మాధవీలత కు బీఫామ్ ఇవ్వని బీజేపీ.. అభ్యర్థిని మారుస్తుందా?

అనూహ్యంగా హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా తెరమీదకు వచ్చిన మాధవీలత కు పార్టీ హైకమాండ్ ఇంకా బీఫామ్ ఇవ్వలేదు. దీంతో ఎంత అనూహ్యంగా తెరమీదకు వచ్చారో.. అంతే అనూహ్యంగా తెరమరుగు కానున్నారా? అన్న సందేహాలు బీజేపీ వర్గాలలోనే వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకూ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ వారిలో నలుగురికి తప్ప మిగిలిన వారందరికీ బీఫారంలు అందజేసింది. పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, నల్గొండ నుంచి సైదిరెడ్డి, హైదరాబాద్ నుంచి మాధవీలతలకు పార్టీ బీఫారంలు నిలిపివేసింది. వీరిలో  గోమాస శ్రీనివాస్, సైదిరెడ్డిను మారుస్తారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్  బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు.  ఇక సైదిరెడ్డి విషయంలో బీజేపీ నేతల్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆయన స్థానొంలో తేరా చిన్నపరెడ్డిని ఖరారు చేసే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే సీతారాం నాయక్ విషయంలో కూడా పార్టీ హైకమాండ్ అసంతృప్తితో ఉంది. ఆయన ప్రచారం కూడా చేయడం లేదని అంటున్నారు. అయితే మాధవీలతకు బీఫారం నిలిపివేయడం పట్లే బీజేపీ వర్గాల్లో సైతం విస్మయం వ్యక్తం అవుతోంది.  పార్టీ సభ్యత్వం కూడా లేని మాధవీలతను బీజేపీ హైదరాబాద్ అభ్యర్థిగా ప్రకటించిన అధిష్ఠానం.. ఆమె బీజేపీ గూటికి చేరి, జోరుగా కూడా ప్రచారం ప్రరంభించేసిన అనంతరం ఇలా బీఫారం నిలిపివేయడానికి కారణమేమిటన్న చర్చ విస్తృతంగా జరుగుతోంది.  అయతే మాధవీలత భర్తకు చెందిన ఓ ఆసుపత్రిపై కరోనా సమయంలో వచ్చిన ఆరోపణల కారణంగానే మాధవీలతకు బీజేపీ హైకమాండ్ బీఫారం నిలిపివేసిందన్న చర్చ జరుగుతోంది. అయితే ఆ ఆసుపత్రిపై  కరోనా సమయంలో వచ్చిన ఆరోపణలు ఇప్పుడు కొత్తగా బీజేపీ అధిష్ఠానం దృష్టికి వచ్చిందా అని మాధవీలత మద్దతు దారులు నిలదీస్తున్నారు. మొత్తం మీద ప్రచారంలో దూసుకుపోతు... హైదరాబాద్ నియోజకవర్గంలో గెలుపు అవకాశాలను మెరుగుపరుచుకుంటున్న మాధవీలతకు హైకమాండ్ బీఫారం నిలిపివేయడంతో బీజేపీ క్యాడర్ లో అయోమయం నెలకొంది. 

ఆ నియామకాలు చెల్లవు.. వేతనాలు వెనక్కిచ్చేయాలి.. కోల్ కతా హైకోర్టు తీర్పు

పశ్చిమ బెంగాల్‌  రాజకీయాలను కుదిపేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో కోల్ కతా హైకోర్టు   సోమవారం (ఏప్రిల్ 22) సంచలన తీర్పు వెలువరించింది. 2016 నాటి రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష నియామక ప్రక్రియ చెల్లదని పేర్కొంటూ ఆ పరీక్ష, ఆ నియామకాలను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. అంతే కాకుండా ఆ టెస్ట్ లో పాసై ఉద్యోగాలలో చేరిన ఉపాధ్యాయులంతా తమ తమ వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది.   ప్రభుత్వ , ఎయిడెడ్‌ పాఠశాలల్లో 9 నుంచి 12 తరగతులకు ఉపాధ్యాయులతో పాటు గ్రూప్‌ సి, గ్రూప్‌ డి స్టాఫ్‌ సిబ్బంది నియామకాల కోసం 2016లో బెంగాల్‌ సర్కారు రాష్ట్ర స్థాయి సెలక్షన్‌ పరీక్ష నిర్వహించింది.  24,650 ఖాళీల భర్తీ కోసం చేపట్టిన ఈ రిక్రూట్‌మెంట్‌ పరీక్షకు 23 లక్షల మందికి పైగా హాజరయ్యారు. అనంతరం  ఎంపిక ప్రక్రియ చేపట్టి  25,753 మందిని ఎంపిక చేసి నియామకపత్రాలు అందజేశారు. అయితే ఈ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి, ఆరోపణలు వచ్చాయి.  న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ పిటిషన్లపై విచారణ నిమిత్తం కోల్‌కతా హైకోర్టులో ప్రత్యేక డివిజన్‌ బెంచ్‌ ఏర్పాటైంది. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన ఈ ధర్మాసనం, 2016 నాటి టీచర్ల నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని నిర్ధారించి  తీర్పు వెలువరించింది. తక్షణమే ఆ నియామకాలను రద్దు చేసి కొత్త నియామక ప్రక్రియ ప్రారంభించాలని పశ్చిమ బెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌కు సూచించింది. నాటి వ్యవహారంపై మరింత సమగ్ర దర్యాప్తు జరిపి మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.  2016 ఉపాధ్యాయ నియామక ప్రక్రియతో ఉద్యోగాలు పొందిన టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది నాలుగు వారాల్లోగా తాము అందుకున్న వేతనాలను తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. ఆ డబ్బు వసూలు బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని సూచించింది. ఈ కుంభకోణానికి సంబంధించిన కేసులో  పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మాజీ మంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పార్థా ఛటర్జీ ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

లోకేష్ దే మంగళగిరి!

మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ముందే విజయం ఎవరిదో ఖరారైపోయింది. ఈ విషయంలో ఇంకా నమ్మని వాళ్లెవరైనా ఉంటే.. ప్రచారంలో భాగంగా అధికార పార్టీ అభ్యర్థికి అడుగడుగునా ఎదురౌతున్న పరాభవాల పరంపరను చూస్తే అర్ధమైపోయింది. మంగళగిరి నియోజవకర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి అంతగా అచ్చిరాని మంగళగిరి నియోజకర్గాన్ని లోకేష్ తొలి సారి ఎంచుకుని పోటీకి దిగినప్పుడే చాలా మంది అరెరె ఎందుకిలా అనుకున్నారు. అయితే సవాళ్లను స్వీకరించి పోరాడటమే తన నైజమని చాటుతూ 2019 ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ పోటీ చేశారు. ఆ ఎన్నికలలో ఆయన వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు.  సాధారణంగా ఎన్నికలలో ఓడిపోయిన అభ్యర్థి మళ్లీ ఎన్నికలు వచ్చే వరకూ నియోజకవర్గంలో కనిపించడం అరుదు. అయితే నారా లోకేష్ అందుకు భిన్నం. పరాజయం పాలైన నియోజకవర్గం నుంచే మళ్లీ పోటీ చేస్తానని ప్రకటించి ఈ ఐదేళ్లూ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకునే ఉన్నారు.  ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధికి అంకితమై మంగళగిరి ప్రజలకు అండగా నిలిచి వారి గొంతుకలా మారి అధికార వైసీపీ అక్రమాలూ, దౌర్జన్యాలను ప్రశ్నించారు. నిలదీశారు.  గత ఐదేళ్లలో వివిధ సమస్యలపై ప్రస్తుత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని లోకేష్ నిరంతరం ప్రశ్నించారు. లోకేష్ చిత్తశుద్ధిని గమనించిన  మంగళగిరి ప్రజలు  ఈ సారి తమ ఓటు లోకేష్ కే అన్న నిర్ణయానికి ఎప్పుడో వచ్చేశారు. మంగళగిరిలో లోకేష్ ఆదరణను గమనించిన వైసీపీ అక్కడ ఒకరు కాదు, ఇద్దరు  అభ్యర్థులను మార్చి చివరికి మురుగుడు లావణ్యను పార్టీ అభ్యర్థిగా నిలిపింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే లోకేష్ పై విజయం సాధించడం సాధ్యం కాదని భావించిన వైసీపీ అధినేత జగన్, తెలుగుదేశం పార్టీ నుంచి గంజి చిరంజీవిని చేర్చుకుని మరీ ఆయనను పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. మళ్లీ ఆయనను కూడా కాదని  మురుగుడు లావణ్యను పోటీకి దింపింది. ఈ మార్పులూ చేర్పులూ ఏవీ నియోజకవర్గ ప్రజలలో లోకేష్ పై ఉన్న అభిమానాన్ని ఇసుమంతైనా తగ్గించలేకపోయాయి. నియోజకవర్గం మొత్తం లోకేష్ వైపు మొగ్గు చూపుతోందని ఎన్నికల ప్రచారం సందర్భంగా లోకేష్ కు అడుగడగునా లభిస్తున్న జననీరాజనమే సాక్ష్యంగా నిలుస్తోంది. తాజాగా వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య  ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓట్లడుగుతున్న సందర్భంలో  ఓ వృద్ధురాలు తన  ఓటులోకేష్‌కే అని కుండబద్దలు కొట్టడమే కాకుండా, జగన్  పథకాల కంటే లోకేష్ వల్లనే ఎక్కువ లబ్ధి పొందుతామని తెగేసి చెప్పింది. అందుకు సంబంధించిన వీడియో  ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  

జగన్ పై గులకరాయిదాడి కేసులో దుర్గారావు నిర్దోషి!

