CM Chandrababu

పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులతో మంత్రి లోకేశ్‌ భేటీ

  ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదోవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సన్మానించారు. ఉండవల్లిలో ఆయన విద్యార్థులతో ముఖముఖి నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌‌లో విద్యాసంస్కరణలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని లోకేశ్‌ అన్నారు. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్ల ఉత్తమ విద్యార్థులతో యాడ్స్‌ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. కష్టపడి పనిచేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. షైనింగ్‌ స్టార్స్‌ పేరుతో ఉత్తమ విద్యార్థులకు మంత్రి లోకేశ్‌ అభినందనలు తెలిపారు.  రానున్న రోజుల్లో ఏపీ మోడల్‌ ఎడ్యుకేషన్‌ కోసం పట్టుదలతో ముందుకు సాగుతామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తల్లిదండ్రులు తలెత్తుకొని తిరిగేలా చేశారని సంతోషం వ్యక్తం చేశారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్య సాధన కోసం కసి, పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. అనేక సవాళ్లు ఉన్నప్పటికీ విద్యాశాఖలో సంస్కరణలు చేపడుతున్నట్టు మంత్రి వెల్లడించారు. విద్యార్థుల ఆసక్తి తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేసిన డ్రీమ్ వాల్, గ్రాటిట్యూడ్ వాల్, విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేలా ఏర్పాటు చేసిన బ్లాక్స్ ఆకట్టుకున్నాయిని మంత్రి తెలిపారు . జీవితం పట్ల వారికున్న క్లారిటీ నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. వారు కంటున్న కలలు అన్ని సాకారం కావాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ విద్యా వ్యవస్థ పై నమ్మకం పెరిగేందుకు విద్యార్థులు సాధించిన ఈ ర్యాంకులు ఒక మైలురాయిగా నిలిచిపోతాయిని లోకేశ్ పేర్కొన్నారు

Minister Nadendla Manohar

ఏపీలో రేషన్ వ్యాన్ల రద్దు : మంత్రి నాదెండ్ల

  ఆంధ్రప్రదేశ్‌లో జూన్‌ ఒకటో తేదీ నుంచి చౌకధర దకాణాల ద్వారానే రేషన్‌ సరఫరా చేస్తామని  మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు దివ్యాంగులకు మాత్రం డోర్‌ డెలివరీ చేస్తాని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు. 29వేల చౌక దుకాణాల ద్వారా గతంలో బియ్యం సహా ఇతర సరకుల సరఫరా జరిగేది. గత వైసీపీ సర్కార్ ఎండీయూల పేరిట ఈ వ్యవస్థను నాశనం చేసింది. 9,260 మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ల కోసం  రూ.1860 కోట్లు వృథా చేశారు. లబ్ధిదారులు తమ ఇబ్బందులను ఎవరికీ చెప్పుకోలేక పోయారు. 30శాతం మందికి రేషన్‌ అందడం లేదని ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో తేలింది.  రేషన్‌ సరఫరాకు వాహనాలు వచ్చాక జవాబుదారీ తనం లేదు, సరకులు ఎటు వెళ్తున్నాయో తెలియదు.  వందల సంఖ్యలో క్రిమినల్‌ కేసులు ఈ వాహనాల ఆపరేటర్‌లపై నమోదయ్యాయి. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కోసం ఓ గ్రీన్‌ ఛానెల్‌ ఏర్పాటు చేసుకున్నారు. చౌకదుకాణాలు ప్రతినెల 1 నుంచి 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా పై ఉక్కుపాదం మోపుతాం అని మంత్రి నాదెండ్ల తేల్చి చెప్పారు. రేషన్ సరఫరాకు వాహనాలు వచ్చాకా సరుకులు ఎటు వెళుతున్నాయో తెలియలేదు. ఒక్కో వాహనానికి నెలకు రూ.27వేల చొప్పున పౌర సరఫరా శాఖ చెల్లిస్తోందని పేర్కొన్నారు. చాలా అంశాలపై నిర్ణయించి రేషన్ వ్యాన్లను రద్దు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. దీపం-2 పథకం పై మంత్రివర్గ సమావేశంలో చర్చించామని.. దీపం-2 కింద బుకింగ్ కు ముందే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని మంత్రి నాదెండ్ల తెలిపారు.     

Rajahmundry

రాజమహేంద్రవరంలో తెలుగు యూనివర్సిటీ పునరుద్ధరణపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం

  రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయ పునరుద్ధరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై  రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ఏపీకి తరలించే ప్రతిపాదనకు మంత్రి వర్గం ఆమోదం తెలపడం తద్వారా కళలకు కాణాచి, సాంస్కృతిక రాజధానిగా పేరొందిన రాజమహేంద్రవరానికి పునఃవైభవం వస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి దుర్గేష్  ఒక ప్రకటనలో పేర్కొన్నారు.   ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం చట్టం - 1985లోని సెక్షన్ 3(2) ప్రకారం ఏపీలోని రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం  ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలపడం ఆనందంగా ఉందన్నారు.    తెలుగు భాషా సాహిత్యం, సంస్కృతుల ఉన్నత స్థాయి పరిశోధన కేంద్రంగా తెలుగు విశ్వవిద్యాలయం పనిచేస్తుందని తెలిపారు. అన్ని భాషలను గౌరవిస్తూనే మాతృభాషకు అగ్రతాంబూలం ఇవ్వాలన్న  లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.  తెలుగు భాష మరియు సాహిత్యం ఆధారంగా కళా సంస్కృతి, సంగీతం, రంగస్థల నాటకాలు, చిత్ర లేఖనం తదితర వాటిలో  అధునాతన అధ్యయానికి, పరిశోధనలు సులభతరం చేయడానికి ఉపయుక్తంగా ఉంటుందన్నారు. భవిష్యత్ లో జరిగే శాస్త్రీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి రంగంలోనూ ప్రాచీన తెలుగు పరిశోధనలకు అవకాశం కల్పించబడుతుందన్నారు. అంతేగాక తెలుగు భాషా సాహిత్యాలు, కళలు, సంస్కృతి, శాస్త్రాలు సంపూర్ణంగా, సమగ్రంగా అభివృద్ధి చెందాలన్న సదుద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.  ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ప్రజల తరపున  సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారాలోకేష్ లకు మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజల సంస్కృతి, వారసత్వానికి వారధిగా నిలుస్తూ పవిత్ర గోదావరి చెంతన ఉన్న  రాజమహేంద్రవరంలో తెలుగు వైభవంగా వెలుగొందుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగు భాషా సంస్కృతులు, కళలు మరింతగా విరాజిల్లుతాయన్న అభిప్రాయాన్ని మంత్రి దుర్గేష్ వ్యక్తం చేశారు.

TTD

టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

  తిరుమల తిరుపతి దేవస్థాన మండలి  పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమ‌ల కొండ‌ల్లో ఉన్న ప‌చ్చ‌ద‌నాన్ని అట‌వీశాఖ ద్వారా 68.14 శాతం నుండి 80 శాతానికి పెంచేందుకు నిర్ణ‌యించారు. ప‌చ్చ‌ద‌నాన్ని పెంచేందుకు రూ.4 కోట్ల కేటాయించింది.  స్విమ్స్ ఆసుపత్రిలో 597 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. ఒంటిమిట్ట ఆలయంలో నిత్య అన్నదానం చేయాలని నిర్ణయించామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమలలో యాంటీ డ్రోన్ టెక్నాలజీ వినియోగించాలని నిర్ణయించినట్లు ఈవో తెలిపారు.  తిరుమల ఉప ఆలయాలు సమగ్ర అభివృద్ధికి కమిటీ వేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ఆకాశగంగ, పాపవినాశం, కాలినడక మార్గాల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. తిరుమలలో 42 వీఐపీ అతిథి గృహాలు ఆధ్యాత్మిక పేర్లు మార్చాలని నిర్ణయించినట్లు ఆలయ ఈవో శ్యామల రావు పేర్కొన్నారు. తిరుమలలో యాంటీ డ్రోన్ టెక్నాలజీ వినియోగించాలని నిర్ణయించినట్లు ఈవో తెలిపారు. టీటీడీ ఉప ఆలయాలు సమగ్ర అభివృద్ధికి కమిటీ వేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ఆకాశగంగ, పాపవినాశం, కాలినడక మార్గాల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. తిరుమలలో 42 వీఐపీ అతిథి గృహాలు ఆధ్యాత్మిక పేర్లు మార్చాలని నిర్ణయించినట్లు ఆలయ ఈవో శ్యామల రావు పేర్కొన్నారు.⁠  తిరుచానూరు ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం, అమ‌రావ‌తి వేంక‌టేశ్వ‌ర‌ స్వామి ఆల‌యం, నారాయ‌ణ‌వ‌నం క‌ళ్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యం, క‌పిల‌తీర్థం క‌పిలేశ్వ‌ర‌ స్వామి ఆల‌యం, నాగాలాపురం వేద‌నారాయ‌ణ‌స్వామి ఆల‌యం, ఒంటిమిట్ట కోదండ‌రామ స్వామి ఆల‌యాల అభివృద్ధి కోసం స‌మ‌గ్ర బృహ‌త్ ప్ర‌ణాళిక త‌యారు చేసేందుకు ఆర్కిటెక్ట్ ల నుండి సాంకేతిక‌, ఆర్థిక ప్ర‌తిపాద‌న‌లు స్వీక‌రించాల‌ని నిర్ణ‌యించారు.  ఇండియ‌న్ ఆర్మీకి చెందిన సైనిక్ నివాస్ పేరు విష‌యంలో వారితో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామని ఈవో వెల్ల డించారు. ⁠తిరుమ‌ల‌లోని బిగ్ క్యాంటీన్లు, జ‌న‌తా క్యాంటీన్ల లైసెన్సు ఫీజును నిర్ణ‌యించే అంశంపై ఆమోదం. భ‌క్తులకు నాణ్య‌మైన ఆహారం అందించేందుకు పేరొందిన సంస్థ‌ల‌కు ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ⁠టీటీడీలో పని చేస్తున్న అన్యమతస్థుల బదిలీలు.. వీర్ఎస్ దిశగా కసరత్తు చేయాలని డిసైడ్ అయ్యారు.   

