journalist krishnamraju arrest

జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్టు

రాజధాని అమరావతిని, అమరావతి మహిళలను కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన  జర్నలిస్టు కృష్ణంరాజును పోలీసులు బుధవారం (జూన్ 11) అరెస్ట్ చేశారు. వైసీపీ మీడియా చానెల్ లో ఓ చర్చా కార్యక్రమంలో కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడమే కాకుండా పలు ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి కృష్ణంరాజును ఏ1గా చేర్చారు. ఇదే కేసులో ఇప్పటికే ఆ చానెల్ ఉద్యోగి, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇక అమరావతి మహిళలపై, అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజును   భీమిలి  సమీపంలో అరెస్టు చేసి  , నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆయనను గురువారం (జూన్ 12) కోర్టులో  హాజరు పరుస్తారు.  

matlabu behind honey moon murder

హానీమూన్ మర్డర్.. మతలబేంటంటే?

హానీమూన్ మర్డర్ కేస్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా అతి పెద్ద సంచలనం. ఈ కేసు వ్యవహారంలో అనేక మలుపులు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయ్. పైకి తన ముందు అక్కా అక్కా అంటూనే లోలోపల తన సోదరిని అతడు బుట్టలో పడేశాడని వాపోతున్నాడు సోనమ్ సోదరుడు గోవింద్.  ఇంతకీ ఎవరీ   సోనమ్? ఈమె ఎవర్ని పెళ్లాడింది? తన భర్తను ఎప్పుడు హతమార్చింది? ఎవరి సాయంతో ఈ పని చేసిందన్న ప్రశ్న చాలా మందిలో ఆసక్తి రేకిస్తోంది. ఉత్కంఠ భరితమైన ఈ విషాదగాథలో నిందితులు సోనమ్- రాజ్ కుష్వాహా కాగా.. మృతుడు రాజా. రాజాకు  సోనమ్ కు మే 11న పెళ్లయ్యింది. వీరు హానీ మూన్ కి   మేఘాలయకు వెళ్లారు.  పెళ్లయిన 12 రోజులకే .. అంటే మే 23న రాజా హత్యకు గురయ్యాడు.  దీనంతటికీ కారణం 21 ఏళ్ల రాజ్ కుష్వాహాతో సోనమ్ కి ప్రేమ వ్యవహారం ఉండటమేనని తెలుస్తోంది. రాజా కుష్వాహా తన స్నేహితులతో కలసి.. రాజాను హతమార్చారని పోలీసులు విచారణలో వెల్లడైనట్టు చెబుతున్నారు.  అంతే కాదు సోనమ్ సైతం ఈ నేరం అంగీకరించినట్టు తెలుస్తోంది.  అయితే ఈ కేసులో తన సోదరి ప్రమేయం ఉన్నట్టు అధికారికంగా తెలీయడం లేదనీ, ఒక వేళ అదే నిజమైతే.. ఆమెకు తప్పకుండా ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాడు నిందితురాలు సోనమ్ సోదరుడు గోవింద్.  రాజా సోదరుడు విపిన్ తో కలసి మీడియాతో మాట్లాడిన గోవింద్ ఈ డిమాండ్ లేవనెత్తారు.  హానీమూన్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు రాజా కుష్వాహా మరెవరో కాదు గోవింద్ ఫ్లై- ఉడ్ ఫ్యాక్టరీలో పీఆర్ గా పని చేస్తున్న వ్యక్తే. ఆమాటకొస్తే కుష్వాహా తన సోదరిని అక్కా అక్కా అని పిలిచేవాడని.. ఇద్దరం పక్క పక్కన ఉన్నపుడు తన సోదరి తనతో పాటు కుష్వాహాకూ రాఖీ   కట్టిందనీ గోవింద్ చెబుతున్నారు.    ఇపుడీ వ్యవహారం ఎందుకంత హాట్ టాపిగ్గా మారిందంటే.. ఇప్పటి వరకూ ప్రపంచ చరిత్రలో హానీమూన్ లో ఉండగానే ప్రియుడితో కలసి తన భర్తను మర్డర్ చేయించిన నవ వధువుగా చరిత్రకెక్కింది సోనమ్. ఒక పక్క దేశంలో భారత్- పాక్ అంటూ యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఇదేదీ లెక్క చేయని ఈ ఇద్దరూ ప్రేమికులు (వీరికి మరేదైనా పేరు పెట్టాలి) తమ అడ్డు తొలగించుకోవడంలో భాగంగా ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడం దారుణంగా భావిస్తున్నారు. అందుకే ఈ మర్డర్ కేసులో తన సోదరి పాత్ర నిజమైతే, ఆమెకు తప్పక మరణ శిక్ష విధించాలని కోరుకుంటున్నాడు గోవింద్. ఎందుకంటే తాను ఎప్పుడైతే తన సోదరిని రాజా ఇంటికి ఇచ్చానో అప్పటి నుంచీ ఆ కుటుంబంలో ఒక భాగం అయ్యాననీ.. అందుకే  తాను కూడా వారి పక్షమేననీ.. కాబట్టి ఆ కుటుంబానికి నా వల్ల జరిగిన అపరాధానికి తాను న్యాయం కోరుతున్నానని బోరున విలపిస్తూ చెప్పాడు గోవింద్. 

all good omens in kutami one year rule

కూటమి ఏడాది పాలన.. అన్నీ మంచి శకునములే!

