టీఆర్ఎస్ ఎంపీ నామాకు ఈడీ షాక్.. 96.21 కోట్ల ఆస్తులు జప్తు

తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ నామానాగేశ్వరరావుకు ఈడీ షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన మధుకాన్ గ్రూప్ కంపెనీలకు చెందిన ఆస్తులను జప్తు చేసింది. దాదాపు 96.21 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ సోమవారం (అక్టోబర్ 17) జప్తు చేసింది. నామానాగేశ్వరరావు, నామా సీతయ్యల అధీనంలో ఉన్న ఈ ఆస్తులను ఈడీ జప్తు చేసింద. రాంచీ-జంషడ్ పూర్ హైవే నిర్మాణం పేరిట బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మధుకాన్ గ్రూప్ కంపెనీ దారి మళ్లించిందన్న అభియోగాలపై ఈడీ దర్యాప్తు చేపట్టిన సంగతి విదితమే. ఈడీ దర్యాప్తులో డొల్ల కంపెనీల ద్వారా ఈ నిధుల మళ్లింపు జరిగినట్లు గుర్తించింది.   దీంతో హైదరాబాద్, బెంగాల్, విశాఖ, ప్రకాశం జిల్లాల్లో ఈ కంపెనీ పేరున ఉన్న 88.85 కోట్ల విలువైన భూములు, అలాగే 7.36 లక్షల విలువైన చరాస్థులను ఈడీ జప్తు చేసింది.  కాగా ఇదే కేసులు సంబంధించి గత ఏడాది జూన్ లో నామా నాగేశ్వరరావు నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి విదితమే.

జ‌గ‌న్ అడ్డుకోలు ఆట‌!

హీరోయిన్‌ని తీసికెళుతోన్న హీరోగారు, ఆయ‌న స్నేహ‌బృందాన్ని విల‌న్ అడ్డుకోవ‌డానికి అనేక మార్గాల్లో అడ్డంకులు క‌ల్పించ‌డం, ఒక‌టి రెండు దాడులు చేయుట‌..తీరిగ్గా త‌న్నులు తిని సుఖంగా హీరోహీరోయి న్లు వెళ్ల‌డానికి అడ్డంకులు తొల‌గించేయ‌డం..ఇదంతా సినీసీన్లు. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రైతుల పాద‌ యాత్ర ఎక్క‌డిక‌క్క‌డ నిలువ‌రించే య‌త్నం చేయ‌డం, యాత్ర‌కు మ‌ద్ద‌తుగా విప‌క్షాల మ‌ద్ద‌తును అడ్డుకోవ‌డానికి ప్ర‌భుత్వం  పోలీసుల‌తో అడ్డంకులు సృష్టిం చ‌డం, క‌ద‌ల‌నీయ‌కుండా చేసి వారితో వ‌చ్చి న వారిపై దాడులు చేయించి మ‌రీ భ‌య‌పెట్ట‌డం లాంటివి ఈమ‌ధ్య జ‌గ‌న్ స‌ర్కారుకి దిన‌చ‌ర్య‌గా మారింది. ఎవ‌ర‌న్నా ప్ర‌జోపయోగ ప‌నుల్లో బిజీగా ఉంటారు. కానీ జ‌గ‌న్ స‌ర్కార్ మాత్రం విప‌క్షాల‌వారు వీధి చివ రికి వెళుతు న్నార‌ని తెలిసినా ఒక్క‌రిద్ద‌రు పోలీసుల‌నైనా పంపి వెన‌క్కి పంపే య‌త్నాలే చేస్తున్నారు. ఇది  పిరికి త‌నంతో కూడిన భ‌య‌మ‌నే అనుకోవాలి.  ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ కోల్పోయిన మ‌న‌స్తాపం ఈవిధంగా తీర్చుకుంటున్నార‌నే అనుకోవాలి. ఎందుకంటే మ‌హాపాద‌ యాత్ర చేస్తున్న రైతాంగానికి మద్ద‌తునివ్వ‌డానికి టీడీపీ యువ‌నాయ‌కులు ప‌రిటాల శ్రీ‌రామ్(అనంత‌ పురం), వంగ‌వీటి రాధా(విజ‌ య‌వాడ‌), గంటీ హ‌రీష్ (అమ‌లా పురం) వంటివారు ఆదివార‌మే రాజ‌మండ్రి చేరుకున్నారు. కాగా సోమ‌వారం ఉద‌యం పాద యాత్ర‌లో పాల్గొన‌డానికి బ‌య‌టికి  రాగానే వీరితో పాటు టీవీ5 చైర్మ‌న్ బీ.ఆర్‌.నాయుడిని కూడా పోలీసులు ఊహించ ని విధంగా చుట్టుముట్టి అడుగు ముందుకు వేయ‌ నీయ‌లేదు.  ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలో రైతుల మ‌హాపాద‌యాత్ర రాజ‌మండ్రికి చేరుకోవ‌డాన్ని ప్రభుత్వం అడ్డు కునే య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. ప్ర‌శాంతంగా పాద‌యాత్ర చేస్తున్న రైతాంగాన్ని నిలువ‌రిం చేందు కు రాజ‌మండ్రి రోడ్డు క‌మ్ రైలు బ్రిడ్జి మీద రాక‌పోక‌లు నిషేధించారు. రిపేరు పేరుతో వారం రోజులు తిర‌గ రాద‌ని నిషేధా జ్ఞ‌లు అమ‌లుచేస్తున్నారు. అయినా త‌మ పాద‌యాత్ర ఆగే ప్ర‌సక్తి లేద‌ని రైత‌లు అంత‌కు మించి ధీటుగా స‌మాధానం ఇచ్చారు. వారికి సంఘీభావం తెలియ‌జేస్తూ పాద‌యాత్ర‌లో అడుగు క‌లిపేం దుకు, వారిని ఉత్సాహ‌ప‌రిచేందుకు టిడిపీ నాయ‌కులు రాజ‌మండ్రి చేరుకున్నారు. కానీ వారిని పోలీసులు అడ్డుకుని అడుగు ముందుకు వేయ‌నీయ‌క‌పోవ‌డంతో అక్క‌డ ఉద్రిక్త‌త చోటు చేసుకుంది.  పాదయాత్రకు వెళ్లడానికి వీల్లేదని పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ క్ర‌మంలో పోలీసుల  అడ్డును త‌ప్పించుకుని ముందుకు సాగేందుకు ప్ర‌య‌త్నించిన బీఆర్ నాయుడు కారుకు అడ్డుగా నిలిచిన పోలీ సులు అరెస్టులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. టీడీపీ నాయ‌కుడు కోనేరు మురళి ఇంటి వ‌ద్ద నుంచి బ‌య లు దేరిన వంగ‌వీటి రాధాను కూడా అడ్డుకున్నారు. దీంతో స్థానిక టీడీపీ కార్య‌క‌ర్త‌లు సైతం.. భారీ ఎత్తున అక్కడకు చేరుకున్నారు. దీంతో కోనేరు మురళి నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు త‌మ‌కు స‌హ‌క రించి వెళ్లిపోవాల‌ని లేకుంటే  అరెస్టులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. దీంతో రాజ‌మండ్రి రాజ‌కీయం ఒక్క సారిగా వేడెక్కింది.  ప్ర‌జానిర‌స‌న‌ను అడ్డుకోవ‌డానికి ప్ర‌భుత్వం విశ్వ‌య‌త్నాలు చేస్తోందే గాని, ప్ర‌జ‌ల నిర‌స‌న‌కు కార‌ణ‌మైన పాల‌నా విధానాల్లో మార్పులు చేర్పుల‌కు మాత్రం స‌సెమిరా అంగీక‌రించ‌డం లేదు. మూడేళ్లపాల‌న‌లో ప్ర‌జాహితంగా చేస్తున్నామ‌ని ప్ర‌చారం చేసుకున్న ఏ ఒక్క కార్య‌క్ర‌మం ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోలేదు. పైగా తీవ్ర నిర‌స‌న వెల్లువెత్తుతోంది. దీన్ని భ‌రించ‌లేక‌నే జ‌గ‌న్ స‌ర్కార్   రైతుల మ‌హాపాద‌యాత్ర‌ను నిలువ‌ రించడంలో విప‌క్షాలమీద దుమ్మెత్తిపోయ‌డం, వారిని మాట్లాడ‌నీయ‌కుండా చేయ‌డం, అడ్డుకోవ‌ డం, అరెస్టుల భ‌య‌పెట్ట‌డాలు చేయ‌డం విప‌క్ష‌పార్టీల కార్య‌క‌ర్త‌లపై లాఠీ ఝుళిపించి అరెస్టులు చేయ‌డా ల‌కు పూనుకుం టోంది.  అమ‌రావ‌తి రాజ‌ధానిని చేయ‌కుండా మూడు రాజ‌ధానుల అంశాన్ని తెర‌మీద‌కి తేవ‌డంతోనే విప‌క్షాలు మండిప‌డ్డాయి. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా అమ‌రావ‌తి రైతులు చేప‌ట్టిన పాద‌యాత్ర కు టీడీపీ తో పాటు విప‌క్షాల‌న్నీ మ‌ద్ద‌తు నీయ‌డంతో అది మ‌రింత ఊపందుకుంది. దానికి కౌంట‌ర్‌గా డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌కు వైసీపీ తెర‌లేపింది. అది గాలివాన‌గా మారింది. హైకోర్టులో తీర్పుపై అస్పీలు చేసి స‌రిపెట్టుకోవ‌ల‌సి  వ చ్చింది.  కానీ అమ‌రావ‌తి రైతులు మాత్రం పాద‌యాత్ర‌ను మహాపాద యాత్ర‌గా మార్చి క‌దం తొక్కారు. వారికి సంఘీ భావం ప్ర‌క‌టించిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీల‌తో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ కూడా  గ‌ట్టి మ‌ద్ద‌తే ఇ చ్చింది. ఈ నేప థ్యంలో వారి మ‌ద్ద‌తు యాత్ర‌ను కూడా  జ‌గ‌న్ సర్కార్ తీవ్రంగా అడ్డుకుంది. జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు ఆయ‌న పార్టీ నాయ కులు, అభిమానుల‌ను తిరిగి వెళిపోవాల ని పోలీసుల‌తోనే ప్ర‌తిఘ‌టించేలా చేసి దాడుల‌కు పాల్ప‌డ్డారు. ప‌వ‌న్ బ‌స చేసిన హోట‌ల్‌కి వెళ్లి మ‌రీ అక్క‌డ ఉన్న ఇత‌ర జ‌న‌సేన నాయ‌కుల‌ను బ‌య‌టికి తీసుకు వ‌చ్చి మీకు అనుమ‌తి లేద‌ని అంటూ వారి ని వెన‌క్కి పంపిం చ డం జ‌గ‌న్ స‌ర్కార్ ప‌రిస్థితిని స్ప‌ష్టం చేస్తుంది.  జ‌గ‌న్‌కి తిండి తినే కంటే విప‌క్షాలను క‌ద‌ల‌కుండా ఎలాచేయాల‌న్న ఆలోచ‌నే ఎక్కువ యిం ద‌న డానికి ఈ సంఘ‌ట‌న‌లే నిద‌ర్శ‌నం.  స‌రిగా చ‌ద‌వ‌కుంటే పిల్ల‌ల్ని తండ్రి తిడ‌తాడు, ఆడ‌కుంటే కోచ్ తిడ‌తాడు, స‌రిగా పాల‌న చేయ‌కుంటే ప్ర‌జలు తిర‌గ‌బ‌డ‌తారు. కాదు పొమ్మంటే విప‌క్షాలు ఛ‌స్తే ఊరుకోవు. ప్ర‌తిఘ‌టిస్తాయి, ఉద్య‌మిస్తాయి కాద‌ని అడ్డుకునే వ్యూహాలు ఎన్ని పారించే య‌త్నాలు చేసినా ఫ‌లితం శూన్య‌మే. జ‌గ‌న్ ఎంత ఆలోచిం చినా అడ్డు కోవ‌డాలు, పోలీసుల మ‌ద్ద‌తుతో ప్ర‌భుత్వం ప్ర‌జాభీష్టంగా ముంద‌డుగు వేయ‌డం దుర్ల‌భం.

ఆకలి చుట్టూ అ...రాజకీయ దుమారం !

