ఈ నెల 31 వరకు తెలంగాణాలో లాక్‌ డౌన్

క‌రోనా వైరస్‌ నియంత్రణకు చేపట్టిన జనతా కర్ఫ్యూకు ప్రజలంతా అద్భుతమైన రీతిలో సంఘీభావం తెలిపారని తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందించారు.  ఆదివారంనాడు  తెలంగాణలో 5 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని సి.ఎం. ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  కరోనా నివారణకు ఉన్నత స్థాయి కమిటీ లో చర్చించిందన్నారు. ఈనెల 31 వరకు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని.. అప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నట్లు సీఎం స్పష్టం ప్ర‌క‌టించారు. వారం రోజులు ఇళ్ల‌లోనే వుండండి. ఆ ఒక వారం మీ జీవితాన్నే కాపాడుతోంది.  మీమ్మ‌ల్ని, మీతో పాటు దేశాన్ని కాపాడండని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇట‌లీ లాంటి దుర్గ‌తి మ‌న‌కు ప‌ట్ట‌వ‌ద్దంటే మ‌న‌మే మ‌న‌ల్ని కాపాడుకోవాల‌ని సి.ఎం. సూచించారు. విదేశాల నుంచి వ‌చ్చిన వారు హోం క్వాంరెంటైన్ లోనే వుండండి. దాచి పెట్ట‌వ‌ద్దు. మీకు మీరు నియంత్ర‌ణ పాటించండి. భ‌యోత్పాత స్థితిలో ప్ర‌పంచం వుంది. ద‌య‌చేసి ఆషామాషీగా తీసుకోకుండా స్వ‌యం నియంత్ర‌ణ‌పాటించండి. మ‌న కుటుంబాన్ని, మ‌న దేశాన్ని మ‌నం ధ్వంసం చేసుకుందామా అంటూ ముఖ్య‌మంత్రి సూచించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై సీఎం కేసీఆర్ అత్యున్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. సీఎస్‌తో పాటు డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు సీఎంతో భేటీ లో పాల్గొన్నారు.  కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పరిస్థితి రోజు రోజుకీ చేజారిపోతుందన్న అనుమానాన్ని ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంలోనే లాక్‌డౌన్ ప్రకటిస్తే పరిస్థితి అదుపులోకి వస్తుందని కేసీఆర్ సర్కార్ భావించి ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.  

విశాఖ రాజధాని ప్రతిపాదన ప్రస్తుతానికి కోల్డ్ స్టోరేజ్ లోకే !

ప్రస్తుతానికి ఆ ప్రతిపాదన లేనట్టే. కేంద్రం లాక్ డౌన్ ప్రకటించిన 75 జిల్లాల్లో , విశాఖపట్నం కూడా ఉన్నందువల్ల, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తాత్కాలికంగా పక్కన పెట్టినట్టే . ఇహ, ఉద్యోగులు కూడా ప్రస్తుతానికి ఆ ఆలోచన గురించి భయపడాల్సిన అవసరం లేదన్నమాట. ఆంధ్రప్రదేశ్‌కు కార్యనిర్వాహక రాజధాని(ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌)గా ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించిన విశాఖపట్నానికి తరలేందుకు సచివాలయ ఉద్యోగులు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. నాలుగు రోజుల క్రితం జరిగిన సచివాలయ ఉద్యోగుల సంఘం ఎగ్జిక్యూటివ్ కమిటి సమావేశంలో ఈ విషయంపై చర్చించారు. మే నెలాఖరు నాటికి విశాఖ వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని ఉద్యోగ సంఘ నాయకులు సచివాలయ సిబ్బందికి సూచించారు.అమరావతి నుంచి కార్యనిర్వాహక రాజధానిని విశాఖ తరలించాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్దికాలం కిందట నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో సచివాలయం విశాఖపట్నానికి తరలనుండడంతో ఉద్యోగులూ అక్కడికి వెళ్లాల్సి వస్తోంది. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా సచివాలయ ఉద్యోగులందరూ విశాఖపట్నానికి తరలివెళ్లేందుకు సచివాలయ ఉద్యోగులంతా సిద్ధంగా ఉండాలని సచివాలయ ఉద్యోగుల సంఘం (అప్సా) అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. సంబంధిత ఉత్తర్వులు మే నెలాఖరులోపు ఏ క్షణంలోనైనా ప్రభుత్వం నుంచి రావచ్చని చెప్పారు. అమరావతి సచివాలయంలో అప్సా ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది అనంతరం వెంకట్రామిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘విశాఖను పరిపాలనా రాజధానిగా నిర్ణయిస్తూ ప్రభుత్వం కొన్ని ప్రాథమిక నిర్ణయాలు తీసుకుంది. అసెంబ్లీలో బిల్లులు పాస్‌ కాకపోవడం, కోర్టు కారణాల వల్ల వీటిపై ఉత్తర్వులు రాలేదు. మూడు రాజధానులు అంశం వచ్చిన దగ్గర నుంచి ఉద్యోగులంతా రానున్న విద్యా సంవత్సరంలో తమ పిల్లలకు అడ్మిషన్లు ఎక్కడ తీసుకోవాలంటూ పలు రకాల ప్రశ్నలు అడగడంతో వీటిపై వివరణ ఇచ్చేందుకు అప్సా ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించాం. ఏ క్షణంలోనైనా విశాఖకు తరలి వెళ్లాలనే ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి వెలువడతాయని.. దీనికి ఉద్యోగులంతా సిద్ధంగా ఉండాలని సమావేశంలో   స్పష్టతనిచ్చాం.’ అని తెలిపారు. 100-200 మంది గుమికూడితేనే కరోనా వస్తుందని అంటున్నారని.. ఉద్యోగులు వేల సంఖ్యలో ఉన్నందునే జనరల్‌ బాడీ నిర్వహించలేదని ఆయన చెప్పారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉందని, స్పష్టత ఇచ్చాక ఏప్రిల్‌ మొదటి వారంలో అప్సా జనరల్‌ బాడీ సమావేశం నిర్వహిస్తామన్నారు. అయితే, ఇది ఇప్పటికి వాయిదా పడే అంశం గానే కనిపిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక ఉద్యోగులను విశాఖకు తరలించాల్సి వస్తే..చదువుకునే పిల్లలు ఎంత మంది ఉద్యోగులకు ఉన్నారో అటువంటివారందరికీ తరలింపులో మినహాయింపు ఇవ్వాలని కోరతామని వెంకటరామి రెడ్డి చెప్పినప్పటికీ, ఇపుడు దాని గురించి ఆలోచన చేసే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదనేది ఉద్యోగులు, అధికారుల వాదన.  అయితే, ఇదంతాకూడా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించాక ముందు పరిస్థితి. తాజా గా కరోనా వైరస్ నేపధ్యం లో, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 75 జిల్లాల లాక్ డౌన్ కారణంగా- ప్రస్తుతం విశాఖ లో కార్య నిర్వాహక ప్రతిపాదన ఇప్పటికైతే వెనక్కు వెళ్ళినట్టే !