సరిగ్గా ఏడాది క్రితం అంటే గత ఏడాది జూన్ 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేనాటికి రాష్ట్ర పరిస్థితి  అస్తవ్యస్థంగా ఉంది. అరాచక పాలనతో, విధ్యాంసాలతో జగన్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆ పరిస్థితిని గ్రహించిన ఏపీ ఓటరు కూటమికి అఖండ మెజార్టీ ఇచ్చాడు. అంతటి అనుభవశాలి అయిన చంద్రబాబుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవగాహన రావడానికి నెలల సమయం పట్టిందంటే..  వైపీసీ హయాంలో ఎంత విధ్వంసం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా కూటమి ఎన్నికల హామీలను కూడా వెంటనే అమలు చేయలేకపోయింది. వ్యవస్థలను గాడిలో పెట్టి ఆంధ్రప్రదేశ్‌ను విధ్వంసం నుంచి వికాసం వైపు పరుగులు పెట్టించడానికి ఏడాది పట్టింది. ఆంధ్రులు గర్వించేలా అమరావతి, జలసిరులు నింపేలా పోలవరం, జెట్ స్పీడ్ అందుకున్న జాతీయ రహదారులు, అభివృద్ధికి నిచ్చెనల్లా ఫ్లైఓవర్లు.. ఇలా ఏడాది కాలంలో ఎన్నెన్నో పనులు పట్టాలెక్కి పురోగతితో సాగుతున్నాయి.  గత ఏడాది జూన్ 12న చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో వేడుకలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుపరిపాలన- స్వర్ణాంధ్రప్రదేశ్‌ పేరుతో వేడుకలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాది పాలన సందర్భంగా సాయంత్రం సుపరిపాలన- స్వర్ణాంధ్రప్రదేశ్‌ పేరుతో రాష్ట్ర స్థాయి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ అధికారులతో కార్యక్రమం నిర్వహించనున్నారు.  2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 175 స్థానాలకు 164 స్థానాలను కూటమి కైవసం చేసుకుంది.11 సీట్లకు పరిమితమైన వైసీపీ ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. ఈ ఏడాది పాలనలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ.. అమరావతి అభివృద్ధి పనులకు తొలి ప్రాధాన్యం ఇస్తోంది. ఏ ఫర్ అమరావతి, పీ ఫర్ పోలవరం అంటూ తమ ప్రభుత్వం ప్రాధాన్యాలను సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం నాడే క్లారిటీ ఇచ్చారు.  అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేశారు. డీఎస్సీ పరీక్షలు కూడా నిర్వహించారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు దీపం 2 కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తున్నారు. అలాగే అన్నా క్యాంటీన్ల ఏర్పాటు చేసి, ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పెంచి ప్రతినెలా ఒకటో తేదీనే పంపిణీ చేస్తున్నారు. జగన్  ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ఈ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను ప్రారంభిస్తామని ప్రకటించారు. తల్లికి వందనం మార్గదర్శకాల జీఓ కూడా జారీ అయింది. రేపటి నుంచే నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయనుంది.  పార్టీల సంగతికి వస్తే మూడు కూటమి పార్టీల మధ్య మంత్రిత్వ పదవుల దగ్గర నుంచి నామినేటెడ్ పదవుల వరకూ.. పరస్పర అవగాహనతో పాలన సాగుతోంది. అలాగే ప్రభుత్వం డిజిటల్ పాలనపై ఎక్కువ దృష్టి పెడుతోంది. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలను ప్రజలకు చేరువ చేశారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం పరిశ్రమలకు ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నారు.   మొదటినుంచి చంద్రబాబు తీరు తెలిసిన వాళ్ళకి  ఈసారి ఆయనలో ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ కనిపిస్తున్నది. ఆయన తన మొఖంలోని ఫీలింగ్స్ కనిపించకుండా రాజకీయాల్లో చాలా జాగ్రత్తగా ఉండేవారు. కానీ ఈసారి ఆయన వీలైనంత ఎక్కువగా నవ్వుతూ.. ఏమాత్రం అవకాశం దొరికినా సామాన్యులతో కలిసి పోవడానికి ప్రయత్నిస్తున్నారు. తను బయటికి వస్తుంటే వీలైనంత తక్కువగా ఆర్భాటం ఉండేలా  జాగ్రత్త పడుతున్నారు.  తెలుగుదేశం రాజకీయ మొత్తం ప్రస్తుతం లోకేష్ చుట్టూనే నడుస్తుంది. అటు పార్టీ‌పైనా ఇటు ప్రభుత్వంలోనూ లోకేష్ తనదైన మార్క్ చూపిస్తున్నారు. లోకేష్‌ నాయకత్వ లక్షణాలు ప్రధాని మోడీని సైతం ఆకట్టుకుంటున్నాయి. అందుకే మోడీ స్వయంగా లోకేష్‌ దంపతులను ఢిల్లీకి ఆహ్వానించి ప్రాధాన్యత ఇచ్చారు. లోకేష్ మంగళగిరిలో జరుపుతున్న ప్రజా దర్బార్ సక్సెస్ అవ్వడంతో  ఆయన జిల్లాల పర్యటనల్లోనూ దాన్ని కంటిన్యూ చేస్తున్నారు.  2014 -19 మధ్య లోకేష్‌ను ప్రధానంగా పారిశ్రామిక వర్గాలే కలుస్తూ ఉండేవి. ఈసారి సామాన్య ప్రజల్ని కలవడానికి కూడా ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీ కూడా  చంద్రబాబు కంటే ఎక్కువగా లోకేష్‌ను టార్గెట్ చేస్తుందంటే లోకేష్ ఏ స్థాయిలో పవర్ సెంటర్‌గా మారుతున్నారో అర్థమవుతుంది.   జనసేన అధినేత పవన్ కళ్యాణ్  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా తనదైన మార్క్ చూపిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు అభివృద్ధి చేయడం, అటవీ శాఖలో  కుంకీ ఏనుగులను ప్రత్యేకంగా రప్పించడం వంటి కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. పొలిటికల్‌గా పూర్తిస్థాయిలో తన స్టాండ్ మార్చుకున్న జనసేనాని పూర్తి స్థాయిలో సనాతన ధర్మాన్ని అజెండాగా పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు అధికారంలో కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.  కేంద్రంలో తెలుగుదేశం కీలకంగా మారడంతో రాజధాని అమరావతికి తగినన్ని ఫండ్స్ తెచ్చుకోగలుగుతున్నారు. గత ఐదేళ్లూ అడవిలా మారిన అమరావతికి కొత్త కళ వస్తోంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలని కష్టపడుతోంది కూటమి ప్రభుత్వం.  పోలవరం పూర్తి చేయడంతో పాటుగా  బనకచర్లతో అనుసంధానం చేయాలని కొత్త ప్రాజెక్ట్ ని చంద్రబాబు అనౌన్స్ చేశారు. అది పూర్తయితే రాయలసీమ కూడా సస్యశ్యామలం అవుతుందని నిపుణులు అంటున్నారు.  గత వైసిపి ప్రభుత్వం దెబ్బ తినడానికి అతి పెద్ద కారణం రోడ్ల దుస్థితి. ఆ పరిస్థితి అర్థం చేసుకున్న కూటమి అధికారంలోకి వచ్చీ రాగానే రోడ్లపై ప్రత్యేక ద‌ృష్టి సారించి వాటిని అభివ‌ృద్ది చేస్తూ ప్రజల మన్ననలు అందుకుంటోంది. అలాగే అమరావతిలో క్వాంటం వ్యాలీ ప్రాజక్ట్  భవిష్యత్తు గేమ్ చేంజర్ గా చెబుతున్నారు సీఎం చంద్రబాబు. అలాగే అమరావతి, వైజాగ్ మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి  కొన్ని కీలక నిర్ణయాలను త్వరలోనే అమలులో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తమ్మీద గత ఐదేళ్లు ప్రజలకు లేని స్వేచ్ఛను  తాము ఇచ్చామని అంటున్నారు కూటమి నేతలు. స్వయంగా సీఎం చంద్రబాబు సహా  ప్రభుత్వంలో ఉన్న నేతలందరూ ఇదే మాట చెబుతూ వస్తున్నారు. గ్రామీణ ప్రజల్లో కూడా ఇదే  భావన వ్యక్తమవుతోంది.  అయితే తెలుగుదేశం శ్రేణులపై వైసీపీ హయాంలో పెట్టిన అక్రమ కేసులు ఇంకా కొనసాగుతుండటం, రైతులకు గిట్టుబాటు ధర దక్కకపోతుండటం వంటి అంశాలపై ప్రజల్లో ఒకింత అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఆ దిశగా చంద్రబాబు ప్రభుత్వం దృష్టిసారిస్తే.. ఏపీ వాసులకు అన్నీ మంచి శకునములే అంటున్నారు.

yalliki vandanam scheme implimentation from tomorrow

కూటమి సర్కార్ గుడ్ న్యూస్.. రేపటి నుంచే తల్లికి వందనం పథకం అమలు

సూపర్ సిక్స్ లో మరో ముఖ్యమైన హామీ తల్లికి వందనం పథకాన్ని తెలుగుదేశం కూటమి సర్కార్ గురువారం (జూన్ 12) నుంచి అమలు చేయనుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారపగ్గాలు చేపట్టి గురువారం నాటికి సరిగ్గా ఏడాది అవుతుంది. ఈ సందర్భంగా  తల్లికి వందనం కార్యక్రమాన్ని ఆరంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఈ పథకం కింద గురువారం (జూన్ 12) నిధులు విడుదల చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం వర్తిస్తుంది.  ఈ పథకం కింద తల్లుల ఖాతాలలో 8 వేల 745 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేయనుంది.  ఫస్ట్ క్లాస్ లో అడ్మిషన్ పొందిన పిల్లల నుంచి ప్లస్ వన్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల వరకూ అందరికీ తల్లికి వందనం పథకం వర్తిస్తుంది.  ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇహనో, ఇప్పుుడో  జీవో విడుదల చేయనుంది.   ఇలా ఉండగా ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో ఈ పథకంతో కలిపి ఇప్పటి వరకూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఐదు పథకాలను అమలు చేసినట్లౌతుంది. సూపర్ సిక్స్ పథకాలైన పింఛన్ల పెంపు, అన్నా క్యాంటిన్లు,  మెగా డీఎస్సీ, దీంపం్ర2 పథకాలను ఇప్పటికే అమలు చేస్తున్న తెలుగుదేశం కూటమి  ప్రభుత్వం.. ఇప్పుడు తల్లికి వందనం పథకాన్ని కూడా ప్రారంభించింది. ఇక సూపర్ సిక్స్ హామీలలో ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం మిగిలి ఉంది. ఆ పథకాన్ని కూడా ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్నట్లు చంద్రబాబు ఇప్పటికే  ప్రకటించారు.   