ఎవరో కవి, ఆకలికి అన్ని భాషలు వచ్చన్నారు. నిజం. ఆకలికి అన్నిభాషలు వచ్చును. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషలలో ఆకలి మాట్లాడుతుంది. అలాగే,బెంగాలీ, పంజాబీ మరాఠీ, గుజరాతీ, అస్సామీ, ఉర్దూ, హిందీ ఇలా ఉత్తర దక్షణాది భాషలు అన్నిటిలో, ఆకలి మాట్లాడుతుంది. భారతీయ భాషలే కాదు, ప్రపంచ భాష ఇంగ్లీష్’ లోనూ ఆకలి అనర్గళంగా మాట్లాడ గలదు. అలాగే, ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, చైనీస్ ఇలా మొత్తంగా  ఏడువేలకు పైగా ఉన్న ప్రపంచ భాషలు అన్నిటిలో ఆకలి మాట్లాడుతుంది.మాట్లాడుతూనే వుంది. ఆకలి కేవలం మాట్లాడమే కాదు, మాట్లాడిస్తుంది.పోట్లాడుతుంది. కేకలు పెడుతుంది. కేకలు పెట్టిస్తుంది. అంతే కాదు, రాజకీయ గర్జనలు చేస్తుంది. అయితే, రాజకీయ ఆకలి కేకలు ఎంతవరకు నిజం అంటే, బొమ్మా బొరుసు రెండూ నిజమే, రెండు కాదు.  ప్రపంచంలో ఆకలి ఉన్నది ఎంత నిజమో, ఆకలి రాజకీయమూ అంతే నిజం. ఆకలిని రాజకీయ అస్త్రంగా మలచుకునే  ప్రయత్నాలు దేశీయంగానే కాదు. అంతర్జాతీయంగాను జరుగుతున్నాయి. ఇందుకు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2022 (జిహెచ్‌ఐ-2022) పేరిట ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఎఫ్ఆర్ఐ) విడుదల చేసిన తాజా నివేదిక  ఒక తాజా ఉదాహరణ. ఈ నివేదిక ప్రకారం ప్రపంచ ఆకలి సూచిలో భారత దేశం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరో ఆరు మెట్లు దిగజారి 121 దేశాల్లో 107 స్థానానికి పడిపోయింది. గత సంవత్సరం 116 దేశాల్లో 101 స్థానంలో వుంది.  అయితే, ఈ నివేదిక ఎంతవరకు ప్రామాణికం, నివేదిక తయారు చేసిన ఐఎఫ్ఆర్ఐకు ఉన్న విశ్వసనీయత ఎంత అనే విషయంలో ఎవరి అనుమనాలు వారికున్నాయి. సహజంగానే కేంద్ర ప్రభుత్వం జిహెచ్‌ఐ-2022 నివేదికను తిరస్కరించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలు, జిహెచ్‌ఐ-2022ను బోగస్ నివేదిక అని కొట్టి వేస్తున్నాయి. దేశ ప్రతిష్టను దిగజార్చేందుకు జరుగతున్నకుట్రగా పేర్కొంటున్నాయి. ఆర్ఎస్ఎస్ అనుబంధ  స్వదేశి జాగరణ్ మంచ్ (ఎస్జేఎం) అయితే భారత దేశ ప్రతిష్టను దిగజార్చే దురుద్దేశంతో, బాధ్యతారహితంగా జిహెచ్‌ఐ-2022 నివేదికను రూపొందించి/ప్రచురించి సంస్థ పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.  జర్మనీకి చెందిన ప్రభుత్వేతర సంస్థ, ‘వెల్ట్ హుంగర్ హిల్ఫే పై విచారణ జరిపించి  చర్యలు తీసుకోవాలని జాగరణ్ మంచ్ డిమాండ్ చేసింది. నిజానికి గత సంవత్సరం ఇదే సంస్థ ఇదే తప్పుడు గణాంకాల ఆధారంగా తప్పుడు  ఆరోపణలు చేసినప్పుడ, ప్రపంచ ఆహారసంస్థ (ఎఫ్ఏఓ) తప్పును ఒప్పుకుని సరిదిద్దుతామని మాటిచ్చి మళ్ళీ ఇప్పుడు అదే తప్పు చేసిందని స్వదేశి జాగరణ మంచ్ పేర్కొంది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి భారత దేశం ఆర్థిక, ఆహార, ఔషద సహాయం అందుకుంటున్నఇరుగు పొరుగు దేశాలు పాకిస్థాన్, బంగ్లా దేశ్, శ్రీలంకల కంటే భారత దేశంలో పరిస్థితి అధ్వానంగా ఉందని నివేదిక పేర్కొనడం అసత్యం మాత్రమే కాదు హాస్యస్పదంగానూ ఉందని స్వదేశీ జాగరణ్  మంచ్   పేర్కొంది.   నిజానికి, కొన్ని విదేశీ సంస్థలు భారత దేశ ప్రతిష్టను దిగజార్చేందుకు, ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడే కాదు, గతంలో దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నప్పటి నుంచి కూడా ఇలాంటి ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. అయితే, ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం విదేశీ స్వచ్చంద సంస్థల కార్యకలాపాలకు సంబందించిన నిబంధనలు కఠినతరం చేసిన నేపథ్యంలో  ఒక్క ఆకలి విషయంలోనే కాదు  ఇంకా అనేక విధాల దేశం ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు జాతీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలు ఆరోపిస్తున్నాయి. కొవిడ్ మరణాల విషయంలో  భారత దేశ జనాభాలో కనీసం  మూడో వంతు  జనాభా ఉన్నా అమెరికా, అంతకంటే తక్కువ జనాభా ఉన్న మరి కొన్ని చిన్న చిన్న దేశాలతో పోల్చి దేశంలో హాహాకారాలు సృష్టించే ప్రయత్నాలు జాతీయంగా, అంతర్జాతీయంగా జరిగిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు.     మరోవంక ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఐఎఫ్ఆర్ఐ నివేదికకు, ఎర్ర తివాచీ పరిచి స్వాగతిస్తున్నాయి. హరతులిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఫల్యాలకు ఇది నిదర్శనమని అంటున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఇదే అదనుగా తీసుకుని  ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ టార్గెట్ గా వ్యంగ్య బాణాలు విసిరారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అసత్య ప్రచారంతో దేశాన్ని బలహీన పరుస్తున్నాయని ఆరోపించారు. అలాగే, ప్రధాని మోడీని విమర్శించడంలో ముందుండే  తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు, తమదైన స్టైల్లో  మోడీ పాలనలో  కొద్ది మంది అస్మదీయులకు మాత్రమే అచ్చే దిన్, అమృత కాల్  దేశానికి మాత్రం డబుల్ ఇంజిన్ విధ్వంశం” అని ట్వీట్ చేశారు.       అయితే, 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో కేవలం 3000 మంది అభిప్రాయలు సేకరించి, చిత్రించిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2022 విశ్వసనీయత విషయంలో అధికార పార్టీకే కాదు, సామాన్యులకు కూడా సందేహాలున్నాయని అంటున్నారు.  కొవిడ్ మహమ్మారి ప్రభావం నుంచి  పేద ప్రజలను కాపాడేందుకు, 2020 నుంచి  కేంద్ర ప్రభుత్వం దేశంలో 80 కోట్ల మంది  పేద ప్రజలకు నెలకు ఐదుకిలోల వంతును ఉచితంగా గోధుమలు/ బియ్యం సరఫరా చేస్తోంది. మరో వంక  శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ తదితర దక్షిణ ఆసియా దేశాల ఆకలి కేకలు ప్రపంచ వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తున్నాయి. అలాగని భారత దేశంలో ఆకలి లేదని కాదు. అంతా బాగుందని అసలే కాదు. కానీ, జిహెచ్‌ఐ-2022 నివేదిక పేర్కొన్నట్లుగా  పాక్, బంగ్లా, శ్రీలంక కంటే భారత దేశంలో పరిస్థితి అధ్వానంగా అయితే లేదు. ఇక్కడే  జిహెచ్‌ఐ-2022 నివేదిక ‘సృష్టి’ కర్తలు తప్పులో కాలేశారని అంటున్నారు. అబద్ధం చెప్పినా అతికినట్లు ఉండాలి,  కానీ, జిహెచ్‌ఐ-2022 వివేదిక నిండా బొక్కలే ఉన్నాయని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.  నిజానికి   దక్షిణ ఆసియాలోనే కాదు, ప్రపంచం మొత్తంలో మసక బారుతున్న ఆర్థిక వ్యవస్థకు వెలుగు కిరణం ఏదైనా ఉందంటే అది భారత దేశం ఒక్కటే  అని ఇటీవలనే అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ తెలిపింది. అయితే, అది సంపూర్ణ సత్యమా, అంటే కాకపోవచ్చును కానీ, జిహెచ్‌ఐ-2022 మాత్రం సంపూర్ణ అసత్యం, అని నిపుణులు అంటున్నారు.

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక పోలింగ్ షురూ!

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. దాదాపు మూడేళ్లుగా ఇదిగో అదిగో అంటూ వాయిదా పడుతూ వచ్చిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ అధ్యక్ష ఎన్నిక సోమవారం (అక్టోబర్ 17)న పోలింగ్ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 19 ( బుధవారం) జరుగుతుంది. అధ్యక్ష ఎన్నికలలో పార్టీ సీనియర్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ లు పోటీ పడుతున్నారు. ఎవరు గెలుస్తారన్న విషయంపై పెద్దగా ఎవరిలోనూ ఉత్కంఠ లేదు. ఫలితం నామినేషన్ల రోజునే తేలిపోయింది. అధిష్ఠానం ఆశీస్సులున్న ఖర్గే విజయం దాదాపు ఖాయమన్న భావన అయితే అందరిలో నెలకొని ఉంది. మరో అభ్యర్థి శశిథరూర్ కూడా ఈ విషయాన్ని బాహాటంగానే చెప్పేయడమే కాకుండా ఖర్గేకు అభినందనలు కూడా తెలియజేశారు. అయితే దేశ వ్యాప్తంగా ఉన్న తొమ్మిది వేల మంది పీసీసీ ప్రతినిథులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక రేసులో ఉన్న మల్లిఖార్జున ఖర్గే తన ఓటు హక్కును బెంగళూరులో వినియోగించుకున్నారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, జైరాం రమేష్ భారత్ జోడో యాత్ర క్యాంపులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ కూడా ఏఐసీసీ కార్యాలయంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలోని అఖిల భారత కాంగ్రెస్ కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నఅన్ని పీసీసీ కార్యాలయాలలోనూ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది.  

మెట్రో  వెయ్యి  ట్రిప్పులు  ఏ మూల‌కి?