కేరళ సి. ఎం . ను చూసి నేర్చుకోమని జగన్ కు కేశినేని నాని సలహా !

కేశినేని నాని... ఫైర్ బ్రాండ్ టీ డీ పీ ఎం.పి . జనాలకు అసలు ఏ మాత్రం పరిచయం అక్కర్లేని నాయకుడు. ఏ ఒక్క చిన్న వకాశం వచ్చినా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని దులిపి ఆరేయటానికి అసలేమాత్రం వెనుకాడడు.  వైరస్‌ నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కేరళ సీఎం పినరయి విజయన్‌‌ను చూసి నేర్చుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి , ఆయన ట్విటర్ ద్వారా సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కరోనా బాధితులు సంఖ్య ఐదుకు పెరిగింది. దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఏపీలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యలు చేపట్టింది. ఏపీలో బస్సులు బంద్ చేసింది. గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించి ఇంటింటికి తిరిగి, విదేశాల నుంచి వచ్చిన వారు, తాజాగా దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడే వారి వివరాలను సేకరిస్తోంది. అయితే, కరోనా నియంత్రణకు ఎన్ని కోట్లు ఖర్చు చేస్తామనే అంశాన్ని ప్రకటించలేదు. కేరళ ప్రభుత్వం మాత్రం కరోనా నియంత్రణకు రూ.20వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. గతంలో నిఫా వైరస్‌ మీద పోరాడిన అనుభవం ఉన్న కేరళ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. అందులో రూ.500 కోట్లను హెల్త్ కిట్స్ (శానిటైజర్లు, మాస్క్‌లు) వంటి వాటి కోసం వినియోగించనున్నారు. అలాగే, రూ.2000 కోట్లను చిన్న చిన్న రుణాలు , నెలవారీ సరుకులు, రేషన్ వంటి వాటి పంపిణీ కోసం వినియోగించనున్నారు.ఇంతకీ మన ఎం. పి . గారి సూచనను పాటిస్తారో, లేదో చూడాలి మరి. !

ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే..

మోదీ పిలుపిస్తే..మేము అమలు చెయ్యాలా? ఆయన నియంతలా వ్యవహరిస్తున్నారు.. లాంటి లెఫ్టు, రైటు వితండవాదులు.. ప్రతిక్షణం అసహనంతో కొట్టుమిట్టాడుతున్న మేధావులు ఉన్న దేశంలో.. అత్యవసర పరిస్థితుల్లో దేశం మొత్తం ఇంత ఐక్యత ప్రదర్శిస్తుందా అనే అనుమానాలు ఉన్నవారికి వారి సందేహాలు పటాపంచలు చేసే విధంగా జనతా కర్ఫ్యూ జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ను అడ్డుకోవడానికి, దేశంలో విస్తరించకుండా లింక్ చైన్ ను బ్రేక్ చేయడానికి ప్రధాని నరేంద్రమోడీ పిలుపు మేరకు దేశం మొత్తం ఏకతాటిపైకి వచ్చి జనతా కర్ఫ్యూను  పాటిస్తోంది. కోవిడ్ 19 కేవలం 12 గంటలు మాత్రమే బతికి ఉంటుందని ఈ లోపు దానికి కొత్త ఆసరా దొరక్కపోతే చనిపోతుందని శాస్త్రవేత్తలు తేల్చి చెప్తున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రజలు భద్రంగా ఉండాలని ప్రధాని జనతా కర్ఫ్యూను ప్రతిపాదించారు. ఈ రోజు 14 గంటల పాటు ఈ సెల్ఫ్ క్వారంటైన్ చేసుకుంటే వ్యాధి వ్యాప్తిని దాదాపుగా 80 శాతం అరికట్టవచ్చు.  దేశంలో ప్రస్తుతం 300 మందికి పైగా ఈ వ్యాధితో  ఆసుప్రతుల్లో చేరారు. లక్షలాది మందిని క్వారంటైన్ చేశారు. అయిదుగురు వ్యక్తులు ఇప్పటికే మరణించారు. ఈ ఉపద్రవం నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి మనల్ని మనం ఇంట్లో బంధించుకోవడం తప్ప వేరే మార్గం లేదు. ఇంత పెద్ద దేశంలో ఇంత జనాభాపై ఆంక్షలు పెట్టి అదుపు చేయడం ఎవరికీ సాధ్యం కాదు. పరీక్షలు చేయడం అంతకన్నా సాధ్యం కాదు. అలాంటి సమయంలో ప్రధాని నరేంద్ర మోడీకి వచ్చిన ఈ ఆలోచన అంత సులభమైనదేమీ కాదు. 130 కోట్ల మంది భారతీయులు ఇళ్లలో బందీగా ఉండిపోవడం మామూలు పరిస్థితుల్లో అయితే సాధ్యం కాదు. అయితే వ్యాధి తీవ్రత దృష్ట్యా నో, ప్రధాని పై విశ్వాసంతోనో దేశ ప్రజలంతా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. అందుకు దేశ ప్రజలను అభినందించక తప్పదు. వందల కోట్లు ఖర్చు చేసినా అదుపు కాని ఈ వ్యాధిని ఈ టెంపరరీ లాక్ డౌన్ తో అరికడితే అంత కన్నా కావాల్సింది ఏమీ లేదు. దేశాలకు దేశాలు షట్ డౌన్ లోకి వెళ్లిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో శాశ్వత షట్ డౌన్ కన్నా ఇలా తాత్కాలిక షట్ డౌన్ మేలు కదా. అందుకే దేశ ప్రజలంతా సహకరిస్తున్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే మరో మూడు నాలుగు సార్లు ఈ విధంగా 14 గంటల బంద్ పాటిస్తే చాలు మన దేశం నుంచి పూర్తిగా కోవిడ్ 19 వైరస్ ను తరిమి కొట్ట వచ్చు. ఇప్పటి వరకూ విదేశాలకు వెళ్లి వచ్చినవారు, విదేశస్తుల ద్వారానే ఈ వ్యాధి విస్తరిస్తోంది. ఇప్పుడిప్పుడే మన పౌరులకు (స్థానికంగా ఉండేవారికి) సోకుతున్నది. స్థానికులకు సోకడం మొదలు పెడితే క్వారంటైన్ చేయడం సాధ్యం కాదు. అందుకే ఈ ప్రయత్నం. గరిష్టంగా ఈ విధంగా నాలుగు సార్లు దేశం మొత్తం జనతా కర్ఫ్యూ విధించుకుంటే వైరస్ మాయం అవుతుంది. దేశ ఆర్ధిక వ్యవస్థ పై భారం లేకుండా మనం దేశాన్ని దేశ ప్రజలను కాపాడుకోగలుగుతాం. మరీ ముఖ్యంగా మన సైనిక బలగాలలో కొందరికి ఈ వైరస్ సోకింది. అది మరింత ప్రమాదకరం. దాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. మనందరం సహకరిద్దాం మన భవిష్యత్తు కోసం..  

ఆ వ్యక్తి నిర్లక్ష్యానికి తెలుగురాష్ట్రాలు వ‌ణుకుతున్నాయి!