YCPs anger over Amaravati

అమరావతిపై వైసీపీ అక్కసు.. కొమ్మినేని అరెస్టు అన్యాయమంట

సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అమరావతి మహిళలను కించపరిచిన కేసులో ఆయన్ను అరెస్టు చేశారు. హైదరాబాద్‌ జర్నలిస్టు కాలనీలోని ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఏపీకి తీసుకువచ్చి మంగళగిరి కోర్టులో హాజరుపరచడంతో కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. కొమ్మినేనిపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో  రాజధాని రైతులు, మహిళలు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కంభంపాటి శిరీష ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్‌లో కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు.  అమరావతిలో ఉన్న తాడికొండ ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గంలోని దళిత మహిళలను అవమానిం చారన్న ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు తెలుస్తోంది. కొమ్మినేనితో పాటు జర్నలిస్ట్‌ కృష్ణంరాజు, ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసిన చానెల్ యాజమాన్యంపైనా కేసు నమోదు చేశారు. కృష్ణంరాజు అనే జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు లైవ్ షోలో పాల్గొని అనుచిత వ్యాఖ్యలు చేశారు.  అమరావతి దేవతల రాజధాని కాదని.. వేశ్యల రాజధాని అని వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపింది. ఆ అసభ్య వ్యాఖ్యలను నిలువరించకుండా కొమ్మినేని శ్రీనివాసరావు చర్చ కొనసాగించడం వివాదాస్పదమైంది. విజయవాడ అయోధ్యనగర్‌ కాలనీలోని ఇంటికి తాళం వేసి కృష్ణం రాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్‌లో అమరావతి మహిళలపై కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలతో రాజకీయం వేడెక్కింది. టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు పోటా పోటీగా మాటల యుద్ధానికి దిగారు. మరోవైపు దీనిపై అమరావతి మహిళలు ఎక్కడికక్కడ నిరసనలు చేపడుతున్నారు. వైసీపీ నేతల తీరుపై భగ్గుమం టున్నారు. వైసీపీ నేతలు రాజధాని అమరావతిపై కక్ష కట్టి ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలను అవమానించేలా మాట్లాడిన వారిపై తగు చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. అరెస్ట్ తర్వాత కొమ్మినేనిని తుళ్లూరు  పోలీసుస్టేషన్‌ను తరలిస్తే.. అక్కడి ప్రజల ఆగ్రహావేశాలతో సమస్యలు తలెత్తుతాయని పోలీసులు ఆయనకు వైద్య పరీక్షల అనంతరం నల్లపాడు పోలీస్‌స్టేష‌న్‌కు తరలించి.. మంగళగిరి కోర్టులో మాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు వైసీపీ మీడియాలో కొమ్మినేని, కృష్ణంరాజుల చర్చపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ .. మాజీ ముఖ్యమంత్రి జగన్, వైఎస్ భారతీరెడ్డి  అమరావతి ప్రాంత మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే క్షమాపణలు చెప్పడం కాదు కదా.. కొమ్మినేని అరెస్ట్‌ను జగన్ తప్పు పడుతున్నారు. కొమ్మినేని అరెస్టు కక్షసాధింపేనని, డిబేట్‌లో వ్యక్తులు మాట్లాడే మాటలకు.. యాంకర్‌కు ఏం సంబంధం అని ప్రశ్నిస్తున్నారు. మీడియాపై కావాలనే దాడులు చేస్తున్నారన్నారు. కొమ్మినేనిని చంద్రబాబు గతంలోనూ టార్గెట్‌ చేశారని ఎక్స్‌ వేదికగా విమర్శించారు. నాలుగేళ్ల తర్వాత అన్నింటికి సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని మళ్లీ అధికారంలోకి వస్తామన్న ధీమాతో జగన్ వార్నింగులు ఇస్తున్నారు కొమ్మినేని అరెస్టును తప్పుపట్టిన జగన్ ఆ చర్చలో కృష్ణంరాజు మాట్లాడింది తప్పేనని పరోక్షంగా అంగీకరించినట్లైంది. ముందు నుంచి అమరావతి రాజధానిపై వ్యతిరేకతతో ఉన్న జగన్ ఇంత జరుగుతున్నా ఇంకా అదే తరహాలో మాట్లాడుతుండటం విమర్శల పాలవుతోంది. జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చినప్పుడు అమరావతికి భూములిచ్చిన రైతులు ఏళ్లతరబడి ఆందోళనలు నిర్వహించారు.  అప్పట్లో వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. తాజా వివాదంపై రాజధాని ప్రాంత రైతులు, స్థానిక మహిళలు భగ్గుమన్నారు. కొమ్మినేని, కృష్ణంరాజుకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. వాళ్లిద్దరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోసారి వైసీపీ నేతలు అమరావతిపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. నిరసన తెలుపుతున్న అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ మహిళల్ని పిశాచాలుగా అభివర్ణించారు. రాక్షసులు కూడా అలా చేయరని.. అదో ఆర్గనైజ్‌డ్‌ తెగ అని సజ్జల వ్యాఖ్యానించడంపై మహిళలు మరింత రగిలిపోతున్నారు మరోవైపు సాటి మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఖండించాల్సిన మాజీ మంత్రి రోజా కూడా కొమ్మినేనికి వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారు. క‌ృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను కొమ్మినేని ఖండిచారంట. ఎవరో చేసిన వ్యాఖ్యలకు కొమ్మినేని అరెస్ట్ చేశారంట. మరి  ఖండిస్తే ఆ డిబేట్ అంతసేపు ఎలా కొనసాగిందో మాజీ మంత్రి రోజాకి తెలియదా అని దుమ్మెత్తి పోస్తున్నారు. కొమ్మినేని లైవ్ షోలో కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు తప్పే అని అంగీకరిస్తున్న వైసీపీ.. ఆ డిబేట్ కొనసా గించిన కొమ్మినేనిని మాత్రం సమర్ధిస్తుండటం లాజిక్ లేకుండా తయారైదంటున్నారు. మీడియా వ్యక్తి అయినప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డి తిరిగి అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే అమరావతిపై ఆ పార్టీ స్టాండ్‌ ఏంటో? రాజధానిపై వైసీపీ నేతలకు ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

NCW orders immediate action against Krishnam Raju

కృష్ణంరాజుపై తక్షణ చర్యలకు ఎన్‌సీడబ్ల్యూ అదేశాలు

జగన్ సొంత మీడియా చానెల్ లో చర్చ సందర్భంగా అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు వీవీఆర్‌ కృష్ణంరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీని జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) ఆదేశించింది. కృష్ణంరాజు అవమానకర వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన వార్తలను ఎన్‌సీడబ్ల్యూ సుమోటోగా తీసుకుంది. ఈ విషయంపై వేగంగా, నిర్దుష్ట కాలపరిమితిలోపు దర్యాప్తు పూర్తిచేసి, నిందితుడిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు విజయ రహాట్కర్‌ ఏపీ డీజీపీకి లేఖ రాశారు. మూడు రోజుల్లోపు దీనిపై పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ఆదేశించింది.  ఇప్పటికే కృష్ణంరాజు కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. విజయవాడ అయోధ్యనగర్‌లోని ఆయన ఇంటికి తాళం వేసి ఉందనీ.. కుటుంబసభ్యులు కూడా లేరని సమాచారం. కృష్ణంరాజును పట్టుకోవడానికి తుళ్లూరు డీఎస్పీ టి.మురళీకృష్ణ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ఈ బృందాలకు డీఎస్పీ సలహాలు, సూచనలు ఇస్తూ పర్యవేక్షిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో కృష్ణంరాజు కదలికలను పసిగట్టే పనిలో ఉన్నారు. విజయవాడ నుంచి ఎక్కడికి, ఎప్పుడు వెళ్లారనే విషయాలను నిఘా పోలీసులు ఆరాతీస్తున్నారు. ఆయన్ను ఏ క్షణమైనా అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వీవీఆర్‌ కృష్ణంరాజు జర్నలిస్ట్‌ అనే ఆంగ్ల మాసపత్రికకు ఎడిటర్‌గా చెలామణి అవుతున్నారు. జర్నలిస్ట్‌ పత్రిక పేరుతో గత ప్రభుత్వ హయాంలో భారీగా అక్రెడిటేషన్లు పొందినట్టు ఆరోపణలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడినంటూ సమావేశాలు పెట్టి తానో సుద్దపూసనని ప్రచారం చేసుకుంటారు. ఏపీ టీవీ జర్నలిస్ట్‌ అనే మల్టీమీడియా న్యూస్‌ ఏజెన్సీకి  స్వయం ప్రకటిత సీఈవో గా ఉన్నారు.  బెజవాడ ప్రెస్‌క్లబ్‌ అంటూ హడావుడి చేశారు. గది అద్దెకు తీసుకుని కార్యాలయం కూడా ప్రారంభించారు. అయితే అటువైపు ఎవరూ చూడకపోవడంతో  అద్దె దండుగ అంటూ  దానిని మూసేశారు.  కొమ్మినేని శ్రీనివాసరావుకు, కృష్ణంరాజుకు పూర్వాశ్రమం నుంచి మైత్రీబంధం ఉంది. కొమ్మినేని చొరవతోనే జగన్ మీడియా చానెల్  డిబేట్‌లో రాజకీయ విశ్లేషకుడి ముసుగులో పాల్గొని  2014-19 మధ్య రాజధాని అమరావతితో పాటు, అప్పటి టీడీపీ ప్రభుత్వంపై విషం కక్కారు. మళ్లీ ఇప్పటి కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడమే ఎజెండాగా పనిచేస్తున్నారు. 2014-19 మధ్య... ఆయనే పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్‌ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజల్ని రెచ్చగొట్టేలా పలు సమావేశాలు నిర్వహించారు.  కృష్ణంరాజు ఏ కార్యక్రమం చేసినా  జగన్ మీడియా హైలైట్ చేస్తుంది. అలా జగన్ మీడియాలో ప్రముఖంగా ప్రచురితమైన  పేపర్‌ క్లిప్పింగ్‌లన్నీ కృష్ణంరాజు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో  ఉంచుకున్నారు. తరచూ తనకు సాక్షి డిబేట్‌లో మాట్లాడే అవకాశం కల్పించినందుకు... తన జర్నలిస్ట్‌ పత్రిక పదో వార్షిక సంచిక ముఖచిత్రంపై  కొమ్మినేని శ్రీనివాసరావు ఫొటో వేసి, జర్నలిస్ట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అంటూ మిత్రబంధం చాటుకున్నారు.