ఇంటిల్ల‌పాదీ చిన్నా చిత‌కో ఉద్యోగ‌మో, వ్యాపార‌మో చేస్తేగాని ఇల్లుగ‌డిచే ప‌రిస్థితి లేదు. కాలం ఎంతో మారిపోయింది. పూర్తిగా క‌మ‌ర్షియ‌ల్ అయింది. ఏది కొన్నా కొండ‌చిలువ‌లా లాగేసుకుంటోంది గాని ఫ‌ర‌వాలేదు అనుకున్న ధ‌ర‌కు వ‌చ్చింద‌నేది లేదు. ఉద్యోగాల‌కోస‌మో, ప‌నికోస‌మో బ‌స్సులు, మెట్రో రైళ్ల ప్ర‌యాణాలు త‌ప్ప‌డం లేదు..ప్ర‌తీ ఏడూ ప్ర‌యాణీకుల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా హైద‌రాబాద్ వంటి న‌గ‌రాల్లో ప్ర‌యాణీకులు స‌మ‌ యానికి గ‌మ్యాన్ని చేర‌లేక‌పోతున్నారు. బ‌స్స‌ల్లో వెళ్ల‌లేకపోతు న్నామ ని మెట్రో రైళ‌ల‌ను ఆశ్ర‌యించినా అంత‌గా పెద్ద ప్ర‌యోజ‌నం లేక‌పోతోంద‌న్న అభిప్రాయాలే వ్య‌క్త‌మ‌వు తు న్నాయి. మెట్రో రైళ్ల ట్రిప్పులు పెరిగినా అంత‌గా ప్ర‌యోజ‌నం లేక‌పోతోంది. బోగీలు ఎక్కువ లేక‌ పోవ‌డం ఒక్క‌సారిగా ఒక్క బోగీలో రెండు బ‌స్సుల జనం ఎక్కుతుండ‌డంతో ప్ర‌యాణీకుల క‌ష్టాలు బ‌స్సు క‌ష్టాల్ని త‌ల‌పిస్తున్నాయి! ప్ర‌స్తుతం వెయ్యి ట్రిప్పులు తిరుగుతున్నాయి, మూడు బోగీల్లో ప్ర‌యా ణీకు ల‌ను గ‌మ్యాల‌కు చేరుస్తున్నాయి. కానీ ఇది ఏమాత్రం ఉప‌యోగ‌క‌రంగా లేద‌న్న‌దే ప్ర‌యాణీకుల గోడు. బోగీల‌ను మ‌రిన్నిపెంచితేనే ప్ర‌యాణీకుల స‌మ‌యాన్ని ఆదా చేసిన‌వార‌వుతారు. ఇది మెట్రో రైల్వేవారు  దృష్టిలో పెట్టుకుని చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న అభిప్రాయాలే వ్య‌క్త‌మ‌వు తున్నాయి.  ఎలాంటి అడ్డంకులు, స్టేజీల బెడ‌దా లేకుండా వీల‌యినంత త్వ‌ర‌లోనే గ‌మ్యానికి చేర‌డానికి చాలా మంది ఉద్యోగులు, ప‌నుల‌కు వెళ్లేవారు మెట్రోనే ఎక్కువ‌గా ఆశ్ర‌యిస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో ఈ మెట్రో ప్ర యాణీకుల సంఖ్యా పెరిగింది. న‌గ‌రంలో ఏద‌న్నా పండ‌గో,  పార్టీల హ‌డావుడి  జ‌రిగితే  ట్రాఫిక్  ఇబ్బందు ల‌తో బ‌స్సుల్లో ప‌డి వెళ్ల‌లేక‌నే మెట్రోని న‌మ్ముకుంటున్నారు. టికెట్ ధ‌ర ఎంత‌య‌నప్ప‌టికీ  వీల‌యినంత త్వ‌ర గా చేరిపోవ‌చ్చ‌న్న ఉద్దేశంతోనే బస్సుల‌ను వ‌దిలేసి మెట్రోల్లో వెళ్ల‌డానికి ఇష్ట‌ప‌డుతున్నారు. టికెట్ ఎక్కువా త‌క్కువా అన్న‌ది కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. అయితే, ఈ ఒత్తిడిని త‌గ్గించుకోవ‌డానికి మెట్రో రైల్వేవారు ట్రిప్పుల సంఖ్య పెంచామ‌ని అంటున్నారు. దాని వ‌ల్ల పెద్ద‌గా ప్ర‌యాణీకుల‌కు క‌లిగే ప్ర‌యో జ‌నం లేద‌నే అనాలి. ట్రిప్పుల కంటే బోగీల సంఖ్య కూడా పెంచే ఆలోచ‌న చేయాలి. అదీ వీలు వెంట‌నే చేయ‌డం వ‌ల్ల ఒత్తిడి త‌గ్గే అవ‌కాశం ఉంటుంది. రైళ్లు వెంట వెంట‌నే ఉంటున్న‌ప్ప‌టికీ ఆఫీసులు, ప‌ను ల‌కు వెళ్లే సమ‌యంలో ఒక్క‌సారిగ ప్ర‌యాణీకుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది క‌నుక ట్రిప్పుల‌తో పాటు బోగీల సంఖ్య పెంచితే ఎంతో మేలు జ‌రుగుతుంద‌న్న‌ది ప్ర‌యాణీకుల మాట‌. సౌక‌ర్యం కంటే త్వ‌ర‌గా వెళ్ల‌డానికి ప్ర‌యాణీకులు ఇష్ట‌ప‌డుతున్న‌పుడు బోగీల సంఖ్య పెంచ‌డ‌మే ధ‌ర్మ‌మ‌వుతుంది. 

యాక్టివ్ అవుతున్న టీడీపీ యువతరం వంగవీటి రాధా- పరిటాల శ్రీరామ్ భేటీ

తెలుగుదేశం పార్టీలో యువ తరంగం మరింత యాక్టివ్ అవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఏపీకి వైసీపీ గ్రహణం నుంచి విముక్తి కలిగించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు అవిశ్రాంతంగా చేస్తున్న కృషికి ఆ పార్టీలోని డైనమిక్ యువ నేతలు మరింత ఉత్సాహంగా ప్రోత్సాహం అందించేందుకు ముందుకొస్తున్నారు. ఆ క్రమంలోనే ఏపీ టీడీపీ రాజకీయాల్లో తాజాగా అత్యంత అరుదైన ఘటన జరిగింది. అమరావతినే ఏపీకి ఏకైక రాజధానిగా ఉంచాలని ఆ ప్రాంత రైతులు చేస్తున్న అమరావతి టూ అరసవిల్లి పాదయాత్రకు మద్దతుగా పాల్గొనేందుకు వంగవీటి రాధా, పరిటాల శ్రీరామ్ రాజమండ్రి వచ్చారు. ఈ నేపథ్యంలో వంగవీటి రాధా- పరిటాల శ్రీరామ్ రాజమండ్రిలో ఓ రహస్య ప్రాంతంలో భేటీ అవడం ఆసక్తికరంగా మారింది. ఈ భేటీకి సంబంధించిన విజువల్స్ ను పరిటాల శ్రీరామ్ తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేశారు. రాధా, శ్రీరామ్ తో పాటు తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు క్రియాశీల నేత,  లోక్ సభ స్పీకర్ దివంగత  జీఎంసీ బాలయోగి కుమారుడు హరీశ్ కూడా భేటీ అయ్యారు. ఈ ముగ్గురు యువనేతల అపూర్వ కలయికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అందులోనూ ఇరు ప్రాధాన్యతా కుటుంబాల వారసులు రాధా- శ్రీరామ్ తొలిసారిగా భేటీ అవడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. వంగవీటి రాధాకృష్ణ, పరిటాల శ్రీరామ్ ఇద్దరూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో ప్రాధాన్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చినవారే. వంగవీటి రాధాకృష్ణ కుటుంబానికి కోస్తాంధ్రలోను మరీ ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో అంతకు మించి విజయవాడలో బలమైన రాజకీయ నేపథ్యం ఉంది.  అలాగే.. పరిటా శ్రీరామ్ కుటుంబానికి అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఎంతో ప్రాధాన్యం ఉంది. తాడిత పీడిత, పేద ప్రజలకు అండగా నిలిచిన చరిత్ర ఉన్న కుటుంబాలకు వారసులు రాధా- శ్రీరామ్. పేదలకు అండగా ఉన్న క్రమంలోనే వంగవీటి రంగా, పరిటాల రవి అసువులు బాసారు. ఈ రెండు కుటుంబాలకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరూ రాజమండ్రిలో భేటి అవడం, వారితో మరో యువనేత గంటి హరీశ్ కూడా జత కలవడం చర్చనీయాంశంగా మారింది. వీరి అపూర్వ సమావేశం  రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ ముగ్గురూ కూడా మూడు వేర్వేరు బలమైన సామాజికవర్గాలకు చెందినవారే కావడం గమనార్హం. గతంలో వంగవీటి రాధాపై రెక్కీ ఘటన సందర్భంగా పరిటాల శ్రీరామ్ తీవ్రంగా స్పందించారు. వంగవీటి రాధా తెలుగుదేశం కుటుంబ సభ్యుడని, రాధాను టచ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ సందర్భంగా శ్రీరామ్ హెచ్చరించారు. వంగవీటి కుటుంబం అంటే మామూలు కుటుంబం అనుకుంటున్నారా? అని శ్రీరామ్ ఘాటుగా ప్రశ్నించారు. అప్పటికి ఈ యువనేతలిద్దరూ ప్రత్యక్షంగా కలుసుకున్నది లేదు. ఇరువురూ టీడీపీలో డైనమిక్ లీడర్లే. అలాంటి యువ నేతలు ఇప్పుడు తొలిసారిగా రాజమండ్రిలో సమావేశమై ఏ విషయాలు చర్చించారనే దానిపై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. వంగవీటి రాధా- పరిటాల శ్రీరామ్ తెలుగుదేశం పార్టీలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్నారు. ఆ అక్కసుతోనే అధికార వైసీపీ వీరిరువురినీ ఇబ్బందులు పెట్టేందుకు యత్నాలు చేస్తోంది. ఆ క్రమంలోనే వంగవీటి రాధా హత్యకు రెక్కీ జరిగింది. రాధాపై రెక్కీ నిర్వహించడంపై అనేక అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. రాధాను నిర్మూలించాలనే కుట్ర ఈ రెక్కీ వెనుక ఉన్నట్లు తర్వాత బయటపడింది. వంగవీటి రాధా- పరిటాల శ్రీరామ్ భేటీపై సోషల్ మీడియాలో పలువురు విశేషంగా స్పందిస్తున్నారు. ఇద్దరు పులి బిడ్డలు కలిశారంటే చరిత్ర తిరగరాసినట్లే అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పరిటాల రవి, వంగవీటి రంగా ఇద్దరూ సింహాలని, ఆ సింహాల కొడుకులు రాధా, శ్రీరామ్ తొలిసారి భేటీ అవడాన్ని స్వాగతిస్తూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వంగవీటి రాధా- పరిటాల శ్రీరామ్ సుమారు రెండున్నర నుంచి మూడు గంటల పాటు భేటీ అయినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం టికెట్లు కేటాయిస్తానని టీడీపీ చీఫ్ చంద్రబాబు కొద్ది రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వంగవీటి రాధా- పరిటాల శ్రీరామ్- గంటి హరీశ్ భేటీ అవడం కూడా టీడీపీలో యువతలో మరింత చైతన్యం తీసుకొచ్చే వ్యూహాల గురించి వీరు చర్చించి ఉండొచ్చనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే వీరి మధ్య ఏవో కీలకమైన అంశాల మీదే ఇంత సుదీర్ఘంగా చర్చ జరిగి ఉండొచ్చాని భావిస్తున్నారు.  మొత్తానికి రాధా- శ్రీరామ్ తొలిసారిగా భేటీ అవడమే ఆశ్చర్యకరమైతే.. వారితో బాలయోగి కుమారుడు హరీశ్ జత కలవడం అపురూపమైన, అరుదైన ఘటనగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. రాజకీయంగా వీరి కలయిక సంచలనం సృష్టిస్తోంది. ఈ ముగ్గురు యువనేతల కలయిక ప్రత్యర్థి పార్టీల నేతలు ముఖ్యంగా పెచ్చుమీరిన నియంతృత్వ వైఖరితో ఉన్న వైసీపీ నేతల్లో కలవరం సృష్టించే అవకాశం ఉందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.

కేసీఆర్ బీఆర్ఎస్ విషయంలో పునరాలోచనలో పడ్డారా?