CM Chandrababu

రేపు ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు.. సీఎం చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు సమర్పణ

  ఏపీ సీఎం చంద్రబాబు రేపు చిత్తూరు జిల్లా తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా బుధవారం మధ్యాహ్నం అమ్మవారిని కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి దర్శించుకుంటారు.  అనంతరం సాయంత్రం అమరావతి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లలో అధికార యంత్రాంగం బిజీగా ఉంది. ఈ ఏర్పాట్లను  ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ఎస్పీ మణికంఠ పరిశీలించారు. అడ్వాన్స్‌డ్‌ సెక్యూరిటీ లైనింగ్‌లో భాగంగా గుడుపల్లె మండల పరిధిలోని ద్రావిడ విశ్వవిద్యాలయం క్రీడా ప్రాంగణంలో హెలిప్యాడ్‌ ఏర్పాటు చేశారు.  ఇక్కడ భద్రతా ఏర్పాట్లపై అధికారులు చర్చించారు. అనంతరం కుప్పం పట్టణంలోని గంగమాంబ ఆలయంవద్ద ఏర్పాట్లను పర్యవేక్షించి.. సిబ్బందికి సూచనలిచ్చారు. సెక్యూరిటీకి సంబంధించి వర్సిటీ గ్రౌండ్‌ హెలిప్యాడ్‌లో బ్యారికేడ్లు, శానిటేషన్‌ నిర్వహణపై అధికారులకు సూచనలు ఇచ్చారు. బుధవారం ఉదయం సీఎం అమరావతి నుంచి బెంగళూరుకు, అక్కడి నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు ద్రవిడ వర్సిటీ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కుప్పం తిరుపతి గంగమ్మ దేవాలయం చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం 2.30 గంటలకు అమరావతికి తిరుగుప్రయాణం అవుతారని అధికారులు చెప్పారు.   

19 committees for mahanadu

మహానాడు నిర్వహణ కోసం 19 కమిటీలు

జగన్ అడ్డా కడపలో తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి.  ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు అంటే మే 19 వరకూ జరిగే పసుపు పండుగ మహానాడు నిర్వహణ కోసం తెలుగుదేశం అధినేత చంద్రబాబు 19 కమిటీలను ఏర్పాటు చేశారు.  మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఆహ్వానం నుండి భోజనాల వరకు అన్నీఈ కమిటీలే చూసుకుంటాయి. మొత్తంగా మహానాడుకు సంబంధించి సమన్వయ బాధ్యతలన్నీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చూసుకుంటారు. నారా లోకేష్ తో పాటు కేంద్ర మంత్రి, పార్టీ ఎంపీ  రామ్మోహన్‌నాయుడు కూడా కీలక బాధ్యతలు నిర్వహిస్తారు. ఇక మహానాడు నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన 19 కమిటీలకు సంబంధించి ఒక్కో కమిటీలో పది నుంచి 20 మంది ఉంటారు.   పల్లా శ్రీనివాస్‌, బక్కని నర్సింహులు ఆధ్వర్యంలో ఆహ్వాన కమిటీ, నారా లోకేశ్‌ నేతృత్వంలో సమన్వయ కమిటీ, యనమల ఆధ్వర్యంలో తీర్మానాలు, అచ్చెన్నాయుడి నేతృత్వంలో వసతి  , రామ్మోహన్‌ నాయుడు ఆధ్వర్యంలో సభ నిర్వహణ, బీసీ జనార్దన్‌రెడ్డి నేతృత్వంలో భోజనాల కమిటీలను ఏర్పాటు చేశారు. ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తున్నారు. అదే విధంగా కడపలో మహానాడు నిర్వహించడం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం.  ఇక మహానాడులో తొలి రోజు అంటే మే 27న  పార్టీ అధినేత ఎన్నిక కోసం చంద్రబాబు నామినేషన్ దాఖలు కార్యక్రమం ఉంటుంది. రెండో రోజు పార్టీ చంద్రబాబును పార్టీ అధినేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటుంది. అలాగే రెండో రోజు వివిధ అంశాలు, సమస్యలపై చర్చ జరుగుతుంది. చివరి రోజు పార్టీ పలు తిర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదిస్తుంది. అనంతరం భారీ బహిరంగ సభ ఉంటుంది.  

AP Cabinet meeting

రైతు సమస్యలపై ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయం

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముత్తుకూరులో ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సత్యసాయి జిల్లా తాడిమర్రిలో అదానీ పవర్ కు 500 మెగావాట్లు, వైఎస్సార్ కడప జిల్లా కొండాపురంలో 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు భూ కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఎకరానికి రూ.5 లక్షల చొప్పున భూమి కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది.  మరోవైపు రైతు సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది. పంటల దిగుబడులపై సీఎంకు అధికారులకు వివరించారు. రైతులను ఆదుకునేందుకు తాము సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి తెలిపారు. లిక్కర్ స్కామ్ పై విచారణ పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. ఎవరూ తొందరపడి మాట్లాడి అనవసర వివాదాలను తావివ్వొద్దని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో విశాఖలో జరిగే యోగా డేను విజయవంతం చేయాలని మంత్రులకు సీఎం సూచించారు. ▪️2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకానికి కేబినెట్ ఆమోదం. ▪️హైదరాబాద్ లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ఏపీకి తరలించే ప్రతిపాదనకు ఆమోదం. ▪️విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేందుకు స్టడీ సెంటర్ల ఏర్పాటుకు అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీకి అనుమతి. ▪️అమరావతి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా లీగల్ వర్సిటీ ఏర్పాటుకు ఆమోదం. ▪️దుకాణాల ద్వారా రేషన్, ఇతర సరకులు ఇచ్చే ప్రతిపాదనపై కేబినెట్లో చర్చ. ▪️భోగాపురం వద్ద 500 ఎకరాలు కేటాయించే మంత్రుల బృందం ప్రతిపాదనకు ఆమోదం. ▪️ఏపీ లెదర్ పుట్వేర్ పాలసీ 4.0కి కేబినెట్ ఆమోదం. ▪️పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదించిన 11 సంస్థలకు కేబినెట్ ఆమోదం. ▪️రూ.30 వేల కోట్ల పెట్టుబడులు, 35 వేల ఉద్యోగాల కల్పనకు కేబినెట్ ఆమోదం మంత్రివర్గ అజెండాలోని అంశాల తర్వాత తాజా పరిణామాలపై చంద్రబాబు చర్చించారు.