జగన్ మెప్పు కోసం అత్యుత్సామం ప్రదర్శించిన బెజవాడ పోలీసులు చివరకు తప్పు తెలుసుకుని దిద్దుకునే పనిలో పడ్డారా అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇటీవల జగన్ పై జరిగిన గులకరాయి దాడి కేసులో ఏ2గా పేర్కొంటూ అదుపులోనికి తీసుకున్న దుర్గారావును విచారణ అనంతరం నిర్దోషిగా తేల్చి వదిలేశారు.  ఇటీవల విజయవాడలో జగన్ బస్సు యాత్ర సందర్భంగా ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు గులకరాయితో దాడి చేశారు. దాడి జరిగిన క్షణం నుంచీ వైసీపీ నేతలు దాడి వెనుక తెలుగుదేశం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆరోపణలు గుప్పించారు. ఈ దాడి ద్వారా సానుభూతి పొంది ఎన్నికలలో లబ్ధి పొందాలని తహతహలాడారు. పోలీసులు కూడా ఈ కేసులో తెలుగుదేశం వారిని ఇరికించేందుకు అత్యుత్సాహం చూపారు. దాడి కారకులను పట్టిస్తే రెండు లక్షల రివార్డు అని ఆర్భాటంగా ప్రకటించిన పోలీసులు వారంతట వారే దాడికి పాల్పడ్డాడంటూ ఇద్దురు యువకులను అరెస్టు చేశారు. వారిలో సతీష్ అనే వడ్డెర కాలనీకి చెందిన యువకుడిని ఏ1గా పేర్కొన్నారు.  అతడిని అరెస్టు చేసి కోర్టు ఆదేశాల మేరకు నెల్లూరు జైలుకు రిమాండ్ కు తరలించారు. ఇక ఈ కేసులో ఎ2గా దుర్గారావు అనే వ్యక్తిని పేర్కొని అతడిని అదుపులోనికి తీసుకుని విచారించారు.  తెలుగుదేశం కార్యాలయంలో పని చేసే దుర్గారావును అరెస్టు చేసి  జగన్ పై గులకరాయి దాడి వెనుక తెలుగుదేశం హస్తం ఉందనే సంకేతాలు ఇచ్చారనీ, వైసీపీ వారు దుర్గారావు అరెస్టును పేర్కొంటూ దాడి వెనుక ఉన్నది తెలుగుదేశం అంటూ విమర్శలు గుప్పించారు. అయితే ఆ విమర్శలను తెలుగుదేశం గట్టిగా ఖండించింది. ఈ కేసులో బొండా ఉమను అరెస్టు చేసి ఆయన నామినేషన్ వేయకుండా అడ్డుకుని వెల్లంపల్లికి లైన్ క్లియర్ చేయాలన్న కుట్ర ఉందని ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం, వైసీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ తరుణంలోనే గులకరాయిదాడి కేసులో దుర్గారావు నిర్దోషి అని పేర్కొంటూ పోలీసులు అతడిని విడుదల చేశారు. విచారణ పేరుతో దుర్గారావును బెదరించి అయినా నేరం చేసినట్లు అంగీకరించేలా చేయాలన్న దుష్ట పన్నాగం పారనందుకే   దుర్గారావు నిర్దోషి అని ప్రకటించి విడుదల చేరని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇలా ఉండగా విచారణ పేరుతో తనను బెదరించి రాయిదాడికి పాల్పడినట్లు ఒప్పుకోవాలని పోలీసులు తీవ్రంగా ఒత్తిడి చేశారని విడుదల అనంతరం దుర్గారావు చెప్పారు. అయితే తాను బలంగా నిలబడ్డాననీ, చేయని నేరాన్ని అంగీకరించేది లేదని స్పష్టంగా చెప్పాననీ దుర్గారావు అన్నారు.  

చంద్రబాబు సభలకి వెళ్తే చంపేస్తారా?

ఈ వైసీపీ పిశాచాలు ఎంతకి తెగించాయంటే, చంద్రబాబు సభలకి వెళ్తున్న వారిని చంపడానికి కూడా వెనుకాడటం లేదు. ఇలాంటి దారుణాలను ఇంతవరకు ఏ దేశ రాజకీయల్లోనూ కనీవినీ ఎరుగం. నమ్మశక్యం అనిపించకపోయినప్పటికి ఇది నిజం.  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోడూరు పంచాయితీ, వెంకటేశ్వర పాలేనికి చెందిన పామంజి శ్రీరాములు అనే వ్యక్తి తెలుగుదేశం కార్యకర్త. నెల్లూరు జిల్లాలో ఎక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యక్రమం జరిగినా తప్పకుండా హాజరవుతాడు. శనివారం నాడు పొదలకూరులో చంద్రబాబు నాయుడు బహిరంగ సభ జరిగింది. ఈ సభకు పామంచి శ్రీరాములు తన స్నేహితులతో కలసి వెళ్ళాడు. సభ ముగిసిన తర్వాత స్వగ్రామానికి చేరుకున్న శ్రీరాములు మీద స్థానిక వైసీపీ కార్యకర్త ఈశ్వరయ్య మరో నలుగురితో కలసి దాడి చేశాడు. కత్తులతో దాడి చేయడంతో శ్రీరాములు తీవ్రంగా గాయపడి, ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సభలుగానీ, కూటమిలో భాగస్వాములుగా వున్న జనసేన, బీజేపీ నాయకుల సభలు గానీ భారీ స్థాయిలో విజయవంతం అవుతున్నాయి. జగన్ చేపట్టిన బస్సు యాత్రలు జనం లేక వెలవెలబోతున్నాయి. ఈ అక్కసు కూడా ఇలాంటి హత్యాయాత్నాలు చేయడానికి కారణాలుగా మారుతున్నాయి. 

బస్సు యాత్ర తుస్సు.. జగనన్న సీరియస్సు!

జగనన్న వస్తున్నాడంటేనే జనం ఆ ఏరియాల నుంచి పారిపోతున్న పరిస్థితి. ఆయనగారు వస్తున్నాడంటే పోలీసుల హడావిడి, అనుమానితుల పేరుతో అరెస్టులు.. పైగా ఆయన చెప్పే అబద్దాలు వినలేక అవస్థలు. ఈ గోలంతా ఎందుకని జనం ఆయన సభలకు దూరంగానే వుంటున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో జగన్ చేస్తున్న బస్సు యాత్రకు జనం నుంచి స్పందన దాదాపు శూన్యంగా వుంది. జగన్ బస్సు యాత్ర చేస్తే జనం విరగబడి చూస్తారని అనుకున్న వైసీపీ వర్గాలకు పెద్ద షాక్ తగిలింది. జగన్ బస్సు రోడ్డు మీద వుంటే జనం ఎవరి పనిలో వాళ్ళు వుంటున్నారు తప్ప ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు.  తాను చేస్తున్న బస్సు యాత్రలకు ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో జగన్ ఆయా ప్రాంతాల్లో వున్న వైసీపీ నాయకుల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ముందు అనుకున్న ప్రకారం నాన్‌స్టాప్‌గా బస్సు యాత్ర నిర్వహించాల్సి వుంది. జనం నుంచి స్పందన లేకపోవడంతో బస్సు యాత్రకు ఒక్కరోజు బ్రేక్ వేశారు. ఉత్తరాంధ్ర నేతలో  కీలక సమావేశం పేరుతో ఎజెండాలోని కొత్త ప్రోగ్రామ్‌ని ముందుకు తీసుకొచ్చారు. విజయనగరం జిల్లాలో తాను బుధవారం నుంచి బస్సు యాత్ర చేస్తానని, దీని కోసం జన సమీకరణ భారీ స్థాయిలో చేయాలని, లేకపో్తే మామూలుగా వుండదని జగన్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. 

మహేష్ బాబు అభిమానులకు గాలం.. వైసీపీ వ్యూహం విఫలం!