will rajgopalreddy give shock to congress

కోమటిరెడ్డి రాజగోపాల్ మళ్లీ ఝలక్ ఇస్తారా?

మంత్రి పదవి దక్కక పోవడంతో తీవ్ర నిరాశ లో ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి . ఏడాదిన్నరగా వాయిదా పడుతూ వస్తున్న మంత్రి వర్గ విస్తరణ ఎట్టకేలకు ఇటీవల జరిగింది. అది కూడా పాక్షికంగానే.  తెలంగాణ క్యాబినెట్‌లో ఖాళీగా ఉన్న ఆరు స్థానాల్లో మూడు స్థానాలను అధిష్టానం భర్తీ చేసింది. అయితే ఈ  విస్తరణలో తనకు చోటు దక్కక పోవడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మనస్తాపం చెందారట. ఇప్పటికే మంత్రి పదవి హామీతో కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల విషయంలో హైకమాండ్  ఇచ్చిన హామీ నెరవేర్చుకుంది. బీజేపీలోకి వెళ్లి తిరిగొచ్చిన గడ్డం వివేక్‌ వెంకటస్వామికి కూడా తాజా విస్తరణలో క్యాబినెట్ బెర్త్ లభించింది. అయితే తనకు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుందని రాజగోపాల్ మధన పడుతున్నారట. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే తిరిగి పార్టీలోకి రావాలని, మంత్రి పదవి ఇస్తామని హైకమాండ్ ఎన్నికల ముందుఆయనకు హామీ ఇచ్చిందంట. భువనగిరి ఎంపీగా చామల కిరణ్‌ని గెలిపిస్తే పదవి ఇస్తామని రెండోసారి హామీ ఇచ్చిందంట.  ఆ హామీ నెరవేర్చలేదని రాజగోపాల్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట. మంత్రివర్గ విస్తరణలో తనకు తప్పుకుండా బెర్త్‌ దక్కుతుందని భావించిన రాజగోపాల్ రెడ్డి కి మంత్రి దక్కకపోవడంతో ఇక తాడో పేడో తేల్చుకునే పనిలో ఉన్నారట. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి దక్కక పోవడానికి ప్రధాన కారణం ఆయన సోదరుడు వెంకటరెడ్డి క్యాబినెట్‌లో ఉండటమే అంటున్నారు. అదీకాక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే ఇద్దరు రెడ్డి నేతలు మంత్రులుగా ఉండటంతో రాజగోపాల్‌ కు కుల సమీకరణలు కలిసిరాలేదంటున్నారు. జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి  మంత్రులుగా ఉన్నారు. దీంతో మళ్లీ ఇంకో రెడ్డి సామజిక వర్గం నేతకే పదవి ఇస్తే ఒక్క జిల్లా నుంచే ముగ్గురవుతారని..   అందులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే నెగటివ్ అవుతుందనే హైకమాండ్ ఆయన విషయాన్ని పెండింగ్ లో పెట్టిందంటున్నారు. రాజగోపాల్‌కు ఇచ్చిన హామీని ఎలా నెరవేర్చాలో? అయన్ని ఎలా సంతృప్తి పరచాలో అంతుపట్టక పార్టీ పెద్దలు సతమతమవుతున్నారంట. అందుకే పొంగులేటి , వివేక్ కి ఇచ్చిన హామీ నెరవేర్చినా రాజగోపాల్ రెడ్డి విషయం లో స్పష్టత కొరవడిందంట. వివేక్ కుమారుడు ఎంపీగా ఉన్నా, ఆయన సోదరుడు  వినోద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. అదే ఎంపీగా తన భార్య లక్ష్మిని పోటీకి దింపకుండా చామల బరిలో దిగితే సొంత డబ్బులు ఖర్చు పెట్టి గెలిపించినా తనకు మంత్రి పదవి రాకుండా జిల్లా నేతలే అడ్డుకుంటున్నారని రాజగోపాల్‌రెడ్డి ఇప్పటికే పలుమార్లు బహిరంగంగానే విమర్శలు చేశారు. రెండు నెలల కిందట మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని విస్తృత ప్రచారం జరిగింది. అదే సమయంలో రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని మాజీ మంత్రి, పార్టీ సీనియర్‌ నాయకుడు జానారెడ్డి అధిష్టానానికి లేఖ రాశారు. దాంతో రాజగోపాల్‌రెడ్డి ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. జానారెడ్డి లేఖతో మంత్రి పదవి రాకుండా పోయిందని ధర్మరాజు లా ఉండాల్సిన వారు దృతరాష్టుడిలా మారారని అప్పట్లో రాజగోపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరవాత ఆవేశంతో పని కాదని జిల్లా మంత్రులు ఉత్తమ్ , కోమటిరెడ్డిలతో సన్నిహితంగా ఉంటూ.. ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నారు. కాని మంత్రి పదవి రాకపోవడంతో మళ్లీ పార్టీపై ఆగ్రహంతో ఉన్న ఆయన ఫామ్ హౌస్‌కే పరిమితమై సైలెంట్ అయ్యారు. రాజగోపాల్ రెడ్డి సైలెంట్ గా ఉండటం తో ఎం చేయబోతున్నారనే సస్పెన్స్ నెలకొంది . ఇప్పటికే సోషల్ మీడియాలో రాజగోపాల్ రెడ్డి అనుచరులు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టి  వైరల్ చేస్తున్నారు . మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా అని ప్రశ్నిస్తూ.. రాజగోపాల్‌కి మంత్రి రాలేదన్న అసంతృప్తితో రాజీనామా చేస్తున్నట్లు పోస్టులు పెడుతున్నారు . ఇంత జరుగుతున్నా రాజగోపాల్ తన మనసులో మాట బయటపెట్టడం లేదు. సామాజిక కోణంలో అధిష్టానం మూడు స్థానాలు భర్తీ చేసిందని, ఇంకా మూడు పోస్టులు ఖాళీగా ఉండటంతో అన్ని విధాలా ఆలోచన చేసి మళ్లీ విస్తరణలో నిర్ణయం తీసుకుంటుందని ఇంచార్జ్ మీనాక్షి చెప్పడంతో కొంత కాలం వెయిట్ చేద్దామని రాజగోపాల్ భావిస్తున్నారంట.  అయితే తమ నాయకుడు ఇక ఎంతో కాలం వేచి చూసే పరిస్థితి లేదని కోమటిరెడ్డి అనుచరులు అంటున్నారు . ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి ఇవ్వకపోతే మరోసారి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారంట. ఇప్పుడే రాజీనామాపై నిర్ణయం వెల్లడిస్తే పార్టీని బ్లాక్ మెయిల్ చేసినట్లు అవుతుందని వెయిట్ చేస్తున్నారంట. మరి చూడాలి ఆ సస్పెన్స్‌కు ఎప్పుడు తెర పడుతుందో.