three telugu mps in diplomatic teams

భారత దౌత్య బృందాలలో ముగ్గురు తెలుగు ఎంపీలు

ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భారత  ఆపరేషన్ సిందూర్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని  9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తరువాత పాక్ భారత్ లక్ష్యంగా క్షిపణి, డ్రోన్ దాడులకు పాల్పడటం, వాటిని భారత్ సమర్థంగా తిప్పికొట్టడం అందరికీ తెలిసిన విషయమే. ఆ తరువాత కాల్పుల విరమణ ఒప్పందంతో ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలు ఒకింత సడలినా..  పాకిస్తాన్ నుంచి కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్ వ్యూహాత్మకంగా  పాకిస్థాన్ పై దౌత్యయుద్ధం ప్రకటించింది. ఇందులో భాగంగానే..  పహల్గాం ఉగ్రవాదికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్.. తదననంతర పరిణామాలను ప్రపంచ దేశాలకు వివరించే లక్ష్యంతో భారత ప్రభుత్వం అఖిలపక్ష ఎంపీలతో ఏడు బృందాలను ఏర్పాటు చేసింది.   ఈ ఏడు ప్రతినిథి బృందాలకు అఖిల పక్షాలకు చెందిన నేతలు నాయకత్వం వహిస్తారు. ఒక బృందానికి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నాయకత్వం వహిస్తారు. అలాగే మిగిలిన ఆరు బృందాలకూ.. బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్, అదే పార్టీకి చెందిన వైజయంత్ పాండా, జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఝా,  డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, శివసేన (ఏక్ నాథ్ షిండే) ఎంపీ శ్రీకాంత్  నాయకత్వం వహిస్తారు. కాగా ఈ బృందాలలో ముగ్గురు తెలుగు ఎంపీలకు కూడా స్థానం దక్కింది.   రాజమహేంద్రవరంఎంపీ, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రవిశంక్ ప్రసాద్ నేతృత్వం వహించే బృందంలో సభ్యురాలు. ఈ బృందం యూకే, ఫ్రాన్స్, జర్మనీ, యూరోపియన్ యూనియన్, ఇటలీ, డెన్మార్క్ లలో పర్యటిస్తుంది. అలాగే... ఎన్సీపీ ఎంపీ సుప్రియాసూలె నాయకత్వంలోని బృం దంలో  నరసరావుపేట ఎంపీ, తెలుగుదేశం నాయకుడు లావు కృష్ణదేవరాయులు సభ్యుడిగా ఉన్నారు. ఈ బృందం ఈజిప్ట్, క్వటార్, ఇథియోపియా, దక్షిణాఫ్రికాలలో పర్యటిస్తుంది. ఇక శశిథరూర్ నేతృత్వం వహించే బృందంలో అమలాపురం ఎంపీ జీఎం హరీష్ బాలయోగి సభ్యుడిగా ఉన్నారు. ఈ బృందం అమెరికా, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియా దేశాలలో పర్యటిస్తుంది.  

Corona cases

దేశంలో ఆందోళన రేపుతోన్న కరోనా కేసులు..అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచన

  దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు మళ్లీ ఆందోళన రేపుతున్నాయి. మే 19 నాటికి దేశవ్యాప్తంగా 257 యాక్టివ్ కొవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపధ్యంలో ఆరోగ్య శాఖ అధికారులు, వ్యాధి వ్యాప్తి తీరుతెన్నులపై నిశితంగా దృష్టి సారించారు. ఇప్పటికే హాంకాంగ్, సింగపూర్  దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఓమిక్రాన్ ఉప-వేరియంట్లయిన జేఎన్‌-1, ఎల్‌ఎఫ్‌.7, ఎన్‌బీ.1.8 కేసుల పెరుగుదలకు కారణంగా నిలుస్తున్నాయి. ముంబైలో ఇద్దరు మహిళల మరణం తీవ్ర కలకలం రేపింది. వీరు కరోనా కారణంగానే మృతి చెందారంటూ వార్తలు వ్యాపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్  స్పందించి, ఈ వార్తలను ఖండించింది.  సింధుదుర్గ్, డోంబివ్లి ప్రాంతాలకు చెందిన ఇద్దరు మహిళలు ఆదివారం ముంబైలోని ఓ ఆసుపత్రిలో మరణించిన మాట వాస్తవమే అయినా, వారి మృతికి కరోనా కారణం కాదని బీఎంసీ స్పష్టం చేసింది. తాజాగా కోవిడ్ భారిన పడిన బాధితులలో కొందరు తాము తీవ్ర అలసటతో బాధపడుతున్నారు. వర్షాకాలం వచ్చే ముందు సంభవించే వ్యాధులు ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రాంతాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్, ప్రముఖ నటి శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడ్డారు. ఫ్లూ తరహా లక్షణాలను ఎదుర్కొంటున్న వారు జనసమూహాలకు దూరంగా ఉండాలని, వైద్య పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా క్యాన్సర్, మధుమేహం, అధిక రక్తపోటు, కాలేయ వ్యాధులు వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవారు, వృద్ధులు, ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బీఎంసీ కోరింది. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, అలసట, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించింది.   