విశాఖలోని ప్రభుత్వ అంటువ్యాధుల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడికి (65) కరోనా సోకినట్టు పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. ఈనెల 12 నుంచే జ్వరం ఉన్నా.. మామూలుదేనని భావించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరిగినట్టు తెలియడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. వ్యాధి లక్షణాలతో ఈనెల 17న విశాఖలోని అంటువ్యాధుల ఆసుపత్రిలో చేరారు. అతని ప్రయాణ వివరాలు చూస్తే.. * ఫిబ్రవరి 21న జెద్దా నుంచి మక్కాకు, అక్కడినుంచి మదీనాకు విమానాల్లో వెళ్లారు. * మళ్లీ మక్కా వచ్చి మార్చి 9న హైదరాబాద్‌కు వచ్చారు. * 10న విమానాశ్రయం నుంచి మెహిదీపట్నంలోని కుమార్తె ఇంటికెళ్లారు. 11న విశాఖ-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ బీ1 బోగీలో బయల్దేరి విశాఖకు 12న వచ్చారు. అల్లీపురంలోని ఆయన ఇంట్లో పలువురు వచ్చి కలిశారు. * 13న శుక్రవారం ఓ మసీదులో సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. * 14న జ్వరంతో మంచం మీదనుంచి లేవలేకపోయారు. అదేరోజు సాయంత్రం 6.30 గంటలకు ఓ ల్యాబ్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. * 17న మర్రిపాలెంలో వైద్యుడి వద్దకు వెళ్లగా.. ఆయన కరోనా లక్షణాలు గమనించి ప్రభుత్వ అంటువ్యాధుల ఆసుపత్రికి పంపారు. క్లినిక్‌లో ఈ వృద్ధుడు ముగ్గురు వైద్యసిబ్బందిని నేరుగా కలిశారు. తర్వాత నమూనాలు పంపిన రెండు రోజులకు వ్యాధి ఖరారైంది. * ఆయన కుటుంబంలో 58 ఏళ్ల భార్య, 18 ఏళ్ల కుమార్తె ఉన్నారు. భార్యకూ కరోనా అనుమానిత లక్షణాలు ఉండటంతో అంటువ్యాధుల ఆసుపత్రికి తరలించారు. * గోపాలపట్నంలో ఉంటున్న తల్లి, ఇద్దరు సోదరులు సన్నిహితంగా ఉన్నట్లు తెలిసి వారినీ పరీక్షలకు తరలించారు. * మర్రిపాలెంలో ఆయన్ను పరీక్షించిన వైద్యుడు హోమ్‌ క్వారంటైన్‌లో ఉంటానని తెలిపారు. ఆ వ్యక్తి నిర్లక్ష్యానికి క‌రోనా ఎంత మందికి సోకిందోన‌ని ఏపీ, తెలంగాణా అధికారులు భ‌య‌ప‌డుతున్నారు. ఇప్ప‌ట్టికైనా క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డానికి మన కోసం...మనం బ్రతికే సమాజం కోసం అప్ర‌మ‌త్తంగా వుందాం.

కుటుంబ‌స‌భ్యుల‌తో స‌ర‌దాగా బీజేపీ నేత‌లు

బీజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ జనతా కర్ఫ్యూ లో భాగంగా కుటుంబంతో ఇంట్లో సమయాన్ని గడుపుతున్నారు. కుటుంబ‌స‌భ్యులతో స‌ర‌దాగా చెస్ ఆడుకున్నారు. ప్ర‌ధాని పిలుపు మేర‌కు ప్ర‌జ‌లంతా ఐక్య‌త ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా చెప్పారు. తెలంగాణా రాష్ట్రంలో ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం అయిందని ఆయ‌న అన్నారు. ఇలాంటి క‌ర్యాక్ర‌మాన్ని చేప‌ట్టి ప్ర‌పంచానికే మార్గ‌ద‌ర్శ‌కంగా ప్ర‌ధాని మోదీ నిలిచార‌ని సంజ‌య్ అభిప్రాయ‌ప‌డ్డారు. తెలంగాణా ఈ వైర‌స్ ఉధృతి పెరుగుతున్న నేప‌థ్యంలో సి.ఎం. ఇచ్చిన పిలుపు మేర‌కు 24 గంట‌లు పాటించ‌డం సంతోష‌క‌రమ‌ని ఆయ‌న అన్నారు. మాజీ అధ్య‌క్షులు డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్‌. మేమంతా ఇంటికే ప‌రిమితం అయ్యాం. మీరు కూడా ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌జ‌లు బ‌య‌టికి వెళ్ళ‌కుండా ఐక్య‌త ప్ర‌ద‌ర్శించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకున్న‌నిర్ణ‌యానికి ప్ర‌జ‌లంతా మ‌ద్ద‌తు తెలుపుతున్నార‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్‌ చెప్పారు.

విజయవాడ లో కరోనా పాజిటీవ్ కేసు

విజయవాడ నగరంలో మొదటి కరోనా పాజిటీవ్ కేసు నమోదైంది. దీంతో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. కరోనా పాజిటీవ్ కేసు నమోదైన ప్రదేశంలో దాదాపు 500 ఇళ్ళలో మెడికల్ చెకప్ లు చేస్తున్నారు. అంతే కాడు మూడు కిలోమీటర్లమేర ప్రజలను అప్రమత్తం చేశారు. ఎవరెవరిని కలిశాడో వారిని , ఇంట్లో వారివి శాంపిల్స్ కలెక్ట్చేశాము. ప్రైవేట్ టాక్సీలో వచ్చిన వ్యక్తిని కూడా పరిశీలిస్తున్నాం. ప్రైవేట్ క్యాబ్ హైదరాబాద్ నుంచి విజయవాడ, అక్కడినుంచి గుంటూరుకు ముగ్గురు ప్యాసింజర్లను తీసుకు వెళ్లిన‌ట్లు తెలిసింది. కరోనా పాజిటీవ్ కేసు రావడంతో సిటీని హై అలర్ట్ చేశారు. ఈ కర్ఫ్యూని ఇంకో రెండు రోజులు చేస్తే బాగుంటుందే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. అయితే సిటీలో 144 సెక్షన్ అమలులో ఉంది. విజయవాడ నుంచి గుంటూరు ప్రయాణించిన ప్రయాణికులు స్వచ్చందంగా ముందుకు రావాలని క‌లెక్ట‌ర్ పిలుపునిచ్చారు. స్వచ్చందంగా ప్రజలు గుమ్మికూడకుండా సహకరుంచాలని లేదంటే నిర్బందంగా అయినా చర్యలు తీసుకుంటామని క‌లెక్ట‌ర్ హెచ్చ‌రించారు. 

చప్పట్లు ఎందుకు కొట్టాలి? దీని వెనుక సైన్స్ వుందా?