kcr vist yashoda hospital and inquire palla health condition

పల్లాకు కేసీఆర్ పరామర్శ

ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జారి పడి గాయపడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరామర్శించారు. బుధవారం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో పల్లా ఉదయమే ఆయనను కలిసేందుకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. ఏమైందో ఏమో కానీ అక్కడ ఆయన కాలు జారి కిందపడ్డారు. దీంతో ఆయనను హుటాహుటిన యశోదా ఆస్పత్రికి తరలించారు.  కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు విచారణ పూర్తయిన తరువాత తిరుగు ప్రయాణంలో యశోదా ఆస్పత్రికి వచ్చి పల్లాను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇలా ఉండగా పల్లా తుంటి ఎముక విరిగిందని తెలుస్తోంది.   ప్రస్తుతం ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. తుంటి ఎముకకు గాయం కావడంతో పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు. సర్జరీ చేయాల్సి ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. 

women protests in podili against jagan

పొదిలిలో జగన్ కు నిరసనల సెగ!

జగన్ పొదిలి పర్యటన రసాబాసగా మారింది. పోగాకు వేలం కేంద్రం సందర్శన అంటూ పొదిలిలో పర్యటించిన జగన్ కు నిరసనల సెగ గట్టిగా తగిలింది. జగన్ సొంత మీడియా చానెల్ లో అమరావతిపైనా, అమరావతి మహిళలపైనా జర్నలిస్టు కృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు, వాటికి సాక్షి ఉద్యోగి, మరో సీనియర్ జర్నలిస్టు అయిన కొమ్మినేని శ్రీనివాసరావు వంత పాడినట్లుగా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. మరో జర్నలిస్టు కృష్ణంరాజు పరారీలో ఉన్నారు.  హైకోర్టులు ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ తరుణంలో జగన్ పొదిలి పర్యటనకు బయలుదేరారు. దీంతో ఆయన పర్యటన పొడవునా నిరసనలు వెల్లువెత్తాయి. పెద్ద సంఖ్యలో జనం ముఖ్యంగా మహిళలు రోడ్లపైకి వచ్చి జగన్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. షేమ్ షేమ్ జగన్  అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. నినాదాలు చేశారు. నల్లబెలూన్లు ప్రదర్శించారు. జగన్ సొంత మీడియా చానల్ లో ప్రసారమైన అసభ్య వ్యాఖ్యలను ఖండించకపోవడమే కాకుండా, ఆ వ్యాఖ్యలు చేసిన వారిని సమర్ధించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మౌనం వీడాలి, జగన్ రాష్ట్రం వీడాలి అంటూ నినాదాలు చేశారు. అలాగే భారతీరెడ్డి మౌనం వీడాలి అంటూ మహిళలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. అలా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలపై వైసీపీ మూకలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. వైసీపీ మూకల దాడిలో కొందరు మహిళలు గాయపడ్డారు. అలాగే రాళ్లదాడిలో ముగ్గురు పోలీసులు కూడా గాయపడ్డారు. సరే ఎలాగో పొగాకు వెలం కేంద్రానికి జగన్ వెళ్లారు. అక్కడ ఆవుకథలాంటి ప్రసంగం చేశారు. అయితే వైసీపీ మూకల హంగామా పొగాకు రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. వైసీపీ శ్రేణులు పోగాకుబేళ్లను తొక్కుతూ నానా హంగామా చేసి రైతులకు నష్టం కలిగేలా ప్రవర్తించారు. ఇక పొగాకు రైతులను ఉద్దేశించి జగన్ తనదైన మార్క్ ప్రసంగం చేశారు. పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.  పొగాకు రైతులకు అండగా ఉంటానన్నారు.  

pramotion to lokesh in telugudesham

మూడు నెలల్లో లోకేష్‌కు తెలుగుదేశంలో కీలక బాధ్యతలు?

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మంత్రి నారా లోకేష్‌కు పార్టీపరంగా ప్రమోషన్ ఎప్పుడు?..అనే ప్రశ్న ఇప్పుడు అటు పార్టీలోను...ఇటు రాజకీయ వర్గాల్లో ఇంట్రస్టింగ్ టాపిక్‌గా మారిపోయింది.  లోకేష్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌ గా ప్రకటించాలని మహానాడు వేదికగా టీడీపీ నేతలు ప్రతిపాదనలు పెట్టారు. అయితే మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. దాంతో మహానాడు ముగిసినా లోకేష్‌ ప్రమోషన్‌కు సంబంధించిన చర్చ పార్టీలో ఇంకా నడుస్తునే ఉంది. లోకేష్ పట్టాభిషేకం ఆలస్యమవ్వడం వెనుకఅనేక అంశాలు ముడిపడి ఉన్నాయని టీడీపీలో సీనియర్ నేతలు అంటున్నారు. కూటమి నేతృత్వంలో ప్రభుత్వం నడుస్తుండడం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం.. సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రాన్ని బయటకు తీసుకురావడానికి చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తుండటం కారణాలుగా చెబుతున్నారు. చంద్రబాబు పాలనలో బీజీగా ఉంటున్న నేపథ్యంలో పార్టీ బాధ్యతలు లోకేష్‌‌కు అప్పగించాలనే డిమాండ్‌ టీడీపీ నేతల నుంచి చాలా కాలంగా వస్తున్నది.  ఓ వైపు టీడీపీ నేతల నుంచి డిమాండ్‌ పెరుగుతున్న తరుణంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు దీనిపై స్పందించాల్సిన పరిస్ధితి వచ్చింది.  లోకేష్‌ని ఎప్పుడు టీడీపీ ప్రెసిడెంట్ గా  చేయబోతున్నారు.. 2029 ఎన్నికల్లోగా లోకేష్‌ని సీఎంగా చేస్తారా అనే ప్రశ్నలు చంద్రబాబు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ప్రశ్నలకు చంద్రబాబు జవాబిస్తూ లోకేష్ కి టీడీపీతో పాటు ప్రజల మద్దతు పూర్తిగా ఉందన్నారు. ఇక యువతను ప్రోత్సహించడంలో తెలుగుదేశం ఎపుడూ ముందుంటుందనీ,  తన పార్టీ నుంచి కేంద్ర మంత్రిగా అతి పిన్న వయస్కుడు అయిన రామ్మోహన్ నాయుడు ఉన్నారని గుర్తు చేశారు. అలాగే తెలుగు పార్లమెంట్ సభ్యులలో  అత్యధిక శాతం యువకులేననీ చెప్పారు. ఏపీ అసెంబ్లీని యూత్ అసెంబ్లీగా అభివర్ణించారు.  ఆ క్రమంలో యువత రాజకీయ అవకాశాలు అందుకోవడం ఒక పరిణామ క్రమంలో జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక ఎన్టీఆర్ తరువాత తాను సీఎం కావడం... తరువాత లోకేష్ పేరు వినిపించడం మీద బాబు స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో నామినేట్ చేయడం కుదర దన్నారు. ప్రజల అనుమతి ఉండాలని స్పష్టం చేశారు.  తనకు నాలుగు సార్లు సీఎంగా ప్రజలు అవకా శం ఇచ్చారని అంటూనే... లోకేష్‌కి కూడా జనాల మద్దతు ఉందంటూ అన్యాపదేశంగా లోకేష్‌ ప్రమోషన్‌పై స్పందించారు. తెలుగుదేశం యూత్ పార్టీగా విస్తరిస్తూ ముందుకు సాగుతోందని చంద్రబాబు అంటుండటంతో.. లోకేష్‌కు తర్వలో కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారనే చర్చ టీడీపీలో మళ్లీ మొదలైంది. కాస్త అటూ ఇటూ  కావచ్చు, ఆలస్యం అయినా అవ్వొచ్చు..  కానీ లోకేష్ కచ్చితంగా టీడీపీలో కీలక భూమిక పోషించబోతున్నారని టీడీపీ నేతలంటున్నారు. తాజాగా పార్వతీపురంలో పర్యటించిన లోకేష్‌ పొలిట్ బ్యూరోలో సంస్కరణ తేవాలంటే  కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. అందరినీ ఒప్పించడానికి 3నెలల సమయం పడుతుందనే హింట్‌ ఇచ్చారు.  ఆ క్రమంలో మరో మూడు నెలల్లో లోకేష్‌కు ప్రమోషన్‌ దక్కబోతుందనే చర్చ పార్టీ నేతల్లో నడుస్తోందంట. టీడీపీ సిద్ధాంతాలను మార్చకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా మహానాడులో ఆరు శాసనాలను ప్రకటించడం జరిగింది.  వాటిని రూపొందించడంలో లోకేష్ ముఖ్యభూమిక పోషించా రని స్వయంగా చంద్రబాబే ప్రకటించారు.  మహానాడు విధానం మార్చడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిం దన్న లోకేష్‌... మిగిలిన విషయాలపై స్పందించనప్పటికి.. తర్వలో ఆయన ప్రమోషన్ గ్యారెంటీ అని పార్టీ సీనియర్లు అంటున్నారు.