vallabhaneni vamshi bail petition hearing adjourned

వంశీ బెయిలు పిటిషన్ విచారణ వాయిదా

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాఖలు చేసిన పిటిషన్లపై  విచారణను ఏపీ హైకోర్టు గురువారం ( మే 22)కు వాయిదా వేసింది.  అక్రమ మైనింగ్ కేసులో గన్నవరం పోలీసుల పీటీ వారెంట్  పై వంశీ హౌస్ మోషన్ పిటిషన్   దాఖలు చేశారు. తనకు ముందస్తు బెయిల్   మంజూరు చేయాలని  ఆ పిటిషన్ లో కోరారు. అయితే వంశీ బెయిలు పిటిషన్ ను కోర్టు గురువారం ( మే 22)కు వాయిదా వేసింది.  ఇక పోతే బాపులపాడు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో వంశీని రెండు రోజుల కస్టడీకి ఇవ్వాలని హనుమాన్ జంక్షన్ పోలీసులు కోర్టుకు కోరారు. ఈ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. తీర్పును ఈ సాయంత్రం వెలువరిస్తామని న్యాయమూర్తి తెలిపారు.  ఇలా ఉండగా.. అక్రమ మైనింగ్ కేసులో కింది కోర్టు అనుమతించినా గురువారం వరకూ పీటీ వారంట్ జారీ చేయబోమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఏది ఏమైనా బెయిలు విషయంలో వల్లభనేని వంశికి మరోసారి చుక్కెదురైంది. 

kavitha express happy for sons graduation

కుమారుడికి గ్రాడ్యుయేషన్ పట్టా.. సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేసిన కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ కుమారుడు ఆదిత్య అమెరికాలోని ఓక్ ఫారెస్ట్ యూనివ‌ర్సిటీ నుంచి గ్రాడ్యుయేష‌న్ ప‌ట్టాను అందుకున్నారు.  యూనివర్శిటీలో  జ‌రిగిన గ్రాడ్యుయేష‌న్ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్సీ క‌విత‌, అనీల్ కుమార్ దంప‌తులు హాజ‌ర‌య్యారు. గ్రాడ్యుయేష‌న్ కు సంబంధించిన ఫోటోను  కల్వకుంట్ల కవిత సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  ఆదిత్యా, నీ చిట్టి చేతిని పట్టుకోవడం నుండి నువ్వు డిగ్రీ పట్టుకోవడం వరకు చూశాను. ఈ గోప్ప ప్రయాణంలో నీవు చాలా కష్టపడ్డావు. ఎంతగానో ఎదిగావు, మమ్మల్ని గర్వపడేలా చేశావు అంటూ  ఆనందం వ్యక్తం చేశారు.  కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కవిత అమెరికా పర్యటనకు ఢిల్లీలోని సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కోర్టు ఆమెకు వారం రోజుల పాటు అమెరికా పర్యటనకు వెళ్లేందుకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. కవిత ఈ నెల 23న అమెరికా నుంచి హైదరాబాద్ కు చేరుకుంటారు.  

Hyderabad Metro Corporation

హైదరాబాద్ మెట్రో ఛార్జీలు తగ్గింపు

  హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల పెంచిన ప్రయాణ ఛార్జీలను సవరించింది. ఇటీవల పెంచిన మెట్రో ఛార్జీలను సవరిస్తూ, వాటిని 10 శాతం మేర తగ్గిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం పేర్కొన్నాది. ఈ నిర్ణయంతో ప్రయాణికులపై ఆర్థిక భారం కొంతమేర తగ్గనుంది. ఇటీవల ఛార్జీల పెంపుపై ప్రయాణికుల ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  తగ్గిన చార్జీలు మే 24వ తేదీ నుండి అమలులోకి రానున్నట్టు మెట్రో రైలు సంస్థ ప్రకటించింది. మే17వ తేదీ నుంచి పెరిగిన మెట్రో ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. క‌నీస ఛార్జీ రూ. 10 నుంచి రూ. 12కు, గ‌రిష్ఠ టికెట్ ధ‌ర రూ. 60 నుంచి రూ. 75కు పెంచారు. ఇలా కనిష్ఠంగా రూ.2, గరిష్ఠంగా రూ.16 వరకు ఛార్జీలు పెంచినట్లు ఎల్‌ అండ్‌ టీ ప్రకటించింది. అయితే ఈ పెరిగిన చార్జీలను యథాతథంగా ఉంచలని హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం నిర్ణయించింది.  

rain alert to andhra pradesh

ఏపీకి భారీ వర్ష సూచన

నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి  ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో బుధ, గురువారాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వాతా వరణ శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు  దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే కోస్తాంధ్ర జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. అయితే రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వేసిన ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుంది.   కొన్ని ప్రాంతాలలో పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశం ఉంది.  వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య,  సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే  విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఉభయ గోదావరి, కోనసీమ జిల్లాల్లో మోస్తరు  నుంచి భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉంది.  

comprehensive training to meet challenges

సవాళ్ళకు జవాబు.. క్యాడర్ కు ప్రత్యేక శిక్షణ!