జ్యోతిషశాస్త్రం అధ్యయనం చేసిన వారు, జ్యోతిషశాస్త్రం మరియు సైన్స్ పరిజ్ఞానం ఉన్నవారు ప్ర‌ధాని మోడీకి మార్గనిర్దేశం చేసివుంటార‌ట‌. ఎందుకంటే.... మార్చి 22 అమావాస్య. ఈ నెలలో చీకటి రోజు. అన్ని వైరస్, బ్యాక్టీరియా మరియు దుష్ట శక్తులు అటువంటి రోజుల్లో అంటే అమావాస్య రోజున గరిష్ట సామర్థ్యాన్ని మరియు శక్తిని కలిగి ఉంటాయి. ఒకేసారి 130 కోట్ల మంది 5 PM- చప్పట్లు కొట్టడంతో వైబ్రేషన్లను సృష్టించ‌బ‌డ‌తాయ‌ట‌. వైరస్ త‌న శక్తిని కోల్పోతుంది. సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టడం చాలా ఆసక్తికరంగా ఉంది. ఆ సమయంలో చంద్రుడు రేవతి అనే కొత్త 'నక్షత్రా'నికి వెళుతున్నాడు. ఆడటం మరియు చప్పట్లు కొట్టడం సంచిత కంపనం శరీరంలో రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. పర్వతాలపై పాత శక్తి దేవాలయాలలో వారు భారీ, గాంగ్ లాంటి గంటలు కలిగి ఉండటానికి కారణం ఇదేన‌ట‌. చాలా పరిజ్ఞానం ఉన్నవారే ప్ర‌ధాని మోడీకి మార్గనిర్దేశం చేస్తున్నారు. అందుకే మీరు కూడా త‌ప్ప‌కుండా చ‌ప్ప‌ట్లు కొట్ట‌డం మ‌ర్చిపోవ‌ద్దు.

నాంపల్లి రైల్వే స్టేషన్‌లో కరోనా కలకలం

నాంపల్లి రైల్వే స్టేషన్‌లో కరోనా కలకలం సృష్టించింది. ముంబై ఎక్స్‌ప్రెస్‌లో కరోనా లక్షణాలున్న వ్యక్తిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత‌ని చేతికి ఉన్న స్టాంప్‌ ఆధారంగా ప్రయాణికుడికి కరోనా లక్షణాలున్నట్టు రైల్వే పోలీసులు గుర్తించారు. వెంట‌నే అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసులు అతడిని ప్రశ్నించారు. ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ టైమ్ లో రైల్లో ప్రయాణించాడు, ఏ దేశం నుంచి వచ్చాడు అనే ప్రశ్నలు అడిగారు. అయితే ఆ వ్యక్తి మాత్రం నోరు విప్పలేదు. దీంతో అనుమానం వచ్చిన రైల్వే పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తే అస‌లు విష‌యాలు బ‌య‌టికి వ‌చ్చాయి. జ‌న‌తా క‌ర్ఫ్యూ రోజు తెల్ల‌వారుఝామున 22-3-20న 05.47 గంటలు tr. నెం .17031 ముంబై ఎక్స్. PF.NO లో వచ్చారు. HYB స్టేషన్ యొక్క 6. సైరామ్ బెర్త్ అనే ఒక ప్రయాణీకుడి నుండి వచ్చిన సమాచారం మీద .బి 1 కోచ్ ఫోన్ నంబర్: 9916482332, ఒక నిందితుడు (కోవిడ్ -19 బారిన పడ్డాడు) బెర్త్ నెం. అదే కోచ్‌లో 6 మందిని అదుపులోకి తీసుకున్నారు మరియు ధృవీకరణపై అతను తన పేరు మౌసిన్ అలీ వయస్సు 33 సంవత్సరాలు ఎస్ / ఓ అర్షద్ అలీ, మొరాదాబాద్, యుపికి చెందినవాడు. ఫోన్ నంబర్: 7567432757. 21.3.20 న లాగోస్ (నైజీరియా) నుండి అబుదాభి మీదుగా ముంబై చేరుకుంది. ఈ రైలులో హైడ్‌కు మరింత ప్రయాణించారు .అతని తల్లి తన అన్నయ్యతో కలిసి మంగళల్‌హట్, హెచ్‌వైడిలో ఉంటున్నారు. అతని ఎడమ చేతి మణికట్టు మీద హోమ్ దిగ్బంధం యొక్క స్టాంప్ ఉంది. అతన్ని పిఎఫ్‌లో ఒంటరిగా ఉంచారు. నం .5 & 6. ASC / SC, IPF / HYB మరియు GRP సిబ్బంది పాల్గొన్నారు. ర్యాలీ డాక్టర్ / హెచ్‌వైబి సూచన మేరకు నిందితుడిని 108 మందికి అప్పగించారు, చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి 07.25 త‌ర‌లించారు. హైదరాబాద్ మొజంజాహిమార్కెట్ కూడలి లో ట్రాఫిక్ డీసీపీ బాబురావు మరియు ట్రాఫిక్ సిబ్బందితో కలిసి జనతా కర్ఫ్యూ పై వాహన చోదకులు అవగాహన కలిపిస్తున్నారు. ప్లేయకార్డులు పట్టుకొని కోవిడ్ 19 మహమ్మారి పై అవగాహన కలిపిస్తున్న ట్రాఫిక్ పోలీస్‌లు త‌మ విధులు నిర్వ‌హిస్తున్నారు.

బుల్లెట్ కంటే క‌రోనానే ఎక్కువ భ‌య‌పెట్టింద‌ట‌!

