మెడలో మిర్చి దండలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన

తెలంగాణ శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న నిరసన చేపట్టారు. రాష్ట్రంలో మిర్చి రైతుల సమస్యల పరిష్కారంలో రేవంత్  సర్కార్ విఫలమైందని ఆరోపిస్తూ మెడలో మిర్చి దండలు వేసుకుని నిరసనకు దిగారు. వెంటనే మిర్చి రైతుల సమస్యలను పరిష్కరించాలనీ, మిర్చికి   పాతివేలు గిట్టుబాటు ధర చెల్పించాలని డిమాండ్ చేశారు.   రాష్ట్రంలో గత సీజన్ లో 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగు జరిగిందనీ, అయితే  గిట్టుబాటు ధర లేకపోవడంతో ఈ సీజన్ లో మిర్చి సాగు 2లక్షల 40 వేల ఎకరాలకు పడిపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పేర్కొన్నారు.  ప్రభుత్వం తక్షణం స్పందించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మిర్చికి కనీసం క్వింటాల్ కు పాతిక వేలు ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు.   రాష్ట్రంలో మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలని, అలాగే మిర్చిని సుగంధ ద్రవ్యాల జాబితా నుంచి ఆహార ధాన్యాల జాబితాలోకి మార్చాలని కోరారు.  

ఇరాన్ లో బ్లడ్ రెయిన్ కు  కారణమిదే 

ఇరాన్ లో ఇటీవలె బ్లడ్ రెయిన్ కురిసినట్టు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు నిగ్గు తేల్చారు.  స్వచ్చమైన నీరు రంగు రుచి వాసన ఉండదు. ఈ మూడు లేనిదే స్వచ్చమైన నీరు అని  మనం అభివర్ణిస్తుంటాం.  కానీ ఇరాన్ లో బ్లడ్ రెయిన్ వార్త ప్రపంచాన్ని ఆకర్షించింది. సాధారణంగా వర్షపు నీరు స్వచ్చంగా ఉంటుంది.  కానీ ఇరాన్ లోని రెయిన్ బో ఐ ల్యాండ్ లో కురిసిన వర్షం నీరు ఎర్రటి రంగులో ప్రవహించి సముద్రంలో కలిసిపోయింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ వార్త  టాప్ టెన్ లోకి వెళ్లిపోయింది. ఈ ఘటనపై శాస్త్రవేత్తలు లోతుగా పరిశోధించారు. ఇరాన్ రెయిన్ బో ఐ ల్యాండ్ లో  కురిసిన వర్షానికి ఎలాంటి రంగులేదని పరిశోధకులు తేల్చేశారు. ప్రపంచంలోని ఏడో వింత అని వచ్చిన వార్తలను కొట్టిపారేశారు. తాజాగా రెయిన్ బో ఐ ల్యాండ్ లో కురిసిన వర్షాన్నిఅక్కడి జనం ఎంజాయ్ చేశారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూడటానికి ప్రపంచనలుమూలల నుంచి అక్కడికి చేరుకున్నారు. బ్లడ్ రెయిన్ వార్త తెలుసుకుని ఇరాన్ బీచ్ లో ప్రత్యక్ష మయ్యారు. ఇరాన్ లో రెయిన్ బో ఐల్యాండ్ లో  ఆకాశం నుంచి వర్షపు నీరు పడి జలపాతంలా క్రిందకు దూకడంతో అద్భుతమైన దృశ్యం పలువురిని ఆకర్షించింది. రెయిన్ బో ఐ ల్యాండ్ లో అగ్ని పర్వతం ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ పర్వతం బద్దలు కావడంతో ఆ ప్రాంతమంతా ఐరన్  ఆక్సైట్  కంటెంట్ తో నిండిపోయింది. వర్షం పడినప్పుడు చిలుముతో నిండిన ఐరన్ మీద వర్షపునీరు పడటంతో అది ఎర్రగా మారిపోయి ప్రవహించింది.  ఎర్రటి రంగులో ఈ నీరు ప్రవహించడంతో బ్లడ్ రెయిన్ అనే ప్రచారం జరిగింది. 

20 నుంచి కేటీఆర్ జిల్లాల పర్యటన

బీఆర్ఎస్ రాష్ట్రంలో మళ్లీ పట్టు సాధించాలన్న పట్టుదలతో అడుగులు వేస్తున్నది. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్క్భాన్ని ఇందుకు ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు జిల్లాల పర్యటనకు సమాయత్తమౌతున్నారు. ఈ నెల 20 నుంచి కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పర్యటించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి రోడ్ మ్యాప్ ఖరారైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  దీనిలో  భాగంగా కేటీఆర్ అన్ని జిల్లాలలో పార్టీ ముఖ్యనాయకులు,   కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు. ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్‌లో పార్టీ సీనియర్ నేతలు ప్రజాప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం జరిగిన విషయం తెలిసిందే. అదే విధంగా త్వరలో వరంగల్‌లో లక్షలాది మందితో పార్టీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. 

బీజేపీ ఎంపీ డీకే అరుణ నివాసంలో అగంతకుడి హల్ చల్.. దొంగేనా?

బీజేపీ ఎంపీ, మాజీ మంతరి డీకే అరుఏణ ఇంట్లోకి అగంతకుడు జొరబడటం ఇప్పుడు సంచలనం సృష్టించింది. మామూలుగా ఇళ్లల్లో దొంగలు పడటం, పోలీసులకు ఫిర్యుదు అందగానే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం మామూలు విషయమే. కానీ ప్రజాప్రతినిథి నివాసంలోకి, అదీ ఎంపీ, మాజీ మంత్రి డీకే అరుణ నివాసంలోకి సోమవారం అర్ధరాత్రి (మార్చి 16) అగంతకుడు జొరబడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చోరీ కోసం వచ్చిన ఆ అగంతకుడు దాదాపు గంటన్నర పాటు డీకే అరుణ నివాసంలోనే తచ్చాడాడు. అంతే కాకుండా డీకే అరుణ నివాసంలోని సీసీ కెమోరా వైర్ ను కూడా తొలగించాడు.  దీనిపై డీకే అరుణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ఆ అగంతకుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.  తన ఇంట్లోకి  అగంతకుడుజొరబడటం వెనుక కుట్ర ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. విషయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తనకు భద్రత పెంచాలని డిమాండ్ చేశారు. ఇలా ఉండగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు ఎంపీ డీకే అరుణతో ఫోన్ లో మాట్లాడి.. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.  భద్రత పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై విచారణ వేగవంతం చేసి వాస్తవాలు తేల్చాలని పోలీసులను ఆదేశించారు.  

నోరు జారిన నేరానికి...!