Drugs in Mangli birthday celebrations

సింగర్ మంగ్లీ బర్త్ డే సెలబ్రేషన్స్ లో డ్రగ్స్ కలకలం

టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. ప్రముఖ సింగర్ మంగ్లీ పుట్టిన రోజు వేడుకలలో డ్రగ్స్ వినియోగం జరిగినట్లు  పోలీసులు చెబుతున్నారు. మంగ్లీ బర్త్ డే సెలబ్రేషన్స్  రంగరెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి గ్రామ శివారులో  మంగళవారం (జూన్ 10) రాత్రి జరిగాయి. కాగా ఈ వేడుకలలో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారంలో ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ దాడులలో మంగ్లీ బర్తడే సెలబ్రేషన్స్ లో డ్రగ్స్ వినియోగం జరిగినట్లు వెల్లడైంది.  ఈ వేడుకలకు 50 మంది వరకు కుటుంబ సభ్యులు సన్నిహితులు హాజరయ్యారు. అలా హాజరైన వారిలో  సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం.   అర్ధరాత్రి రెండు గంటల తర్వాత sot  పోలీసులు దాడులు చేపట్టారు. దాడుల్లో దాదాపుగా 48 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా, వారిలో తొమ్మండుగురికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.  అలాగే విదేశీ మద్యం కూడా పెద్ద ఎత్తున వినియోగించినట్లు పోలీసులు చెబుతున్నారు.  

kcr attend before kaleswaram commission

కాళేశ్వరం కమిషన్ ఎదుటకు కేసీఆర్

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు  కాళేశ్వరం కమిషన్  ముందు విచారణకు హాజరయ్యారు.  సిద్దిపేటలోని ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ నుంచి  బయలుదేరి ఆయన నేరుగా బీఆర్కే భవన్ కు చేరుకున్నారు.  ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో వెంట ఈ విచారణకు వచ్చేందుకు  మాజీ మంత్రి హరీష్‌రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు ప్రశాంత్‌రెడ్డి, పద్మారావుగౌడ్, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్సీ మహమూద్ అలీ, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కి కమిషన్ అనుమతించింది.  ఇలా ఉండగా కేసీఆర్ విచారణ కమిషన్ ముందు హాజరు కావడానికి బయలుదేరుతుండగా ఎర్రవల్లి ఫాం హౌస్ లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరావు కాలు జారి పడిపోయి గాయపడ్డారు. దీంతో ఆయనను సికిందరా బాద్ యశోదా ఆస్పత్రికి తరలించారు.    ఆ తరువాత మార్గమధ్యంలో కేసీఆర్ కాన్వాయ్ లోని రెండు కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. కమిషన్ విచారణకు హాజరయ్యే ముందు ఈ అపశ్రుతులేంటంటూ బీఆర్ఎస్ శ్రేణులు మధనపడుతున్నాయి.  కాగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు నేపథ్యంలో బీఆర్క్కే భవన్ కు వచ్చే దారులలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అలాగే బీఆర్కు భవన్ లోకి  అందులో పని చేసే ఉద్యోగులను వినా మరెవరినీ అనుమతించడం లేదు. అలాగు బీఆర్కే భవన్, జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు రోడ్డుని పూర్తిగా మూసి వేశారు.   ఇలా ఉండగా కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావడానికి ముందు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సామాజిక మాధ్యమంలో చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఆ ట్వీట్ లో ఆయన కేసీఆర్ ను కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు నిలబెడితే ఆయన ఖ్యాతి ఇసుమంతైనా తగ్గదని  పేర్కొన్న కేటీఆర్ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభిస్తున్నప్పటి ఫోటోను ఆ పోస్టుకు జత చేశారు. 

journalist krishnamraju anticipatory bail petition

ముందస్తు బెయిలు కోసం హైకోర్టుకు జర్నలిస్టు కృష్ణంరాజు

ముందు వెనుకలాలోచించకుండా నోటికొచ్చినట్లు మాట్లాడి.. ఇప్పుడు అరెస్టు భయంతో ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు జర్నలిస్టు కృష్ణంరాజు. రాజధాని అమరావతిపైనా, అమరావతి మహిళలపైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజు.. నిరసనలు వెల్లువెత్తి, కేసు నమోదు కాగానే అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. పోలీసులు తన కోసం తీవ్రంగా గాలిస్తుండటం, జాతీయ మహిళా కమిషన్ కూడా తనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని, ఆ చర్యల నివేదికను మూడు రోజులలో సమర్పించాలంటూ ఏపీ డీజీపీని ఆదేశించిన నేపథ్యంలో అరెస్టు తప్పదన్న భయంతో కృష్ణం రాజు ముందస్తు బెయిలు కోసం మంగళవారం (జూన్ 10) ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.  పూచీకత్తులు సమర్పిస్తానని, తనకు విజయవాడ, అమరావతి చుట్టుపక్కల ఆస్తులు ఉన్నందున పారిపోనని తన ముందస్తు బెయిలు పిటిషన్ లో కృష్ణంరాజు పేర్కొన్నారు.  కాగా కృష్ణంరాజు ముందస్తు బెయిలు పిటిషన్ గురువారం (జూన్ 12) విచారణకు వచ్చే అవకాశం ఉంది. 

telangana high court grant conditional bail to gali janardhan reddy

గాలి జనార్దన్ రెడ్డికి హైకోర్టులో ఊరట

మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టు స్టే విధించింది. గాలి జనార్దన్ రెడ్డికి షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. పది లక్షల రూపాయల చొప్పున రెండు షూరిటీలు సమర్పించాలనీ, పాస్ పోర్టు సరెండర్ చేయాలని ఆదేశిస్తూ గాలి జనార్దన్ రెడ్డికి కండీషన్డ్ బెయిలు మంజూరు చేసింది.  ఓబుళాపురం మైనింగ్ కంపెనీ  అక్రమాల కేసులో నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గాలి జనార్దన్‌రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు కె.మెఫజ్‌ అలీఖాన్‌, అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వీడీ రాజగోపాల్‌ లకు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ గాలి జనార్దన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.   గాలి ముందస్తు బెయిలు పిటిషన్ పై మంగళవారం (జూన్ 10)న వాదనలు పూర్తికాగా హైకోర్టు బుధవారం (జూన్ 11) గాలి జనార్దన్ రెడ్డికి షరతులతో కూడిన బెయిలు మంజూరు చేస్తూ తీర్పు  వెలువరించింది. 

former minister gudiwada amarnath silent

వైసీపీలో గుడివాడ అమర్నాథ్ సినిమా అయిపోయిందా?