జ‌న‌తా క‌ర్ఫ్యూ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఖాళీగా క‌నిపిస్తున్న రోడ్లు! నిర్మానుష్యంగా మారిన పాత‌బ‌స్తీ. బుల్లెట్ కంటే క‌రోనానే హైద‌రాబాదీల‌కు ఎక్కువ‌గా భ‌య‌ప‌ట్టించింద‌ట‌. మ‌త‌క‌ల‌హాలు జ‌రిగిన‌ప్పుడు క‌ర్ఫ్యూ వున్నా ఫైరింగ్ జ‌రుగుతుంద‌ని తెలిసినా జ‌నం రోడ్ల‌మీద‌కు వ‌చ్చి అల్ల‌ర్లు చేసేవార‌ట‌. బుల్లెట్‌ల‌ను కూడా లెక్క చేసేవారు కాద‌ట‌. అయితే క‌రోనా సంద‌ర్భంగా ప్ర‌క‌టించిన జ‌న‌తా క‌ర్ఫ్యూ స‌క్సెస్ చూస్తుంటే క‌రోనాతో ప్ర‌జ‌లు ఎంత ఆందోళ‌న చెందుతున్నారు అర్థ‌మ‌వుతుందంటున్నారు పోలీసులు. స్వ‌చ్ఛందంగా జ‌న‌తా క‌ర్ఫ్యూ ను అమ‌లు చేస్తూ జ‌నం ఎవ‌రూ బ‌య‌టికి రాలేదు. ఆదివారం అయినా హైద‌రాబాద్ ర‌ద్దీగానే క‌నిపిస్తోంది. ఎందుకంటే హాలిడే కాబ‌ట్టి చాలా మంది షాపింగ్ కోసం చార్మినార్ వైపే ప్ర‌యాణం చేస్తారు. పైగా రోడ్డు పైనే అతి త‌క్కువ ధ‌ర‌కు అన్ని ర‌కాల వ‌స్తువులు ల‌భించే అవ‌కాశం చార్మినార్ ప‌రిస‌ర ప్రాంతాల్లో దొరుకు తుంది. అందుకే జ‌నంతో ఓల్డ్ సిటీ ర‌ద్దీగా క‌నిపిస్తుంది. అయితే ఈ రోజు జ‌న‌తా క‌ర్ఫ్యూ కార‌ణంగా రోడ్ల‌న్నీ బోసి పోయి క‌నిపిస్తున్నాయి. జ‌నం బ‌య‌టకు రావ‌డం లేదు. గ‌తంలో ఎప్పుడో మ‌త‌క‌ల‌హాలు జ‌రిగిన‌ప్పుడు ఇలాంటి సీన్‌యే క‌నిపించేది. ఇప్ప‌డు క‌రోనా దెబ్బ‌కు జ‌నం భ‌య‌ప‌డి ఇళ్ల నుంచి బ‌య‌టికి రావ‌డం లేదు. ఎక్క‌డా వాహ‌నాలు క‌నిపించ‌డం లేదు. రోడ్ల‌పై అమ్ముకునే వ్యాపార‌స్థులు సైతం త‌మ వ్యాపారాల‌ను బంద్ చేసుకుని ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారంటే క‌రోనా భ‌యం జ‌నాన్ని ఏ మేర‌కు ప్ర‌భావం చూపిస్తుందో అర్థం చేసుకోవ‌చ్చు. మ‌రో వైపు ట్రాఫిక్ పోలీసులు చౌర‌స్తాల‌ వ‌ద్ద ప్లేయకార్డులు పట్టుకొని కోవిడ్ 19 మహమ్మారి పై అవగాహన కలిపిస్తున్న దృశ్యాలే క‌నిపిస్తున్నాయి కానీ జ‌నం ఎక్క‌డ రోడ్ల మీద క‌నిపించ‌డం లేదు. ఉద‌యం కేవ‌లం న్యూస్ పేప‌ర్‌, ఇళ్ల‌కు పాలు వేసే వారే రోడ్ల మీద క‌నిపించారు. హైదరాబాద్ మొజంజాహిమార్కెట్ కూడలి లో ట్రాఫిక్ డీసీపీ బాబురావు మరియు ట్రాఫిక్ సిబ్బందితో కలిసి జనతా కర్ఫ్యూ పై వాహన చోదకులు అవగాహన కలిపిస్తున్నారు. ట్రాఫిక్ పోలీస్‌లు త‌మ విధులు నిర్వ‌హిస్తున్నారు. గ‌తంలో మ‌త‌క‌ల‌హాలు జ‌రిగిన సంద‌ర్భంగా క‌ర్ఫ్యూ విధించిన‌ప్ప‌ట్టికీ జ‌నం గ్రూప్‌లు గ్రూప్‌లుగా ఒకే సారి రోడ్ల‌పైకి వ‌చ్చే వారు. పోలీసు ఫైరింగ్ చేస్తార‌నే భ‌యం కూడా లేకుండా వ‌చ్చే వారు. అయితే పోలీస్ బుల్లెట్ కంటే క‌రోనాకే ఓల్డ్ సిటీ ప్ర‌జ‌లు భ‌య‌ప‌డ్డార‌ని పోలీసులు ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటున్నారు.

కరోనా కారణంగా ఉద్యోగుల విధుల నిబంధనలు సడలించిన ఏ.పి . సర్కార్ 

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వ కార్యాలయాల్లో ను చర్యలు చేపడుతూ ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.   సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం, సచివాలయంలో సెక్షన్, అసిస్టెంట్ సెక్షన్ అధికారుల సహా దిగువ స్థాయి కేడర్ లోని ఉద్యోగులంతా రెండు గ్రూప్ లు గా ఏర్పడి ప్రత్యామ్నాయ వారాల్లో విధులకు హాజరు కావలసి ఉంటుంది. ఇంటి వద్ద నుంచే పని చేసేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం .అటు హెచ్ ఓ డి కార్యాలయాలు, జిల్లాల కార్యాలయాల్లో ను రెండు గ్రూప్ లు గా ఉద్యోగుల విధులకు హాజరు కావొచ్చని స్పష్టం చేసిన ప్రభుత్వం.గెజిటెడ్ అధికారులు మాత్రం విధులకు హాజరు కావాలని సాధారణ పరిపాలన శాఖ స్పష్టం చేసింది.  60 ఏళ్ల వయసు పైబడిన సలహాదారు లు, చైర్ పర్సన్లు ఇంటి వద్ద నుంచే పని చేయాలని ఆదేశాలు.50 ఏళ్ళు వయస్సు పైబడి శ్వాసకొస సమస్యలు, మధుమేహం లాంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్న అధికారులు ఏప్రిల్ 4 తేదీ వరకు  ధ్రువీకరణ లేకపోయినా ఇంటి వద్దే ఉండొచ్చని స్పష్టం చేసిన ప్రభుత్వం.ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించినట్టే కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం  స్పష్టం చేసింది.  ఉద్యోగులు కు 9.30, 10, 10.30 గంటల వేర్వేరు షిఫ్టు  లో హాజరుకు అనుమతి.ఇంటి వద్ద నుంచి పని చేసేందుకు అనుమతి లభించిన ఉద్యోగుల ఈ-ఆఫీసు ద్వారా విధులు నిర్వహించాలని జి.ఏ.డి. ఆదేశాలిచ్చింది. ఈ ఉత్తర్వులు అత్యవసర సేవల విభాగాలకు వర్తించవని స్పష్టం చేసిన ప్రభుత్వం.  రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థలకు , సహకార సంస్థలు, స్వతంత్ర్యప్రతిపత్తి కలిగిన సంస్థలకు వర్తిస్తుందని అదేశాల్లో పేర్కొన్న ప్రభుత్వం.తదుపరి ఉత్తర్వుల వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిర్యాదులు స్వీకరించబోమని స్పష్టం చేసిన ప్రభుత్వం. వీలైనంత మేరకు ప్రభుత్వం కార్యాలయంలోకి సందర్శకులను అనుమతి లేదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. సచివాలయం, హెచ్ ఓ డి కార్యాలయాలు, జిల్లా కార్యాలయాల్లో 50 శాతం మందికి విధులకు హాజరు అయ్యేలా, మరో 50 శాతం మంది ఇంటి వద్ద నుంచే పని చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు.ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 4 వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ.   

క‌రోనా నియంత్ర‌ణ‌కు హాంకాంగ్ రాజీలేని పోరాటం!