కాలు జారితే, వెనక్కి తీసుకోవచ్చును, కానీ, నోరు జారితే వెనక్కి తీసుకోలేము. ఒక్కొక్క సారి, నోరు జారిన నేరానికి, భారీ మూల్యమే చెల్లించుకోవలసివస్తుంది, ఉత్తరాఖండ్’ ఆర్ధిక, శాసనసభ వ్యవహారాల మంత్రి, ప్రేమ్ చంద్ అగ్రవాల్ విషయంలో అదే జరగింది. అవును. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో,ఆయన,రాష్ట్రమంటే కేవలం’ పహాడీలు’ (గిరిజనులు) మాత్రమే కాదు,అంటూ గిరిజనుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఆతర్వాత ఆయన, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  లాగా చాలా చాలా వివరణ ఇచ్చుకున్నారు. అయినా కొంచెం ఆలస్యంగానే అయినా, రాజీనామా చేయక తప్పలేదు. ఆదివారం (మార్చి 16) ఆయన మంత్రి పదవికి రాజీనామా  చేశారు.  ఇలా తెలిసీ, తెలియకో, కొండకచో  నోటి తీటతో నోరు జారి, చిక్కుల్లో చిక్కుకున్న పెద్దలు, చిన్నలు చాలామందే ఉన్నారు. ఆ మధ్యన శ్యాం పిట్రోడా అనే కాంగ్రెస్ పెద్దాయన, లోక్ సభ ఎన్నికల ప్రచారం జోరు మీదున్న సమయంలో, చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేశాయి. శ్యాం పిట్రోడా ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో ఏమో కానీ..  దేశం తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా, పశ్చిమ వాసులు అరబ్బుల్లా, ఉత్తరాది వారు శ్వేత జాతీయులుగా, చివరగా దక్షిణాది ప్రజలు అఫ్రికన్స్’లా ఉంటారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పటికే వారసత్వ సంపద గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అందుకు ఆయన మూల్యం చెల్లించారు. ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఎన్నికల క్రతువు ముగిసిన తర్వాత  కాంగ్రెస్ పార్టీ  ఆయన్ని మళ్ళీ అదే పదవిలో కుర్చోపెట్టిందనుకోండి అది వేరే విషయం.  అలాగే, 2019 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కాయిన్’ చేసిన చోకీదార్ చోర్  నినాదం ఆయన్ను రాజకీయంగానే కాదు, చట్టపరంగానూ చిక్కుల్లోకి నెట్టింది. రాహుల్ గాంధీ ప్రధాని మోదీని దేశం ముందు దొంగగా చూపించేందుకు తమ ఆరోపణను, అభిప్రయాన్ని కోర్టుకు అపాందించారు. కోర్టు చేయని వ్యాఖ్యలను చేసినట్లు ప్రచారం సాగించారు. న్యాయస్థానం ఆగ్రహానికి గురయ్యారు.  ఒకసారి కాదు రెండు సార్లు సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పారు. రాహుల్ గాంధీ ఇలా నోరు జారిన నేరానికి, ఆయన చెల్లించిన మూల్యం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరసగా రెండవసారి రెండు అంకెలకు పరిమితం అయింది. పార్టీ ఓటమికి నైతిక బాద్యత వహిస్తూ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇలా ఒకరిద్దరు కాదు, నోటి తీటా రాజకీయ నేతల చిట్టా చాలా వుంది. ఎక్కడి దాకానో ఎందుకు, మొన్నటి 2024 ఎన్నికలకు ముందు  బీజేపీ అధ్యక్షుడు, జేపీ నడ్డా  బీజేపీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్,(ఆర్ఎస్ఎస్) అవసరం తమకు లేదంటూ చేసిన వ్యాఖ్యలు, ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపాయో, చెప్ప నక్కర లేదు. సరే  ఆ తర్వాత బీజేపీ దిద్దుబాటు చర్యలు తీసుకుని,ఇటీవల జరిగిన, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ సహా మూడు రాష్ట్రాల్లో విజయం సాధించింది. అలాగే, హర్యానా, గుజరాత్ సహా ఐదారు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో క్లీన్  స్వీప్ చేసింది.   అలాగే కేంద్ర హోం మంత్రి అమిత షా రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్’ గురించి రాజస్య సభలోచేసిన వివాదస్పద వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని రేపాయో చెప్పనవసరం లేదు. రాజ్యాంగ వజ్రోత్సవాలను పురస్కరించుకుని  రాజ్య సభలో చేపట్టిన ప్రత్యేక చర్చకు సమాధానం ఇస్తూ అమిత్ షా ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి, అంబేద్కర్, అంబేద్కర అనడం వాళ్ళకు ఒక ఫాషన్ అయి పోయింది. అంబేద్కర్ పేరు ఉచ్చరించినన్ని  సార్లు భగవత్ నామ స్మరణ చేస్తే కనీసం ఏడు జన్మల పాటు స్వర్గమైనా దక్కేది  అంటూ చేసిన వ్యాఖ్యలు, పార్లమెంట్ లోపలా వెలుపలా ప్రకంపనలు సృష్టించాయి. ఎంతో దుమారాన్ని రేపాయి. విపక్షాలు హోం మంత్రి రాజీనామాకు డిమాండ్ చేశాయి. ఆయన్ని బర్తరఫ్ చేయాలని పట్టు పట్టాయి.  పార్లమెంట్ ప్రాంగణంలో ఇంతవరకు ఎప్పుడూ చూడని నిరంతర నిరసన ప్రదర్శనలు, తోపులాటలు, తొక్కిసలాటలు, గౌరవ  ఎంపీలు గాయాలతో ఆసుపత్రుల పాలుగావడం వంటి    తతంగం చాలా చాలా జరిగింది. ఇంచుమించుగా వారం రోజులకు పైగానే, పార్లమెంట్ సమావేశాలు, ఆ దుమారంలో కొట్టుకు పోయాయి. అమిత షా రాజీనామా చేయలేదు, ప్రధానమంత్రి ఆయనని  బర్త్ రఫ్  చేయలేదు కానీ  రాజ్యాంగ వజ్రోత్సవాలను ఘనంగా  నిర్వహించి క్రెడిట్ కొట్టాయాలని చూసిన బీజేపీ లక్ష్యం మాత్రం నెరవేర లేదు. పార్టీ ఇమేజ్  పక్కకు వాలింది. దేశీయంగానే కాదు అంతర్జాతీయంగానూ భారత ప్రజాస్వామ్య వ్యవస్థ  బోనులో నిలబడింది.  ఇక మన దగ్గరకు వస్తే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నేతల దురుసు తనానికి హద్దులే లేవు. అది రుజువైన వాస్తవం. ఆంధ్ర ప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళ పాలనలో  ముఖ్యమంత్రి సహా మంత్రులు, భాష విషయంలో ఎంతగా దిగ జారారో,ఎంతగా నోటిని పారేసుకున్నారో,  ఎన్నెన్ని బూతు నిఘంటువులు సృష్టించారో వేరే చెప్ప నక్కరలేదు. అలాగే అందుకు  వైసీపీ చెల్లించిన మూల్యం గురించి కూడా చెప్ప నవసరం లేదు.   ఇక ఇప్పడుతాజాగ , ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నేతలు నోరు జారి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్’ గురించి చేసిన, స్టేచర్  - స్ట్రెచర్ - మార్చురీ  వ్యాఖ్యలు.. దానికి అనుబంధంగా ఇచ్చిన వివరణ, కొనసాగింపుగా  సోషల్ మీడియా విశృంఘలత్వం పై విరుచుకు పడుతూ,  బట్టలు ఊడదీసి... అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపధ్యంలో గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర బీఆర్ఎస్ నాయకులు, నోరు జారిన  రోత మాటలు,మళ్ళీ మళ్ళీ తెర మీదకు వస్తున్నాయి.  దీంతో ఇప్పటికే ఓ వంక అంతర్గత రాజకీయ సంక్షోభం, మరో వంక ఆర్థిక సంక్షోభంతో పీకల లోతు కష్టాల్లో కూరుకుపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరిన్ని కష్టాలను ఎదుర్కొంటోంది. ఈ రోజు కాక పోయినా రేపు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం  ప్లస్ అండ్ మైనస్  లెక్కల బాలన్స్ షీట్ స్క్రూటినీకి వచ్చినప్పడు, ఆయన  ఖాయంగా మూల్యం చెల్లించవలసి రావచ్చును.    అలాగే ఆంధ్ర అప్రదేశ్  లోనూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జన సేన అధినేత పవన్ కళ్యాణ్’, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ నాగ బాబు పిఠాపురం వేదికగా జరిగిన జనసేన ఆవిర్భావ సభలో  చేసిన వివాదస్పద వ్యాఖ్యలు కూటమిలో కుంపట్లు పెట్టాయి. అనుభవ రాహిత్యంతో పాటు అజ్ఞానం తోడైన అహంకారంతో  అన్నదమ్ములు చేసిన వ్యాఖ్యలు కూటమిలో కుంపట్లు రాజేసాయి. ఇంతవరకు సజావుగా సాగుతున్న కుటుంబంలో చిచ్చు పెట్టాయి. సినిమాల్లో  డూప్  లు చేసిన ఫైట్లు చూసి  హీరోలే ఫైట్  చేశారని  అభిమానులు ఈలలు వేస్తారు. చప్పట్లు కొడతారు. హీరోలకు తాము జీరోలమని తెలుసు. అయినా  విజయోత్సవ వేడుకల్లో వేదికలు ఎక్కి  చేతులు ఊపుతారు. సక్సెస్  సొంతం చేసుకుంటారు.  అలా  తమను తాము మోసం చేసుకుంటూ, అభిమానులను మోసం చేస్తారు. రాజకీయాల్లోనూ అదే  హీరోయిజం’ చుపిస్తామంటే కుదరదు.  కానీ  కొణిదెల సోదరులు  పిఠాపురంలో  కూటమి గెలుపును తమ ఖాతాలో వేసుకుని  హీరో ఫోజులు ఇచ్చే విఫల ప్రయత్నం చేశారు. బండి కింద నడిచి వెళ్లే కుక్క పిల్ల బండి భారం మొత్తం తానే మోస్తున్నానని ఫీల్  అవుతుందంటే అర్థం చేసుకోవచ్చును, కానీ  వారనే కాదు,  రాజకీయ నాయకులు ఎవరైనా అదే ఫీలింగ్  లో ఉంటే, ఆ వైభోగం అట్టే కాలం నిలవదు. సంకీర్ణ  రాజకీయాల్లో చేయి చేయి కలిస్తేనే చప్పట్లు... లేదంటే చిత్కారాలు చీవాట్లు తప్పవు. అందుకే, నోటి తీట పొట్టకు చేటని  అంటారు.