వైసీపీ గెలుపు ఆశలు వదిలేసుకుంది. పార్టీ విజయం కోసం ప్రత్యర్థి కూటమికి మద్దతు లభించకుండా చేయడమొక్కటే మార్గమన్న నిర్ణయానికి వచ్చేసి తదనుగుణంగా వ్యూహాలు రచిస్తోంది. అయితే ఆ వ్యూహాలూ విఫలం అవుతుండటంతో ఏం చేయాలో తెలియక దిక్కు తోచని స్థితిలో పడింది. ఐదేళ్ల పాలనలో చేసిందిదీ అని చెప్పుకుని ప్రజలను ఓట్లు అడగడానికి ఒక్క అంశమూ కనిపించక.. ఇప్పుడు ప్రత్యర్థులపై విషం కక్కడం ద్వారా వారికి ఓటర్లను దూరం చేసి గెలిచేయాలన్న వైసీపీ దుష్టపన్నాగాలు పారడం లేదు.  పోనీ గత ఎన్నికలలో సెంటిమెంట్ పండించిన కోడి కత్తి దాడిని ఈ ఏన్నికలలో మరో రకంగా తెరమీదకు తెచ్చి సానుభూతి పొందడానికి వైసీపీ చేసిన యత్నం ఘోరంగా విఫలమైంది. అంతే కాకుండా పార్టిని నవ్వుల పాలు చేసింది. ఔను గులకరాయి దాడితో హత్యాయత్నం అంటూ పెద్ద బిల్డప్ ఇచ్చి చేసుకున్న ప్రచారం పార్టీకి ఇసుమంతైనా ప్రయోజనం చేకూర్చకపోగా ఎదురు పార్టీ ప్రతిష్టను దారుణంగా దిగజార్చింది. గులకరాయి నుదుటికి తగిలిందని జగన్ వేసుకున్న ప్లాస్టర్ సైజు రోజురోజుకూ పెరుగుతుండటాన్ని నెటిజన్లు ఎత్తి చూపుతూ జగన్ ను, జగన్ పార్టీనీ ఓ ఆటాడుకుంటున్నారు.  మరో వైపు పవన్ కల్యాణ్ తన ప్రసగంలో ప్రస్తావించిన అంశాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి వైసీపీ చేసిన యత్నం కూడా బూమరాంగ్ అయ్యింది. సినీ నటుల అభిమాన సంఘాలను రెచ్చగొట్టడం ద్వారా కూటమి అవకాశాలను దెబ్బకొట్టాలన్న వైసీపీ వ్యూహం కూడా దారుణంగా విఫలం అయ్యింది.  ఇంతకీ ఏం జరిగిందంటే... పవన్ కల్యాణ్ తన ప్రచారంలో భాగంగా అధికార వైసీపీపై, ముఖ్యమంత్రి జగన్ పై విమర్శల దాడిని పెంచారు. జగన్ రాజకీయాలను వదిలేసి పూర్తిగా వ్యక్తిగత అంశాలనే తన ప్రచారంలో ప్రస్తావిస్తూ రోజురోజుకూ దిగజారిపోతున్నారంటూ విమర్శించారు.  తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుేడు  మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ  ఎన్నడూ సినీ పరిశ్రమనూ, సినీ నటులనూ టార్గెట్ చేయలేదన్న పవన్ కల్యాణ్.. జగన్ మాత్రం సినీ పరిశ్రమ, సినీ నటులను టార్గెట్ చేసి వారిని వేధించారన్నారు. సినీమా థియోటర్ల టికెట్ల రేట్ల తగ్గింపు, బెనిఫిట్ షోలకు అనుమతులు నిరాకరణ వంటి వాటిని ఉపయోగించారు. తనపై కక్షతో మొత్తం సినీ పరిశ్రమనే జగన్ వేధించారన్నారు. ఈ సందర్భంగా గతంలో ఏ సీఎం కూడా ఇలా వ్యక్తిగత వైరం పెట్టుకుని వ్యవహరించిన దాఖలాలు లేవన్నారు. అందుకు ఉదాహరణగా తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో హీరో కృష్ణ ఆయనకు వ్యతిరేకంగా సినిమాలు తీసిన విషయాన్ని ప్రస్తావించి, అయినా ఎన్నడూ ఎన్టీఆర్ కృష్ణను టార్గెట్ చేయలేదని చెప్పారు.  పవన్ ఈ వ్యాఖ్యలను పట్టుకుని మహేష్ బాబు ఫ్యాన్స్ ను కూటమికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు వైసీపీ తన సోషల్ మీడియాను ఉపయోగించుకుని చేయాల్సినదంతా చేసింది.   పవన్ కళ్యాణ్ హీరో కృష్ణను అవమానించారని ఆరోపిస్తూ  మహేష్ బాబు అభిమానులను రెచ్చగొట్టేలా  వైసీపీ సోషల్ మీడియా వింగ్ నానా రచ్చా చేసింది. అయితే ఆ వ్యూహం, ఆ ప్రయత్నం ఫలించలేదు. జనసైనికులు అలర్టై  అప్పట్లో  సీనియర్ ఎన్టీఆర్‌కి వ్యతిరేకంగా తాను సినిమాలు తీసినట్లు సూపర్ స్టార్ కృష్ణ అంగీకరించిన పాత వీడియోను సామాజిక మాధ్యమంలో వైరల్ చేశారు. విశేషమేమిటంటే ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా తాను సినిమాలు తీశాననీ, అయినా ఎన్టీఆర్ ఎన్నడూ ఆ విషయంలో తనను అడగలేదనీ, తమ మధ్య సుహృద్భావ వాతావరణం చెడలేదనీ చెప్పిన ఆ ఇంటర్వ్యూ గతంలో జగన్ సొంత మీడియాలోనే వచ్చింది. దానినే జనసైనికులు  ప్రముఖంగా ప్రస్తావిస్తూ వైసీపీ కుట్రలను భగ్నం చేశారు. దీంతో వైసీపీ శిబిరానికి మౌనాన్ని ఆశ్రయించడం వినా మరో మార్గం లేకుండా పోయింది. 

సజ్జల ‘బురదగుంటలో పొర్లాడే పంది’?

వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతిరోజూ ఉదయాన్నే లేవగానే దురదగుంట ఆకుతో తయారుచేసిన తాంబూలం వేసుకుంటూ వుంటారని అనిపిస్తోంది. ఎందుకంటే, ఆయన ఏ మాట మాట్లాడినా ‘నోటి దూల’తో మాట్లాడినట్టు వుంటుంది. ఐదేళ్ళ క్రితం వైసీపీ అధికారంలోకి రాకముందు కావచ్చు.. ఐదేళ్ళ క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ దురదృష్టకర క్షణాలు దాపురించిప్పటి నుంచి కావచ్చు... ఆయన ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా నోటి దురదతో ఇష్టమొచ్చిన స్టేట్‌మెంట్లు ఇవ్వడం తప్ప, పద్ధతిగా మాట్లాడిన దాఖాలాలు లేవు. ఐదేళ్ళ వైసీపీ పాపం బాగా పండి, పరిపక్వ దశకు వచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో కూడా సజ్జల తన సహజ ప్రకోపంతో నోరు జారుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పేరుతో అనివార్యమైన ఒక చారిత్రక పరిణామం జరిగింది. ఈ కూటమి వైసీపీకి ఓటమిగా మారుతుందన్న అభిప్రాయం జాతీయ స్థాయిలో కూడా ఏర్పడింది. ఈ పరిస్థితిని చూసి కడుపుమంటని ఆపుకోలేకపోతున్న వైసీపీ నాయకులు కూటమి విషయంలో, కూటమికి మద్దతు ఇస్తున్న వారి విషయంలో నోటికొచ్చినట్టు వాగుతూ తమ సంస్కార హీనతను బయటపెట్టుకుంటున్నారు. అలాంటి వారిలో మొట్టమొదటి వ్యక్తి మిస్టర్ సజ్జల. ఆంధ్రప్రదేశ్ కూటమికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇటీవల కూటమికి మద్దతు ప్రకటించారు. జనసేనకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. ఇది చూసిన సజ్జలకి ఎసిడిటీ, అల్సర్ బాగా పెరిగిపోయింది. దాంతో మీడియా సమావేశంలో తన కడుపుమంటను బయటపెట్టారు. ‘కూటమికి చిరంజీవి మద్దతు ప్రకటించిన విషయంలో మేమేమీ ఆశ్చర్యపోవడం లేదు. చిరంజీవే కాదు.. ఇంకెవరు వచ్చి మద్దతు ఇచ్చినా మాకు నష్టం లేదు. ఎంతమంది కలసి వచ్చినా వైసీపీని ఓడించడం సాధ్యం కాదు’ అని బీరాలు పలికారు. ఆయన అక్కడతో ఆగితే ఎలా? ఉదయాన్నే తినే దురదగుంట ఆకు తాంబూలం తన ప్రభావం చూపిస్తుంది కదా.. ఆ ప్రభావంతోనే ఆయన ‘‘ఏపీ ఎన్నికల ముఖచిత్రం విషయంలో ఇప్పుడొక స్పష్టత వచ్చింది. ఇటువైపు జగన్ ఒక్కరే వున్నారు.. అటువైపు గుంటనక్కలు, తోడేళ్ళు, ముళ్ళపందులు’ వున్నాయని నోరుపారేసుకున్నారు. నోరు పారేసుకోవడం తన ఒక్కడి జన్మహక్కు అని సజ్జల భావిస్తూ వుండొచ్చు. నోరు పారేసుకోవడం కంటే.. నోరుని జాగ్రత్తగా కాపాడుకోవడమే గొప్ప విషయం. సజ్జల తరహాలోనే కూటమి వర్గాలు కూడా నోరు పారేసుకుంటే బాగుంటుందా? సజ్జలను ‘బురదగుంటలో పొర్లాడే పంది’ అని ఎవరైనా అంటే పద్ధతిగా వుంటుందా? ‘వైసీపీ అనే బురద గుంటలో పొర్లాడుతున్న పంది లాంటి సజ్జల, తన ఒంటికి అంటిన బురదని అందరి మీద వెదజల్లుతున్నారు’ అని ఎవరైనా అంటే సంస్కారం అనిపించుకుంటుందా? సజ్జలని అలా ఎవరూ అనరనే ఆశిద్దాం.

ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ దూరం చేసే కుట్ర!

ప్రజల అభిమానాన్ని పొంది ఎన్నికలలో విజయం అందుకోవడం అసాధ్యమన్న నిర్ణయానికి వచ్చేసిన ఏపీలోని అధికార వైసీపీ ఇప్పుడు తమను వ్యతిరేకించే వారు ఓటు వేయడానికి అవకాశం లేకుండా చేసి లబ్ధి పొందాలని చూస్తోంది. ప్రజలు, వ్యాపారులు, కార్మికులు, కర్షకులు, మధ్య తరగతి ఇలా సమాజంలోని ఏ వర్గమూ జగన్ పాలన పట్ల సదభిప్రాయంతో లేదు.  ప్రజలను కష్టాల పాల్జేసి, వ్యతిరేకించిన వారిని నానారకాలుగా వేధించి ఈ ఐదేళ్ల పాలనలో జగన్ రాష్ట్ర ప్రగతిని అడుగంటించేశారన్న ఆగ్రహం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే వారినీ అన్ని రకాలుగా వేధించారు. వేతనాలు సమయానికి ఇవ్వకపోవడమే కాదు, డీఏ బకాయిలు, ఫిట్ మెంట్ విషయంలో కూడా వారిని దారుణంగా దగా చేశారు. కొందరు ఉద్యోగ సంఘాల నేతలను లోబరచుకుని ఉద్యోగులను వారికి న్యాయంగా రావలసిన ప్రయోజనాలకు కూడా దూరం చేశారు.  దీంతో ఉద్యోగులంతా ఈ సారి వైసీపీకి గుణపాఠం చెప్పాలన్న నిర్ణయానికి వచ్చేశారు. ఆ విషయంలో వారేమీ రహస్యాన్ని పాటించడం లేదు. ఆ విషయాన్ని బాహాటంగానే చెబుతున్నారు. ఈ నేఫథ్యంలో ఉద్యోగులు ఓట్లు ఎటూ ప్రభుత్వానికి వ్యతిరేకమే అన్న నిర్ణయానికి వచ్చి వారి ఓటు హక్కును హరించడమే లక్ష్యంగా జగన్, వైసీపీ కుట్రలకు తెరలేపారు.  ప్రభుత్వ ఉద్యోగులంతా జగన్ ప్రభుత్వంపై తీవ్ర అసహనంతో ఉన్నారు.  తెలుగుదేశంకు  ఓట్లు వేస్తారనే భయంతో పోస్టల్ బ్యాలెట్ ను తగ్గించేందుకు, కొందరు అధికారులతో చేతులు కలిపి వైసీపీ కుట్రలకు తెరలేపింది.  జగన్ రెడ్డి అడుగులకు మడుగులొత్తుతున్న  కొంత మంది అధికారులతో  ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు కాకుండా కుట్ర చేశారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు లేవంటూ  ఫారం12 లను తీసుకోవడం లేదని చెబుతున్నారు. ఉద్యోగులు పట్టుబట్టడంతో వాటిని తీసుకున్నా.. తీసుకున్నట్లుగా రశీదు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.  ఇప్పటికీ నోడల్ ఆఫీస ఎవరన్నది స్పష్టత లేదని చెబుతున్నారు. తక్షణమే  నోడల్ అధికారులను నియమించి, నోడల్ ఆఫీసర్ ఎవరో కింది స్థాయి అధికారులకు తెలిసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ ఉద్యోగుల ఓట్లపై కుట్ర చేస్తుందని తెలుగుదేశం ఎమ్మెల్సీ పరుచూరు అశోక్ బాబు  ఆరోపించారు.   ఎన్నికల విధుల్లో భాగంగా ఉద్యోగ రిత్యా అధికారులు ఎవరైనా నియోజకవర్గంలో ఉన్నా ఫారం 12 కాపీలను తీసుకోవాల్సిన బాధ్యత ఏఆర్వో, ఆర్వోలపై ఉందన్నారు.  ఉద్యోగస్తులకు అన్యాయం చేసిన  జగన్ ప్రభుత్వానికి  ప్రభుత్వ ఉద్యోగులంతా ఓటు రూపంలో బుద్ధి చెప్పాలనీ అశోక్ బాబు పిలుపునిచ్చారు.  ఉద్యోలకు మేలు చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని  కోరారు. 

జగన్ అరాచకపాలనకు నిరసనగా హస్తిన వేదికగా వేలు కోసుకున్న మహిళ

ఏపీలో జగన్ పాలన అరాచకత్వానికి పర్యాయపదంగా మారిపోయింది. జగన్ అరాచక పాలనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఎన్నికల ప్రచారం పేర మనమంతా సిద్ధం అంటూ నిర్వహిస్తున్న బస్సు యాత్రకు ప్రజలు ముఖం చాటేస్తున్నారు. ఎలాగో తంటాలు పడి వైసీపీ నేతలు జనాలను సమీకరించినా.. అడుగడుగునా నిరసనలే వ్యక్తమౌతున్నాయి. జగన్ కు వ్యతిరేకంగా యువత, నిరుద్యోగులు, కార్మికులు, కర్షకులు.. ఇలా ఒకరనేమిటి సమాజంలోని అన్ని వర్గాల వారీ రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలకు దిగుతున్నారు. జగన్ బస్సు యాత్ర పోడవునా నిరసన గళం వినిపిస్తున్నారు.  అయితే రాష్ట్రంలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్న వారిపై పోలీసుల సహకారంతో ఉక్కుపాదం మోపుతున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా పోలీసులు ప్రభుత్వం తరఫున ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల తీరుపై, కొందరు ఐఏఎస్, ఐపీఎస్ లు జగన్ కు అండగా వ్యవహరిస్తున్న వైనంపై ఎన్నికల సంఘానికి ఇప్పటికే ఎన్నో ఫిర్యాదులు అందాయి. స్వయంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీనా ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందన కోసం వేచి ఉన్నామని ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే.  అయితే ఇప్పుడు జగన్ పాలనలో జరుగుతున్న ఆరాచకాలపై హస్తిన వేదికగా కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. గుంటూరుకు చెందిన కోవూరి లక్ష్మి అనే మహిళ జగన్ అరాచకపాలనకు నిరసనగా ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద తన బొటన వేలు కోసుకున్నారు.  మాజీ హోంమంత్రి సుచరిత అనుచరుల అక్రమాలను వివరిస్తూ ఇండియా గేట్ వద్ద తన అనుచరులతో నిరసనకు దిగిన ఆమె.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అవినీతిపై ప్రసంగిస్తూ అకస్మాత్తుగా తన బొటన వేలు కోసుకున్నారు. జగన్ అరాచకపాలన, వైసీపీ నేతల అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, అవినీతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోడీ, సీజేఐ చంద్రచూడ్ లకు ఫిర్యాదు చేసే ఉద్దేశంతో  మహిళా సంఘాలు, ప్రజా సంఘాల నేతలతో కలిసి హస్తిన వచ్చిన లక్ష్మి వారిని కలిసేందుకు అవకాశం దక్కక పోవడంతో వారి వారి కార్యాలయాలలో ఫిర్యాదులు అందజేసి ఆదివారం సాయంత్రం ఇండియా గేట్ వద్ద నిరసన చేపట్టారు. ఆ నిరసనలో భాగంగా తన బొటన వేలు తెగ్గోసుకున్నారు. 

జగన్మోసం.. షర్మిలకు ఆస్తిలో వాటా కాదు.. అప్పు ఇచ్చారు!