వీలైనంత దూరం పాటించండి. శుభ్రంగా వుండండి. ఆరోగ్య‌ప‌రంగా ఏమైనా అనుమానం వుంటే వెంట‌నే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించండంటూ హాంకాంగ్ ప్ర‌భుత్వం విస్తృత ప్ర‌చారం చేస్తోంది. మ‌న ఆరోగ్యంతో పాటు సామాజిక ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అంటు నినాదం ఇచ్చింది హాంకాంగ్ ప్ర‌భుత్వం. హాంకాంగ్‌లో ప‌రోక్షంగా క‌ర్ఫ్యూ అమ‌లులో వుంది. గ‌త రెండు నెల‌లుగా సామాన్య జీవ‌నంలో పూర్తిగా స్థంభించిపోయింది. ఎప్పుడు సంద‌డిగా క‌నిపించే ఈ దేశం బోసిపోయి క‌నిపిస్తోంది. అత్య‌వ‌స‌ర విభాగాలు త‌ప్ప మిగ‌తా వాటికి హాలిడే ప్ర‌క‌టించి ష‌ట్‌డౌన్ చేశారు. ఈ ప‌రిస్థితి మే వ‌ర‌కు కొన‌సాగనుందంటున్నారు.  విదేశాల్లో నుంచి వ‌చ్చిన వారంద‌రూ క్వారంటీన్ చేయాల్సిందేన‌ని హాంకాంగ్ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. విమానాశ్ర‌యంలోనే స‌ద‌రు వ్య‌క్తి చేతి మ‌ణిక‌ట్టుకు ఎల‌క్ట్రానిక్ బ్రేసెలెట్ తొడిగిస్తున్నారు. అత‌నికి చెందిన‌ ఫోన్‌లో స్టే హోం సేఫ్ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇస్తున్నారు. ఈ యాప్ ద్వారా వారిపై నిఘా పెట్టి ప‌రిశీలిస్తున్నారు. విదేశాల నుంచి వ‌చ్చిన వాళ్ళంద‌రూ క్వారంటీన్ చేయ‌డానికి ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసింది అక్క‌డి ప్ర‌భుత్వం.  హాంకాంగ్‌లో రోజు రోజుకు క‌రోనా వైర‌స్ బాధితుల సంఖ్య పెరుగుతున్న‌ప్ప‌ట్టికీ పూర్తిగా అదుపులో వుంద‌ని హాంకాంగ్ ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌టించింది.  రానున్న రెండు మూడు వారాల్లో వ‌చ్చే విదేశీయుల‌తో జాగ్ర‌త్త‌గా వుండేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. అంతే కాదు స్థానికులు  జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌ల‌ని ప్ర‌భుత్వం హెచ్చ‌రిస్తోంది.  అవ‌స‌ర‌మైతే ఇత‌ర దేశాల నుంచి వారిపైనే ఆంక్ష‌లు పెట్టే అంశాన్ని కూడా హాంకాంగ్ ప్ర‌భుత్వం ఆలోచిస్తోంది.  మ‌రో ప్ర‌క్క ప్ర‌జ‌లు ఇంటి వ‌ద్ద నుంచే ప‌ని చేస్తున్నారు. విద్యార్థులు ఆన్‌లైన్ స్కూలింగ్ చేస్తున్నారు. టీచ‌ర్లు ప్ర‌త్య‌క క్లాస్‌ల‌ను ఆన్‌లైన్‌లో బోధించ‌డానికి కొత్త విద్యావిధానాన్ని అమ‌లుచేస్తున్నారు. షాపింక్‌మాల్స్‌, సూప‌ర్‌మార్కెట్‌ల‌ను ఎప్ప‌ట్టిక‌ప్పుడు శానిటైజ్ చేస్తూ జాగ్ర‌త్త‌లు పాటిస్తున్నారు.  రోజువారీగా చిన్న ఉద్యోగాలు చేసేవారు షాపులు మూసివేయ‌డం వ‌ల్ల వారు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. సామాన్య ప్ర‌జ‌లు ఇలాంటి వారికి స‌హాయం చేయ‌డానికి ముందుకు వ‌స్తున్నారు.  వారికి అవ‌స‌ర‌మైన నిత్యావ‌స‌ర వ‌స్తువుల్ని అందిస్తూ హాంకాంగ్ రూల్ మోడ‌ల్‌గా ఆద‌ర్శంగా నిలుస్తోంది.  ఇప్పటి దాకా కరోనా వైరస్‌ కేవలం మనుషుల్లోనే వ్యాప్తి చెందుతుందని తెలుసు. కానీ హాంకాంగ్‌లో ఓ పెంపుడు కుక్కకు కరోనా సోకింది.  ఇది మ‌నిషి నుంచి జంతువుకా, లేదా జంతువు నుంచి మ‌నిషి వ‌చ్చిందా?  దీనిపై ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి.  హాంకాంగ్ లో కోవిడ్-19 రోగి అయిన 60 ఏళ్ళ మహిళ పెంపుడు కుక్కకు కూడా ఈ వైరస్ సోక‌డంతో హాంకాంగ్ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మై జంతువుల‌పైన కూదా దృష్టి పెట్టింది. ఆ పెంపుడు కుక్క‌కు టెస్టులు జరపగా  'వీక్ పాజిటివ్' లక్షణాలున్నట్టు తేలింది. దీంతో దాన్ని జంతువుల క్వారంటైన్ కు పంపించి   క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో దానికి బలహీన స్థాయిలో కరోనా వైరస్ ఉందని రిపోర్ట్ వ‌చ్చింది. ఆ త‌రువాత ఆ కుక్క చ‌నిపోయింది. దీనిపైన సీరియ‌స్‌గా ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి.