హైదరాబాద్ ను తలదన్నేలా అమరావతి ఓఆర్ఆర్

ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని నిర్మించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. అమరావతి చుట్టూ భారీ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రణాళిక మేరకు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు కంటే పెద్దదిగా ఉంటుంది. మొత్తం 189.9 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండే ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం భూమి సేకరణకు ఇప్పటికే అధికారుల నియామకం పూర్తయ్యింది.   అమరావతి ఔటర్ రింగు రోడ్డు మొత్తం ఐదు జిల్లాల్లోని   121 గ్రామాల గుండా వెళుతుంది.  గుంటూరు జిల్లాలో.. మంగళగిరి మండలం కాజా, చినకాకాని, గూటూరు, బుడంపాడు, ఏటుకూరు, పొత్తూరు, అంకిరెడ్డిపాలెం, సిరిపురం, వర్గాని, వెలవర్తిపాడు, మేడకొండూరు, డోకిపర్రు, విషాదాల, పేరేచర్ల, మండపాడు, మంగళగిరిపాడు, పాములపాడు, రావెల్, చిలువూరు, ఏమన్ని, చింతలపూడి, పెనుమూలి, కంఠంరాజు కొండూరు,  నంబూరు, అనుమర్లపూడి, దేవరాయబొట్లపాలెం,  కొలకలూరు, నందివెలుగు, గుడివాడ, అంగలకుదురు, కఠేవరం, సంగం జాగర్లమూడి,  వల్లభాపురం, మున్నంగి, దంట్లూరు, కుంచవరం, అత్తోటగొడవర్రు, నారాకోడూరు, వేజెండ్ల, సుద్దపల్లి, శేకూరు, కొర్నెపాడు, అనంతవర్రపాడు, చామళ్లమూడి, కర్నూలు గుండా అమరావతి ఓఆర్ఆర్ వెడుతుంది. అలాగే పల్నాడు జిల్లా  ముస్సాపురం, పాటిబండ్ల, తాళ్లూరు, లింగగుంట్ల, జలాల్పూరు, కంభంపాడు, కాశిపాడు, ధరణికోట, లింగాపురం, దిడుగు, నెమలికల్లు గ్రామాలు, ఎన్టీఆర్ జిల్లా పొన్నవరం, జగన్నాథపురం, తిమ్మాపురం, గూడెం మాధవరం, జూజూరు, చెన్నారావుపాలెం, అల్లూరు, నరసింహారావు పాలెం, కంచికచెర్ల, మున్నలూరు, మొగులూరు, పేరేకలపాడు, గొట్టుముక్కల, కూణికినపాడు, జి.కొండూరు, దుగ్గిరాలపాడు, పెట్రంపాడు, కుంటముక్కల, గంగినేనిపాలెం, కోడూరు, నందిగామ,  మైలవరం, పొందుగుల, గణపవరం గుండా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వెడుతుంది. ఇక కృష్ణా జిల్లాలొ సగ్గూరు ఆమని, బుతుమిల్లిపాడు, బల్లిపర్రు, బండారుగూడెం, అంపాపురం, పెద్దవూటపల్లి, తేలప్రోలు, వెలినూతల, ఆత్కూరు, పొట్టిపాడు, వెల్దిపాడు, తరిగొప్పుల, బోకినాల, మణికొండ, వేంపాడు, మరిదుమాక, కొణతనపాడు, దావులూరు, కోలవెన్ను, ప్రొద్దుటూరు, చలవేంద్ర పాలెం, నెప్పల్లె, కుందేరు, రొయ్యూరు, ఉత్తర వల్లూరు, చినపులిపాక, బొడ్డెపాడు, దక్షిణ వల్లూరు, ఏలూరు జిల్లా  బొద్దనపల్లె, గరికపాటివారి కండ్రిక, ఆగిరిపల్లి, చొప్పరమెట్ల, పిన్నారెడ్డిపల్లి, నూగొండపల్లి, నర్సింహపాలెం, కృష్ణవరం, సగ్గూరు, సురవరం, కల్లటూరుల గుండా వెడుతుంది.  

దస్తగిరి భార్యపై దాడి!