తెలుగు దేశం  అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,  ఓవంక సుపరిపాలన ద్వారా ప్రజాభిమానాన్ని సొంతం చేసుకుంటూనే, మరో వంక పార్టీ పటిష్టతపై దృషి కేంద్రీకరించారు.  గతంలో అధికారంలో ఉన్న ఐదేళ్లలో..  అప్పటి పరిస్థితులు, ముఖ్యంగా రాష్ట్ర విభజన విసిరిన సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కునే క్రమంలో ..  చంద్రబాబు, స్టేట్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్ నినాదంతో శక్తి యుక్తులు అన్నింటినీ రాష్ట్ర ప్రయోజనాలకే వెచ్చించారు. రాష్ట ప్రయోజనాలకు ఇచ్చిన ప్రాధాన్యత పార్టీకి ఇవ్వలేదు. పార్టీ పటిష్టత పై అంతగా దృష్టి పెట్టలేదు. ఫలితంగా పార్టీనే కాదు, రాష్ట్రం కూడా ఎంతగానో నష్ట పోయింది. వైసీపీ ఐదేళ్ళ సుందర ముదనష్ట పాలనలో..  జగన్ రెడ్డి రాష్ట్రాన్ని దశాబ్దాల కాలం వెనక్కి తీసుకు పోయారు.   గతంలోనే ఈ వాస్తవాన్ని గుర్తించిన చంద్రబాబు నాయుడు.. మరో మారు అలాంటి అనర్ధం జరగ కుండా ఉండేందుకు, ఇప్పటికే చాల వరకు పట్టాల పైకి తెచ్చిన పరిపాలన పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూనే, పార్టీ పటిష్ఠతపై కూడా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని నిర్ణయించారు.  అవును.. కింది స్థాయి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై చంద్రబాబు దృష్టిని కేంద్రీకరించారు. ఇందులో భాగంగా.. తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు, నియోజకవర్గాల వారీగా  ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించారని పార్టీ నేతలు చెబుతున్నారు. నిజానికి..  మారుతున్న పరిస్థితులకు, ముఖ్యంగా టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులు, నూతన ఆవిష్కరణలకు  అనుగుణంగా నూతన పద్దతులను అడాప్ట్ చేసుకోవడం, ఆచరణలో పెట్టడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొట్టినపిండి. అంతే కాదు ఒక్క రాజకీయ, పరిపాలన రంగాలలోనే కాదు, ఏ రంగంలో అయినా  టెక్నాలజీ సమర్ధవంతంగా వినియోగించుకోవడం అభివృద్దికి మూల మంత్రంగా చంద్రబాబు నాయుడు గట్టిగా విశ్వసిస్తారు. అదే విషయాన్ని ఆయన పలు సందర్భాలలో, అనేక వేదికల నుంచి ప్రస్తావించారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన  తెలుగువన్  రజతోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొని చేసిన ప్రసంగంలోనూ.. చంద్రబాబు ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. టెక్నాలజీ రంగంలో వచ్చిన మార్పులను ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకుంటూ పాతికేళ్ళ విజయ ప్రస్థానం సాగించిన, తెలుగు వన్   చైర్మన్ కంఠంనేని రవిశంకర్  ను అభినందిచారు. అలాగే..  ఇటీవల కాలంలో అన్ని రంగాలకు ఆయువు పట్టుగా మారిన సోషల్ మీడియా సమర్ధ వినియోగం పైనా చంద్రబాబు నాయుడ దృష్టి పెట్టారని పార్టీ వర్గాలు తెలిపాయి. అందుకే..  నియోజకవర్గాల వారీగా నిర్వహించే  శిక్షణ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలో సంస్థాగత విషయాలు.. రాజకీయ అంశాలతో పాటుగా, సోషల్ మీడియా సద్వినియోగం విషయంలోనూ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పార్టీ నేతల తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా కార్యకర్తలు, నాయకులకు రాజకీయ అవగాహన, రాజకీయ వ్యూహాల పట్ల అవగాహనా కల్పించడంతో పాటుగా..  స్వర్ణాంధ్ర విజన్ – 2047,  పీ – 4 ఇనిషియేటివ్స్ ముఖ్య ఉద్దేశాలపై అవగాహన కల్పిస్తామని నేతలు చెప్పారు. అదే విధంగా బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేలా చేయడం జరుగుతుందని తెలిపారు.   ఇప్పటికే కుప్పం, మంగళగిరి సహా మరి కొన్ని నియోజక వర్గాల్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని మహానాడు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా, అన్ని నియోజక వర్గాల్లో నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ముందుగా.. గత ఎన్నికల్లో ఓడిపోయిన  విశాఖపట్నం నార్త్, చింతలపూడి, తెనాలి, పెనుగొండ,కనిగిరి నియోజక వర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, ఈ ఐదు నియోజక వర్గాల్లో శిక్షణ కార్యక్రమం పూర్తయిన తర్వాత మంచి చెడులను సమీక్షించుకుని, రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.      ఈ శిక్షణ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ సిద్దాంతం, పార్టీ లక్ష్యం, నాయకత్వ లక్షణాలు, సంక్షేమ పథకాల అమలుకు చేపట్టిన కార్యక్రమాలు, సోషల్ మీడియాని సమర్ధవంతంగా వినియోగించుకోవడ్డం వంటి పలు కీలక అంశాలపై ఎంపిక చేసిన క్రియాశీల కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాలలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. భవిష్యత్ లో  ప్రొఫెసర్లు, ఇతర రంగాలకు చెందిన నిపుణుల సేవలను కూడా వినియోగించుకోవడం జరుగుతుందని అంటున్నారు.  అదే విధంగా   వైసీపీ సోషల్ మీడియా సాగించే ప్రభుత్వ వ్యతిరేక దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టేందుకు వీలుగా మండల స్థాయి నుంచి కార్యకర్తలకు సోషల్ మీడియా సమర్ధ వినియోగంపై శిక్షణ ఇవ్వడం కూడా శిక్షణలో భాగంగా ఉంటుందని అంటున్నారు.