గవర్నర్ సాబ్... నా పదవిని కాపాడండి: ఏ పీ పీ ఎస్ సి చైర్మన్ 

* కరోనా వైరస్ రాక ముందే , క్వారంటైన్ అయిన ఉదయ్ భాస్కర్  * టీ  డీ పీ హయాం లో నియమితులైన ఆరుగురు సభ్యులూ కూడా , ఇపుడు చైర్మన్ ను పట్టించుకోవటం లేదు  తనపై రాష్ట్ర ప్రభుత్వం కత్తి కట్టిందని ఆరోపిస్తున్న ఈయన పేరు ఉదయభాస్కర్ . హోదా  ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్   సర్వీస్ కమిషన్ చైర్మన్.  అంటే ఏ పీ పీ ఎస్ సి అనే ఒక  రాజ్యాంగ బద్ధ సంస్థ కు ఈయన పెద్ద దిక్కన్న మాట.  అయితే,ఇప్పుడు  ఆయనకే  దిక్కు లేకుండా పోయిన పరిస్థితి.  ఏమి చేయాలో పాలు పోనీ పరిస్థితి లో ఆయన రాజ్ భవన్ మెట్లెక్కారు. ఒక మూడు పేజీల వినతిపత్రం కూడా  సమర్పించారు. తనను  నాలుగు నెలల క్రితమే, ఈ ప్రభుత్వం ' ఐసొలేట్ '  చేసిందనీ,తనకు ఆఫీసు లో ఒక గది మినహా,  పీఏ, అటెండర్లు కూడా లేకుండా చేసిందనీ ఉదయ్ భాస్కర్ వాపోయారు. తాను  చేయాల్సిన పనులూ సెక్రటరీతోనే  చేయిస్తున్నారని,ఫైళ్లపై సభ్యులు గుడ్డిగా సంతకాలు చేస్తున్నారనీ ఉదయ్ భాస్కర్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు వివరించారు. తానుండగానే ఇన్‌చార్జ్‌ చైర్మన్‌ నియామకం జరిపితే, కోర్టుకెళ్లిన విషయాన్నీ కూడా ఉదయ్ భాస్కర్ గవర్నర్ ముందు ప్రస్తావించారు.  నిజానికి, వచ్చే సంవత్సరం నవంబర్ వరకూ ఉదయ్ భాస్కర్ పదవీ కాలం ఉన్నప్పటికీ, ఆయనకు  పనిచేసే వాతావరణం అక్కడ   లేదనీ, అయినా కూడా నాలుగు నెలలుగా భరిస్తున్నాననీ, సహిస్తున్నాననీ ఆయన గవర్నర్ కు  వివరించారు. వాస్తవానికి ఏ పీ పీ ఎస్ సి చైర్మన్ ను   తొలగించాలంటే, ముందుగా గవర్నర్ నోటీస్ లో  పెట్టాలి,  ఆ తర్వాత చైర్మన్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించినట్టుగా  ఒకవేళ గవర్నర్  భావిస్తేదానిపైన , తదుపరి చర్యల నిమిత్తం రాష్ట్రపతి దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లాలి. దాన్ని , రాష్ట్రపతి  కార్యాలయం సుప్రీం కోర్టు నోటీస్ లో  పెట్టిన తర్వాత, అప్పుడు  సుప్రీమ్ కోర్టు తన నిర్ణయం  వెల్లడిస్తుంది.   ఇంత ప్రొసీజర్  ఉండగా,రాష్ట్ర ప్రభుత్వం ఉదయ్ భాస్కర్ ను  పూర్తిగా పక్కన పెట్టేసి, కార్యదర్శి తోనే కథ నడిపేస్తోంది. ఈ  మొత్తం వ్యవహారాన్ని ఉదయ్ భాస్కర్  గవర్నర్ దృష్టి కి  తీసుకెళితే, తగు విచారణ జరిపించి వాస్తవాలు కనుక్కుంటానని గవర్నర్ ఆయనకు హామీ ఇచ్చినట్టు  తెలిసింది.  మొత్తానికి,ఈ వ్యవహారం లో  మనకు బోధ పడే విషయమేమిటంటే , కరోనా వైరస్ రాక ముందే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ఏ పీ పీ ఎస్ సి చైర్మన్ ఉదయ్ భాస్కర్ ను క్వారంటైన్ చేసిందనే విషయం. ఏ మాటకా మాట చెప్పాలి ధర్మ ప్రభువులు, ఏమి చేసినా చాలా పద్ధతిగా,  వివరంగా,ఇంకా వైనంగా చేస్తారు. 

క‌రోనా స్పెష‌ల్ ఆఫర్లు ప్ర‌క‌టించిన జియో, ఈరోస్ నౌ!

ఈరోస్ నౌ యాప్ ప్రజలకు బంపరాఫర్ ప్రకటించింది. రాబోయే రెండు నెలలు ఉచితంగా వాడుకునే అవకాశాన్ని వినియోగదారులకు కల్పిస్తోంది. ఈ యాప్ లో ఎవరైతే 'స్టే ఫ్రీ' అని ఇంగ్లీష్ కోడ్ ఉపయోగిస్తారో వాళ్లకు రెండు నెలలు యాప్ లోని సినిమాలు.. ప్రోగ్రామ్స్, రియాలిటీ షోలను ఉచితంగా పొందవచ్చు. కాగా, ఇదే పద్దతిలో అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ వంటి అప్లికేషన్స్ కూడా ప్లాన్స్ రెడీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఇంటి నుంచి పని చేసేవారికి అదనపు ప్రయోజనాలను కలిగిస్తూ నూతన 4జీ డేటా వోచర్లను తాజాగా ప్రకటించింది. 4జీ సౌకర్యంతో పాటుగా టాక్‌టైమ్‌ను రూ. 11 నుంచి రూ. 101 ప్లాన్స్ వరకు అందుబాటులో ఉంచింది. ఒకసారి అధిక వేగంతో డేటా ముగిసిన తర్వాత 64 కేబీపీఎస్‌తో అపరిమితంగా ఇంటర్నెట్‌ను ఉపయోగించుకునే సౌక‌ర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది జియో. కేవ‌లం 11 రూపాయ‌ల‌కు - 800ఎంబీ డేటా.. 75 నిమిషాల టాక్‌టైమ్‌. 21 రూపాయ‌ల‌కు - 2జీబీ డేటా.. 200 ని.టాక్‌టైమ్‌, 51 రూపాయ‌ల‌కు - 6జీబీ డేటా.. 500 ని.టాక్‌టైమ్‌, 101 రూపాయ‌ల‌కు - 12 జీబీ డేటా.. 1000 ని.టాక్‌టైమ్ అందిస్తున్నారు. అయితే రూ.251 వోచర్‌కు మాత్రం అదే పాత ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రాకుండా ఇంటి నుంచి పని చేయాలని కోరిన నేప‌థ్యంలో గత కొద్దిరోజులుగా ఇండియా అంతటా భారీగా ఇంటర్నెట్ వినియోగం పెరిగింది.

ఏపీకి పధ్నాలుగో ఆర్థిక సంఘం నిధులు వ‌చ్చాయ‌ట‌!

పధ్నాలుగో ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు మూడు రాష్ట్రాలకు పట్టణ స్థానిక సంస్థలకు ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 1600 కోట్లుకుపైగా విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి రూ. 431 కోట్లు ఉన్నాయి. వీటిని రాష్ట్ర ఖాతాలో జమ చేసినట్లుగా.. కేంద్రం సమాచారం పంపింది. అది విష‌యం. మార్చి 31లోపు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం వల్ల పధ్నాలుగో ఆర్థిక సంఘం నిధులు రావని వైసీపీ నేతలు ఆందోళన చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు. నిజానికి మున్సిపల్ ఎన్నికలు ఏపీలో జరగలేదు. వాయిదా పడ్డాయి. నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తి కాలేదు. అయినప్పటికీ..దీన్నేమి పట్టించుకోకుండా.. కేంద్రం నిధులు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి తాజా వ‌చ్చిన ఈ 431 కోట్ల రూపాయ‌ల ఆర్థిక సంఘం నిధులను పదిహేను రోజుల్లో స్థానిక సంస్థల ఖాతాకు బదిలీ చేయాల్సి ఉంటుంది. లేకపోతే.. ఆర్బీఐ వడ్డీ వసూలు చేస్తుంది. ఇప్పుడు మున్సిపల్ కోటాకు సంబంధించిన నిధులను విడుదల చేశారు.. త్వరలో మండల, పంచాయతీలకు సంబంధించిన నిధులను కూడా విడుదల చేస్తార‌ట‌. మొత్తంగా ఏపీకి పధ్నాలుగో ఆర్థిక సంఘం ద్వారా.. రూ. 3,500 కోట్ల నిధులు స్థానిక సంస్థలకు వస్తాయన్న అంచనా ఉంది.

రాజకీయ నేతల ప్రమేయం వల్లే ఆయేషాకు న్యాయం దొర‌క‌లేదు!

పన్నెండేళ్ల క్రితం అత్యాచారం, హత్యకు గురైన తన కుమార్తెకు ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆయేషా తల్లి శంషాద్ బేగం ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆయేషా హత్య కేసులో రాజకీయ నేతల ప్రమేయం వల్లే న్యాయం జరగలేదని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేలా ప్రత్యేక చట్టాలు తేవాలని ఆమె ఆకాంక్షించారు. సీపీ సీపీ సజ్జనార్ లాంటి పోలీసు అధికారి తమ కుమార్తె కేసు దర్యాప్తు చేసి ఉంటే తమకు న్యాయం జరిగి ఉండేదేమోనని ఆమె అన్నారు. దిశపై హత్యాచారానికి పాల్పడిన నిందితులందరూ సామాన్యులని.. అందుకే ఎన్‌కౌంటర్ చేయగలిగారని అన్నారు. ఎలాంటి రాజకీయ అండదండలు లేకపోవడంతో నిందితులను ఈజీగా కాల్చి చంపేశారన్నారు. ప్రాంతీయ, కులతత్వం, హోదా, డబ్బువల్లే తమ కుమార్తె కేసును నీరుగార్చారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసినా న్యాయం జరగలేదని అన్నారు. ఆయేషా కేసులో పోలీసులే నిందితులని ఆమె అన్నారు. బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరాను తన హాస్టల్‌లోనే అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన 2007లో విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం ఉమెన్ హాస్టల్‌లో జరిగింది. అప్పట్లో ఆయేషా మీరా హత్యాచార ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆ కేసులో అసలైన నిందితులను రాజకీయ నాయకుల ప్రమేయంతో తప్పించారని.. తమకు న్యాయం చేయాలని ఆయేషా తల్లి శంషాద్ బేగం కోరుతున్నారు. దాదాపు 12 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలన సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యాచారం కేసును ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఆయేషా మీరా హత్యాచారానికి గురైంది. నిర్బయ చట్టం తీసుకొచ్చారని దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. దేశం ధనికులు, పేదలు అనే రెండు వర్గాలుగా చీలిపోయిందన్నారు. తన కుమార్తె పేరుతో ఎలాంటి చట్టాలు తీసుకురాలేదని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న కుమార్తె కేసులోనూ నేరస్థులను పట్టుకుని, సీబీఐ ద్వారా శిక్ష వేయిస్తే చాలా గర్విస్తామని అన్నారు. తన కుమార్తె పేరుతో ఆయేషా చట్టాన్ని ముఖ్య‌మంత్రి జగన్ తీసుకురాగలరా? అని ఆమె ప్రశ్నించారు.

ఇండోనేషియ‌న్లు పెట్టిన చిచ్చు.. కరీంనగర్‌లో 76వేల మందికి స్క్రీనింగ్

ఇండోనేషియా నుంచి వచ్చిన వారు 70మంది కలిసినట్టు అధికారులు గుర్తించారు. ఇంటింటికీ వెళ్లి అనుమానితులను వైద్య బృందాలు గుర్తిస్తున్నాయి. మూడు రోజుల్లో ఎవరెవరిని కలిశారు? ఏయే ప్రాంతాల్లో సంచరించారు? అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కలెక్టరేట్‌‌కు అతి సమీపంలోని మ‌సీదుల‌కు వెళ్లినట్లుగా తెలుస్తోంది. మార్చి 14,15 తేదీల్లో పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లోనూ వీరు సంచారించారని అధికారులు గుర్తించారు. ఇంకా వీరు తిరిగిన ప్రాంతాలను తెలుసుకునేందుకు పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. తెలంగాణలో కరోనా వైరస్ చాప కింద నీరులా విజృంభిస్తోంది. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇక ఇండోనేషియన్ల పుణ్యమా అని కరోనా వైరస్ కరీంనగర్ కు పాకింది. ఇండోనేషియా నుంచి కరీంనగర్ కు వచ్చిన మత ప్రచారకుల బృందంలో 9మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. కరోనా సోకిన ఇండోనేషియన్లు కరీంనగర్ లో బస చేశారు. కరీంనగర్ నగరంలో కరోనా బాధితులను గుర్తించే పనిలో బిజీగా ఉన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో కరీంనగర్ ను జల్లెడ పడుతున్నారు. కరీంనగర్‌లో 50 వేల మందికి పరీక్షలు చేశాం. అయితే ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. ప్రజలకు అసౌకర్యం కలగొద్దని కరీంనగర్‌ పర్యటన వాయిదా వేసుకున్నానని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలిపారు. ఇండోనేషియన్లు ఎక్కడెక్కడ తిరిగారో విచారణ చేస్తున్నాం. ఎయిర్‌పోర్టులు, పోర్టులు మూసివేయాలని ప్రధానికి చెప్పాను. ఒకేసారి మూసివేయడం కూడా సాధ్యం కాదని సి.ఎం. చెప్పారు.

క‌రోనాను టెస్ట్‌ క్రికెట్‌తో పోల్చిన టెండూల్క‌ర్‌

భారత దేశంలో ఇప్పటికే 294 మందికి కరోనా సోకగా.. నలుగురు మృత్యువాత పడ్డారు. శ‌ర‌వేగంతో విస్త‌రిస్తున్న క‌రోనాను అడ్డుకోవ‌డానికి టెస్టు క్రికెట్ మ్యాచ్ త‌ర‌హాలో సిద్ధం కావాల‌ని స‌చిన్ అంటున్నారు. పిచ్‌ పరిస్థితులను, బౌలర్‌ శైలిని మనం అర్థం చేసుకుని సుదీర్ఘంగా బ్యాటింగ్‌ చేయాలి. ఇక్కడ అత్యంత రక్షణాత్మకంగా ఆడటం కూడా చాలా ముఖ్యం. ప్రస్తుత ప్రపంచానికి కావాల్సిందే ఓర్పు. కరోనాపై మనల్ని రక్షించుకోవాలంటే ఎంతో ఓపిక అవసరం' అని సచిన్‌ వివరించారు. ఈ పోరులో ప్రజలందరికీ సహనం, సమష్టితత్వం, అప్రమత్తత అవసరమని సచిన్‌ తెలిపారు. వైరస్‌ సోకకుండా, వ్యాప్తి చెందకుండా ప్రజలంతా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వాల సూచనలను తప్పకుండా పాటించాలని కోరారు. 'జనతా కర్ఫ్యూ'కు అందరూ సహకరించాలని కోరారు. అంతా కూడా స్వీయ నిర్భందాన్ని పాటించాలన్నారు. అంతకుముందు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) 'సేఫ్‌ హ్యాండ్స్‌' చాలెంజ్‌ను సచిన్ స్వీకరించారు. చాలెంజ్‌లో భాగంగా తన చేతులను శుభ్రం చేసుకుంటున్న వీడియోను సచిన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. దాదాపు 20 సెకండ్లు సచిన్ చేతులు శుభ్రం చేసుకున్నారు.