వైసీపీ అధినేత జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి ఇటీవల తన ప్రాణాలకు ముప్పు ఉంది, భద్రత కల్పించాలని కోరిన సంగతి తెలిసిందే. దస్తగిరి ప్రాణాలకు ముప్పు మాట నిజమేననడానికి తాజాగా ఆయన భార్య షబానాపై జరిగిన దాడి రుజువుగా నిలిచింది. షబానాపై ఆమె నివాసంలోనే దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడిన వారు వైసీపీ మహిళా కార్యకర్తలని ఆమె ఆరోపించారు. తన ఇంట్లోకి జొరబడిన వైసీపీ మహిళా కార్యకర్తలు తనను అసభ్య పదజాలంతో దూషించారనీ, ఈ ఏడాది చివరిలోగా దస్తగిరిని ఖతం చేస్తామని హెచ్చరించారనీ షబానా పేర్కొన్నారు.    ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తనకు రక్షణ కల్పించలేదనీ, అలాగే తన ఫిర్యాదు కూడా నమోదు చేసుకోలేదని షబానా ఆరోపించారు.   వివేకా హత్య కేసులో సాక్షులంతా అనుమానాస్పద స్థితిలో వరుసగా మరణిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని కోరారు. ఈ కేసులో సాక్షుల అనుమానాస్పద మరణాలపై వివేకా కుమార్తె డాక్టర్ సునీత కూడా ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.  కాగా దస్తగిరి భార్యపై దాడి సంఘటనపై స్పందించిన మాల్యాల పోలీసులు తమకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదన్నారు.  

మరికొద్దిసేపట్లో అంతరిక్షం నుంచి సునీతా విలియమ్స్ భూమ్మీదకు 

తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన  భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్  మరికొద్ది సేపట్లో  భూమిని చేరుకోనున్నారు.  ఆమెతో బాటు మరో వ్యోమగామి బుల్ విల్మోర్ చేరుకోనున్నారు. ఇప్పటికే అంతరిక్షంలో తిరుగు ప్రయాణానికి వీరు సిద్దమయ్యారు. సునీత విలియమ్స్ ను తీసుకొచ్చేందుకు రోదసిలోకి వెళ్లిన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూడ్రాగన్ ఆదివారం(మార్చి 16) సక్సెస్ ఫుల్ గా భూ కక్ష్యలోని అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)తో అనుసంధానమైంది.  క్రూ మిషన్ లో వెళ్లిన నలుగురు వ్యోమగాములు  ఒకరితర్వాత ఒకరు అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లారు. వీరు వెళ్లడంతో సునీతా విలియమ్స్ రాక కన్ఫర్మ్ అయ్యింది. సునీతా విలియమ్స్ రిటర్న్ జర్నీ గూర్చి ఇప్పటికే నాసా ప్రకటించింది.  అమెరికా కాలమాన ప్రకారం అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక అన్ డాకింగ్ ప్రాసెస్ ప్రారంభమౌతుంది.  సోమవారం అర్ధరాత్రి 12.45 గంటలకు(మార్చి 17) అంతరిక్షకేంద్రం నుంచి క్రూడ్రాగన్ విడిపోయే  ప్రాసెస్ ప్రారంభం కానుంది. స్పేస్ ఫిప్ విజయవంతంగా విడిపోయి మంగళవారం సాయంత్రం 4.45 గంటలకు భూమ్మీదకు  రిటర్న్ జర్నీ ప్రారంభమౌతుంది. సాయంత్రం 5.11 గంటలకు  భూ కక్ష్య దాటుకుని క్రిందకు వచ్చి సాయంత్రం ఫ్లోరిడా తీరంలోని సముద్రజలాల్లో స్పేస్ ఎక్స్ క్యాపుల్ దిగుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరు (వ్యోమగాములు) దిగనున్నారు.  2024 జూన్ 5న ప్రయోగించిన వ్యోమనౌక ‘స్టార్ లైనర్ ’లో సునీతా విలియమ్స్ అంతరిక్షంలో అడుగుపెట్టారు. ప్లానింగ్ ప్రకారం వీరు వారంరోజులకే భూమ్మీదకు చేరుకోవాలి. అయితే స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తెలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే భూమ్మీదకు స్టార్ లైనర్  వ్యోమనౌక తిరిగి వచ్చేసింది. అప్పటి నుంచి సునీతా విలియమ్స్ విల్మోర్ లు అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. 

చంద్రబాబు హస్తిన టూర్... మోడీ, అమిత్ షాతో భేటీ!?

తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరో సారి హస్తిన పర్యటకు సిద్ధమయ్యారు. మంగళవారం (మార్చి 18) ఆయన హస్తినలో పర్యటించనున్నారు.  ఇటీవల తరచూ హస్తిన బాట పడుతున్న చంద్రబాబు అక్కడ కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.   ఎన్డీఏలో కీలక బాగస్వామిగా  తెలుగుదేశం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన రాష్ట్రం కోసం ఏదైనా ఇలా కోరితే.. కేంద్రం అలా మంజూరు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా మంగళవారం (మార్చి 18) ఢిల్లీ పర్యటనకు వెడుతుండటంతో ఈ సారి రాష్ట్రానికి ఏం సాధించుకువస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.   అయితే కేంద్ర వ్యవసాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత, మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమార్తె వివాహం అదే రోజు ఢిల్లీలో జరగనుంది. ఆ వివాహవేడుకకు చంద్రబాబు హాజరౌతున్నారు. అయితే ఆయన ఊరికే వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించి వచ్చే పరిస్థితి ఉండదనీ, పనిలో పనిగా అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కలిసి.. ఆయా శాఖల నుంచి ఏపీకి ఏదో ఓ మేరకు ప్రయోజనం చేకూరేలా ఆయన అడుగులు పడతాయని అంటున్నారు. కాగా ఈ పర్యటనలో చంద్రబాబు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.  అదే విధంగా  అమరావతి పున: ప్రారంభ  కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీని చంద్రబాబు ఆహ్వానించే అవకాశం ఉంది. ఇందు కోసం ఆయన ప్రధాని మోడీతో కూడా భేటీ అవుతారని విశ్వసనీయ సమాచారం.  

ఏపీ క్యాబినెట్ భేటీ.. అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సోమవారం (మార్చి 17) మధ్యాహ్నం భేటీ కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ మంత్రివర్గ సమావేశంలో అమరావతి పనులు సహా పలు కీలక నిర్ణయాలకు, బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఏపీ కేబినెట్ లో పెట్టనున్న పలు బిల్లులకు కేబినెట్ ఆమోదముద్ర వేస్తుంది.   అదే విధంగా ఇప్పటికే సీఆర్డీయే ఆమోదం తెలిపిన అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. 22 వేల 607 కోట్ల రూపాయలతో 22 పనులకు సీఆర్డీయే ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఈ పనులకు ఇప్పుడు కేబినెట్ పచ్చ జెండా ఊపుతుంది.  వీటితో పాటు పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చించి ఓకే చేయనుంది.  అదే విధంగా  సీఆర్డీఏ అథారిటీలో ఆమోదించిన  టెండర్ల పనులు చేపట్టేందుకు  ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి.  క్యాబినెట్ అమోదం తెలిపిన తరువాతే  టెండర్లు దక్కించుకున్న సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లను సీఆర్డీయే జారీ చేయాల్సి ఉంటుంది.   అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ చేపట్టిన రూ.15081 కోట్ల విలువైన 37 పనులకు,  అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయిoపులకు కూడా కేంద్రం ఆమోదముద్ర వేసే అవకాశం ఉ:ది.   ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ , దాల్మియా సిమెంట్స్,  లులూ గ్లోబల్ ఇంటర్నేషనల్, ఇండోసాల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్  సంస్థలు రాష్ట్రంలో చేయనున్న ఇన్ వెస్ట్ మెంట్లకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేస్తుందని తెలుస్తోంది.  

కావటి మనోహర్ రాజీనామా!

