనుబట్టి ఆగస్టు 8 వరకు కవిత ఖాయంగా జైల్లోనే వుంటారు. ఆ తర్వాత కస్టడీ మళ్ళీ పొడిగించే అవకాశాలు కూడా వున్నాయి.  ఇంతకాలం యువరాణిలా, మహారాణిలా ఒక వెలుగు వెలిగిన కవిత తీహార్ జైల్లోని పరిస్థితులను తట్టుకోలేకపోతున్నారు. జైల్లో పడ్డానన్న డిప్రెషన్‌తోపాటు అక్కడి ఆహారం, దోమలు, చుట్టుపక్కల వున్న పరిస్థితులు కవితని పూర్తిగా క్రుంగదీశాయి. దాంతో ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆస్పత్రికి కూడా వెళ్ళి, చికిత్స తరవాత తిరిగి జైలుకు రావాల్సి వచ్చింది. కవిత అనారోగ్య పరిస్థితిని చూసి అయినా ఆమెకి బెయిల్ లభిస్తుందని ఆమె కుటుంబ సభ్యులు ఆశించారు. కానీ, చట్టం ఆమె చేసిన నేరం గురించే ఆలోచిస్తోంది తప్ప, ఆమె ఆరోగ్యం గురించి కాదు. కస్టడీని పొడిగించుకుంటూనే వెళ్తోంది. కవిత భర్త దేవనపల్లి అనిల్ కుమార్ ఢిల్లీలోనే మకాం వేసి కవితకి సంబంధించిన అన్ని వ్యవహారాలనూ చూసుకుంటున్నారు. కవిత ఆస్పత్రిలో చేర్చినప్పుడు ఆమె పరిస్థితిని చూసి అనిల్ కుమార్ కన్నీరు పెట్టుకున్నారని సమాచారం. ఆ సమయంలో భార్యాభర్తలు మాట్లాడుకునే అవకాశం దొరికినప్పుడు, తాను ఈ నరకం ఇక భరించలేనని, అప్రూవర్ అయిపోతానని, ఆ దిశగా ప్రయత్నాలు చేయమని కవిత భర్తని రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కవిత అప్రూవర్ అవడం అంటే, నేను మద్యం కుంభకోణానికి పాల్పడ్డాను... విచారణకు పూర్తిగా సహకరిస్తాను అని నేరాన్ని పూర్తిగా ఒప్పుకోవడం. ఇదే కుంభకోణంలో భాగస్వాములుగా వున్న కొంతమంది అప్రూవర్లుగా మారి హ్యాపీగా బయట తమ పనులు తాము చేసుకుంటున్నారు. అప్రూవర్‌గా మారడం అందరి విషయం వేరే.. కవిత విషయంలో మాత్రం వేరేగా వుంటుంది. కవిత అప్రూవర్‌గా మారితే, అది బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తునే భస్మీపటలం చేసేస్తుంది. ఇప్పటికే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్‌కి మానసికంగా చాలా దూరమైపోయారు. కవితగనుక అప్రూవర్‌గా మారడం అంటూ జరిగితే, ఇక బీఆర్ఎస్ అన్నా, కేసీఆర్ కుటుంబం అన్నా తెలంగాణ సమాజం పట్టించుకోదు.  కవిత భర్త అనిల్ కుమార్ కవిత అప్రూవర్ అవుతానని అంటున్నట్టు కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చినప్పుడు వాళ్ళ నుంచి ఇదే ప్రతిస్పందన ఎదురైనట్టు తెలుస్తోంది. కవిత దారిన కవిత అప్రూవర్ అయిపోతే ఇక తమ పార్టీకి, తమ కుటుంబానికి తెలంగాణలో ఎంతమాత్రం విలువ వుండదని, కాబట్టి కవిత ఆలోచన కరెక్ట్ కాదని కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు వ్యతిరేకించినట్టు సమాచారం. అలా అయితే కవితను జైల్లోంచి బయటకి తెచ్చే మార్గమేదైనా మీ దగ్గర వుందా అని అనిల్ కుమార్ అడిగితే, వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానం రానట్టు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా కవితను జైల్లోంచి బయటకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేయకపోతే కవితకు అప్రూవర్ అవడం తప్ప వేరే మార్గం లేదని అనిల్ కుమార్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

jagan debts in 5 years

ఐదేళ్లలో జగన్ చేసిన అప్పు అక్షరాలా 6 లక్షల 86 వేల 955 కోట్లు!

మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో అక్షరాలా ఆరులక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఔను తన ఆర్థిక అరాచకత్వంతో జగన్ రాష్ట్రాన్ని దివాళా అంచుకు చేర్చేశారు. 2019మార్చి 31 నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు 3లక్షల 75 వేల 975 కోట్ల రూపాయలు కాగా, 2019 మే లో జగన్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టింది. ఎన్నికలలో పరాజయం పాలై గద్దె దిగే సమయానికి రాష్ట్ర అప్పులు 9 లక్షల 74 వేల 556 కోట్ల రూపాయలు. అంటే ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం అక్షరాలా 6 లక్షల 86 వేల 955 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. వీటిలో ప్రభుత్వం నేరుగా చేసిన అప్పు రూ.4,38,278లు కాగా, కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పు 2,48,677 రూపాయలు. అసెంబ్లీ  వేదికగా  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం (జులై26) విడుదల చేసిన శ్వేతపత్రం వెల్లడించిన గణాంకాలివి. ఈ సందర్భంగా చంద్రబాబు.. అప్పుల పద్దు ఇంకా ఎక్కువే ఉండొచ్చన్నారు. ఇంకా వెలుగులోకి రావాల్సిన అప్పులు చాలా ఉన్నాయన్నారు. జగన్ నిర్వాకం కారణంగా  పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం కారణంగా 52 వేల 900 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లింది. ఈ 52, 900 కోట్ల రూపాయల నష్టంలో 45 వేల కోట్లు ఆయకట్టకు నీటి సరఫరాలో జాప్యం వల్ల వాటిల్లిందనీ, 4900 కోట్ల రూపాయలు ప్రాజెక్టుకు జరిగిన డ్యామేజీ, రిపేర్ల వల్ల వాటిల్లింది. జల విద్యుత్ ఉత్పత్తిలో జాప్యం వల్ల 3వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. శ్వేతపత్రం ద్వారా ఈ వివరాలన్నీ వెల్లడించిన చంద్రబాబు.. ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయకుండా ఉండి ఉంటే.. ప్రభుత్వానికి జీఎస్పీపీ కాంట్రిబ్యూషన్ ద్వారా 52వేల 900 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చి ఉండేదన్నారు. అమరావతి పనుల నిలుపు దల వల్ల ప్రభుత్వానికి రెండు నుంచి మూడు లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని వివరించారు. 

Obama support for Kamala Harris

కమలా.. కుమ్మేయ్!

అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రటిక్ పార్టీ తరఫున అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ పేరు ఖరారు అయ్యే దశలో వున్న నేపథ్యంలో, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా నుంచి ఆమెకు మద్దతు లభించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి అధ్యక్ష పదవికి పోటీ నుంచి తప్పుకోవడంతో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పేరు ముందుకు వచ్చింది. అయితే బరాక్ ఒబామా మొదటి నుంచి కమలా హ్యారిస్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. తన భార్య మిచెల్ ఒబామాను అధ్యక్ష పదవికి అభ్యర్థిగా బరిలోకి దించడానికి శతవిధాలా ప్రయత్నించారు. అయితే డెమోక్రటిక్ పార్టీలో కమలా హ్యారిస్‌కే ఎక్కువ మద్దతు లభిస్తూ వుండటంతో ఒబామా ఫ్యామిలీకి కూడా కమలా హ్యారీస్‌కి మద్దతు ప్రకటించక తప్పలేదు.

visakha mortigaged during jagan tenure

తాకట్టులో విశాఖ నగరం!