ఓడిశా సీఎం నవీన్ పట్నాయక్ హైదరాబాద్ లో ఉన్నారు. సోమవారం (అక్టోబర్17న) హైదరాబాద్ వేదికగా ఒడిశా పెట్టుబడుల సదస్సు జరుగుతోంది. ఆ సదస్సులో పాల్గొనేందుకు నవీన్ పట్నాయక్ ఆదివారమే హైదరాబాద్ వచ్చారు. ఆయనకు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్వాగతం పలికారు. అంతే అంతకు మినహా రాష్ట్ర ప్రభుత్వం కానీ, అధికార తెరాస కానీ ఆయనను ఇసుమంతైనా పట్టించుకోలేదు. గతంలో తన జాతీయ రాజకీయ ప్రస్థానం కోసం మద్దతు కోరేందుకు కేసీఆర్ ఒడిశా వెళ్లి మరీ నవీన్ పట్నాయక్ ను కలిశారు. అప్పుడు నవీన్ పట్నాయక్ స్వయంగా కేసీఆర్ కు స్వాగతం పలికారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రానికి వస్తే ఎటువంటి మర్యాదలు చేయాలో అన్నీ చేశారు. అయితే ఇప్పుడు మాత్రం తెలంగాణలో నవీన్ పట్నాయక్ కు అటువంటి స్వాగత సత్కారాలు లభించలేదు. కేసీఆర్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఢిల్లీలో చేస్తున్నది ఏమిటన్నది ఎవరికీ తెలియని ఒక రహస్యోదమ్యంగా సాగుతోంది. ఆయన ఢిల్లీ పర్యటన విశేషాలు మీడియాలో కానీ, సామాజిక మాధ్యమంలో కానీ ఎక్కడా కనిపించడం లేదు. అసలు ఆయన ఢిల్లీలో ఏం చేస్తున్నారన్నది పార్టీ ముఖ్యులకైనా తెలుసా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. గత ఆరు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న కేసీఆర్ బీఆర్ఎస్ కోసం నిర్వహించిన సమావేశాలు కానీ, సదస్సులు కానీ ఏమీ లేవు. మీడియా ముందకు అసలే రాలేదు. ఒక జాతీయ పార్టీని పెట్టిన తరువాత తొలి సారిగా దేశ రాజధానిలో అడుగుపెట్టిన ఆయన తన జాతీయ రాజకీయ అజెండాను ఆవిష్కరిస్తారని అంతా భావించారు. ఏదో మొదట ఓ రెండు రోజులు బీఆర్ఎస్ కార్యాలయం, తెలంగాణ భవన్ నిర్మాణాలను పరిశీలిస్తూ మీడియాలో కనిపించారు. అంతే ఆ తరువాత ఆయన హస్తినలో ఏం చేస్తున్నారు? ఎంత కాలం ఉంటారు అన్న దానిపై పార్టీ నుంచి కానీ, ఆయన నుంచి కానీ ఎటువంటి సమాచారం లేదు. ఇక నవీన్ పట్నాయక్ హైదరాబాద్ పర్యటన వద్దకు వస్తే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు సీఎం హోదాలో కేసీఆర్ స్వాగతం పలకడం విధాయకం. నిజంగా అత్యవసర పనుల నిమిత్తం ఆయన హస్తినలో ఉంటే.. అనుకోవచ్చు. అసలు అధికారిక కార్యక్రమాలంటూ ఏమీ లేకుండా వెళ్లి హస్తినలో కూర్చున్న కేసీఆర్ మర్యాద పూర్వకంగా ఒక ఆహ్వాన ప్రకటన కూడా జారీ చేయకుండా పట్నాయక్ పర్యటన విషయాన్ని పూర్తిగా విస్మరించడమేమిటని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. తనకు అవసరమైనప్పుడు పని గట్టుకుని వెళ్లి మరీ మంతనాలు జరిపి వచ్చారు. ఇప్పుడు అసలు పట్టించుకోవడం లేదు.. దీని వెనుక నవీన్ పట్నాయక్ తన జాతీయ పార్టీకి మద్దతుగా లేదా అనుకూలంగా ఎటువంటి ప్రకటనా చేయకపోవడమేనా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.   గతంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల కోణంలో ఆయనతో సమావేశం అయ్యారు. 2018 ముందస్తు ఎన్నికల్లో గెలిచిన తర్వాత వెళ్లి చర్చలు జరిపారు.   సరే ఇప్పుడ కేసీఆర్ జాతీయ రాజకీయాలలో వేలే కాదు.. రెండు కాళ్లూ పెట్టేశారు. కలిసి వస్తారని అనుకున్నా.. అనుకోకపోయినా.. బీజేపీయేతర పార్టీల నేతలందరినీ కలిసి మద్దతు కోరాల్సిన అవసరం ఇప్పుడు కేసీఆర్ కు  ఎంతో ఉంది. అయినా స్వయంగా నవీన్ పట్నాయక్ తెలంగాణలో అడుగిడినా ఆయనతో చర్చలు జరపలేదు. ఆయన సరే హస్తిన లో ఉన్నారు. కానీ బీఆర్ఎస్ కు మద్దతు కోరుతూ ఆయన తరఫున మరెవరైనా.. మరెవరి దాకాలో ఎందుకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కుమారుడు కేటీఆర్ ను అయినా నవీన్ పట్నాయక్ వద్దకు పంపి ఉండాలి అలాగా చేయలేదు.  దీంతో కేసీఆర్ జాతీయ రాజకీయాల విషయంలో పునరాలోచిస్తున్నారా అన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. బీఆర్ఎస్ ప్రకటన అయితే చేసేశారు కానీ.. దానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎటువంటి అడుగులూ వేయకపోవడమే తమ  అనుమానాలకు కారణమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

డేగ క‌ళ్ల  టీఆర్ ఎస్‌

ఎక్క‌డికి పోతావు చిన్న‌దానా నా చూపుల్లో చిక్కుకున్న చిన్న‌దానా...అంటూ హీరోగారు త‌న నుంచి త‌ప్పిం చుకోలేవ‌ని హీరోయిన్ని దాదాపు ప్రేమ‌పూర్వ‌కంగా బెదిరిస్తాడు.. అది సినిమా.. కానీ రాజ‌కీయాల్లో అలాంటి డేగ‌క‌ళ్ల‌తో టీఆర్ ఎస్ త‌మ పార్టీవారినే కాదు ఇత‌ర పార్టీల‌వారినీ క్ష‌ణం రెప్ప‌వేయ‌కుండా గ‌మ‌నించా ల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది..మునుగోడు ఉప ఎన్నిక సాక్షిగా! అనుమానం త‌లెత్త‌గానే వేయి క‌ళ్లు వెంటాడ‌తాయంటారు. అదే పంథా అనుస‌రిస్తోంది  టీఆర్ ఎస్‌. మునుగోడు ఉపఎన్నిక‌ దృష్ట్యా ప‌రిస్థితుల‌ను బేరీజు వేసుకోవ‌డంతో పాటు పార్టీల ప్ర‌తినిధులు, నాయ‌కుల అడుగు జాడ‌లను ప‌సిగ‌ట్టే ప్ర‌య‌త్నాల్లో ప‌డింది. మునుగోడులు త‌ప్ప‌కుండా ఘ‌న విజ‌యం సాధిస్తా మ‌న్న ఢంకా బ‌జాయించిన టీఆర్ ఎస్ ఊహించ‌నివిధంగా ఇపుడు అంద‌రి మీద ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. కేవ‌లం త‌మ పార్టీవారే గాకుండా ఎన్నిక దృష్ట్యా కాంగ్రెస్‌, బీజేపీ నాయ‌కులు, ప్ర‌తినిధులు, అభ్య‌ర్థుల క‌ద‌లిక‌ల మీదా ఓ న్నేసింది అనాలి.  భ‌యంభ‌యంగానే ధైర్యాన్ని ప్ర‌క‌టించ‌డంలో ఆరితేరిన లక్ష‌ణాలు టీఆర్ ఎస్ స్వ‌యంగా ప్ర‌క‌టించు కుంటోంది. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కేంద్ర రాజ‌కీయాల్లో చక్రం తిప్పాల‌న్న ప‌ట్టుద‌ల‌తో పార్టీ పేరుని బీఆర్ ఎస్‌గా మార్చి మ‌రీ ముంద‌డుగు వేస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వానికి  పెను స‌వాలుగా నిల‌వాలి, కేంద్రాన్ని భ‌య‌ప‌డేలా చేయాల‌న్న‌త‌లంపుతో దూసుకుపోవ‌డానికి స‌ర్వ‌స‌న్న‌ద్ధ‌మ‌య్యారు. అయితే మునుగోడు ఉప ఎన్నిక స‌మ‌యంలో పార్టీని బ‌లోపేతం చేయ‌డంలోనూ దృష్టి పెట్టాలి గ‌నుక ఇటు పార్టీ వ‌ర్గాల‌ను, నిఘా సంస్థ‌ల‌ను రంగంలోకి దింపార‌న్న ప్ర‌చారం ఉంది. మునుగోడులో తిష్ట వేస్తున్న పార్టీలు, ప్ర‌తినిధులు, వారి మ‌ద్ద‌తుదారుల క‌ద‌లిక‌ల్ని ప‌నిగ‌ట్టుకుని ప‌రిశీలిస్తున్న‌ది టీఆర్ ఎస్‌. ఎవ‌రు ఎవ‌రిని క‌లుస్తున్నారు, ఎవ‌రు ఎవ‌రితో మాట్లాడుతున్నారన్నవే గాకుండా ప్ర‌తీ చిన్న స‌మాచారం టీఆర్ ఎస్ వ‌ర్గా లు సేక‌రిస్తున్నారు. చీమ చిటుక్కుమ‌న్నా పార్టీ అధినేత‌కు తెలిసే విధంగా స‌మాయ‌త్త‌మ‌యింది. అందు వ‌ల్ల టీఆర్ ఎస్ పార్టీ వ‌ర్గాలు మ‌రింత జాగ‌రూక‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  గెల‌వ‌డం ప్ర‌ధాన ల‌క్ష్యంగా పెట్టుకుని అందుకు అనుస‌రించాల్సిన వ్యూహాల‌తో పాటు ఈ విధ‌మైన వ్యూ హాన్ని కూడా అమ‌లు చేయ‌డంలో దృష్టి పెట్టారు. మ‌రీ ముఖ్యంగా బూర న‌ర్స‌య్య గౌడ్ టీఆర్ ఎస్ నుం చి బ‌య‌ట‌ప‌డ‌టంతో పార్టీ మ‌రింత జాగ్ర‌త్త‌ప‌డాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ప‌డ‌నివారిని ప్ర‌తిప‌క్షాలు ఇట్టే ఆక‌ట్టుకుంటాయ‌న్న‌ది అనాదిగా జ‌రుగుతున్న‌దే. ఫిరాయింపులు ఎంత ధైర్యంగా ఉన్నా నీరుగారు స్తాయి. అదే భ‌యం టీఆర్ఎస్‌కీ లేక‌పోలేదు. మునుగోడు ఉప ఎన్నిక కీల‌కంగా భావిస్తున్న ఈ త‌రు ణంలో ఫిరాయింపులు మ‌రింత కంగారుపెట్ట‌క‌పోవు. ఒక్క‌రిద్ద‌రు మారి విప‌క్షాల్లోకి వెళ్లినా  అవ‌త‌ల‌పార్టీకి ఏమాత్రం వారు బ‌లం చేకూరుస్తారోగాని, ఇటు ఒక వికెట్ ప‌డిపోయింద‌న్న బాధ మాత్రం లోలోప‌ల ఉంటుంది. అందునా పేరున్న నాయ‌కులు, వారి అభిమానులు, అనుయాయూల‌తో  వెళిపోతే దాని ప్ర‌భావం అమితంగా నే ఉంటుంది. అందుక‌నే టీఆర్ అధినేత క‌ళ్లు డేగ కళ్టుగా మార్చుకున్నారు, నిఘావ‌ర్గాల‌ను నిద్ర పోనీయడంలేదు, పార్టీ నాయ‌కుల‌ను అంద‌ర్నీ ప‌రుగులు పెట్టిస్తున్నారు.  అస‌లే ప‌రిస్థితులు కొంత తీవ్ర‌త‌ర‌మ‌య్యాయి. లిక్క‌ర్ కుంభ‌కోణం మ‌రీ భూతంగా మారిపోయి కేసీఆర్ కుటుంబాన్ని రోడ్డుమీద‌కు తెచ్చేట్టుగా మారింది. ఈ స‌మ‌యంలో పార్టీ మునుగోడులో గెలిపించుకోవ‌డం క‌ష్ట‌మే అయిన‌ప్ప‌టికీ తీవ్రంగా కృషి చేస్తోంది. లిక్క‌ర్ మ‌ర‌క ఇప్ప‌ట్లో తుడుచుకుంటే పోయేది కాదు. ఎన్నిక ముంగిట్లోకి వ‌చ్చేసింది. ఇపుడు ప్ర‌తిష్ట‌ను కాపాడుకునేందుకు ఈ ఎన్నిక‌లో గెలిచి కాస్తంత ఊపిరి పీల్చ‌కోవాలి. క‌నుక‌నే కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నిక‌ విష‌యంలో డేగ దృష్టితోనే ప‌రిస్ఙితుల‌ను గ‌మ‌నిస్తున్నారు, అంద‌రినీ ప‌రుగులెత్తిస్తున్నారు. 

వైసీపీ ప్రభుత్వ పనితీరుకు కేంద్ర మంత్రుల గుర్తింపు.. ఎందుకంటే?

ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలనా వైభోగాన్ని కేంద్ర మంత్రులు బాగా గుర్తించారని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు. ఇదేమిటి చంద్రబాబు ఏమిటి.. జగన్ పాలనకు బ్రహ్మాండంగా కేంద్రం నుంచి గుర్తింపు వచ్చిందని ట్వీట్ చేయడమేమిటని అనుకుంటున్నారా? నిజమే కేంద్రం జగన్ పాలనను గుర్తించిందనీ, అయితే బ్రహ్మాండంగా ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి జరుగుతోందనీ, అవార్డుల మీద అవార్డులు వచ్చేస్తున్నాయనీ, ప్రజాదరణ రోజు రోజుకూ అద్భుతంగా పెరిగిపోతోందనీ కాదు.. వరుస వైఫల్యాలతో ప్రజా జీవితాన్ని అతలాకుతలం  చేసేలా ఏపీలో జగన్ పాలన ఉందన్న విషయాన్ని కేంద్ర మంత్రులు గుర్తించారని చంద్రబాబు సెటైర్ వేశారు. ఇంత అధ్వానంగా పాలన సాగుతున్న రాష్ట్రం దేశంలో మరోటి లేదన్న గుర్తింపు జగన్ సర్కార్ కు బాగా వచ్చిందన్నారు. గత మూడేళ్లుగా ఏపీలో పాలన అధమంగా ఉందనీ, సీఎం మాటలు కోటలు దాటుతున్నాయే కానీ.. రాష్ట్ర ప్రజలు రోడ్డు దాటలేక అవస్థలు పడుతున్నారనీ చంద్రబాబు ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇంతటి అధ్వాన పాలనతో జగన్ కేంద్ర మంత్రుల గుర్తింపు పొందారని అన్నారు. వచ్చే ఎన్నికలలో 175 కు 175 అసెంబ్లీ స్థానాలలో  విజయం సాధించాలంటున్న జగన్ ఈ మూడేళ్లలో రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఏమిటో ఒక సారి అవలోకనం చేసుకోవాలన్నారు. ఇంతటి అధ్వాన పాలన అందించినందుకు సిగ్గు పడాలని చంద్రబాబు ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. 

రాష్ట్ర విభజనకు జగన్ సంపూర్ణ మద్దతు పలికారా?

వైసీపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన విశాఖ గర్జన తుస్సు మంది. డ్వాక్రా మహిళలు, వర్సిటీ విద్యార్థులను బెదరించి బలవంతంగా తీసుకువచ్చినా.. విశాఖ జనంలో స్పందన లేకపోవడంతో గర్జన శబ్దం కనీసంగా కూడా విశాఖలో వినిపించలేదు. చివరికి సభలో చెప్పుకోదగ్గ జనం కూడా లేకుండా పోయారు. ఇంతోటి దానికి ఇంత మంది మంత్రులు తరలి రావాలా అన్న వ్యాఖ్యలూ వినిపించాయి. సరే ఇదంతా పక్కన పెడితే.. విజయసాయి గర్జన్ లో అసలు కనిపించలేదు, వినిపించలేదు. ఆయన ప్రమేయం ఇసుమంతైనా లేకుండానే వైసీపీ ఇంతటి కార్యక్రమాన్ని చేపట్టి పూర్తి చేసింది. వాస్తవానికి విశాఖ రాజధాని అయితే అందరి కంటే ఎక్కువగా లబ్ధి చేకూరేది విజయసాయికే. ఆ లబ్ధి కోసమే ఆయన ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ చార్జిగా ఉన్న సమయంలో ఎడాపెడా భూ దందాలు చేశారు. అవన్నీ ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో పార్టీ ఉద్దేశ పూర్వకంగానే ఆయనను విశాఖ బాధ్యతల నుంచి తప్పించిందంటారు. అందులో వాస్తవం ఎలా ఉన్నా.. విజయసాయి కుమార్తె, అల్లుడి ఖాతాలోకి విజయసాయి విజయవంతంగా చేర్చిన భూముల జాబితా మీడియా ముఖంగా సర్వే నంబర్లతో సహా వెలుగులోనికి వస్తుండటంతో ఆయన ఫేస్ విశాఖలో కనబడినా వైసీపీకి తీరని నష్టం జరుగుతుందని స్వయంగా జగనే భయపడుతున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే విజయసాయిని పార్టీ వ్యవహారాల నుంచి దూరంగా ఉంచాలన్న నిర్ణయానికి జగన్ వచ్చినట్లు చెబుతున్నారు. విశాఖ భూదందా, ఢిల్లీ లిక్కర్ స్కాం లింకులు అన్నీ విజయసాయి కేంద్రంగానే ఉండటంతో.. మరీ ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కాం లో జగన్ సతీమణి భారతి పేరు బయటకు రావడం వెనుకా విజయసాయి సెల్ఫ్ ప్రొటక్షన్ వ్యూహం ఉందని జగన్ అనుమానిస్తున్నారని అంటున్నారు.  ఈ నేపథ్యంలోనే విజయసాయి భూదందా వ్యవహారాలన్నీ ఒకదాని వెనుక ఒకటి మీడియా ముఖంగా బయటపడుతున్నా... వైసీపీ బాకా ఉదే జగన్ సొంత పత్రికలో కనీసం ఖండనలు కూడా రాలేదని అంటున్నారు. పార్టీ తనను దూరం పెడుతున్నదన్న నిర్ణయానికి వచ్చిన తరువాతనే విజయసాయి సొంత చానెల్ అంటూ ప్రకటించారనీ.. నిజానికి వైసీపీలో ఆయనకు మరింత ఉక్కపోత ఎదురైతే సొంత పార్టీ పెట్టేందుకు కూడా వెనుకాడరనీ అంటున్నారు. జగన్ ను ఢీ కొట్టేందుకు కూడా వెనుకాడని ధైర్యం విజయసాయికి రావడం వెనుక కమలం ఆశీస్సులున్నాయా అన్న అనుమానాలు సైతం వ్యక్త మౌతున్నాయి. బీజేపీ ఆశీస్సులు విజయసాయికి పుష్కలంగా ఉండటం వల్లనే ఇంత జరుగుతున్నా జగన్ ఆయనపై వేటు వేయడానికి కానీ, పార్టీ నుంచి సస్పెండ్ చేసి షోకాజ్ నోటీసు జారీ చేయడానికి కానీ వెనుకాడుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకూ విజయసాయిపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదని అంటున్నారు. ఈ ధీమాతోనే.. రాహుల్ భారత్ జోడో యాత్ర ఏపీలో ప్రవేశించే తరుణంలో నాడు జగన్ రాష్ట్ర విభజనకు సంపూర్ణ మద్దతు ఇచ్చిన విషయం వెల్లడయ్యేలా విజయసాయి కాంగ్రెస్ ను రెచ్చగొడుతూ ట్వీట్ చేశారని కూడా పరిశీలకులు అంటున్నారు. సరిగ్గా రాహుల్ భారత్ జోడో యాత్ర ఏపీలో ప్రవేశించే సమయంలో జగన్ రాష్ట్ర విభజనకు సంపూర్ణ మద్దతు ఇచ్చారంటూ.. నాడు వైసీపీ తీర్మానం చేయడాన్ని... ఆ తీర్మానాన్ని అప్పటి హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు పంపుతూ వైసీపీ పంపిన లేఖను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జై రాంరమేష్ ఇప్పుడు వెల్లడించడానికి కారణం విజయసాయి చేసిన ట్వీటే కారణం కావడం గమనార్హం. 

కాంగ్రెస్ గూటికి  క‌విత‌!

తెలంగాణా రాజ‌కీయాల ప‌రిణామాలు వేగవంతంగా మారిపోతున్నాయి. టీఆర్ ఎస్ పార్టీ బీఆర్ ఎస్‌గా మారిపోయింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ దేశ రాజ‌కీయాల్లోకి దూకి కేంద్రానికి గ‌ట్టి స‌వాలు విసిరి త‌న ప్రాధా న్య‌త‌ను దేశ‌మంతా విస్త‌రించేలా చేయ‌డానికి ముంద‌డుగు వేశారు. అయితే ఈ స‌మ‌యంలోనే ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణం బ‌య‌ట‌ప‌డ‌టం, అందులో కేసీఆర్ కుమార్తె మాజీ ఎంపీ క‌ల్వ‌కుంట క‌విత త‌దిత‌రుల కీల‌క‌పాత్ర గురించి వార్త‌లు దేశ‌మంత‌టా విస్త‌రించ‌డం ఎంతో ప్రాధాన్య‌త‌ను సంత‌రించు కుంది. ఆమె పాత్ర ఎంత‌వ‌ర‌కూ ఉంది, అది కేసీఆర్ రాజ‌కీయ భ‌విష్య‌త్తు మీద ఏ మేర‌కు ప్ర‌భావం చూపుతుంద‌న్న‌ది తెలంగాణా రాజ‌కీయాల్లో త‌న దైన శైలితో విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్న, కేసీఆర్ సోద‌రుని కుమార్తె తెలంగాణా ఫైర్‌బ్రాండ్ ర‌మ్యారావు,  క‌విత కాంగ్రెస్  ఆశ్ర‌యించ‌డానికే ఎంతో అవ‌కాశం ఉంద‌న్నారు. ఆమె కాంగ్రెస్‌తో లోపాయ కారి ఒప్పందాలు చాలాకాలం క్రిత‌మే చేసుకుంద‌ని అన్నారు.  శ‌నివారం తెలుగువ‌న్‌తో ర‌మ్యారావు ప్ర‌స్తుత రాజ‌కీయాప‌రిణామాల‌గురించి చ‌ర్చించారు. ఈ సంద‌ ర్భంగా ఆమె మాట్లాడుతూ, అస‌లు తెలంగాణాలో టీఆర్ ఎస్ రెండోప‌ర్యాయం అధికారంలోకి వ‌చ్చే స‌మ‌యానికే క‌విత బీజేపీ వారితో సంబంధాలు ప‌టిష్ట‌ప‌రుచుకుంద‌ని ర‌మ్యారావు అన్నారు.  రెండో పర్యాయం టీ ఆర్ ఎస్‌ రాకున్నా ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకున్నార‌న్నారు. అం దువ‌ల్ల‌నే ఆమె ఎంపీగా గెలిచిన నిజామా బాద్ నుంచే మ‌ళ్లీ పోటీచేయ‌డానికి నిర్ణ‌యించుకున్నారు. ఇక్క డ త‌మ పార్టీ రాకున్నా కేంద్రంలో బీజేపీ పార్టీతో ఉన్న స‌త్సంబంధాలు క‌విత‌కు మ‌ద్ద‌తునిస్తాయన్న ధైర్యం ఆమెకు  ఎప్ప‌టి నుం చో ఉంద‌న్నారు. అప్ప‌ట్లో అమిత్ షా ని మ‌రో కీల‌క నాయ‌కునితో సంప్ర దించార‌ని, త‌మ స్థానం సు స్థిరప‌ర‌చుకోవ‌డానికి సిద్ధ‌ప‌డ్డార‌ని  ర‌మ్యారావు  స్ప‌ష్టం చేశారు.   లిక్క‌ర్ స్కామ్ వ్య‌వ‌హారం గురించి ప్ర‌స్తావిస్తూ, మ‌రీ విస్త‌రించేంత‌వ‌ర‌కూ వాస్త‌వానికి కేసీఆర్‌కు తెలియ ద‌ని, దాని సీరియ‌స్ నెస్ బ‌య‌ట‌ప‌డ‌డంతో కుమార్తెను ఆ ఉచ్చునుంచి బ‌య‌ట‌ప‌డేసేటందుకు ఆయ‌న తీవ్ర కృషిచేస్తున్నార‌ని ర‌మ్యారావు అన్నారు. ఢిల్లీలో నాయ‌కుల‌ను సంప్ర‌దించి కేసు తీవ్ర‌త‌ను త‌గ్గించే ప్ర‌య‌త్నాలు ముమ్మరం చేశారన్నారు. అయితే మునుగోడు ఎన్నిక‌ల స‌మ‌యం ఆస‌న్న‌ మ‌యిన ఈ స‌మయంలో కేసు ప్ర‌భావం ఉంటుంద‌ని అంటూనే తీవ్ర‌త‌ను త‌గ్గించ‌డానికే ప‌రువు కాపాడు కునే య‌త్నా ల్లో భాగంగానే కేసీఆర్ ఢిల్లీ యాత్ర‌లు చేస్తున్నారు. వాస్త‌వానికి క‌విత పాత్ర కీల‌క‌మా కాదా అన్న‌ది ఇంకా తేల‌వ‌ల‌సి ఉంద‌ని, అయితే ఈసీ ఏసి బీ దాడుల‌తో ఆమె చుట్టూ కేసు బిగియ‌డం జ‌రుగుతున్న‌ప్ప‌టికీ  క‌విత స‌న్నిహితుడు అప్రోవ‌ల్‌గా మారితేనే ఆమెకు ప్ర‌మాదం ఉండ‌వ‌చ్చుగాని అప్ప‌టివర‌కూ ఉండ ద‌న్నారు.  అయితే క‌విత నేరుగా ఆర్ ఎస్ ఎస్ ఛీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్‌ని సంప్ర‌తించార‌ని, ఆయ‌న ఆమెను స్కామ్ నుంచి ర‌క్షిస్తార‌న్న న‌మ్మ‌కంతో ఉంద‌ని ర‌మ్యారావు అన్నారు. అంచేత కేసీఆర్ ప్ర‌య‌త్నాల కంటే మోహ న్ భ‌గ‌వ‌త్ క‌రుణాక‌టాక్షాలే ఆమెను కాపాడ‌తాయ‌న్నారు. కానీ ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల్లో టీఆర్ ఎస్ కేంద్రం మీద భారీ విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతున్న నేప‌థ్యంలో అదెంత‌వ‌ర‌కూ సాధ్య మ‌న్న ప్ర‌శ్న‌క స‌మాధానం చెబుతూ, మునుగోడు ఎన్నిక‌ల ముందు పార్టీ ఇబ్బందిప‌డ‌కుండా బీజేపీ వారు కూడా జాగ్ర త్త‌లు తీసుకుంటార‌ని, ఆమెపై చ‌ర్య‌కు ఉప‌క్ర‌మిస్తే మునుగోడులో సెంటిమెంట్ మీద టీఆర్ ఎస్ గెలిచే అవ‌కాశాలుంటాయి గ‌నుక టీఆర్ ఎస్‌పై దాడి అంత వేడిగా ఉండ‌క‌పోవ‌చ్చ‌న్నారు. ప‌రిస్థితుల‌ను అను స‌రించే అంతా జ‌రిగిపోతుందే త‌ప్ప వెంట‌నే చ‌ర్య‌ల‌కు దిగితే కేంద్రం కూడా చిక్కుల్లో ప‌డుతుంద‌నే వారు ఆలోచిస్తారన్నారు.  కేటీఆర్‌, కేసీఆర్ ల మ‌ధ్య విభేదాల గురించి వ‌స్తున్న వార్త‌ల‌ను ప్ర‌స్తావిస్తూ, అలాంటిదేమీ లేద‌ని, అసెంబ్లీకి ఎవ‌రు ముందు రావాలి, ఎవ‌రు త‌ర్వాత రావాల‌న్న‌దేమీ ఉండ‌ద‌ని, పైగా ఒక‌రు లేని స‌మ‌యంలో మ‌రొక‌రు రావ‌డం అనేది ఉండ‌ద‌న్నారు. విభేదాల‌కు ఆస్కారం లేద‌ని, కేసీఆర్ కేంద్ర రాజ‌కీయాల్లోకి వెళుతున్న‌ప్పుడు కేటీఆర్‌ను ఇక్క‌డ ముఖ్య‌మంత్రి చేసి పార్టీ బాధ్య‌త‌ను పూర్తిగా ఆయ‌న చేతుల్లో పెట్టే యోచ‌న‌లో ఉన్న‌పుడు విబేదాల‌కు ఆస్కారం ఉండ‌దని ర‌మ్యా రావు అన్నారు. కేంద్రంలో బీజేపీని ఎదు ర్కొన‌డానికి ప్ర‌తిప‌క్షాల‌తో స్నేహ‌సంబంధాలు మ‌రింత మెరుగుప‌ర్చుకుని యుద్ధానికి స‌న్న‌ధ్ద‌మ‌వుతున్నార‌నే అనాలి. అలా ఆయ‌న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్‌తో క‌లిసి ఇక్క‌డ త‌న కుమారుడు కేటీఆర్ కు ఎలాంటి ఎదురుదాడి లేకుండా చేసుకోవ‌డానికి రేవంత్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ ప‌ద‌వి నుంచి తొల‌గింప చేయ‌వ‌చ్చు. ఫ‌లితంగా తెలంగాణాలో బీఆర్ ఎస్‌, కేటీఆర్ ప్ర‌భుత్వానికి అడ్డంకులు ఉండ కుండా పోతా య‌న్న‌ది ఆయ‌న వ్యూహంలో భాగం కావ‌చ్చున‌న్నారు. 