సొంత పార్టీ నేతలపై నమ్మకం పోయిందా? అవిశ్వాసంతో,పరువు పోగొట్టుకోవడం ఇష్టం లేకే పక్కకు తప్పుకున్నారా!  గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు ఎందుకు రాజీనామా చేశారు ? అవిశ్వాస పోరాటంలో తాను నెగ్గలేనని మనోహర్ కి ముందే తెలిసిపోయిందా?  పోరాడి ఓడిపోవడం కంటే  ముందే పక్కకు తప్పుకోవడం బెటర్ అనుకున్నారా?  సొంత పార్టీ నాయకులు కనీసం తనకు మద్దతు పలకడం లేదన్న అంతర్మథనం మనోహర్ తో రాజీనామా చేయించిందా? గుంటూరులో మేయర్ రాజీనామాతో, జరగబోతున్న నష్టం ఎవరికి?  ఉన్న అధికారాన్ని కాపాడుకో లేకపోయిన వైసిపి కి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఈ దెబ్బకు గుంటూరులో  వైసిపి పట్టు పూర్తిగా కోల్పోయినట్లేనా?  గుంటూరు నగరపాలక సంస్థను వైసిపి కోల్పోయింది.. ఆ పార్టీ నాయకుడు,  నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేసేశారు.  ఈ విషయంలో ప్రత్యర్థి కూటమి పార్టీ పవర్ కంటే ,సొంత పార్టీలోని నాయకుల అసమర్ధతే మేయర్ మనోహర్ తో రాజీనామా చేపించిందన్న చర్చ జరుగుతున్నది. నిజానికి మరి కొద్ది రోజుల్లోనే అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు టిడిపి పని మొదలుపెట్టింది.  కానీ టిడిపి చేతిలో దెబ్బతినకుండా, మనోహర్ చేసిన రాజీనామా..  రాజకీయాల్లో హత్యలు ఉండవు..  ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అన్న దానికి పదానికి ప్రత్యక్ష ఉదాహరణ గా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.  గుంటూరు కార్పొరేషన్ లో మొత్తం 57 డివిజన్లు ఉన్నాయి. .ఈ డివిజన్లో గతం లో  2021 లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు  46 మంది విజయం సాధించారు. కూటమి పార్టీలకు చెందిన కార్పొరేటర్లు కు 11 సీట్లు మాత్రమే వచ్చాయి.  దీంతో వైసీపీ నుండి కావటి మనోహర్ నాయుడు మేయర్ గా పనిచేస్తున్నారు.  ఐతే 2024 ఎన్నికల్లో ప్రభంజన విజయాన్ని అందుకున్న కూటమి నాయకులు  గుంటూరు మేయర్ స్థానం పై దృష్టి పెట్టారు.  మారుతున్న కాలంతో పాటు, కార్పొరేషన్ లో రాజకీయ నాయకుల్లో కూడా మార్పు వచ్చింది  2024 ఎన్నికలకు ముందే, ఆరుగురు వైసిపి కార్పొరేటర్లు కూటమి పార్టీల వైపు వెళ్లిపోయారు. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో, కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో మరో ఆరుగురు కార్పొరేటర్లు కూటమికి జై కొట్టారు.  ఆరు, ఆరు 12 కదా ,ఈ బారా తో హైరానా ఎందుకనుకున్నారు వైసీపీ నేతలు. ఆ తర్వాత ఒక్కొక్క మార్పు జరిగే కొద్దీ , వైసీపీ నాయకులకు టెన్షన్ పుట్టుకొచ్చింది. ఈ వ్యవహారం ఓ వైపు పార్టీకి, మరోవైపు మేయర్ స్థానానికి చేటు తెచ్చేలా ఉంది  అని తెలుసుకున్నా సరే వైసిపి జిల్లా నాయకులు ఆలస్యంగా నిద్ర మేల్కొన్నారు.  ఇక్కడ వైసిపి నాయకులు నిద్ర పోయారు అనడం కంటే ,నిద్ర నటించారు అంటే బాగుంటుందని సొంత పార్టీ కాడరే దుమ్ముత్తిపోసే పరిస్థితికి తీసుకు వచ్చారు వ్యవహారాన్ని. ఈ లోపు కూటమి నాయకులు చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసేసారట.  కూటమి నుంచి విజయం సాధించిన నాయకులు, ఎమ్మెల్యేలు, కేంద్రమంత్రి గుంటూరులోనే మకాం వేసి, తమ దగ్గర ఉన్న వనరులను వైసీపీ కార్పొరేటర్ కు రుచి చూపించారు. దీంతో ఒక్కొక్కరుగా మొదలైన మార్పు వ్యవహారం,  చివరికి పాతిక మంది వైసీపీ కార్పొరేటర్లు, కూటమి పంచన చేరే వరకూ వెళ్లింది.  కౌన్సిల్లో 36 మంది కార్పొరేటర్ల మద్దతు కూడగట్టుకుంది. అనూహ్యంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.  ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులకు గాను ఆరుగురు సభ్యులు టిడిపికి చెందినవారు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలిచారు. దీంతోనే అర్థం అయిపోయింది  మనోహర్ కు గుంటూరు కార్పొరేషన్ రాజకీయాల్లో ఏం జరగబోతుందో అనేది...... అయితే ఈ వ్యవహారంలో మనోహర్ కు సహకరించాల్సిన సొంత పార్టీ నేతలు ,వెన్నుపోటు పొడిచారట ...స్టాండింగ్ కమిటీలో టిడిపి వాళ్ళు ఎట్టా గెలుస్తారో చూస్తామని, జబ్బలు చరిచిన వాళ్ళు ,చివరి రెండు రోజులు సైలెంట్ అయిపోయి సొంత కార్పొరేటర్ ను కాపాడుకోలేని పరిస్థితికి వచ్చారట.... గుంటూరు నగరంలోనూ జిల్లాలోనూ మా పవర్ ఏంటో చూపిస్తామని ,బీరాలు పలికే కొంతమంది సొంత పార్టీ నాయకుల వ్యవహారం  కళ్లారా చూసిన మనోహర్ వీళ్లేనా పార్టీని కాపాడుకునేది అని అప్పట్లోనే అంతర్మథనానికి గురయ్యారట. తన పక్కన ఉండే  కార్పొరేటర్లను పక్క పార్టీలోకి పంపించిన నాయకులు కొందరైతే,  కార్పొరేటర్లు వెళ్ళిపోతున్నా,  పోతే పోనీ మనకేంటి అని రెచ్చగొట్టిన నాయకులను చూసిన మనోహర్ ఇక కార్పొరేషన్ రాజకీయాల్లో ఉండకూడదని నిశ్చయిం చుకున్నట్లు ప్రచారం ఉంది. ఆ ప్రచారానికి తగినట్లుగానే ఎలాంటి హడావుడీ లేకుండా మేయర్  పదవికి రాజీనామా చేశారు.   అయితే టిడిపికి చెందిన నాయకులు, మార్చిలో  గుంటూరు మేయర్ ను మార్చేస్తామని చెప్పినట్లుగానే, చెప్పిన పని చెప్పినట్లుగా తమ చేతికి మట్టి అంటకుండా చేసేసారు. నిజానికి, మేయర్ పై అవిశ్వాసం పెట్టాలంటే రాజకీయంగా, న్యాయపరంగా కొన్ని చిక్కులు వస్తాయని టిడిపి ఆలోచించింది.  సొంత పార్టీ కార్పొరేటర్ లను కాపాడుకునే ప్రయత్నాలు రాజకీయ పార్టీలు చేస్తుంటాయి. కానీ గుంటూరులో మాత్రం అలాంటిది జరగలేదు. వైసిపి నిట్ట నిలువునా చేతులెత్తేసింది. ఓ పక్కన కూటమికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్,కీలకంగా మారి గుంటూరులో చక్రం తిప్పుతుంటే , ప్రతిఘటించాల్సిన  వైసిపి నాయకులు బేర్ మన్నారట. దీంతో పెద్ద స్థాయి నాయకులే పార్టీని వదిలి వెళ్ళిపోతుంటే, ఇక మనకెందుకులే అనుకున్నారు క్షేత్రస్థాయిలో కార్పొరేటర్లు.  దీంతో ఎలాంటి ప్రతిఘటన లేకుండానే వైసిపి మేయర్ స్థానాన్ని కోల్పోయింది.... గుంటూరులో ఈ వ్యవహారం ,రాబోయే రోజుల్లో వైసిపి లో ఎలాంటి మార్పులు తీసుకు వస్తుందో చూడాలి.  