గులాబీ బాస్‌‌ కేసీఆర్‌కు బిగ్ షాక్..కాళేశ్వరం కమిషన్ నోటీసులు

  బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు భారీ షాక్ తగిలింది. గులాబీ బాస్‌తో పాటు పాటు మాజీమంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. జూన్ 5వ తేదీ లోగా విచారణకు హాజరు కావాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆదేశాలు జారీ అయ్యాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కమిషన్ విచారణ తుది దశకు చేరుకోవడంతో.. తెలంగాణ సర్కారు కమిషన్ గడువును 2025 జూలై 31 వరకు పొడిగించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, అవినీతి ఆరోపణలు రావడంతో జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో కమిషన్ విచారణ కొనసాగిస్తుంది.  అయితే గులాబీనేత గతంలో నరసింహారెడ్డి కమిషన్ విచారణను న్యాయస్థానంలో సవాలు చేసి, దాని చైర్మన్‌ను తొలగించారు. ఈ నేపథ్యంలో, జస్టిస్ ఘోష్ కమిషన్ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. కేసీఆర్‌తో పాటు హరీశ్ రావు, ఈటెల రాజేందర్‌కు నోటీసులు జారీ అయ్యాయి. జూన్ 5వ తేదీ లోగా విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో నీటి పారుదల శాఖ మంత్రిగా హరీశ్ రావు పని చేశారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్‌ పని చేశారు . ఈ తరుణంలోనే కేసీఆర్‌తో పాటు హరీశ్ రావు, ఈటెల రాజేందర్‌కు నోటీసులు జారీ అయ్యాయి.  

ఏపీ మద్యం కుంభకోణం.. జగన్ బ్యాచ్ కి బిగుస్తున్న ఉచ్చు?!

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణఏం కేసులు మాజీ సీఎం జగన్ బ్యాచ్ కి ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటున్నట్లు కనిపిస్తోంది.  ఈ కేసులో కీలక నిందితులు నలుగురిని కస్టడీకి ఇవ్వాలని విజయవాడ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, ఈ కేసులో ఏ1గా ఉన్న కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్‌గా ఉన్న బాలాజీ గోవిందప్పలను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు. ఈ నలుగురినీ కలిపి విచారించాల్సిన అవసరం ఉందని సిట్ ఆ పిటిషన్ లో పేర్కొంది. ఈ నలుగురూ జగన్ కు అత్యంత సన్నిహితులు కావడం గమనార్హం.  మద్యం ముడుపులు, కమిషన్ వ్యవహరంలో ఈ నలుగురికీ తెలిసి కొన్ని విషయాలు జరిగాయనీ,  అందువల్లే నలుగురినీ కలిపి విచారించాల్సిన అవసరం ఉందని సిట్ పేర్కొంది. ఈ నలుగురినీ కలిపి విచారించిన తరువాతనే ఈ కేసులో ముందుకు సాగడానికి అవకాశాలు ఉంటాయని సీట్ చెబుతోంది.  ఈ నలుగురినీ కస్టడీకి కోరుతూ సిట్ దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం ( మే 20) విచారణ జరగనుంది.  మరోవైపు రాజ్‌కేసిరెడ్డి వాంగ్మూలం రికార్డు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఈడీ విజయవాడ కోర్టులో మూడు రోజుల కిందట పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై  ఏసీబీ కోర్టు సోమవారం (మే 19) విచారణకు వచ్చింది. ఈ విచారణను కూడా ఏసీబీ కోర్టు మంగళవారం (మే 20)కి వాయిదా వేసింది. దీంతో నలుగురు కీలక నిందితుల కస్టడీ పిటిషన్‌పై కోర్టు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.   మరోవైపు లిక్కర్ స్కాం కేసులో ఏ33గా ఉన్న గోవిందప్పను వారం రోజుల పాటు కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. అలాగే లిక్కర్ కేసులో ఏ30 పైలా దిలీప్ బెయిల్ పిటిషన్‌పై సిట్ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. దిలీప్‌కు బెయిల్ మంజూరు చేస్తే విచారణకు విఘాతం కలుగుతుందంటూ పేర్కొన్నారు. ఈ కేసులో దిలీప్ ద్వారా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మొత్తం వ్యవహారం నడిపించారని సిట్ అధికారులు తెలిపారు. పైలా దిలీప్ బెయిల్ పిటిషన్‌పై కూడా కోర్టు మంగళవారం (మే 19) విచారించనుంది. అలాగే ఈ కేసులో ఏ 6గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ కూడా ఏసీబీ కోర్టు మంగళవారమే.   విచారించనుంది.మొత్తం మీద  మద్యం కుంభకోణం కేసులో జగన్ బ్యాచ్  అడ్డంగా బుక్కైనట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదానికి కారణం అక్రమ కనెక్షన్ లేనా?

హైదరాబాద్‌ పాతబస్తీ గుల్జార్ హౌస్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 17 మంది మృత్యువాత పడిన విషాద ఘటన కలకలం రేపింది.  అగ్నిప్రమాద కారణాలపై సంబంధిత శాఖల అధికారులు విచారణ చేపట్టారు. వారి విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. చూస్తున్నాయి.  షార్ట్ సర్క్యూట్, ఏసీ కంప్రెషర్ పేలుడు కారణాలుగా  అధికారులు ప్రాథమికంగా నిర్ధారించినా, అక్రమ  విద్యుత్ కనెక్షన్ లు కూడా అగ్నిప్రామాదానికి ప్రధాన కారణంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.   ఈ ఆరోపణలపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  మామూలుగా అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంత పెద్ద ఎత్తున మంటలు చెలరేగే అవకాశం ఉండదని విద్యుత్ శాఖ చెబుతోంది.  ఏసీ కంప్రెషర్ బ్లాస్ట్‌ కారణంగానే ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించిందని అంటోంది. అదే సమయంలో  అక్రమ విద్యుత్ కనెక్షన్ కోణంలోనూ విచారిస్తున్నట్లు విద్యుత్ శాఖ పేర్కొంది.  దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామని తెలిపారు విద్యుత్ శాఖ చెబుతోంది. ఇంతకీ అక్రమ కనెక్షన్ల వ్యవహారం ఏమిటంటే..  నగల దుకాణం మూసేయగానే హైటెన్షన్ వైర్‌ నుంచి.. కొక్కేల ద్వారా స్థానికులు కరెంట్‌ కనెక్షన్‌ తీసు కుంటున్నారు. ఈ కారణంగానే బాధిత కుటుంబం కరెంట్‌ మీటర్‌పై లోడ్‌ పడిందనీ, ఆ అధికలోడ్ కారణంగా తొలుత విద్యుత్ మీటర్ బాక్స్ లో మంటలు చెలరేగి పక్కనే ఉన్న చెక్క షోకేస్ కు మంటలు వ్యాపించాయని అంటున్నారు.  అక్కడ నుంచి మంటలు ఏసీ కంప్రెషన్ కు తాకాయనీ, దీంతోనే ప్రమాద తీవ్రత అధికమైందన్న అనుమానాలను విద్యుత్ శాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు.   అగ్నిమాపక సిబ్బంది కూడా ఓవర్‌ లోడ్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని అంటున్నారు.  

పుంగనూరు పుడింగి పెద్దిరెడ్డి అధీనంలోని ప్రభుత్వ భూమి స్వాధీనం

జగన్ హయంలో పుంగనూరు పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకత్వం ఆకాశమే హద్దన్నట్లుగా సాగింది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో  పెద్దిరడ్డి పెత్తనం ఇష్టారాజ్యంగా సాగింది. అడ్డూ అదుపూ లేకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  భూ కబ్జాలకు పాల్పడ్డారు. అధికారం అండతో అదికారులను గుప్పిట పెట్టుకుని వింటారని ప్రభుత్వ భూమి... అటవీ భూమి.. ప్రైవేట్ భూములు అన్న తేడా లేకుండా పెద్దిరెడ్డి కబ్జాల పర్వం కొనసాగిందన్న ఆరోపణలు ఉన్నాయి.   గత ఎన్నికలలో  వైసీపీ అత్యంత ఘోర పరాజయాన్ని చవి చూసింది. అయితే పుంగనూరులో మాత్రం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చావుతప్పి కన్నులొట్టపోయిన చందాన విజయం సాధించారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత తన కబ్జాల వ్యవహారం ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నది. కూటమి సర్కార్ అధికార పగ్గాలు అందుకున్న వెంటనే మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో ఫైల్స్ దగ్థం కేసులో కూడా పెద్ది రెడ్డి ప్రమేయం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.   అన్నమయ్య జిల్లా మదనపల్లి శివారులోని  బీకే పల్లి సర్వే నెంబర్ 552లో ప్రభుత్వ భూమి మొత్తం 10.05 ఎకరాల భూమిలో కొంత భాగం మాజీ సైనికుడికి కేటాయించారు.  ఈ భూమిలో పెద్దిరెడ్డి  1.35 ఎకరాలు   భూమి నుంచి కబ్జా చేశారు. 552-7 సర్వే నెంబర్ లో 3.40 ఎకరాలు, 552-8లో 0.50 ఎకరాల భూమి పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత మాజీ సైనికుడు కుటుంబం నుంచి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇందులో బైపాస్ రోడ్డు, ఫ్లై ఓవర్ కు 18 సెంట్లు పోయింది. 552-7 ఆనుకుని ఉన్న 552-1 లోని 1.35 ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారని రెవెన్యూ అధికారులు తేల్చారు. మదనపల్లి సర్వేయర్ రెడ్డి శేఖర్ రెడ్డి, ఆర్ఐ భరత్ రెడ్డి హద్దులు గీసి ఆక్రమణలు తొలగించి 1.35 ఎకరాలు ప్రభుత్వ భూమి గా తేల్చారు. ఆ భూమిని పెద్దిరెడ్డి అధీనం నుంచి స్వాధీనం చేసుకున్నారు.