వైఎస్ జగన్ హయాంలో ఏపీ ఐటీ శాఖ మంత్రిగా వెలగబెట్టిన గుడివాడ అమర్నాథ్ గుడ్డు కథ ఆ రోజుల్లో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు గురైంది. గుడివాడ అమర్నాథ్ కు గుడ్డు మంత్రి అన్న బిరుదును కూడా సంపాదించుకున్నారు.  ఇక గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైన తరువాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న  అతి కొద్ది మంది పార్టీ నేతలలో గుడివాడ కూడా ఒకరిగా ఉంటూ వచ్చారు. అయితే.. గత కొద్ది రోజులుగా ఆయన పూర్తిగా సైలెంట్ అయ్యారు. అసలు పార్టీలో ఉన్నారా? లేదా అన్నట్లుగా ఆయన తీరు మారిపోయింది. పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న ఆయన తీరును చూసి వైసీపీ వర్గీయులే ఆయన సినిమా అయిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతలో గుడివాడ అమర్నాథ్ అంతగా పార్టీకి దూరంగా మెసలడానికి కారణాలపై రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొత్తం మీద  గుడివాడ అమర్నాథ్ పార్టీ అధినేత జగన్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మాత్రం తెలుస్తోంది. తాను కోరుకున్న నియోజకవర్గానికి తనను ఇన్ చార్జిగా నియమిం చలేదన్న అసంతృప్తి ఆయనలో బాగా పేరుకుపోయిందంటున్నారు.  గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన అతి కొద్ది మంది నేతలలో గుడివాడ కూడా ఒకరని ముందే చెప్పుకున్నాం కదా? అలా మాట్లాడటమే కాదు.. తరచూ విశాఖ జిల్లా వైసీపీ కార్యాలయానికి వచ్చి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంలో కూడా గుడివాడ ముందుండేవారు. అటువంటి ఆయన ఇటీవల అసలు పార్టీ కార్యాలయం ముఖమే చూడటం లేదు.  ఇందుకు కారణంగా ఆయన కోరుకున్న విశాఖ నగరం ఇన్ చార్జి పదవి దక్కకపోవడమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.    గత ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ గాజువాక నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి అత్యంత ఘోరం అనదగ్గ ఓటమిని చవి చూశారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో ఇక్కడ నుంచి  తెలుగుదేశం అభ్యర్థి పల్లా శ్రీనివాస్ విజయం సాధించారు. గుడివాడ అమర్నాథ్ పై పల్లా శ్రీనివాస్ ఏకంగా  95 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. దీంతో ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే  గుడివాడ విశాఖలో వాలిపోయారు.   విశాఖ నగర పరిధిలో ఏదో ఒక నియోజకవర్గాన్ని తనకు అప్పగిస్తారని గుడివాడ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ జగన్ మాత్రం గుడివాడకు విశాఖ నగరం, రూరల్ కూడా కాకుండా  చోడవరం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. దీంతో గుడివాడ తీవ్ర అసంతృప్తికి గురయ్యారంటున్నారు.  అక్కడితో ఆగకుండా విశాఖ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి కూడా గుడివాడను జగన్ పీకేశారు. ఇది తనకు పొమ్మనలేక పొగపెట్టడంగానే గుడివాడ అమర్నాథ్ భావిస్తున్నారంటున్నారు.  2019 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలిచి మంత్రిగా ఉన్న ఆయనను  ఆ నియోజకవర్గ నుంచి తప్పించి చివరి నిమిషంలో గాజువాక టికెట్ ఇవ్వడమే అవమానం అనుకుంటే.. ఎన్నికల తరువాత గాజువాక ఇంచార్జ్ గానైనా కొనసాగించకుండా  తప్పించడం,  పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా లేకుండా చేయడంతో.. గుడివాడ కూడా పొమ్మనలేక పొగబెడుతున్నారన్న భావనకు వచ్చేశారంటున్నారు. అందుకే పార్టీకీ, పార్టీ కార్యక్రమాలకూ దూరంగా ఉంటూ సైలెంటైపోయారని పరిశీలకులు విశ్లేషి స్తున్నా రు. 

‘హస్తం’లో అంతర్మథనం!

రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ సర్వాధికారి.. అందులో సందేహం లేదు. ఇప్పుడే కాదు.. పార్టీలో ఆయనకు ఏ పదవీ లేనప్పుడు కూడా  కాంగ్రెస్ నాయకులకు ఆయన మాటే వేదం. ఆయన నందంటే నంది పందంటే పంది. కాదని ఎవరైనా  కాసింత తోక జాడిస్తే  అంతే సంగతులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో  అయితే చేప్పనే అక్కర లేదు. ఇటు పార్టీకి అటు ప్రభుత్వానికి ఆయనే ‘బిగ్ బాస్’. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయితే..  రాహుల్ గాంధీ సూపర్ ప్రైమ్ మినిస్టర్  అన్నట్లు వ్యవహారం నడిచింది.    ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం..  అందరికి తెలిసిన, బాగా గుర్తున్న విషయమే.  మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న రోజుల్లో  కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఒకానొక ఆర్డినెన్సు రాహుల్ గాంధీకి నచ్చ లేదు. అందులో తప్పు లేదు. అది ఆయన విజ్ఞతకు సంబందించిన విషయం. ఆ ఒక్క ఆర్డినెన్సు అనే కాదు.. మరే ఆర్డినెన్సు లేదా చట్టం అయినా అందరికీ నచ్చాలని లేదు. నిజానికి..  ఆ ఆర్డినెన్సును ఆమోదించిన మంత్రి మండలిలోని మంత్రులు అందరికీ ఆ ఆర్డినెన్సు నచ్చిందని చెప్పలేము. అయి నా..  మంత్రి మండలి ఆమోదం పొందిన తర్వాత అందరూ ఆమోదించి నట్లే, భావించవలసి ఉంటుం ది. అందుకే  మంత్రులే కాదు..  కాంగ్రెస్ ఎంపీలు ఎవరూ కూడా ఈ ఆర్డినెన్సు నాకు నచ్చలేదని బరబరా చించి పారేయలేదు. ఆ పని రాహుల్ గాంధీ చేశారు. అది కూడా..  ప్రధానమంత్రి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో. ప్రధానితో పాటుగా మొత్తంగా మంత్రివర్గాన్ని ప్రభుత్వాన్ని, పార్టీని  అవమాన పరిచే విధంగా..  ఛీ నాన్సెన్స్ అంటూ మీడియా ఎదుట  ఆర్డినెన్సు కాపీని పరపరా ముక్కలు ముక్కలుగా చించి పారేశారు.అయినా.. సోనియా, మన్మోహన్ సింగ్  సహా ఎవరూ పెదవి విప్పలేదు. ఇదేమిటని ప్రశ్నించలేదు. ఆ తర్వాత ఎప్పుడో  మన్మోహన్ సింగ్ ఆ సమయంలో రాజీనామా చేయాలని అనుకున్నారనీ,  ఎవరో వారిస్తే సర్డుకున్నారనే ప్రచారం జరిగింది.  అయితే.. అది నిజమో కాదో తెలియదు.   సరే..  ఆ విషయాన్ని అలా ఉంచితే కాంగ్రెస్ పార్టీ అనే కాదు, బీజేపీ సహా  జాతీయ, ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా వ్యక్టి ఆరాధనకు అలవాటు పడ్డాయి. వ్యక్తి ఆధారిత పార్టీలుగా మారిపోయాయి. రాజకీయాలు వ్యక్తుల చుట్టూనే తిరుగు తున్నాయి. అయితే..  అన్ని పార్టీలు, అందరు నాయకుల కథ వేరు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ స్టోరీ వేరని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  నిజానికి గతంలో కాంగ్రెస్ సహా  ఏ పార్టీలో అయినా ఎన్నికల గెలుపు ఓటముల లెక్కల ఆధారంగానే నాయకత్వ నిర్ణయం జరిగేది. ఎవరి దాకనో ఎందుకు.. అత్యవసర పరిస్థితి అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో,ఇందిరాగాంధీ సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. జనతాపార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు వచ్చింది. ఇందిరా గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ బ్రహ్మానంద రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ (ఆర్)  పుట్టుకొచ్చింది.  అయితే..  జనతా ప్రభుత్వంలో తలెత్తిన అంతర్గత కుమ్ములాటలను ఆసరా చేసుకుని ఇందిరాగాంధీ, కేవలం 11 నెలలకే  తిరిగి అధికారంలోకి వచ్చారు. ఆ విధంగా ఆమె తమ నాయకత్వ  సత్తాచాటుకుని  పార్టీపై పట్టు సాధించారు.  అలాగే..  అద్వానీ విషయంలో బీజేపీ ఆయన్ని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించి రెండు (2004, 2009) ఎన్నికల్లో పోటీ చేసింది. రెండు ఎన్నికల్లోనూ ఓడి పోయింది.  అందుకే, 2014 లో అద్వానీని తప్పించి, మోదీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించి విజయం సాధించింది.   ఇక మళ్ళీ రాహుల్ గాంధీ విషయానికి వస్తే.. రాహుల్  ప్రత్యక్ష పరోక్ష సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ వరసగా మూడు సార్వత్రిక ఎన్నికలలలో ఓడి పోయింది. అందులో రెండు సార్లు  కాంగ్రెస్ పార్టీకి  ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. సీట్ల సంఖ్య, రెండు అంకెల సంఖ్యను దాట లేదు. మూడవ సారి, ప్రతిపక్ష హోదా అయితే, దక్కింది కానీ  సీట్ల సఖ్య మూడంకెలు చేరలేదు. 99 దగ్గరే ఆగిపోయింది.  దేశ రాజధాని ఢిల్లీలో వరసగా మూడు అసెంబ్లీ, మూడు లోక్ సభ ఎన్నికలు మొత్తం కలిపి ఆరు వరస ఎన్నికల్లో కాంగ్రెస్ జీరో స్కోర్ హ్యాట్రిక్ సొంతం చేసుకుంది. అది కూడా ఒక సారి కాదు, వరసగా రండు జీరో హ్యాట్రిక్ లు సొంతం చేసుకుంది. మొత్తంగా చూస్తే..  రాహుల్ గాంధీ  ప్రత్యక్ష , పరోక్ష సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ  ఏకంగా 90 పైగా రాష్ట్రాల  అసెంబ్లీ  ఎన్నికల్లో ఓడి పోయింది. అంతే కాదు.. రాహుల్ గాంధీ అపరిపక్వ రాజకీయాల కారణంగా పార్టీ మళ్లీ బతికి బట్ట కట్టలేనంత భారీ మూల్యం చెల్లించింది. అయినా.. కాంగ్రెస్ పార్టీ ఇంకా రాహుల్ గాంధీని మోస్తూనే వుంది.  మరో వంక రాహుల్ గాంధీ ఇంకా  అదే పంథాలో అడుగులు వేస్తున్నారు.  అందుకే కాంగ్రెస్ పార్టీకి గతమే కానీ, భవిష్యత్ లేదనీ.. ముఖ్యంగా  పహల్గాం ఉగ్రదాడి, తదనంతర పరిణామాల నేపధ్యంలో రాహుల్ గాంధీ.. ఆయన చుట్టూ చేరిన కోటరీ నేతలు చేస్తున్న దేశ వ్యతిరేక వ్యాఖ్యలు, విమర్శలు కాంగ్రెస్ పార్టీ స్థాయిని మరింతగా దిగజార్చి వేయడంతో పాటుగా, ప్రజల్లో పార్టీ ప్రతిష్టను మరింతగా దిగజార్చి వేసిందని అంటున్నారు. అందుకే కాంగ్రస్ పార్టీ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారిందని, చివరకు ఇలా మిగిలాం ..అనే అంతర్మథనం మొదలైందని  అంటున్నారు.