జర్నలిస్టులెవరో తేల్చండి!.. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే తాటతీస్తా.. రేవంత్

సోష‌ల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండి పడ్డారు.ఆలాంటి వారి విష‌యంలో సీరియ‌స్‌  యాక్ష‌న్ తీసుకుంటామ‌ని  హెచ్చ‌రించారు.  ప్ర‌జాప్ర‌తినిధులు త‌ప్పులు చేస్తే.. వారిని ప్ర‌శ్నించ‌డం వ‌ర‌కు ప‌రిమితం కావాల‌ని, కానీ, వారి ఇంట్లో ఆడ‌వాళ్లు ఏం త‌ప్పులు చేశార‌ని వారిపై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నార‌ని  నిల‌దీశారు. ఈ విషయంపై అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. సోష‌ల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నవారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.   ప్ర‌జాజీవితంలో ఉన్న తనను విమర్శిస్తే సహిస్తాకానీ. కానీ, తన భార్య‌, నా బిడ్డ ఏం చేశారని వారిపై అనుచిత వ్యాఖ్యలు అదీ  బండ బూతుల‌తో చేస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు? ఇలాంటి వారు స‌మాజానికి ఏం సందేశం ఇస్తున్నారు. వీరు ఏం జ‌ర్నలిస్టులు? ఇది ది ఏం జ‌ర్న‌లిజం?, ఇలాంటి కామెంట్లు చ‌దివినా.. విన్నా అన్నం కూడా తినాల‌ని అనిపించ‌డం లేదన్నారు. భూభార‌తి పేరుతో త‌న‌పై వ‌స్తున్న కామెంట్లు చ‌దివేందుకు కూడా మ‌న‌స్క‌రించ‌డం లేద‌న్నారు. ఇలాంటి వారికి తోలు తీస్తాన‌ని అసెంబ్లీ సాక్షిగా హెచ్చ‌రించిన రేవంత్ రెడ్డి, భూభార‌తి పేరుతో పేద‌ల భూముల‌ను వారికే చెందేలా చేస్తున్న త‌న ప్ర‌య‌త్నం త‌ప్పా? అని ప్ర‌శ్నించారు. పెయిడ్ ఆర్టిస్టుల‌తో చేయిస్తున్న ఇలాంటి వీడియోలు అత్యంత దారుణంగా ఉంటున్నాయ‌ని సీఎం చెప్పారు. ఇలాంటివి చేయ‌డానికి అస‌లు మ‌న‌సు ఎలా వ‌స్తోంద‌ని నిల‌దీశారు. సమ‌స్య‌లు ఉంటే ఉండొ చ్చున‌ని.. వాటిని హ్యాండిల్ చేయాల్సిన తీరు మాత్రం ఇలా కాద‌న్నారు. “ఇంత‌లేసి మాట‌లు మీ నోటికి ఎలా వ‌స్తున్నాయి. మీరు మ‌నుషులేనా? మీకు భార్య‌, పిల్ల‌లు లేరా?” అని ప్ర‌శ్నించారు. ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకునేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇలాంటి విషపూరిత జర్నలిజంపై చర్చ జరగాలన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి జర్నలిస్టుల జాబితా తీసి ఎవరు జర్నలిస్టులో చెప్పాలని జర్నలిస్టు సంఘాలను కోరారు. జర్నలిజం డెఫినిషన్ చెప్పండి, తప్పు చేసిన జర్నలిస్టును మీరే శిక్షించండి, జర్నలిస్టు కాని వారిని క్రిమినల్ గానే చూస్తామనీ, అలాంటి క్రిమినల్స్ కి ఎలా బుద్ధి చెప్పాలో అలానే చెబుతామని అన్నారు. 

గుంటూరు మేయర్ రాజీనామా.. అవిశ్వాసం భయంతోనేనా?

గుంటూరు మేయ‌ర్, వైసీపీ నేత కావ‌టి మ‌నోహ‌ర్ నాయుడు త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. 2021లో మేయ‌ర్‌గా ఎన్నికైన మ‌నోహ‌ర్ మరో ఏడాది ప‌ద‌వీ కాలం ఉండ‌గానే రాజీనామా చేశారు.   గ‌త నెల‌లో జ‌రిగిన గుంటూరు న‌గ‌ర‌పాల‌క స్టాండింగ్ క‌మిటీ ఎన్నిక‌ల్లో ఆరు స్థానాల‌కు ఆరు స్థానాలనూ తెలుగుదేశం, జ‌న‌సేన కార్పొరేట‌ర్లు కైవ‌సం చేసుకున్నారు. దీంతో అవిశ్వాస తీర్మానం భయంతో ఆయన రాజీనామా చేసినట్లు చెబుతున్నారు.   వైసీపీ నుంచి కార్పొరేట‌ర్లు కూట‌మిలో చేర‌డంతో వైసీపీకి ప‌రాభ‌వం త‌ప్ప‌లేదు. ఈ నెల 17న స్టాండింగ్ క‌మిటీ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశంలో మ‌నోహ‌ర్ నాయుడిపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు గత కొంతకాలంగా నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, మేయర్ మనోహర్ మధ్య వివాదం నెలకొంది. ఈ నేప‌థ్యంలోనే మ‌రో ఏడాది ప‌ద‌వీకాలం ఉండ‌గానే ఆయ‌న‌ రాజీనామా చేశారంటున్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాను అనేక అవమానాలు ఎదుర్కొన్నట్లు కావటి మనోహర్ నాయుడు ఆరోపిస్తున్నారు. మేయర్‌కు ఇవ్వాల్సిన కనీస ప్రోటోకాల్ ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు. ఇన్ని అవమానాలు ఎదుర్కొంటూ   పదవిలో ఉండాల్సిన అవసరం తనకు లేదని.. అందుకే రాజీనామా చేసినట్లు కావటి మనోహర్ నాయుడు అన్నారు. వాస్తవానికి ఇటీవల జరిగిన గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో  వైసీపీ పరాజయం పాలైంది. ఆరు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. అన్ని స్థానాలలోనూ టీడీపీ, జనసేన కార్పొరేటర్లు విజయం సాధించారు. వైసీపీ నుంచి కొందరు కార్పొరేటర్లు తెలుగుదేశం గూటికి చేరారు. ఈ నేపథ్యంలోనే సోమవారం (మార్చి 17) స్టాండింగ్‌ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడిపై అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచనలో కూటమి పార్టీలు ఉన్నాయి. అదే జరిగితే అవిశ్వాస తీర్మానం గెలిచి మేయర్ గా కావటి దిగిపోవాల్సి రావడం ఖాయం. దీంతోనే కావటి మేయర్ పదవికి రాజీనామా చేసేశారు.   నిబంధనల ప్రకారం మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే ఆ మేయర్ నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుని ఉండాలి. ఫిబ్రవరి 17తో మేయర్‌గా మనోహర్ నాయుడు పదవీ కాలం నాలుగేళ్లు పూర్తైంది. దీంతో కూటమి నేతలు సరిగ్గా ఆయన నాలుగేళ్ల పదవీ కాలం పూర్తి అయిన రోజునే అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని నిర్ణయించుకున్నారు.  గుంటూరు నగరపాలక సంస్థలో 56 మంది కార్పొరేటర్లు, ఏడుగురు ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు.    