రాష్ట్ర విభజనకు జగన్ మద్దతు.. జైరాం రమేష్

ఏపీ సీఎం జగన్ నాడు రాష్ట్ర విభజనకు సంపూర్ణ మద్దతు ఇచ్చారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ అన్నారు. రాష్ట్ర విభజనకు సంపూర్ణ మద్దతు ఇస్తూ జగన్ అప్పటి కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారని గుర్తు చేశారు. తాను బళ్లారి పర్యటనలో ఉండటంతో ప్రస్తుతం ఆ లేఖ విడుదల చేయలేకపోతున్నారని.. త్వరలోనే విడుదల చేస్తాననీ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏపీలో ప్రవేశిస్తున్న నేపథ్యంలో విజయసాయి చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా జైరాం రమేష్ ఈ విషయాలు చెప్పారు. రాహుల్ భారత్ జోడో యాత్ర వల్ల ఏపీలో కాంగ్రెస్ పార్టీకి  ఒరిగేది ఏమీ లేదనీ.. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు రాహుల్ కు గుర్తు చేయాలంటూ విజయసాయి ట్వీట్ చేయడంపై జై రాం రమేష్ స్పందించారు. అప్పటి హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు డిసెంబర్ 28న 2012న  అప్పటి వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ నేత ఎంవీ మైసురారెడ్డి, సెంట్రల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు కేకే మహేందర్‌రెడ్డి రాసిన లేఖను సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. ఆ లేఖలో 2011 జులై 8,9 తేదీలలో జరిగిన వైసీపీ ప్లీనరీలో తీసుకున్న నిర్ణయం మేరకు తెలంగాణ ప్రజల మనోభావాలను తమ పార్టీ గౌరవిస్తోందనీ,   రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచడం, లేదా విభజించడంపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానిదేననీ పేర్కొన్నారు.   

టీఆర్ ఎస్‌ను మునుగోడు ప్ర‌జ‌లు న‌మ్మ‌రు..రాజ‌గోపాల్‌రెడ్డి

మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో ఎలాగ‌యినా గెలిచి రాష్ట్ర రాజ‌కీయాల్లో తిరుగులేని పార్టీగా టీఆర్ ఎస్ చ‌క్రం తిప్పాల‌ని చూస్తోంది. 2024 ఎన్నిక‌ల‌కు సెమీస్‌గా భావిస్తున్న మునుగోడు ఎన్నిక‌ల్లో ఎలాగ‌యినా భారీ మెజారిటీతో గెల‌వాల‌న్న ప‌ట్టుద‌ల‌ను టీఆర్ ఎస్ ప్ర‌ద‌ర్శిస్తోంది. ఈ ఆలోచ‌న‌తోనే త‌న చుట్టూ ఉన్న నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌ను టీఆర్ ఎస్ నేత‌లు ప‌శువుల్లా కొనుగోలు చేస్తున్నార‌ని బీజేపీ అభ్య‌ర్ధి, మాజీ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు ప్ర‌జ‌లు టీఆర్ ఎస్‌ను న‌మ్మే స్థితిలో లేర‌ని వారికి ఈ ఎన్నిక‌ల్లో గ‌ట్టి బుద్ధి చెబుతార‌నీ అన్నారు.  మునుగోడు ఇపుడు బీజేపీవారికీ కీల‌కంగా మారింది. కేసీఆర్ కేంద్ర రాజ‌కీయాల్లోకి వెళ్ల‌డానికి ఎంతో ఆస‌క్తి చూపుతూ దూసుకుపోతున్న త‌రుణంలో, పార్టీ పేరు కూడా బీఆర్ ఎస్‌గా మార్చి మ‌రీ కేంద్రం మీద విరు చు కుప‌డుతున్న స‌మ‌యంలో వ‌స్తున్న ఈ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్‌కు గ‌ట్టి షాక్ ఇవ్వాల‌న్న‌దే  బీజేపీ ల‌క్ష్యంగా పెట్టుకుంది. అందుకు కాంగ్రెస్‌నుండి త‌మ పార్టీలోకి వ‌చ్చిన మాజీ ఎమ్మెల్యే రాజ‌గోపాల్ రెడ్డి పై ఎంతో న‌మ్మ‌కంగా ఉన్నారు. ఒక స‌మ‌యంలో ఆయ‌న త‌ప్ప‌కుండా భారీ మెజారిటీతో  గెలిచే అవ కాశా లున్నాయ‌ని ప్ర‌చారం చేసుకుంటూ వ‌స్తున్న బీజేపీ ఇప్ప‌టి ప‌రిస్థితుల దృష్ట్యా అంత సీన్ లేదన్న అను మానం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ప‌రిస్థితుల‌ను త‌మ‌కు అనుకూలం చేసుకోవాల‌ని ఒక వంక కాంగ్రెస్, మ‌రో వంక టీఆర్ ఎస్ మ‌రింత విజృంభిస్తున్నారు. కాంగ్రెస్ అభ్య‌ర్ధి ముందే మునుగోడులో దూసుకుపోతు న్నారు.  కాగా,  ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి చండూరు చౌరస్తాలో  రాజ‌గోపాల్ రెడ్డి  మాట్లాడు తూ,  మునుగోడు ప్రజలను ఎన్ని ప్రలోభాలు పెట్టినా టీఆర్ ఎస్ ను  నమ్మే పరిస్థితిలో లేరని, వారంతా బీజేపీ వైపే చూస్తు న్నారని అన్నారు. బీజేపీ నేతలను, కార్యకర్తలను పార్టీ మారాలని పోలీసులతో టీఆర్ ఎస్‌ బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. మునుగోడును దత్తత తీసు కుంటానన్న కేటీఆర్ తాను మూడేళ్లుగా అభివృద్ధికి నిధులు ఇవ్వమని అడిగితే కనీసం స్పందించ లేదన్నారు.  తెలంగాణ ఉద్యమంలో పని చేస్తున్న సమయంలో పార్టీ ఫండ్‌ కావాలని అడిగితే కేసీఆర్‌, కేటీఆర్‌, కవితలకు తాను కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేశానన్నారు.  అభివృద్ధి అంటే సిరిసిల్ల, గజ్వేల్‌, సిద్దిపేట నియోజకవర్గాలకే పరిమితమా? మునుగోడు నియోజక వర్గానికి నిధులు ఎందుకివ్వర‌ని రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా బీజేపికి ప్రజలు పట్టం కడుతున్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. చట్టసభల్లో ప్రశ్నించే గొంతు లేకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకుని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఘనత కేసీఆర్‌ దేనన్నారు. పార్టీ మారితే తప్ప అభివృద్ది చేయలేరా అని ప్రశ్నించారు. 

కోడి కత్తా, కోనసీమ విధ్వంసమా.. విశాఖలో వైసీపీ ప్లాన్ ఏంటి?