మోసం చేయడంలోనూ, బెదరించి పబ్బం గడుపుకోవడంలోనూ వైసీపీ అధినేత జగన్ ను మించిన వారు లేరని స్వయంగా ఆయన సోదరి షర్మిల ఎన్నికల అఫిడవిట్ చూస్తే ఎవరికైనా ఇట్టే అవగతమౌతుంది.  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం ( ఏప్రిల్ 20) కడప లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా  నామినేషన్ దాఖలు చేశారు. ఆ సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి   షర్మిల వెంట ఉన్నారు.  షర్మిల తన అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువ రూ. 182.82 కోట్లుగా పేర్కొన్నారు.  అలాగే చరాస్తులు తన పేరు మీద మీద 26 కోట్లు, రూ.   భర్త అనిల్ పేరు మీద 45.19 కోట్లు ఉన్నట్లు తెలిపారు. షర్మిల తమ తండ్రి ఆస్తుల్లో తనకు సరైన వాటా నిరాకరించడంతో సోదరుడిపై తిరుగుబాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అఫిడవిట్ చూస్తే జగన్ ఆమెకు తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వకపోవడమే కాదు ఆమెకు అప్పులు మాత్రమే ఇచ్చారని అర్ధమౌతోంది. ఎందుకంటే ఆమె షర్మిలకు జగన్ దగ్గర అప్పులు ఉన్నాయి.  ఆమె అఫిడవిట్ ప్రకారం  సోదరుడు జగన్ రెడ్డి దగ్గర రూ. 82 కోట్లకుపైగా అప్పు తీసుకున్నట్లుగా చూపించారు. దీనిలో ఏదో మతలబు ఉందని అందరూ భావించారు. అయితే ఆ మతలబు ఏమిటో  షర్మిల ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించేశారు.  ఆస్తిలో తనకు రావాల్సిన వాటాలో  ఒకింత ఇచ్చి.. దానినే అప్పుగా జనగ్ మార్చేశారని షర్మిల చెప్పారు. కర్నూలులో ఎన్నికల ప్రచారంలో   విషయాలను జగన్ కు స్వయానా సోదరి అయిన షర్మిల ఈ విష యాలను తన నోటి వెంటే వెల్లడించారు.   కుటుంబ ఆస్తిలో వాటా ఆడబిడ్డ హక్కు అయితే జగన్ తన హక్కును కాలరాశారని షర్మిల విమర్శించారు. చెల్లెళ్ళకు ఇవ్వాల్సిన అస్థి వాటాను తమ వాటాగా భావిస్తారని జగన్ గురంచి వ్యాఖ్యానించారు. తామేదో చెల్లెళ్ళకు గిఫ్ట్ గా ఇస్తున్నామని బిల్డప్ ఇస్తారని.. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఎక్కువ మంది ఉన్నారని విమర్శించారు. జగన్ తనకు రావాల్సిన ఆస్తిలో అతి తక్కువ వచ్చి దానిని సైతం అప్పుగా చూపించారనీ, ఈ వాస్తవం మా కుటుంబం మొత్తానికి తెలుసునని షర్మిల అన్నారు.   అయితే ఇప్పుడు తాను చేస్తున్న పోరాటం తన ఆస్తుల కోసం కాదనీ.. న్యాయం కోసమనీ షర్మిల స్పష్టం చేశారు.  వివేకా ను గొడ్డలితో దారుణంగా నరికి చంపి ఆమెపైనే నిందలు వేస్తున్నారని విమర్శించారు. రేపు తనకు, సునీతకూ ఏమైనా అవుతుందేమో మాకు తెలియదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైతే అయ్యిందని ప్రాణాలకు తెగించి న్యాయం కోసం చేస్తున్న పోరాటం తనదని షర్మిల చెప్పారు.   జగన్మోసానికి తాను మాత్రమే కాదనీ, యావత్ ఆంధ్రప్రదేశ్ గురైందనీ షర్మిల ధ్వజమెత్తారు.  షర్మిల మాటలను బట్టి అధికారం కోసం జగన్ స్వపర బేధాలను లెక్క చేయరనీ, సొంత చెల్లైనా, జనమైనా ఆయనకు ఒకటేనని అవగతమౌతోందని పరిశీలకులు అంటున్నారు. 

చిరంజీవి ఎంట్రీ.. జగన్ పార్టీకి ఇక జంక్షన్ జామే!

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌ రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. ఐదేళ్ల పాల‌న‌లో ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురిచేసిన సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని గ‌ద్దె దించేందుకు అంద‌రూ ఏక‌మ‌వుతున్నారు. దీంతో వైసీపీ అభ్య‌ర్థులు ఓట‌మి భ‌యంతో వ‌ణికిపోతున్నారు. కొన్నేళ్లుగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్న కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి కూట‌మికి మ‌ద్ద‌తు తెలిపారు. మూడు పార్టీలు క‌లిసి ఏపీకి మంచి చేసేందుకు ముందుకు రావ‌డం మంచి ప‌రిణామం అని అన్నారు. అంతే కాదు.. త‌న‌ను క‌లిసిన అనకాపల్లి లోక్‌సభ కూటమి అభ్యర్థి  సీఎం రమేష్‌, పెందుర్తి అసెంబ్లీ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ కు మ‌ద్ద‌తుగా  అత్య‌ధిక మెజార్టీతో గెలిపించాల‌ని వీడియో  విడుద‌ల చేశారు. చిరు కూట‌మికి మ‌ద్ద‌తు ప‌లికిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్  అయ్యింది.  చిరంజీవి కూడా కూటమికి మద్దతుగా రంగంలోకి దిగడంతో  జగన్ సహా ఆయన పార్టీ నేతలంతా జంక్షన్ జామైపోయినట్లు ఫీల్ అవుతున్నారు. వైసీపీ పేటీయం బ్యాచ్ సోష‌ల్ మీడియాలో  ఇష్టారీతిగా పోస్టులు పెడుతున్నది. దీనితోడు వైసీపీ నేత స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి చిరంజీవి కూట‌మి అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దీంతో స‌జ్జ‌ల‌, వైసీపీ నేత‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఏపీ రాజ‌కీయాల్లో ఒక్క‌సారిగా నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం తారాస్థాయికి చేరింది. వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత కేవ‌లం వ్య‌క్తిగ‌త క‌క్ష‌ల‌కే ప్రాధాన్య‌త‌నిచ్చార‌న్న విమ‌ర్శ‌లున్నాయి. అమ‌రావ‌తి రాజ‌ధానిని విచ్ఛిన్నం చేయ‌డం ద్వారా రాజ‌ధాని లేని రాష్ట్రంగా ఏపీని త‌యారు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధిని మ‌రిచి త‌న వ్య‌తిరేకుల‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించ‌డం, జైళ్ల‌కు పంపించ‌డం, పోలీసుల‌తో చిత్ర‌హింస‌లు పెట్టించ‌డం వంటి ప‌నుల‌కు మాత్ర‌మే జ‌గ‌న్ ప్రాధాన్య‌త‌నిచ్చారు. ఈ క్ర‌మంలో సినీ ఇండ‌స్ట్రీని కూడా సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి వ‌దిలిపెట్ట‌లేదు. సినిమా టికెట్ల విష‌యంలో గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం పెద్ద రాద్దాంత‌మే చేసింది. సినిమా వాళ్లు కేవ‌లం న‌టులేన‌ని, వారికి భారీ సంఖ్య‌లో అభిమానులు ఉన్నా వారు సీఎం ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి త‌ల‌వంచాల్సిందే అన్నట్లుగా సినిమా హీరోలు, సీనీ ప్ర‌ముఖుల ప‌ట్ల జ‌గ‌న్ ప్ర‌వ‌ర్తించారు. సినిమా టికెట్ల విష‌యంలో చిరంజీవి, మ‌హేశ్ బాబు, ప్ర‌భాష్‌, రాజ‌మౌళి వంటి వారు సీఎం జ‌గ‌న్ వ‌ద్ద‌కు వెళ్లి వేడుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అప్ప‌ట్లో ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీంతో సినీ పెద్ద‌ల‌తోపాటు, సినీ హీరోల అభిమానులు కూడా జ‌గ‌న్‌పై ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నవారు ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కువ‌స్తూ జ‌గ‌న్ కు వ్య‌తిరేకంగా గ‌ళ‌ం ఎత్తుతున్నారు. తాజాగా చిరంజీవి రంగంలోకి దిగ‌డంతో వైసీపీ అధిష్టానం ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. ఆ పార్టీ అభ్య‌ర్థుల్లోసైతం ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంది. సీఎం జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌పై ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. దీనికితోడు టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన పార్టీలు కూట‌మిగా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగాయి. తాజాగా చిరంజీవి సైతం కూట‌మికి మ‌ద్ద‌తు ప‌ల‌క‌డంతో వైసీపీ అభ్య‌ర్థులు ఆందోళ‌న చెందుతున్నారు. మెగాస్టార్ చిరంజీవికి ఏపీలో అభిమానులు ఎక్కువే. ముఖ్యంగా ఉమ్మ‌డి తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల‌తోపాటు  ఉత్తారంధ్ర జిల్లాల్లోనూ చిరంజీవిని అభిమానించేవారి సంఖ్య భారీగా ఉంటుంది. ప్ర‌స్తుతం చిరంజీవి కూట‌మికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డంతో ఇన్నాళ్లు వైసీపీకి మ‌ద్ద‌తుగా ఉన్న చిరంజీవి అభిమానుల్లో మెజార్టీ ఓట‌ర్లు కూట‌మి వైపు మ‌ళ్ల‌డం ఖాయ‌మ‌న్న ఆందోళ‌న‌లో వైసీపీ అభ్య‌ర్థులు ఉన్నారు. దీంతో వైసీపీ సోష‌ల్ మీడియా రంగంలోకిదిగి చిరంజీవిపై త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డం మొద‌లు పెట్టింది. దీనికి తోడు ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ..  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు పూర్తి స్పష్టత వచ్చింది.. ఒక పక్క జగన్.. మరో పక్క తోడేళ్లు, నక్కలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఇలా స్పష్టంగా చిరంజీవి మాట్లాడటం మంచిదన్నారు. చిరంజీవి లాంటివారు ఎంత‌మంది కూట‌మికి మ‌ద్ద‌తు తెలిపినా వైసీపీ విజ‌యాన్ని అడ్డుకోలేర‌ని, ఈ ఎన్నికల్లో వైసీపీకి 150 సీట్లు రావడం ఖాయమ‌ని స‌జ్జ‌ల అన్నారు. దీంతో స‌జ్జ‌ల వ్యాఖ్య‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్‌ ఇచ్చారు. చిరంజీవి అజాత శ‌త్రువు.. ఆయ‌న జోలికి వ‌స్తే చూస్తూ ఊరుకోను అంటూ స‌జ్జ‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ వార్నింగ్‌ ఇచ్చారు. మీరు అన‌వ‌స‌రంగా నోరుజారితే మిమ్మ‌ల్ని రోడ్డు మీద మోకాళ్ల మీద న‌డిపిస్తా అంటూ ప‌వ‌న్ హెచ్చ‌రించారు. గ‌తంలో మీకు అనుకూలంగా మాట్లాడిన‌ప్పుడు చిరంజీవి మంచి వ్య‌క్తి.. కూట‌మికి మ‌ద్ద‌తు ఇస్తే ఆయ‌న‌పై ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడ‌తారా? వైసీపీ నేత‌లూ ఒళ్లు ద‌గ్గ‌ర‌పెట్టుకొని మాట్లాడండి.. మీరు కలుగుల్లో పందికొక్కులు.. ఎలుకల సమూహం.. మీరు సింహాలు కాదు అని పవన్ కళ్యాణ్ సెటైర్లు గుప్పించారు. మొత్తానికి చిరంజీవి గురించి మాట్లాడొద్దంటూ జ‌గ‌న్‌, వైసీపీ నేత‌ల‌కు ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేత‌లు ఎవ‌రైనా ఓవ‌రాక్ష‌న్ చేస్తే ఊరుకునేది లేదు. చంద్ర‌బాబు  కాస్త మెత‌క వైఖ‌రితో ఉంటారు.. మాకేం కాదులే అనుకోకండి. అలాంటి వ్య‌క్తినికూడా జ‌గ‌న్ జైల్లో పెట్టాడు జ‌గ‌న్‌. ఇప్పుడు ఆయ‌న‌కూడా మెత‌క వైఖ‌రి వీడారు. నేను, చంద్ర‌బాబు క‌లిసి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఓవ‌రాక్ష‌న్ చేసే నేత‌ల‌కు స‌రైన గుణ‌పాఠం చెబుతానంటూ ప‌వ‌న్ హెచ్చ‌రించారు.