మాజీ ముఖ్యమంత్రి చెప్పేదొకటి చేసేదొకటి అనడానికి విశాఖ నగరమే ఒక ఉదాహరణ. రాజధాని రాజధాని అంటూ జగన్ విశాఖపట్నాన్ని తాకట్టు పెట్టేసి కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఔను మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా పేర్కొంటూ ఐదేళ్లు గడిపేశారు. మూడు రాజధానులు అంటూ అమరావతిని నిర్వీర్యం చేయడం వినా ఆయన చేసిందేమీ లేదు. అయినా విశాఖ రాజధాని అంటూ ఉత్తరాంధ్రప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపడానికి శతథా ప్రయత్నించారు.అయినా ఐదేళ్లలో ఆ దిశగా ఒక్కటంటే ఒక్క ఇటుక కూడా పేర్చిన పాపాన పోలేదు. విశాఖ రాజధాని అంటూ రుషికొండకు గుండు కొట్టేసి..  వందల కోట్ల రూపాయలతో విలాసవంతమైన భవనాలను ప్రభుత్వ సొమ్ముతో సొంతానికి నిర్మించుకున్నారు. సరే ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత విశాఖ రాజధాని పేరిట జగన్ పాల్పడిన ఆర్థిక అరాచకత్వం వెలుగులోకి వస్తోంది.  అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం (జులై 26) విడుదల చేసిన శ్వేత పత్రంలో రాజధాని అంటూ కబుర్లు చెబుతూ నగరంలోని ఆస్తులను తాకట్టు పెట్టేసి 1,941 కోట్ల రూపాయలు రుణాలను దండుకొన్నట్లు వెలుగులోకి వచ్చింది. గతంలో ఎప్పుడు తరిమెల నాగిరెడ్డి తాకట్టులో భారత దేశం అనే పుస్తకం రాశారు. ఇప్పుడు జగన్ విశాఖ నగరాన్నే తాకట్టు పెట్టేశారు. విశాఖ నగరంలో పలు ప్రభుత్వ ఆస్తులను జగన్ అప్పుల కోసం తాకట్టు పెట్టేశారు. అలా తాకట్టు పెట్టిన వాటిలో  ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజి, పోలీసు క్వార్టర్లు, ట్రెయినింగ్ అండ్ ప్రొడక్షన్ సెంటర్ ఫర్ డిసెబుల్ వెల్ఫేర్, ఈఈ బంగ్లా, ఆర్ అండ్ బీ క్వార్టర్లు, రైతు బజార్, సర్క్యూట్ హౌస్, పీడ్బ్ల్యూడీ కార్యాలయం సీతమ్మధార తహసిల్దార్ కా ర్యాలయంవంటివి ఉన్నాయి. ఇవన్నీ నగరం నడిబొడ్డులో ఉన్నాయి. చివరాఖరికి రైతు బజారును  కూడా జగన్ సర్కార్ తాకట్టు పెట్టేసింది. రాజధాని విశాఖ అని జగన్ ఎంతగా నమ్మబలికినా విశాఖ జనం విశ్వసించలేదు. అందుకే ఇటీవలి ఎన్నికలలో విశాఖలో జగన్ పార్టీ ఒక్కటంటే ఒక్కస్థానం కూడా గెలుచుకోలేకపోయింది. విశాఖ నగర పరిధిలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ ఆ పార్టీ అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు. విశాఖ పార్లమెంటు స్థానాన్ని కూడా వైసీపీ భారీ తేడాతో చేజార్చుకుంది.  

దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ళ సూత్రధారి మృతి

దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ళ సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52) మరణించాడు. చర్లపల్లి జైలులో వున్న మక్బూల్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతనికి నెల క్రితం గుండె ఆపరేషన్ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మూత్రపిండాలు కూడా విఫలం కావడంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దేశవ్యాప్తంగా జరిగిన పలు బాంబు పేలుళ్ళలో మక్బూల్ హస్తం వున్నట్టు ఎన్ఐఏ గుర్తించింది. దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ళ కేసులో మక్బూల్‌కి ఢిల్లీ కోర్టు జీవితఖైదు విధించింది. ఆరు నెలల క్రితం మక్బూల్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ట్రాన్సిట్ వారంట్ మీద హైదరాబాద్‌కి తీసుకొచ్చారు. 21 ఫిబ్రవరి, 2013న దిల్‌సుఖ్‌నగర్‌లో రద్దీగా వుండే ప్రాంతంలో మక్బూల్ బాంబులు పేల్చాడు. ఆ పేలుళ్ళలో 17 మంది మరణించారు.

నితి ఆయోగ్ ముందు పోలవరం.. బాబు అజెండా ఇదే!

పోలవరం జాతీయ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ప్రతి పైసా కేంద్రమే భరించాలి. అలా భరిస్తామని కేంద్ర విత్తమంత్రి నిర్మలాసీతారామన్ ఇటీవలి తన బడ్జెట్ ప్రసంగంలో విస్పష్టంగా చెప్పారు కూడా. పోలవరం పూర్తికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. అయితే పోలవరం కు ఈ బడ్జెట్ లో కేటాయింపు ఎంత అన్నది ఆమె అంకెల్లో చెప్పలేదు. దీంతో పోలవరం పూర్తి అవ్వడానికి ఎంత కావాలి. ఎంత సమయం పడుతుంది అన్న విషయంలో పలు సందేహాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి.  ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, పోలవరంలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పనులను పరుగులెత్తించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, వ్యయం, సమయం వంటి అంశాలపై శనివారం(జులై27) జరిగే నీతి అయోగ్ సమావేశంలోనే చర్చకు తీసుకురావాలని నిర్ణయించారు. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం, పోలవరం ఎత్తు అంశాలపై నీతి అయోగ్ సమావేశంలో లేవనెత్తి పోలవరం విషయంలో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా సానుకూల వాతావరణం ఏర్పడేలా చేసుకోవాలని బావిస్తున్నారు. పోలవరం ఎత్తుపై తెలంగాణ వ్యక్తం చేసిన అభ్యంతరాలను వీటో చేయడానికి నీతి అయోగ్ సమావేశమే సరైన వేదికగా భావిస్తున్నారు.  ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం ఎత్తుతగ్గించే ప్రశక్తే లేదన్న స్టాండ్ కు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కొత్త డయాఫ్రం వాల్ కు బదులుగా రింగ్ ఫెన్సింగ్ నిర్మాణం అంటూ తొలుత విదేశీ నిపుణులు ప్రాథమిక నివేదిక ఇచ్చినా, తరువాత సవరించి కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణమే శరణ్యమని పేర్కొన్నారు. ఈ విషయంలో కూడా ఎటువంటి ద్వైదీ భావం లేకుండా కొత్త డయాఫ్రం వాల్ నిర్దుష్ట కాలపరిమితిలో నిర్మించే విషయంలో కూడా నీతి అయోగ్ సమావేశంలో ఒక స్పష్టత  వచ్చేలా చంద్రబాబు చర్చించనున్నారు.   

నేటి నుంచే ప్యారిస్ ఒలింపిక్స్!

ఫ్యాషన్‌కి పుట్టిల్లు అయిన ప్యారిస్ నగరంలో నేటి నుంచి ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. విశ్వక్రీడలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్యారిస్ నగరం సిద్ధమైంది. కరోనా మహమ్మారి ముప్పు తొలగిన తర్వాత నిర్వహిస్తున్న మెగా ఈవెంట్‌ ఇది. క్రీడా ప్రపంచానికి చిరకాలం గుర్తుండి పోయే విధంగా అత్యంత వైభవంగా ఆరంభ వేడుకలను నదిలో నిర్వహించాలని ఫ్రెంచ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచంలో నెలకొన్న యుద్ధ వాతావరణం, తీవ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో అత్యంత భారీ భద్రతా ఏర్పాట్లతో ఒలింపిక్స్ వేడుకలు జరగనున్నాయి. దాదాపు 45 వేల మంది రక్షణ బలగాలను వినియోగించనున్నారు. ఫ్రాన్స్‌ దేశం ఒలింపిక్స్.కిఆతిథ్యమివ్వడం ఇది మూడోసారి. తొలిసారి 1900 సంవత్సరంలో, రెండోసారిగా 1924లోజరిగాయి. ఇప్పుడు సరిగ్గా వందేళ్ళ తర్వాత ఫ్రాన్స్ ఒలింపిక్స్ నిర్వహిస్తోంది. అమెరికా (4సార్లు), బ్రిటన్‌ (3సార్లు) తర్వాత అత్యధికంగా ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తున్న దేశంగా ఫ్రాన్స్‌ రికార్డులకెక్కనుంది. మొత్తమ్మీద 206 దేశాల నుంచి 10,500 మంది క్రీడాకారులు  ఈ క్రీడల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

జగన్ సరికొత్త కానుక ‘కాస్కారం’!

గిట్టనివాళ్ళు వైసీపీ ఎమ్మెల్యే జగన్‌ని ‘నత్తి పకోడీ’ అంటూ వుంటారుగానీ, నిజానికి ఆయన ఒక గొప్ప భాషా శాస్త్రవేత్త. ఆయన ఎప్పటికప్పుడు కొత్తకొత్త పదాలను తెలుగు భాషకు, తెలుగు జాతికి అందిస్తూ వుంటారు. ఆ విధంగా ‘జగన్ తెలుగు నిఘంటువు’లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త తెలుగు పదాలు చేరుతూ, తెలుగు భాషను సుసంపన్నం చేస్తూ వుంటాయి. తాజాగా, శుక్రవారం నాడు ఆయన ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఎవరూ కెమెరాలతో రావద్దు, చేతులు ఊపుకుంటూ రండి, మేం ఇచ్చే ఫుటేజ్ తీసుకెళ్ళండని ముందే ‘హెచ్చరిక’ జారీ చేశారు. సరే, ఆ విషయం అలా వుంచితే, ఈ ప్రెస్‌మీట్లో జగన్ మరో కొత్త పదాన్ని తెలుగు భాషకి అందించారు. ఆ పదం ఏమిటంటే, ‘కాస్కారం’. జగన్ మాట్లాడుతూ ‘కాస్కారం’ అన్నప్పుడు, అక్కడ వున్న జర్నలిస్టులకు అర్థంకాక జుట్టు పీక్కున్నంత పని చేశారు. ఆలోచించగా, ఆలోచించగా అర్థమైంది ఏమిటంటే, జగన్ ‘తాత్సారం’ అనే మాటని ‘కాస్కారం’ అని అందంగా పలికారన్నమాట.. అసలు పదాన్ని మరోరకంగా మలిచారన్నమాట అని జర్నలిస్టులకు అర్థమైంది.