విశాఖపట్నంలో పెద్ద ఎత్తున విధ్వంస కాండకు తెరలేపి.. రైతుల మహాపాదయాత్రను అడ్డుకోవడమే వైసీపీ లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకే పవన్ కల్యాణ్  విశాఖ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విశాఖలో కోడి కత్తి డ్రామాను రిపీట్ చేయడమో, కోనసీమ విధ్వంస కాండకు తెరలేపడమో చేయడమే వైసీపీ కుట్రగా కనిపిస్తోందంటున్నారు.  పవన్ కల్యాణ్ విశాఖపట్నం చేరుకున్న సందర్బంగా  విశాఖ విమానాశ్రయం వద్ద చోటు చేసుకున్న సంఘటనలు, సంభవించిన పరిణామాలూ కోడి కత్తిని గుర్తుకు తెస్తున్నాయి. జనసేనాని విశాఖ వస్తున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు వేల సంఖ్యలో జనసైనికులు విమానాశ్రయానికి చేరుకున్న సమయంలోనే విశాఖ గర్జన ముగించుకుని మంత్రులు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. మంత్రులు రోజా, జోగి రమేష్, వైసీపీ విశాఖ ఇన్ చార్జ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులపై జనసైనికులు దాడి చేశారంటూ పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురిపై 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ అరెస్టులు, కేసులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  అయితే   పోలీసులు సిసి ఫుటేజ్ ఆధారంగా అరెస్టులు చేయలేదనీ, అలా చేసి ఉంటే.. ఇప్పుడు పోలీసులు అరెస్టు చేసిన వారెవరూ ఆ దాడికి పాల్పడిన వారిలో లేరన్నది ప్రస్ఫుటం  అవుతుందని అంటున్నారు. అయినా జనసేనానికి ఉన్న జనాభిమానం గురించి తెలిసీ, ఆయనకు పెద్ద సంఖ్యలో అభిమానులు స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వస్తారని తెలిసీ ఎందుకు సరైన భ్రదతా ఏర్పాట్లు ఎందుకు చేయలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. అలాగే మంత్రులు విమానాశ్రయానికి వస్తున్నప్పుడు ప్రొటోకాల్ ప్రకారం ఉండాల్సిన భద్రతా ఏర్పాట్లు కూడా కనిపించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జరిగిన సంఘటనలు, అందుకు దారి తీసిన పరిస్థితులు గమనిస్తే.. విశాఖలో కోనసీమలో జరిగినట్లుగా పెద్ద ఎత్తున విధ్వంసం జరగాలని జగన్ సర్కార్ కోరుకుంటున్నదా అని అనుమానం కలుగుతోందని పరిశీలకులు అంటున్నారు. మంత్రులపై దాడికి పాల్పడిన వారు వైసీపీ కార్యకర్తలేనని జనసేన ఆరోపిస్తోంది. మరి ఆ దిశగా పోలీసులు ఎందుకు దృష్టి సారించడం లేదన్న ప్రశ్నలు వినవస్తున్నాయి. 

తుగ్లక్ లా జగన్ తీరు ఉందన్న జయప్రకాశ్ నారాయణ్

మూడు రాజధానులంటూ ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరి పట్ల క్రమంగా అన్ని వర్గాలలోనూ వ్యతిరేకత పెరుగుతోంది. ఇప్పటి వరకూ ఈ విషయంపై పెద్దగా నోరు మెదపని వారు కూడా ఇప్పుడు బయటకు వచ్చి జగన్ సర్కార్ తీరును తప్పుపడుతున్నారు. ఆ క్రమంలోనే లోక్ సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ్.. మూడు రాజధానులంటూ వైసీపీ, జగన్ సర్కార్ తీరును తప్పుపట్టారు. గతంలో అందరూ కలిసి ఏకగ్రీవంగా రాజధానిగా అమరావతిని గుర్తు చేశారని ఆయన గుర్తు చేశారు. అంతటితో ఆగకుండా తుగ్లక్ కూడా తరచుగా రాజధానులను మార్చిన సంగతి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రబుత్వానికి రాష్ట్ర రాజధానికి మార్చే హక్కు ఇసుమంతైనా లేదని విస్పష్టంగా తేల్చేశారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై జయప్రకాశ్ నారాయణ్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. రాష్ట్రానికి ఒకటి కాదు మూడు రాజధానులు అంటున్న జగన్ సర్కార్ ఆరు నూరైనా మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరతామంటోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి, వికేంద్రీకరణే తమ విధానమని వైసీపీ చెబుతున్నది.  కాగా అమరావతే రాజధాని అంటూ ఆ ప్రాంత  రైతులు మహాపాదయాత్ర చేస్తున్నారు. ఆ యాత్రను అడ్డుకోవాలన్న ఉద్దేశంతో, ఆ యాత్ర విశాఖ ప్రవేశించరాదన్న తలంపుతో వైసీపీ విశాఖ గర్జన్ కార్యక్రమం చేపట్టింది. ఈ నేపథ్యంలోనే  రాజధాని అంశంపై లోక్ సత్తా  అధినేత జయప్రకాశ్ నారాయణ  ఏపీకి రాజధాని అమరావతే అని ఆయన తేల్చి చెప్పారు. తుగ్లక్ తరచూ రాజధానులను మార్చిన సంగతిని ప్రస్తావించిన ఆయన జగన్ పాలన తుగ్లక్ పాలనను తలపిస్తోందని అన్నారు. జగన్ సర్కార్ రాజధానిపై ప్రజలలో గందరగోళాన్ని సృష్టిస్తోందని అన్నారు. అయితే రాష్ట్ర హైకోర్టు రాజధానిపై విస్పష్ట తీర్పు ఇచ్చిన తరువాత కూడా జగన్ సర్కార్ తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లనడం సరికాదని జయప్రకాశ్ అభిప్రాయపడ్డారు.   ఒక సార్వభౌమ అధికారం ఉన్న ప్రభుత్వం ఇండిపెండెంట్ గా హామీ ఇచ్చిన తర్వాత, రాతపూర్వకంగా ఒక కాంట్రాక్ట్ కుదిరిన తర్వాత వెనక్కి వెళ్లే హక్కు లేదని హైకోర్టు చెప్పిందని ఆయన పేర్కొన్నారు.  రాజధాని అంశంపై తారస్థాయిలో రగడ జరుగుతున్న వేళ.. ఏపీ రాజధాని అమరావతే అంటూ జయప్రకాశ్ నారాయణ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  

విశాఖ పరిణామాలపై చంద్రబాబు ఆరా.. పవన్ కు ఫోన్

విశాఖలో గత రెండు రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరా తీశారు. పవన్ కల్యాణ్ బస చేసిన నోవాటెల్ హోటల్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించడం, ఆ హోటల్ లో బస చేసిన జనసేన నేతలను అరెస్టు చేయడం, పవన్ కల్యాణ్ కు పోలీసులు నోటీసులు ఇవ్వడం తదితర అశాలపై చంద్రబాబు స్వయంగా పవన్ కల్యాణ్ కు పోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జనసేన నేతలకు, కార్యకర్తలపై కేసులు, అరెస్టులను ఖండించారు. ఈ సందర్భంగా చంద్రబాబు జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి విపక్షాల గొంతు నొక్కాలని ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.  పవన్ కు నోటీసులు ఇవ్వడాన్ని ఖండించారు.  పవన్ కల్యాణ్ పర్యటనపై ఆంక్షలను వెంటనే తొలగించాలని  చంద్రబాబు డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో శనివారం వైకాపా నేతృత్వంలో జరిగిన విశాఖ గర్జన్ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. కాగా అదే రోజు జనసేనాని పవన్ కల్యాణ విశాఖ రావడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. విశాఖ విమానాశ్రయంలో పవన్ కల్యాణ్ వచ్చిన సమయంలోనే విశాఖ గర్జన ముగించుకుని మంత్రులు విశాఖ విమానాశ్రయానికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కొందరు మంత్రుల వాహనాలపై దాడికి పాల్పడ్డారు. జనసేన శ్రేణులు మంత్రులపై దాడులకు పాల్పడ్డారంటూ  వైసీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు జనసేన నేతలను, కార్యకర్తలను అరెస్టు చేశారు. ఆదివారం  పోలీసులు పవన్ కు నోటీసులు ఇచ్చి  విశాఖను వీడాలంటూ స్పష్టం చేశారు.   ఈ పరిణామాల నేపథ్యంలోనే  చంద్రబాబు పవన్ కల్యాణ్ కు ఫోన్ చేసి  పవన్ తో మాట్లాడారు. వందలాది మంది జనసేన నేతలపై కేసులు పెట్టడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. ఓ పార్టీ అధ్యక్షుడికి ప్రజల సమస్యలు తెలుసుకునే హక్కు ఉంటుందన్న చంద్రబాబు,  జనసేన జనవాణి కార్యక్రమాన్ని సమర్థించారు ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ విశాఖలో పరిస్థితులపైని,  తనకు పోలీసులు నోటీసులు ఇవ్వడం, తమ నేతలను అరెస్టు చేయడం తదితర అంశాలను చంద్రబాబుకు వివరించారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందనీ, జగన్ సర్కార్ పోలీసు అండతో విపక్షాల గొంతు నొక్కాలని ప్రయత్నిస్తోందనీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.  ప్రతిపక్ష నేతల కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించడం సరికాదన్నారు. విపక్ష నేతలను దూషించడమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.   ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారని పవన్ తో అన్నారు చంద్రబాబు.

టీఆర్ఎస్ కు మునుగోడు భయం

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు ఓటమి భయం వెంటాడుతోందా? అందుకే ముందుగానే ఓటమికి కారణాలు వెతుక్కునేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందా? అంటే వరుసగా జరుగుతున్న సంఘటనలను బట్టి చూస్తే ఔననే అనాల్సి వస్తోందని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా సింబల్స్ విషయంలో టీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీలో నెలకొన్న భయాన్నే సూచిస్తోందని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఎర్పడిన తరువాత ఇప్పటి వరకూ జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికలలోనూ టీఆర్ఎస్ కారు గుర్తుతోనే విజయం సాధించింది. ఆ తరువాత కూడా పలు ఉప ఎన్నికలలో కారు గుర్తుతోనే టీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే తెరాస దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలలో పరాజయం పాలైన తరువాత మాత్రమే కారును పోలిన గుర్తులు ఉండటం వల్లనే ఓటమి పాలయ్యామని చెప్పుకుంది. ఇప్పుడు ముందుగానే ఆ విషయాన్ని గట్టిగా చెప్పడం ద్వారా ఇప్పటి నుంచే మునుగోడు ఉప ఎన్నిక ఓటమికి ఎక్స్యూజ్ వెతుక్కోవడానికి ప్రయత్నాలు ప్రారంభించేసింది. మునుగోడు ఉప ఎన్నికలో కారు గుర్తును పోలిన ఎనిమిది గుర్తులను ఎవరికీ కేటాయించవద్దంటూ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈసీ నుంచి ఎలాంటి స్పందనలేదంటూ హైకోర్టును ఆశ్రయించింది. సోమవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్నారు టీఆర్ఎస్ నేతలు. హౌజ్‌ మోషన్‌ విచారణ చేపట్టాలని శనివారం కోరగా కోరగా.. అందుకు హైకోర్టు నిరాకరించింది.  దీంతో సోమవారం లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది.  కెమెరా, చపాతీ రోలర్, డోలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడను గుర్తులను మునుగోడు ఉప ఎన్నికలో ఎవరికీ కేటాయించరాదని  కోరుతూ  ఎన్నికల కమిషన్ ను ఈనెల 10న టీఆర్ఎస్ కోరిన సంగతి విదితమే.  ‘కారును పోలిన గుర్తులను అభ్యర్థులకు ఇవ్వడం వల్ల ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. అందుకే ఈసారి ఎన్నికల్లో వాటిని కేటాయించవద్దు’ అంటూ టీఆర్‌ఎస్‌ నేతలు సీఈవోని కోరారు. అయితే ఈసీ నుంచి స్పందన రాకపోవడంతో.. హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు టీఆర్ఎస్ నేతలు. గతంలో పలు నియోజకవర్గాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులకన్నా..కారును పోలినట్లు ఉండే ఈ గుర్తులతో బరిలో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థులకు అధిక ఓట్లు వచ్చాయన్నారు. కారును పోలి ఉన్నందునే వారికి ఓట్లు పడ్డట్లు స్పష్టమవుతోందని ఈసీకీ టీఆర్ఎస్ అంటున్నది. మునుగోడు, జహీరాబాద్‌, సిర్పూర్‌, డోర్నకల్‌లో 2018 ఎన్నికల్లో రోడ్‌రోలర్‌ గుర్తుకు సీపీఎం, బీఎస్పీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. నర్సంపేట, చెన్నూరు, దుబ్బాక, సిద్దిపేట, ఆసిఫాబాద్, బాన్సువాడ, నాగార్జునసాగర్ లో కెమెరా గుర్తుకు కూడా బీఎస్పీ, సీపీఎం కన్నా ఎక్కువ ఓట్లు పడ్డాయని అంటున్నారు. అందువల్ల ఆ  గుర్తులను తొలగించాలని టీఆర్ఎస్ కోరుతోంది. ఈ విషయంమీదే హైకోర్టులో సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ కు సిద్ధమౌతోంది. 