జ‌గ‌న్ శిబిరంలో దివాక‌రం క‌ల‌క‌లం!

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ  వైసీపీ గ్రాఫ్   త‌గ్గిపోతోంది. 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో  అత్యధిక స్థానాలలో   వైసీపీ అభ్య‌ర్థులు విజ‌యం   క‌ష్టంగా మారింది. నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల మార్పుతో పాటు,  వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌పై ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ బ‌స్సు యాత్ర‌కు సైతం ప్ర‌జాద‌ర‌ణ క‌రువైంది. బ‌స్సు యాత్ర‌కు ప్ర‌జ‌ల‌ను త‌ర‌లించేందుకు స్థానిక వైసీపీ నేత‌లు నానా తంటాలు ప‌డుతున్న ప‌రిస్థితి. ఇటీవ‌ల బ‌స్సు యాత్ర స‌మ‌యంలో జ‌గ‌న్‌పై రాయి దాడి ఘ‌ట‌న‌ను రాజ‌కీయంగా వాడుకునేందుకు వైసీపీ నేత‌లు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ, గ‌త ఎన్నిక‌ల అనుభ‌వంతో ప్ర‌జ‌లు వైసీపీ కుట్ర‌ల‌ను తిప్పికొట్టారు. దీంతో స్థానిక తెలుగుదేశం నేత‌ల‌పై ఈ రాయి దాడి ఘ‌ట‌న‌ను నెట్టేందుకు పోలీసుల స‌హ‌కారంతో వైసీపీ నేత‌లు ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారు. ఒకప‌క్క‌ ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుండ‌టంతోపాటు,  సానుభూతి కోసం వైసీపీ అధిష్టానం వేసిన ప్లాన్ సైతం బెడిసి కొట్టడంతో  వైసీపీ అభ్య‌ర్థుల‌ను ఓట‌మి భ‌యం వెంటాడుతున్నద‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.  సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో.. అమ్మఒడి ఇచ్చాం.. బ‌ట‌న్ నొక్కి ల‌బ్ధిదారుల ఖాతాల్లో డ‌బ్బులు వేశాం.. ప్ర‌తీనెలా ఇంటింటికి పెన్ష‌న్ డ‌బ్బులు అందిస్తున్నాం అంటూ గొప్ప‌గా చెబుతున్నారు. అభివృద్ధి అంటే రోడ్లు బాగుచేయ‌డం, ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాలు ప‌రిశుభ్రంగా ఉంచుకోవ‌టం, నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు క‌ల్పించ‌డం.. రాజ‌ధాని నిర్మాణం ఇవేమీ కాదు.. కేవ‌లం బ‌ట‌న్ నొక్క‌డం ఇంటింటికి డ‌బ్బులు ఇవ్వ‌డ‌మే అన్న‌ట్లుగా జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న సాగింది. ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ నేను బ‌ట‌న్ నొక్కాను.. ఇంత‌క‌న్నా అభివృద్ధి ఏం కావాలి అన్న‌ట్లుగా    జ‌గ‌న్ ప్ర‌సంగిస్తున్నారు.  అయితే, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బ‌ట‌న్ నొక్కుడు, డ‌బ్బులు ఇవ్వ‌డం వెనుక బండారాన్ని ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లోతెలుగుదేశం నేత‌లు ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. ప‌ది రూపాయిలు ఇచ్చి వెయ్యి రూపాయ‌ల‌ను ప్ర‌జ‌ల నుంచి జ‌గ‌న్ ఎలా లాక్కుంటున్నారో కూట‌మి నేత‌లు ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. దీనికితోడు జ‌గ‌న్ బ‌ట‌న్ నొక్కుడు వెనుక అస‌లు బండారాన్ని బ‌య‌ట‌పెడుతూ తెలుగుదేశం దివాకరం అనే షార్ట్ ఫిల్మ్ ను రూపొందించింది. ఈ వీడియోలో జగన్ ప్రజల నుంచి ఎంత దోచుకుంటున్నారో సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో టీడీపీ దివాకరం షార్ట్ ఫిల్మ్ చర్చనీయాంశంగా మారింది.  అయిదేళ్ల జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోయారో, పన్నులు, ధరల పెంపు ద్వారా ఒక్కో కుటుంబంపై ఎంత భారం పడిందో వివరిస్తూ తెలుగుదేశం పార్టీ రూపొందించిన దివాకరం షార్ట్ ఫిల్మ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ది క్యాషియర్ అనే ట్యాగ్ లైన్ తో ఎనిమిది నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియో వివిధ వర్గా ప్రజలలో ఆలోచన రేకెత్తిస్తోంది.  మద్యం తాగే ఒక్కో వ్యక్తి నుంచి అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం ఎంత దోచిందో.. మందు బాబు నోటితోనే చెప్పించారు. ఐదేళ్లలో మద్యం సేవించే ఒక్కో వ్యక్తి నుంచి రూ. 2.16లక్షలు దోచుకున్నారు.. నవరత్నాల పేరుతో కుటుంబానికి జగన్ ఇస్తుంది ఏడాది రూ. లక్ష.. కానీ పెట్రోల్, డీజిల్, ఇసుక ధరలు, బస్, విద్యుత్, ఛార్జీలు, ఇంటిపన్ను, చెత్త పన్ను, రోడ్ ట్యాక్స్, పైబర్ నెట్ ఛార్జీలు పెంచి జగన్ ప్రభుత్వం   ప్రతి కుటుంబం నుంచి దోచుకుంటున్నది  పెంచినవన్నీ లెక్కేస్తే ఐదేళ్లలో ఒక్కో కుటుంబం నుంచి జగన్ సర్కార్ దోచింది అక్షరాలా రూ. 10లక్షలు అంటూ వీడియోలో లెక్కలతో సహా ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించారు.  ఐదేళ్లలో జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోయారో పేర్కొంటూ తెలుగుదేశం పార్టీ రూపొందించిన దివాకరం షార్ట్ ఫిల్మ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో వైసీపీ అభ్యర్థులు ఈ వీడియోను చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై ప్రజలు నష్టపోయిన విధానాన్ని కుప్తంగా వీడియోలో వివరించడంతో ప్రజల్లో పార్టీపై మరింత వ్యతిరేకత పెరిగి తమ ఓటమికి కారణమవుతుందని వైసీపీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ప్రచారానికి వెళ్తున్న పలువురు వైసీపీ అభ్యర్థులను ప్రజలు నిలదీస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ విడుదల చేసిన దివాకరం షార్ట్ ఫిల్మ్  ప్రజలలో వ్యతిరేకత మరింత పెంచిందని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.  