జనసేనాని బ్యాలెన్స్ తప్పుతున్నారా?

తెలుగు తమ్ముళ్ల చురకలు ఎన్నికల ముందు తన పార్టీ మీటింగుల్లో పవన్ కళ్యాణ్ చాలా మాటలు మాట్లాడారు. మనకు ఆర్థిక, అంగ బలాలు, టీడీపీ  స్థాయిలో గ్రౌండ్ లెవల్ నెట్‌వర్క్ లేవు, పోల్ మేనేజ్‌మెంట్ కూడా తెలియదు అందుకే జనసేన స్థాయికి తగ్గట్లు 21 స్థానాలకే పరిమితం అవుతున్నామని జనసైనికులకు వివరించారు.ఆ మాటలు పవన్  మరచిపోయినట్టున్నారు. రోజులు  గడిచే కొద్దీ డిప్యూటీ సీఎం బ్యాలెన్స్ తప్పుతున్నట్లు కనిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని తానే నిలబెట్టానని పవన్‌కళ్యాణ చేసిన వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. కాన్ఫిడెన్స్ లెవల్స్ మరీ ఎక్కువై పోయాయని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. రావణుడి లాంటి దుష్టుడిని మట్టుపెట్టడానికి రామ -  సుగ్రీవులు కలిశారు . అలాంటి వానర సైన్యం లేకపోతే సీతారాములు కలిసేవారు కాదు అనుకుంటే పొరపాటే అని యద్దేవా చేస్తున్నారు . బాబుగారు ఒదిగి వున్నారు కదా అని అంతా మేమే చేసాం, అంతా మా ఘనతే అనకండని చురకలు అంటిస్తున్నారు. మీకు కృతజ్ఞత ఉంటే మీ కోసం సీటు త్యాగం చేసిన వర్మకి ఎమ్మెల్సీ వచ్చేలా చేసేవారని చురకలు అంటిస్తున్నారు. ఈ సందర్బంగా పాత ఎన్నికల లెక్కలు బయటకు తీసి మీ సత్తా ఇదీ అని జనసేనానికి గుర్తు చేస్తున్నారు. 2019 ఎన్నికలలో పవన్ కళ్యాణ్, జనసైనికుల ఫ్యాక్టర్స్‌తో గాజువాకలో జనసేనకు వచ్చిన ఓట్లు 58,539. అప్పుడు తెలుగుదేశం అభ్యర్ధికి పల్లా శ్రీనివాసరావు గారికి వచ్చిన ఓట్లు 56,642. 75,292  ఓట్లు దక్కించుకున్న వైసీపీ 16,753 ఓట్ల మెజార్టీతో గట్టెక్కింది. 2024లో  తెలుగుదేశం అభ్యర్థి పల్లా శ్రీనివాస రావుకి వచ్చిన ఓట్లు 1,57,703. వైసీపీ అభ్యర్ధికి వచ్చిన ఓట్లు 62,468. ఒకవేళ జనసేన లేకుండా టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే ఇప్పుడొచ్చిన ఓట్లలో గతంలో జనసేనకు వచ్చిన ఓట్లు తీసేసినా టీడీపీకి 99,164 ఓట్లు దక్కేవి. ప్రస్తుతం తెలుగుదేశం అభ్యర్థికి వచ్చిన మెజారిటీ 95,235. అందులో 2019 నాటి జనసేన షేర్ 58,539 తీసేస్తే తక్కువలో తక్కువ 35 వేలు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చేది.  2019లో  పీఠాపురంలో జనసేన అభ్యర్థికి వచ్చిన ఓట్లు 28,011. టీడీపీ అభ్యర్ధికి వచ్చిన ఓట్లు 68,467. వైసీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 83,459. 2024లో జనసేన అభ్యర్థికి వచ్చిన ఓట్లు 1,34,394. వైసీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 64,115 . ఒకవేళ టీడీపీ ఇక్కడ మద్దతు ఇవ్వకుండా సైలెంట్‌గా ఉండి ఉంటే 1,34,394 - 68,467= 65,927 ఓట్లు జనసేనకు దక్కేవి. అప్పుడు పవన్‌కళ్యాణ్‌కి 10 వేల లోపే మెజారిటీ దక్కేది. టీడీపీ మాజీ ఎమ్మెల్యేని చేర్చుకుని గెలిచిన భీమవరం లెక్కలు కూడా తీయవచ్చు కాని, చదివేవారికి బోరు కొడుతుంది వద్దులే. ఫ్యాక్టర్స్ మాట్లాడే ముందు ఫ్యాక్ట్ తెలుసుకో..మిడిసిపడే దీపం ఎక్కువసేపు వెలగదు.. అని తెలుగు తమ్ముళ్లు ఉప ముఖ్యమంత్రికి హితబోధ చేయడం మొదలుపెట్టారిప్పుడు.

ప్రకాశ్ రాజ్ కు కౌంటర్ గా  బండ్ల గణేష్  ఆసక్తకర ట్వీట్ 

హిందీ భాషను తమపై రుద్దకండి అంటూ చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని  నటుడు ప్రకాశ్ రాజ్ తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్ గా  సినీ నిర్మాత, న‌టుడు బండ్ల గ‌ణేశ్ ట్విట్ట‌ర్‌ వేదిక‌గా ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన జనాలు ఇది ఖచ్చితంగా ప్రకాశ్ రాజ్ కు కౌంటర్ ట్వీట్ అని తెలుస్తోంది.   మూవీఆర్టిస్ట్ అసోసియేషన్ ( మూవీ) ఎన్నికల్లో  మా అధ్యక్ష  పదవికి పోటీ పడిన ప్రకాశ్ రాజ్ కు అప్పట్లో జనసేనాని పవన్ కళ్యాణ్ మద్దత్తు పలికారు. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ట్విట్టర్ లో రియాక్ట్ కావడాన్ని పవన్ కళ్యాణ్ వీరాభి మాని అయిన బండ్ల గణేష్ స్పందించారు.  “కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే, ద్రోహంతో బతకడం మనుష్యత్వాన్ని నాశనం చేసుకోవడమే. ఒక మనిషి జీవితంలో కృతజ్ఞత ఎంత ముఖ్యమో, ద్రోహం ఎంత ప్రమాదకరమో స్పష్టంగా తెలియజేస్తుంది. మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలి..!” అని ఆయ‌న ట్వీట్ చేశారు.  మా అధ్యక్ష పదవికి మంచువిష్ణుకు పోటీగా ప్రకాశ్ రాజ్ నిల్చున్నారు. అప్పట్లో జనసేనాని ప్రకాష్ రాజ్ వెంటే నిలిచారు. . పాత విషయాలను నెమరువేసుకున్న బండ్ల గణేష్ ట్వీట్ పొలిటికల్ గా హీటెక్కించింది.పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాత 

రేవంత్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హైదరాబాద్ లోని రెండు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. రేవంత్ రెడ్డి చేసిన మార్చురీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖరరెడ్డి, కునా వివేకానందగౌడ్ లు పేట్ బషీర్ బాగ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారిరువురూ వ్యక్తిగతంలో పేట్ బషీర్ బాగ్ పోలీసు స్టేషన్ కు వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు. ఇక రేవంత్ రెడ్డిపై ఫిల్మ్ నగర్ పోలీసు స్టేషన్ లో మరో ఫిర్యాదు దాఖలైంది. ఈ ఫిర్యాదును కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన దాసోసు శ్రవణ్  ఇచ్చారు. పీఎస్ లో రేవంత్ పై ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన దాసోజు  కేసీఆర్ పై మార్చురీ కామెంట్లు చేయడంపై రేవంత్ ను తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ కేసీఆర్ హత్యకు ప్లాన్ చేస్తున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ విఫల హామీలపై నిలదీస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఖతం చేయాలనుకుంటున్నారా? అని నిలదీశారు. బెదరింపు రాజకీయాలను రేవంత్ మానుకోవాలని దాసోజు అన్నారు.  అంతకు ముందు తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రేవంత్ రెడ్డి మార్చురీ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  

రేవంత్ మంత్రివర్గ విస్తరణ నిరవధిక వాయిదా ?

 తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు?  అంటే చెప్పడం కష్టం. అసలు ఉంటుందా? అంటే అదీ అనుమానమే? ఎందుకలా? నిన్న మొన్నటి దాకా, ఇదిగో, అదిగో అంటూ ఊహాగానాలు చేస్తూ వచ్చిన మెయిన్ స్ట్రీమ్  మీడియా కూడా ఇప్పడు ఎందుకు మౌనం పాటిస్తోంది?  అంటే  స్పష్టమైన సమాధానం ఏదీ రాక పోయినా కాంగ్రెస్  అధిష్టానం  కొత్త ఆలోచనల కారణంగానే కాబినెట్ విస్తరణ అలోచన అటకెక్కిందని   విశ్వసనీయ వర్గాల సమాచారంగా కాంగ్రెస్  వర్గాలు పేర్కొంటున్నాయి. అంతే కాదు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్న ముఖ్యమంత్రి   పంచాయతీ ఇప్పట్లో తేలేది కాదని,  సో .. మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో జరగే అవకాశాలు అంతగా  లేవనీ  ఒక విధంగా చెప్పాలంటే  మంత్రి వర్గ విస్తరణ నిరవధికంగా వాయిదా పడినట్లేనని అంటున్నారు.  నిజానికి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావస్తున్నా ఇంతవరకు పూర్తి స్థాయి మంత్రి వర్గం ఏర్పడలేదు. ముఖ్యమైన హోం, విద్యా శాఖలు సహా మరి కొన్ని మంత్రులు లేని శాఖల పరిస్థితి అక్క మొగుడే’ దిక్కన్నట్లు తయారైందని  అధికార వర్గాలు అసంతృప్తి వ్యక్త పరుస్తున్నాయి.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో  ముఖ్యమంత్రితో కలిపి 12 మంది మత్రులున్నారు. మరో ఏడుగురు మంత్రులను తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధిష్టానంతో సంబంధాలు బాగున్న రోజుల్లో  ఆయన ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా  పార్టీ అధిష్టానం ముందుంచిన ఎజెండాలో మంత్రి వర్గ విస్తరణ తప్పక ఉండేదని అంటారు. అంతే కాదు  రెండు మూడు సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మరో ఒకటి రెండు సార్లు మంత్రి పొంగులేటి, ఇతర మంత్రులు మంత్రి వర్గ విస్తరణ కొంచెం అటూ ఇటుగా ఫలానా తేదీ లోగా ఉంటుందని ముహూర్తాలు కూడా నిర్ణయించారు. అయితే ముహూర్త తిథులు, తేదీలు  వచ్చాయి,  పోయాయి కానీ  మంత్రి వర్గ విస్తరణకు  ముడి  పడలేదు.  అదలా ఉంటే, ముగ్గురు మంత్రులకు ఉద్వాసన తప్పదనే ప్రచారం ఒకటి కాంగ్రెస్ పార్టీలో జోరుగా జరుగుతోంది. కారణాలు వేరైనా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్ విచారణ నివేదిక ఆధారంగానే ఉద్వాసనకు నిర్ణయం జరిగిందని  సో, ఆ ముగ్గురుకి ఉద్వాసన తప్పక పోవచ్చనే  ప్రచారం జరుగుతోంది.    అదొకటి  అలా ఉంటే  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా నేరుగా ఢిల్లీ నుంచి టికెట్ తెచ్చుకున్న విజయ శాంతికి కాబినెట్ బెర్త్ ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఆమెతో పాటుగా, మరో ముగ్గురు కొత్త వారికి అవకాశం దక్కే అవకాశం  ఉందని అంటున్నారు. అయితే  ఇందంతా జరిగేది ఎప్పుడు  అంటే మాత్రం  ఎవరూ స్పష్టమైన సమాధానం చెప్పలేక పోతున్నారు. ముందుగా ప్రస్తుతానికి ఆలోచ , విచారణ దశలోనే ఉన్న ముఖ్యమంత్రి మార్పు విషయంలో ఒక నిర్ణయం తీసుకున తర్వాతనే మంత్రి వర్గ నిర్ణయం ఉంటుందని  ఢిల్లీతో టచ్ లో ఉన్న నాయకులు అంటున్నారు.  అయితే అదే సమయంలో  ముఖ్యమంత్రి మార్పు పై నిర్ణయం అంత సులభంగా తేలే వ్యవహారం కాదని, ముఖ్యంగా రేవంత్ రెడ్డిని టచ్ చేస్తే విపరీత పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుందని అధిష్టానానికి కూడా తెలుసని అంటున్నారు. అలాగే  కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఎవరెవరి వెంట ఎంత మంది ఉన్నారు, ఇతర పార్టీలతో టచ్’లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది, ఇతర పార్టీల ఎమ్మెల్యేలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో, లేదా ఇతర  ముఖ్య నాయకులతో  టచ్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఎందరు? వంటి వివరాలన్నీ అధిష్టానం సిద్దం చేసుకుందని అంటున్నారు. అలాగే, ఇటు నుంచి అటు.. అటు నుంచి ఇటు గోడ దూకుడు లెక్కలకు సంబంధించి వివరాలు సైతం  అధిష్టానం వద్ద ఉన్నట్లు ఒక ప్రచారం జరుగుతోంది.  సో.. ఎలా చూసినా కాంగ్రెస్ అధిష్టానం తొందరు పాటు నిర్ణయం తీసుకోదని అంటున్నారు.  సో... చివరికి ఏ  నిర్ణయం తీసుకోకపోవడమే ఉత్తమ నిర్ణయంగా అధిష్టానం తీసుకున్నా  తీసుకోవచ్చని కాంగ్రెస్ వర్గాల సమాచారం.  ఇదలా ఉంటే రామాయణంలో పిడకల వేట అన్నట్లు, ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పని కాదని, రాములమ్మలా నేరుగా దేహికి వెళ్లి మంత్రి పదవి తెచ్చుకుంటానని సంచలన ప్రకటన చేశారు.