ఖర్గే వర్సెస్ థరూర్ అధ్యక్ష పీఠం ఎవరిదో?

ఇంచు మించుగా రెండున్నర మూడేళ్ళుగా ఇదిగో అదిగో అంటూ వాయిదా పడుతూ వచ్చిన భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల  ముహూర్తం రానే వచ్చింది. సోమవారం ( అక్టోబర్ 17) కాంగ్రెస్ అధ్యక్షుని ఎన్నుకునేందుగా దేశ వ్యాప్తంగా ఒకేసారి పోలింగ్ జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది వేల మందికి పైగా ఉన్న పీసీసీ ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకుంటారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజ్య సభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే, మరో సీనియర్ నేత లోక్ సభ ఎంపీ, శశి థరూర్’  పోటీ పడుతున్న విషయం తెలిసిందే.  భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర చాలా గొప్పది, ఎప్పుడో 137 ఏళ్ల నాడు, 1885 డిసెంబరు 25న మాజీ బ్రిటిషు అధికారి ఏ. ఓ. హుమే కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. దేశ స్వాతంత్ర పోరాటం తుదిఘట్టంలో మహాత్మా గాంధీ సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్ర పోరాటానికి సారధ్యం వహించిన కాంగ్రెస్ పార్ట అధ్యక్ష పదవికి ఎన్నిక జరగడం మాత్రం,ఇది ఆరవసారి. అయితే  అదంతా చరిత్ర. అలాగే, ఆ కాంగ్రేస్ ఈ కాంగ్రెస్ ఒకటేనా, అంటే అది మళ్ళీ వేరే చర్చ అవుతుంది. 1969 చీలికకు ముందున్న భారత జాతీయ కాంగ్రెస్’ ప్రస్తుత కాంగ్రెస్’, ఒకటి కాదనే వాదన ఒకటుంది.   ఆ అంశాన్ని అలా పక్కన పెట్టి, ప్రస్తుతంలోకి వస్తే, అంతటి ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఎన్నిక జరుగుతోంది. ఈ 24 ఏళ్లలో ఇంచు మించుగా 22 ఏళ్లకు పైగా సోనియా గాంధీనే అధ్యక్ష పదవిలో కొనసాగారు. మధ్యలో కొద్ది కాలం రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినా, 2019 సార్వత్రిక ఎన్నికల ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ, ఆయన రాజీనామా చేయడంతో మళ్ళీ సోనియా గాంధీనే, తాత్కాలిక ప్రాతిపదికన పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఇదొక రికార్డ్. నెహ్రూ, ఇందిరా గాంధీ సహా ఎవరూ కూడా రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కాలం కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో లేరు.  అదలా ఉంటే, గాంధీ కుటుంబం సభ్యులు (సోనియా, రాహుల్, ప్రియాంక) అధ్యక్ష పదవి వద్దనుకోవడంతో ఎన్నిక అనివార్యమైంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ, అధ్యక్ష పదవి ముట్టేది లేదని భీష్మించుకు కూర్చోవడం వలన ఎన్నిక అనివార్యమైంది. కాగా, ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత జరిగిన అనేక నాటకీయ పరిణామాల నేపధ్యంగా గాంధీ కుటుంబ బయటి వ్యక్తులు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్’ పోటీలో నిలిచారు. గాంధీ కుటుంబం తటస్థ వైఖరిని ప్రకటించినా, తెర వెనక తతంగం మరోలా  ఉందని, శశి థరూర్’ ఆరోపించారు. గాంధీల దృష్టిలో ఇద్దరు సమానమే కానీ , ఖర్గే కాసింత చాలా ఎక్కువ సమానం’ అనే ఆరోపణలు/విశ్లేషణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.ఈ నేపధ్యంలో ఖర్గే ఎన్నిక లాంచానమే అంటున్నారు.  నిజానికి ఖర్గే గాంధీలకు విధేయుడు అనడంలో ఎవరికీ సందేహం లేదు. అయినా  ఖర్గే, పోలింగ్;కు గంటల ముందు కూడా తమ విధేయతను మరోమారు చాటుకున్నారు. రిమోట్ కంట్రోల్ అన్నా,ఇంకొకటన్న తాను పట్టించుకోనని అవమానంగా భావించనని  స్పష్టం చేశారు. అలాగే, కాంగ్రెస్ అధ్యక్షునిగా గాంధీల సూచనలు సలహాలు తీసుకునేందుకు ఏమాత్రం సిగ్గు పడనని స్పష్టం చేశారు. ఒకటి రెండు ఎన్నికలలో ఓడి పోయినంత మాత్రాన గాంధీలను తప్పు పట్టడం సరికాదని, గాంధీలు దేశానికి, పార్టీకి చేసిన మేలును మరిచిపోలేమని అన్నారు. మరో వంక శశి థరూర్’  కాంగ్రెస్ సిద్ధాంతాలకు సంబంధించి తనకు ఎలాంటి ఫిర్యాదు లేదని, అయితే పార్టీ పని విధానంలో మార్పు రావాలని, అన్నారు. ఖర్గే గెలిస్తే ఆయనతో కలిసి పనిచేస్తానని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఆయన యంగ్ టర్క్’ వాయిస్ వినిపించారు. మార్పు కోరుకునే యువకులంతా తన పక్షాన ఉంటే,యథాతథ స్థితిని కోరుకునే వృద్ధులు ఖర్గే పక్షాన ఉన్నారని చెప్పు కొచ్చారు. అయితే ఎవరు ఎవరి పక్షాన ఉన్నారు, ఎవరు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నుంచి పార్టీ పగ్గాలు అందుకుంటారు అనేది, అక్టోబర్ 19 న తేలి పోతుంది.

కేటీఆర్ కు చెలగాటం కవితకు సంకటం

ఉరుము ఉరిమి మంగలం మీద పడడం  అంటే ఇదే నేమో. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం రోజు రోజుకు వేడెక్కుతోంది. ముఖ్యంగా, మునుగోడు ఉప ఎన్నికను తమ రాజకీయ భవిష్యత్ ను నిర్ణయించే కీలక ఎన్నికగా భావిస్తున్న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కల్వకుట్ల తారక రామా రావు, దటీజ్ కేటీఅర్  ప్రధానంగా  బీజేపీయే టార్గెట్ గా కత్తులు దూస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మొదలు మునుగోడు బీజేపీ అభ్యర్ధి కోమటి రెడ్డి వెంకట రెడ్డి వరకు ఎవరినీ వదిలి పెట్టకుండా, విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.  నిజమే. సహజమే ఎన్నికల సమయంలో ప్రత్యర్ధులపై విమర్శలు చేయడం  సహజమే. కానీ, కేటీఆర్  స్థాయిని మరిఛి చేస్తున్న విమర్శలు, శృతి మించుతున్నాయి, చిక్కులు తెచ్చిపెడుతున్నాయని, అంటున్నారు. ఒక విధంగా కేటీఆర్ విమర్శలు ఇటు పార్టీని, పార్టీ నాయకులను,మరీ ముఖ్యంగా కల్వకుట్ల కుటుంబాన్నిచిక్కుల్లోకి నేట్టేస్తోందని అంటున్నారు. ఓ వంక, సోదరి, తెరాస ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో చిక్కుకుని ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని వార్తలొస్తున్నాయి. అదే సమయంలో కేటీఆర్ చేస్తున్న విమర్శలు బీజేపీ నాయకులను రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయని తెరాస నాయకులే గుసగుసలు పోతున్నారు. ఇది పార్టీకు, ఫ్యామిలీకి ఇద్దరికీ మంచిది కాదని, అంటున్నారు.  రాజకీయాలలో రాణించాలంటే, ఎక్కడ ఎక్కాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసుండాలి, నిజానికి కేసీఆర్ విజయ రహస్యం అదే. ఉద్యమ సమయం నుంచి  కూడా కేసీఆర్, బ్లో హాట్ అండ్ బ్లో కోల్డ్ పాలసీనే ఫాల్లో అవుతూ వచ్చారు. గిట్టని వాళ్ళు కొందరు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, అంటారు అయినా కేసీఆర్ అదే పాలసీనే ఫాలో అవుతున్నారని అంటారు. ఇప్పుడు కూడా  కేసేఆర్ కుమార్తె కవితను వెంట పెట్టుకుని ఢిల్లీ వెళ్లి, అక్కడే  ఉన్నారు. ఆయన ఢిల్లీ యాత్రకు, కవిత కేసుకు సంబంధం వుందో లేదో, కానీ, ఢిల్లీ లిక్కర్ కేసులో బోయినపల్లి అభిషేక్‌’ను సీబీఐ అదుపులోకి తీసుకున్నవెంటనే కవిత, సంతోష్ను వెంటపెట్టుకుని ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి అక్కడే ఉన్నారు. నిజానికి, ‘నువ్వు గోకినా గోకకున్నా, నిన్ను నేను గోకుతూనే ఉంటాను’ అంటూ ప్రధాని మోడీని పేరు పెట్టి మరీ హెచ్చరించిన కేసేఆర్, ఇంచు మించుగా గడచిన వారం రోజులుగా ఢిల్లీలో ఉండి కూడా మోడీని ఒక్క సారి కూడా  గోకలేదు. ఒక్క మాట కూడా అనలేదు. అలాగని ఆయన కవిత లిక్కర్ కేసు విషయంలో భయపడుతున్నారని అనలేము అలాగే  అనకుండానూ ఉండలేమని అంటున్నారు. సమస్యలు చుట్టు ముట్టినప్పుడు మౌనాన్ని ఆశ్రయించడం కేసీఆర్ అడాప్ట్ చేసుకున్న విధానమని  ఆయన ప్రస్తుత మౌనం కూడా అందుకు సంకేతం కావచ్చని అంటున్నారు.   అయితే కేసీఆర్ గోకుడు ఆపేసినా, అనూహ్యంగా మునుగోడు బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నకేటీఆర్ మాత్రం గోకుడు ఆపలేదు. మోడీ.. బోడీ.. ఈడీ.. దేనికైనానా రెడీ అంటూ ప్రధాని మోడీని దూషించిన కేటీఆర్, కోమటి రెడ్డి బ్రదర్స్గా పాపులర్ అయిన మునుగోడు బీజేపీ అభ్యర్ధి, కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి, ఆయన సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డిని కలిపి వారు ‘కోమ‌టిరెడ్డి బ్రదర్స్ కాదు కోవర్ట్ బ్ర‌ద‌ర్స్’ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో అటు నుంచి కౌంటర్ గట్టిగానే వచ్చింది. కల్వకుట్ల కుటుంబం కమీషన్ల కుటుంబం అంటూ కోమటి రెడ్డి సోదరులు ఇద్దరూ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అంటే కాకుండా బీజేపీ నాయకులు మొత్తంగా కల్వకుట్ల ఫ్యామిలీ టార్గెట్’గా పాత పురాణాలు అన్నీ బయట పెడుతున్నారు. అందులో భాగంగానే, రాజగోపాల రెడ్డి, తాజాగా, “ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీలోని 600 మద్యం దుకాణాల్లో వాటా ఉంది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఆమెతోపాటు కేసీఆర్‌ హస్తం కూడా ఉంది. కవిత అవినీతిపై ఇప్పటికే సీబీఐ విచారణ జరుగుతోంది. వచ్చే బతుకమ్మ వేడుకలను ఆమె తీహార్‌ జైల్లోనే జరుపుకోవాల్సి ఉంటుంది’’ అని అన్నారు. మరోవంక సీబీఐ, ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణను వేగం పెంచింది. ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రిక్’గా విచారణ సాగిస్తోంది. సీబీఐ అదుపులో ఉన్న బోయినపల్లి అభిషేక్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఆయన గతంలో కవితకు వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దీంతో, ఏ క్షణానికి ఏమి జరుగుతుందో, అనే అనుమానం తెరాస నాయకులను,వెంటాడుతోంది. అయితే, కేటీఆర్ మాత్రం తగ్గేదేలే... అంటూ తన దారిలో తాను బీజేపీ నాయకులను తమదైన ధోరణిలో విమర్శిస్తూనే ఉన్నారు. అందుకే, కేటీఆర్ ధోరణి, పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్న విధంగా మారిందని అంటున్నారు.