కేజ్రీవాల్ హిస్టరీ జైల్లో క్లోజ్ అవనుందా?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ప్రధాన సూత్రధారి అంటూ ఆరోపణలతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయి, ప్రస్తుతం తిహార్ జైల్లో వున్నారు. జైల్లో వున్నప్పటికీ ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్న కేజ్రీవాల్ కొత్త  సంప్రదాయానికి తెరతీశారు. ఇదిలా వుంటే, కేజ్రీవాల్‌కి ఇంటి నుంచి ఆహారం తెప్పించుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. కేజ్రీవాల్‌కు మధుమేహం వుంది. కేజ్రీవాల్ ఇంటి నుంచి మామిడిపళ్ళు, అరటిపళ్ళు, పూరీ, స్వీట్లు తెప్పించుకుని తింటున్నారని, దానివల్ల ఆయన శరీరంలో గ్లూకోజ్ లెవల్స్ రెట్టింపు అయ్యాయని ఈడీ చెబుతోంది. శరీరంలో సుగర్ని పెంచుకోవడం ద్వారా అనారోగ్యాన్ని పెంచుకుని, ఆ కారణాలు చూపించి బెయిల్ పొందాలన్నది కేజ్రీవాల్ వ్యూహంగా ఈడీ ఆరోపిస్తోంది.  ఇదిలావుంటే, కేజ్రీవాల్‌ను జైల్లోనే చంపడానికి కుట్ర జరుగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. గ్లూకో్జ్‌ లెవల్స్ పెరిగిపోయిన కేజ్రీవాల్‌కి ఇన్సులిన్ ఇవ్వడానికి జైలు అధికారులు నిరాకరిస్తున్నారని, దీనివల్ల ఆయన ఆరోగ్యం మీద ప్రభావం పడి, నెమ్మదిగా మరణించేలా కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. కేజ్రీవాల్‌కు ఇన్సులెన్ ఇవ్వకపోవడం వల్ల ఆయన గుండె, కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుంది. రెండు మూడు నెలల పాటు ఆయన్ని ఇలాగే జైలులో వుంచి, ఆ తర్వాత విడుదల చేసినా ఏమాత్రం ప్రయోజనం వుండదు. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాల్సి వస్తుందని అన్నారు.  

ప్రాణాలు తీస్తున్న మాయదారి ఆట

మొన్నటి వరకు యువతరాన్ని పబ్జీ పిచ్చి పట్టి పిడించింది. అంతకు ముందు వున్నంత ఉద్ధృతి లేకపోయినప్పటికీ యువతరంలో ఇప్పటికీ చాలామంది ఆ పిచ్చిలో వున్నారు. ఇప్పుడు అలాంటి ప్రాణాంతకమైన మాయదారి ఆట అమెరికాలో స్టూడెంట్స్ చనిపోవడానికి కారణం అవుతోంది. ఆ ఆట పేరు బ్లూ వేల్ ఛాలెంజ్ (Blue Whale Challange). ఈ గేమ్ పిచ్చిలో పడిన చాలామంది యువతీ యువకులు గతంలో చనిపోయారు. ఈ మధ్యకాలంలో ఈ గేమ్ వల్ల మరణాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలోని భారత సంతతికి చెందిన యువకులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ముసాచుసెట్స్ యూనివర్సటీకి చెందిన ఒక విద్యార్థి మరణించారు. ఈ మరణానికి కారణం బ్లూ వేల్ ఛాలెంజ్ ఆట అని పోలీసులు భావిస్తున్నారు. రెండు నిమిషాలపాటు ఊపిరి బిగపట్టడం వల్ల ఆ విద్యార్థి మరణించాడని పోలీసులు చెబుతున్నారు. బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్‌లో ఊపిరి బిగపట్టే టాస్క్ వుంటుందని పోలీసులు తెలిసారు. మొదట రష్యాలో ప్రారంభమైన ఈ ఆన్‌లైన్ గేమ్ క్రమంగా ఆ ఆట ఆడేవాళ్ళను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తుంది. ఈ గేమ్ వల్ల జరుగుతున్న అనర్థాలను గ్రహించిన అనేక దేశాలు ఈ ఆటకు సంబంధించిన నెట్‌వర్క్.లు తమ దేశంలో కనిపించకుండా జాగ్రత్తపడ్డాయి. ఈ గేమ్‌లో వుండే క్యూరేటర్ ఆడేవారికి రకరకాల ప్రమాదకరమైన టాస్క్.లు ఇస్తుంటాడు. అర్ధరాత్రి నిద్ర లేవడం, భయంకరమైన దృశ్యాలను చూడటం, ఎత్తయిన టవర్ల అంచున నిలబడటం, గాయాలు చేసుకోవడం, ఊపిరి బిగబట్టడం లాంటి  టాస్క్.లు ఇస్తాడు. ఈ టాస్క్.లు చేసేటప్పుడు ఆడే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం లేదా ప్రమాదానికి గురై చనిపోవడం జరుగుతోంది.   ఒక్కసారి ఈ గేమ్‌లోకి ఎంటరైతే బయటపడటం చాలా కష్టం. మానసికంగా తప్పుదోవ పట్టించి, ఒక్కోసారి బెదిరించి టాస్క్.లను పూర్తి చేసేలా ప్రేరేపిస్తారు.

2019 ఎన్నికల అఫిడవిట్ లో జగన్ కేసులు.. ఆస్తుల చిట్టా ఇదే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలోనే సంపన్న సీఎం. గత ఏడాది ఏప్రిల్ లో అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ విడుదల చేసిన నివేదిక పేర్కొన్న మేరకు 510 కోట్ల రూపాయల విలువైన ఆస్తులతో దేశంలోని ముఖ్యమంత్రులందరికంటే సంపన్నుడిగా తేలారు. కాగా గత ఎన్నిలలో జగన్ దాఖలు చేసిన అపిడవిట్ మేరకు ఆయన పేరున అప్పటికి 375 కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయి. ఆయన భార్య భారతి పేర 124 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఇక ఆయన కుమార్తెల పేర 11 కోట్ల రూపాయల విలువైన చరాస్తులున్నాయి. అంతే కాకుండా ఆ అఫిడవిట్ ప్రకారం వీటికి అదనంగా జగన్ పేర 317 కోట్ల పెట్టుబడులు ఉండగా, ఆయన సతీమణి భారతి పేర 62 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి.   2019 ఎన్నికల సమయంలో జగన్ సమర్పించిన అఫిడవిట్  మొత్తం 47 పేజీలుంది. అందులో ఆయన ఆస్తులకు సంబంధించిన వివరాలు 11 పేజీలు. మిగిలిన 21 పేజీలూ జగన్ పై ఉన్న కేసుల వివరాలతో నిండిపోయింది. అప్పటి కి జగన్ పై మొత్తం 34 కేసులు ఉన్నట్లు జగన్ అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆ కేసులన్నీ సీబీఐ, ఈడీ, ఇతర కేసులకు సంబంధించినవే. ఈ ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ పై అదనంగా కేసులు నమోదైన దాఖలాలేవీ లేవు. అయితే పులివెందుల నుంచి ఎన్నికల బరిలో దిగనున్న జగన్ ఈ సారి సమర్పించే అఫిడవిట్ లో ఆయన ఆస్తులు ఏ మేరకు పెరిగాయన్నదానిపై అందరి ఆసక్తీ కేంద్రీకృతమై ఉందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం మనమంతా సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న బస్సు యాత్రలో ఉన్న జగన్ ఈ నెల 25న పులివెందులలో తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొత్తం మీద దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిపై ఉన్న కేసుల సంఖ్య కూడా భారీగానే ఉందన్న సెటైర్లు గత ఏడాది అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ నివేదిక వెలువడిన నాటి నుంచీ పేలుతూనే ఉన్నాయి.  

దేశానికి ఐదు నిమిషాలు ఇవ్వగలరా?