రాజకీయ పిపీలకం సజ్జల.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

అమరావతి రాజధానిని వేశ్యల రాజధాని అంటూ జగన్ మీడియాలో జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలు, వాటికి మద్దతుగా కొమ్మినేని తీరుతో అంటుకున్న మంట ఇప్పటిలో చల్లారేలా లేదు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర మహిళా కమిషన్ ఇప్పటికే తీవ్ర స్థాయిలో స్పందించింది. తాజాగా ఆ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్, ఆ వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర డీజీపీకి ఓ లేఖ ద్వారా ఆదేశాలు జారీ చేసింది. కృష్ణంరాజుపై తీసుకున్న చర్యల నివేదికను మూడు రోజులలోగా సమర్పించాలని జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది. ఇక ఆ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆందోళనలు చేపట్టారు. పలు ప్రాంతాలలో సాక్షి కార్యాలయాల ముందు నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల ఆ ఆందోళనలు చేస్తున్న వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.  సీఎం చంద్రబాబు కనుసన్నల్లోనే ఆర్గనైజ్‌డ్‌గా ఆందోళనలు, దిష్టిబొమ్మల దగ్ధాలు, చెప్పులతో కొట్టడాలు, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు జరిగాయన్నారు. ఏడాది పాలనలో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చివరికి టీవీ డిబేట్‌లోని వ్యాఖ్యలను కూడా వివాదాస్పదంగా మార్చడం ఒక్క చంద్రబాబుకే చెల్లుతుందన్నారు.  అంతే కాకుండా ఆందోళనలు చేస్తున్న మహిళలను పిశాచులు, రాక్షసులు, సంకరజాతి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సజ్జల వ్యాఖ్యలపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇక సజ్జల వ్యాఖ్యలను పలువురు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరరెడ్డి సజ్జలను రాజకీయ పిపీలకంగా అభివర్ణించారు. అచ్చోసిన ఆంబోతులా సజ్జల నీచాతినీచమైన వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సజ్జలను రాష్ట్రబహిష్కరణ చేయాలని డిమాండ్ చే శారు. సజ్జల జగన్ గుమాస్తా అన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన రాష్ట్ర రాజకీయాలతో, ప్రజలతో సంబంధం లేని బంట్రోతు అంటూ, రాజకీయ విమర్శలు చేసే అర్హత సజ్జలకు లేదని పేర్కొన్నారు.   తాజాగా ఏపీసీసీ చీఫ్ షర్మిల కూడా సజ్జలపై విమర్శల వర్షం కురిపించారు. సజ్జలను ఓ మూర్ఖుడిగా అభివర్ణించిన షర్మిల ఇదే సజ్జల కుమారుడు వైసీపీ సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని తనపై కూడా అనుచిత విమర్శలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తోందన్నారు. జగన్ కు సొంత చెల్లి అంటేనే మర్యాద లేదు.. ఇక రాష్ట్రంలో మహిళలపట్ల గౌరవం ఉంటుందని ఎలా భావిస్తామని ప్రశ్నించారు.   

కల్వకుంట్ల కవిత అరెస్టు!

బీఆర్ఎస్ రాజకీయంగా ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టకుండా మౌనంగా ఉంటున్న సమయంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి జెండాతో దూకుడుగా సాగుతున్నారు. తాజాగా బస్ పాస్ చార్జీలను పెంచు తూ ఆర్టీసీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కవిత ఆందోళనకు దిగారు. బస్ చార్జీల పెంపునకు నిరసనగా ఆమె మంగళవారం (జూన్ 10) బస్ భవన్ బంద్ నకు పిలుపు నిచ్చారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, జెండాలు లేకుండా ఆమె జనజాగృతి కార్యకర్తలతో  బస్ భవన్ ముట్టడికి బయలు దేరారు. దీంతో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో  పోలీసులు కవితను అదుపులోనికి తీసుకున్నారు. ఆమెతో పాటు ఆందోళనలో పాల్గొన్న జనజాగృతి కార్యకర్తలను కూడా అదుపులోనికి తీసుకున్నారు.   పెంచిన బస్ చార్జీలను తగ్గించే వరకూ తమ పోరాటాన్ని ఆపేది లేదని కవిత ఈ సందర్భంగా చెప్పారు. అంతకు ముందు కవిత తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బస్ చార్జీల పెంపును తీవ్రంగా ఖండించారు. తెలంగాణ సంస్కృతి, భాష, యాస కాపాడుకోవలసిన అవసరం ఉందన్నారు. ఇక నుంచి పోన్ లో మాట్లాడేటప్పుడు హలో అనడానికి బదులుగా జై తెలంగాణ అనాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జై తెలంగాణ అనడానికి మనసురావడం లేద న్నారు.బోనాల సందర్భంగా ప్రతి బోనం పైనా జై తెలంగాణ నినాదం రాయాలని పిలుపునిచ్చారు.