చాలామంది దేశం నాకేమిచ్చింది అని ప్రశ్నిస్తారు. దేశం నాకేమిస్తుందా అని ఆలోచిస్తారు.. దేశం నాకు చాలా ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అనే మాట మాత్రం ఆలోచించరు. దేశమంటే మరెవరో కాదు.. దేశమంటే మనమేనని అర్థం చేసుకోరు. దేశం మనకి చాలా ఇచ్చింది. ఆఫ్రికా దేశాలనో, ఎడారి దేశాలనో చూస్తే మనకి అర్థమవుతుంది.  మనకి ఎంతో ఇచ్చిన దేశానికి మనం కూడా ఏమైనా ఇవ్వాలి.. దేశం నాకేమిచ్చింది అని కాకుండా.. దేశానినేనేమిచ్చాను? దేశానికి నేనేమివ్వాలి అని ఆలోచించాలి. అనిపిస్తోందా? దేశానికి ఏమైనా ఇవ్వాలని మీకనిపిస్తోందా? అయితే, దేశానికి మీరివ్వాల్సింది ఏమిటంటే, దేశం మీ నుంచి కోరుకునేది ఏమిటంటే, ఐదు నిమిషాలు.. ఎస్.. ఐదంటే ఐదు నిమిషాలు.. రీల్స్ చూడడ్డానికి గంటలు గంటలు వినియోగిస్తాం. అలాంటిది దేశం కోసం ఐదు నిమిషాలు కేటాయించలేమా? ఇప్పుడు మీకు దేశం కోసం ఐదు నిమిషాలను ఇవ్వాలని అనిపిస్తోందా? అయిదు నిమిషాలు కాదు.. పదినిమిషాలు ఇస్తాం.. ఎక్కడ ఇవ్వాలో చెప్పండి అనిపిస్తోందా? అయితే అది ఎక్కడ ఇవ్వాలో మేము  చెప్పం.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ చెబుతున్నారు చదవండి. ‘‘ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. దేశ పౌరులైన మనకు రాజ్యాంగం ఎన్నో హక్కులను కల్పించింది. ఈ ప్రజాస్వామ్య దేశంలో జరిగిన ఎన్నికలలో ఓటు వేయడం పౌరులుగా మన ప్రధాన బాధ్యత. ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఎన్నికలలో ఓటు వేయడానికి, మన దేశం కోసం ఓటు వేయడానికి ఐదు నిమిషాల సమయాన్ని కేటాయించడానికి వీలవుతుంది కదా! ఓటు హక్కును వదులుకోవద్దని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాను. నేను మొదటిసారి ఓటు వేసినప్పుడు ఎంతో ఆనందాన్ని పొందాను. ఆ ఆనందాన్ని ఓటు వేసిన ప్రతిసారీ పొందుతూ వుంటాను’’.... భారత ఎన్నికల సంఘం చేపట్టిన ‘మై ఓట్.. మై వాయిస్’ మిషన్‌లో భాగంగా జస్టిస్ చంద్రచూడ్ ఇలా చెప్పారు.

పంచ్ డైలాగుల నుంచి పలాయనం వరకూ వైసీపీ ప్రస్థానం!

పంచ్ డైలాగుల నుంచి పలాయనం దాకా వైసీపీ తిరోమన ప్రస్ధానం చేరుకుందా అంటే కడప జిల్లా రాజకీయాలలో జరుగుతున్న లేదా చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే ఔననే సమాధానం వస్తోంది. పులివెందుల పులి, సింహం సింగిల్ ఎంట్రీ వంటి  డైలాగుల నుంచి తమపై ఎవరూ ఆరోపణలూ విమర్శలూ చేయకూడదంటూ కడప కోర్టు నుంచి తెచ్చుకునే వరకూ వైసీపీ వచ్చింది.  కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల రంగంలోకి దిగడం ఖాయమైన క్షణం నుంచే వైసీపీలో గాభరా ప్రస్ఫుటంగా కనిపించింది. వైఎస్ బిడ్డగా ఆమె కడప బరిలో అడుగుపెట్టడమే వైసీపీకి కాళ్ల కింద భూమిని తొలిచేసినట్లైంది. దీనికి తోడు ఆమె దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతతో కలిసి ప్రచార సభల్లో వైఎస్ జగన్ ను నిలదీస్తూ చేస్తున్న ప్రసంగాలకు కడప వాసుల నుంచి ఆమోఘమైన స్పందన లభించడంతో వైసీపీ అప్రమత్తమైంది. ప్రచారానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా ప్రజా మద్దతుతో షర్మిల వాటన్నిటినీ అధిగమించి ప్రచారాన్ని కొనసాగించడంతో వేసవి హీట్ ను మించి వైసీపీ టెంపరేచర్ పెరిగిపోయింది.  ఆమె సూటిగా సుత్తి లేకుండా, శషబిషలకు తావు లేకుండా వైఎస్ హంతకులకు కొమ్ము కాస్తున్న జగన్ కు, ఆయన పార్టీకీ ఓటువేయవద్దంటూ ఇచ్చిన పిలుపు జిల్లాలో రాజకీయ ఈక్వేషన్లను ఒక్క సారిగా మార్చేసింది. ఇక వైఎస్ సునీత అయితే అవినాషే మా నాన్న హంతకుడు అని ప్రకటించి మరీ జగన్ కు ఓటేయద్దని కోరుతున్నారు. సీబీఐ చార్జి షీట్ లోని అంశాలను పూసగుచ్చినట్లు ప్రజలకు వివరిస్తూ వివేకా హత్య ను కడప ఎన్నికల అజెండాగా మార్చేశారు.   మరో వైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ను చెళ్లెళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పు జగన్ అంటూ.. హే కిల్డ్ బాబాయ్  అంటూ నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కడపలో పట్టు జారిపోతోందని భయపడిన జగన్ అండ్ కో వివేకా హత్య కేసు గురించి ఆ ఏడుగురూ  మాట్లాడకూడదంటూ గాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆ ఏడుగురూ ఎవరంటే షర్మిల, సునీత, తెలుగుదేశం అధినేత అధినేత చంద్రబాబునాయుడు, జనసేన దళపతి పవన్‌కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి,  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, తెలుగుదేశం పులివెందుల అభ్యర్ధి బీటెక్ రవి.  అయితే ఈ గాగ్ ఆర్డర్ పై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు ఇప్పటికే సునీత ప్రకటించారు. అయితే ఈ తీర్పును బట్టి చూస్తే ఆ ఏడుగురు వినా ఇంకెవరైనా వివేకా హత్య కేసుపై మాట్లాడొచ్చు అన్నట్లుగానే ఉంది. ఈ విషయాన్నే ఇటీవలే వైసీపీ నుంచి తెలుగుదేశం గూటికి చేరిన రఘురామకృష్ణం రాజు వంటి వారు ఎత్తి చూపుతూ షర్మిల సునీతల తరఫున ప్రచారం చేసే ఎవరైనా వివేకా హత్య కేసుకు సంబంధించిన ఆరోపణలు చేయవచ్చని అంటున్నారు. అసలు ఏకపక్షంగా ఓ ఏడుగురు ఫలానా అంశంపై మాట్లాడకూడదంటూ వెలువడిన తీర్పు ఉన్నత న్యాయస్థానంలో నిలిచే అవకాశలు లేవని కూడా అంటున్నారు.  ఏపీలో గాగ్ ఆర్డర్లన్నీ వైసీపీ వారే తెచ్చుకుంటుండటం గమనార్హం. గతంలో మంత్రి అంబటి రాంబాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఓ మహిళతో మాట్లాడిన ఆడియో లీక్ సంచలనం సృష్టించింది. ఆ ఆడియో సోషల్‌మీడియాలో బాగా వైరల్ అయింది. దీంతో  ఆయన హైకోర్టుకు వెళ్లి, దానిని ప్రచురించి-ప్రసారం చేయకుండా గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత పులివెందులలోని తన సొంత ఇంట్లో మాజీ మంత్రి, వైఎస్ వివేకానంద దారుణహత్యకు గురయ్యారు. జగన్‌కు చెందిన సొంత మీడియాతోపాటు, ఎంపి విజయసాయిరెడ్డి, అవినాష్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ వంటి నేతలు.. అప్పుడు దానిని గుండెపోటు అని ప్రకటించారు. తర్వాత రక్తపువాంతులన్నారు. ఆ తర్వాత హత్య అన్నారు. చివరకు దానిని చంద్రబాబునాయుడు చేయించారని ఆరోపించారు. వైసీపీ మీడియాలో నారాసుర రక్త చరిత్ర అని రాశారు. ఆ తర్వాత దానిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తి టీడీపీ నాయకులు, తెలుగు మీడియా చర్చించడం ప్రారంభించింది. దానితో భయపడిన వైసీపీ వివేకా హత్యపై ఎవరూ రాయవద్దని గ్యాగ్ ఆర్డరు తెచ్చుకుంది. దానితో ఆ ఎన్నికల్లో వివేకా హత్య సానుభూతితో వైసీపీ ఓట్లు కొల్లగొట్టింది. ఐదేళ్ల తర్వాత.. మళ్లీ తన తండ్రి-చిన్నాయన హత్యపై, సునీత-షర్మిల  కడప పార్లమెంటు పరిథిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గళం విప్పుతున్నారు. నేరుగా అవినాషే హంతకుడు అని ఆరోపిస్తూ ప్రచారం చేస్తున్నారు.  వారి ప్రచారం కడప లోక్ సభ నియోజకవర్గ పరిధిలోనిన ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ ప్రభావం చూపుతుండటంతో  జగన్ ఆందోళనతోనే గాగ్ ఆర్డర్ ద్వారా చెల్లెళ్ల నోరు మూయించే యత్నం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.   ఫలానా వ్యక్తులు వివేకా హత్యపై మాట్లాడవద్దని ఆర్డరు తెచ్చుకున్న వైసీపీ.. మరి తన మీడియాలో అదే వ్యక్తులపై చల్లుతున్న బురద-చేస్తున్న విమర్శల సంగతేమిటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అప్పుడు వివేకా హత్యపై నారాసురరక్త చరిత్ర, ఇప్పుడు బెజవాడ రాయి దాడిపై చేస్తున్న ఆరోపణలపైనా.. ఇలాగే కోర్టుకు వెళ్లి ఆర్డరు తెచ్చుకోవ చ్చా? అని మరికొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు.