విజయమో..వెనక్కి తిరగడమో తేల్చేది వీళ్లే 

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ ఈసారి అనేక ట్విస్టులతో సెమీస్ వరకూ సాగింది. వెస్టిండీస్, దక్ణిణాఫ్రికా వంటి హేమా హేమీ జట్లు వెనుదిరగడం, నెదర్లాండ్స్, ఆఫ్ఘనిస్తాన్ వంటి పిల్ల జట్లు తమ సత్తా ఏమిటన్నది నిరూపించడం అన్నీ అంతా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. వారితో పాటు క్రికెట్ వీరాభిానులు, అధికారులు, మాజీ ప్లేయర్ల సైతం గొప్ప ప్రదర్శన ఇస్తారనుకున్నవారు కాస్తంత పేలవంగా ఆడి క్రమేపీ పుంజుకోవడం, సులభంగా గెలవవచ్చన్న మ్యాచ్ లు చివరి బంతికీ తాడో పేడో తేల్చుకునేంత ఉద్రిక్తస్థాయిలో ముగియడం అన్నీ చూశాం. మొత్తానికి బయటికి వెళ్లిపోతుం దనుకున్న పాకిస్తన్ సెమీస్ కి చేరి సెమీస్ పోటీలు రసవత్తరంగా పోటాపోటీ గా జరిగే వీలుందన్నది తెలియజేసింది. ఇక అందరూ రేపు జరిగే తొలి సెమీస్ పై దృష్టి పెట్టారు. ఈ సెమీస్ లో జట్టు విజ యమో.. వెనుదిరగడమో తేల్చగలిగే ప్లేయర్ల గురించి తెలుసుకుందాం.. ఎందుకంటే ఇప్పటివరకూ వీళ్లే ఈ జట్లను గెలిపించి ఇక్కడిదాకా తీసుకువచ్చారు. భారత్ తో తలపడే ఇంగ్లండ్ తప్పకుండా కింగ్ కోహ్లీ ని కట్టడి చేయడం మీదనే ఎక్కువ దృష్టి పెట్ట నుంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా జట్టును విజయావకాశాల వేపు మళ్లించగలిగే విచిత్రమైన సత్తా ఉన్నవాడు కోహ్లీ. ఇది ఊహించని ప్రత్యేకత. అసలు సిసలుు ప్లేయర్లే దీన్ని ప్రదర్శించగల్గుతారు. 34 ఏళ్ల కోహ్లీ ప్రస్తుత టోర్నీలో ఇంతవరకూ 246 పరుగులు చేశాడు. అందులో అర్ధసెంచరీతో అజేయంగ నిలిచిన ఇన్నింగ్స్ చెప్పుకోదగ్గది.  ఓటమి ఖాయమన్న మ్యాచ్ లో ఊహించని ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయపథంలోకి లాక్కెల్లడంలో ప్రత్యర్ధులకు చుక్కలు చూపించాడు. అతనికి పరుగులు వరద సృష్టిం చడంలో ఉన్న వేగం, వ్యూహం ఓ ప్రత్యేక శైలిగానే సీనియర్లు, మాజీలు గుర్తించారు. అతను ఒత్తిడిలోనే అద్భుత ప్రదర్శన చేయడం గమనార్హం. బ్యాటింగ్ ను పూర్తిస్థాయిలో ఆశ్వాదించడం అతనిలోనే చూడగల్గుతామంటారు మాజీలు. ఇది ముమ్మాటికీ నిజం. అందుకే అతన్ని రెచ్చగొట్టవద్దని అంటూం టారు పాక్ సీనియర్లు సైతం. అతనంతే.. బౌలర్లను, ఫీల్డింగ్ పొజిషన్లను ఏమాత్రం లెక్క చేయడు.  ఇటీవలి కాలంలో జట్టు మిడిల్ ర్డర్ను ఆదుకుంటున్న గొప్ప వేగం కలిగిన బ్యాటర్ గా ఉద్భవించినవాడు సూర్యకుమార్ యాదవ్. మామూలు ప్లేయర్ లా కనిపించే ఈ బ్యాటర్ ఆకాశమే హద్దుగా సునాయాసంగా సిక్స్ లు కొట్టడంలో మాజీలను తలపిస్తున్నాడు. అందుకే అతన్ని అందరూ స్కై అనీ పిలుస్తున్నారు. ఏమాత్రం కష్టపడుతున్నట్టు ఒత్తిడికి గురయిన దాఖలాలు కనపడవు. అవతలి టీమ్ ఏదయినా, బౌలర్ ఎవరయినా సరే కడు ధైర్యంగా, నైపుణ్యంతో ఫోర్లు, సిక్స్లు బాదేయడంతో పాటు స్కోర్ ను పరుగు లెత్తించడంలో అతనికి అతనే సాటి. అతన్ని రెండో కోహ్లీ అన్నా ఫరవాలేదేమో. సూపర్ 12 చివరి మ్యాచ్లో జింబాబ్వే మీద శరవేగంగా కేవలం 25 బంతుల్లో 61  పరుగులు చేయడమే అందుకు అద్దంపడుతుంది. అంతర్జాతీయ కెరీర్ లోకి అడుగులు వేస్తున్న తొలి రోజుల్లోనే  ఇతను ఇలా  ధాటిగా ఆడుతుండడం సీనియర్లను సైతం ఆహ్లాదపరుస్తోంది. చాలా కాలానికి మిడిల్ ఆర్డర్ లో మంచి ధీటయిన బ్యాటర్ దొరికాడని హెడ్ కోచ్ ద్రావిడ్ కూడా ఎంతో ఆనందిస్తున్నాడు.  అందరూ తప్పకుండా గమనించాల్సిన కుర్రాడు అర్షదీప్ సింగ్. చూడ్డానికి సన్నగా పీలగా కనపడతాడు గాని  ఈ ఎడమచేతి పేసర్ బంతిని స్వింగ్ చేస్తుంటే ప్రత్యర్ధి జట్టు ఓపెనర్లు కంగారుపడటం చూశాం. కాలేజీ అయి ఉద్యోగ వేటలో ఉన్న యువకుడిలా కనిపించే సిగ్గరి లో ఇంత వేగం, యాక్యురసీ చూసి పాక్ మాజీ ప్లేయర్లు కూడా ఆశ్చర్యపడుతున్నారు. క్రమేపీ ఇతగాడు భారత్ ఓపనింగ్ బౌలింగ్ కి నాయ కత్వం వహించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సెమీస్ లో తప్పకుండా ఇంగ్లండ్ కి బెంబేలెత్తించగలడనే అనుకోవాలి. అతనిలో అంతటి సత్తా ఉంది. ఈ టోర్నీలో ఈ 23 ఏళ్ల కుర్ర పేసర్ 10 వికెట్లు తీసుకుని ముందంజలో నిలిచాడు. భువీ తో కలిసి విజృంభిస్తే భారత్ కు విజయావకాశాలు మరింత మెరుగయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి.  ఇక ఎప్పుడు సరదాగా నవ్వుతూ కనపడే ఇంగ్లండ్ స్టార్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ సామర్ధ్యం అనన్య సామాన్యమనే అంటున్నారు కామెంటేటర్లు. నిజమే, ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ ఈ ఫార్మేట్ లోనూ అద్భుతంగా బ్యాట్ చేస్తున్నాడు. ఆరంభ మ్యాచ్ ల్లో అంతగా స్కోర్ చేయకపోయినా చివరి మ్యాచ్ లో లంక మీద 36 బంతుల్లో 42 పరుగులు చేసి తను తన పాత ఫామ్ లోకి వచ్చానని ప్రత్యర్ధులకు హెచ్చరిక చేశాడనే అనాలి. అతను ధాటిగా ఆడితే ఇంగ్లండ్ కలలు పండినట్టే. అతన్ని నిలువరిం చడమ ప్రత్యర్ధి జట్టుకు అత్యంత అవసరం.  ఇక జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ ద్వయం ఊహించని బ్యాటింగ్ సత్తా ఉన్నవారు. ఇద్దరూ చూస్తుండగానే పరుగుల వరదతో జట్టుకు భారీ స్కోర్ సాధించగల నైపుణ్యం ఉన్నవారే. కివీస్ స్టార్ పేసర్లు టిమ్ సౌధీ, ట్రెంట్ బౌల్ట్ వంటి పేసర్లను అవలీలగా ఎదుర్కొని 81పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారంటేనే వారి బ్యాటింగ్ సత్తాను అంచనా వేయవచ్చు.   మరో వంక చిన్న పిల్లాడిలా కనిపించే బౌలర్ కరెన్ అతనితో పాటు మార్క్ఉడ్ నీ ప్రత్యేకంగా గమనిం చాలి. తన జట్టుకు బౌలర్ గా సామ్ కరన్ 2010లోనే గొప్ప విజయాన్ని అందించాడు. ఉడ్ ఇంతవరకూ టోర్నీలో అత్యంత వేగంగా బంతిని వేయగల సత్తా ఉన్న బౌలర్ గా అందరూ గుర్తించారు. వేగంతో పాటు స్వింగ్ చేయగల సత్తాతో ప్రత్యర్ధులను భయపెట్టగల పేసర్ ఉడ్.  ...

ధర్మానకు ఇప్పటికి తెలిసొచ్చింది.. అయినా బలే కవర్ చేశారుగా?

మంత్రి ధర్మాన ప్రసాదరావు.. సీనియర్ రాజకీయ నాయకుడు. మంత్రి కూడా. ఆయనకు ఇన్నాళ్లకు ఒక విషయం అర్ధమైంది. అదేంటంటే తమ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని. గడపగడపకూలో ఎదురౌతున్న నిరసనలు, మంత్రుల బస్సు యాత్ర సందర్భంగా ఎదురైనా చేదు అనుభవాలు ఏవీ కూడా ఆయనకు ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకతకు ప్రతీకలుగా కనిపించలేదట. తమ అధినేత చెప్పిన విధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో వైసీసీ 175కు 175 అసెంబ్లీ స్థానాలలోనూ విజయం సాధించేస్తుందన్న నమ్మకాన్నే ఇంత కాలం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. వీటన్నిటికీ మించి మూడు రాజధానులకు అనుకూలంగా చేపట్టిన విశాఖ గర్జనకు జనం మొహం చాటేసినా, ఇదే అంశంపై ఏర్పాటు చేసిన సమావేశాల్లో, రౌండ్ టేబుల్ సదస్సుల్లో మూడు రాజధానులకు అనుకూలంగా వాణి వినిపించకపోయినా ధర్మానకు ప్రజా వ్యతిరేకత కనిపించలేదు. పై పెచ్చు మూడు రాజధానులకు అనుకూలంగా తాను కోరినా గట్టిగా గళం విప్పలేదని జనంపై చిర్రుబుర్రులాడారు కూడా. జనం అంతా జగన్ వెనకే ఉన్నారని చాలా ధీమాగా చెప్పుకుంటూ వచ్చారు. అలాంటి ధర్మానకు హఠాత్తుగా ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత కనిపించేసింది. వెంటనే ఆయనా మాట తనలో దాచుకోకుండా శ్రీకాకుళంలో మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పేశారు. ‘ఔను.. మా ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉంది’ అంటూ కుండబద్దలు కొట్టేశారు. అయితే ఆ వ్యతిరేకత అంతా ప్రభుత్వ విధానాలను ప్రజలు అర్ధం చేసుకోకపోవడం వల్లనే వచ్చిందని తనదైన శైలిలో కవరింగ్ ఇచ్చేశారు. ఏ ప్రభుత్వానికైనా సరే సంస్కరణలు చేపట్టినప్పుడు తొలుత ప్రజా వ్యతిరేకతక రావడం సహజమేనని సూత్రీకరించారు. ఇప్పుడు జగన్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకతకు కూడా ఆయన అమలు చేస్తున్న సంస్కరణలు ప్రజలకు అర్ధం కాకపోవడం వల్లనేనని కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఏపీలో జగన్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత తీవ్రస్థాయలో ఉందని మంత్రి ధర్మాన స్వయంగా అంగీకరించేశారు. ఆయనే స్వయంగా తమ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందని అంగీకరించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ధర్మన వాస్తవం అంగీకరించేశారని జనం అంటున్నారు.  

జనవరిలో టీఆర్ఎస్ పగ్గాలు కేటీఆర్ కు? ఇక జాతీయ రాజకీయాలకే కేసీఆర్ పరిమితం

దీర్ఘ కాలంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న కేటీఆర్ ఆకాంక్ష నెరవేరే సమయం వచ్చేసిందా అంటే ఔననే అంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. పాన్ ఇండియా పార్టీగా బీఆర్ఎస్ ను తీర్చిదిద్దేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇక పూర్తి సమయం కేటాయించనున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో విజయం ద్వారా రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ఎదురు లేదని చాటిన ఆయన ఇక తన జాతీయ రాజకీయ ఆకాంక్షలు నెరవేర్చుకునేందుకు ఎక్కువ సమయం కేటాయించనున్నారనీ,  అందు కోసం రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పగ్గాలను తన కుమారుడు కేటీఆర్ కు అప్పగించేందుకు నిర్ణయం తీసేసుకున్నారనీ అంటున్నారు.   తొలుత వచ్చే నెలలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులను రంగంలోకి దింపి.. ఆ ఎన్నికలలో మూడు నుంచి నాలుగు సీట్లు గెలుచుకోవడం ద్వారా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మోడీకి గట్టి సవాల్ గా నిలిచేందుకు ప్రణాలిక రూపొందించిన కేసీఆర్ ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. గుజరాత్ ఎన్నికలు పూర్తి కాగానే రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పగ్గాలను కేటీఆర్ కు అప్పగించనున్నారు. గుజరాత్ ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలను ఎదుర్కొంటున్న కవితను రాజకీయాలకు దూరంగా ఉంచాలని కేసీఆర్ భావిస్తున్నారని రాజకీయ వర్గాలలో చర్చ జోరుగా జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ఎక్కడా కవిత ప్రమేయం లేకుండా కేసీఆర్ జాగ్రత్త పడ్డారు. ఒక వేళ గుజరాత్ ఎన్నికలకు ముందే..ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచి కవితకు సమన్లు జారీ చేయడం, విచారణకు పిలవడం, అరెస్టు చేయడం వంటి చర్యలకు పాల్పడితే.. గుజరాత్ ఎన్నికలలో పార్టీకి సానుభూతి పవనాలు వీచేలా అదే అంశాన్ని ఎన్నికల ప్రచారంలో హైలైట్ చేయాలన్న వ్యూహంతో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. ఇప్పటికే ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అంశాన్ని గుజరాత్  అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ ప్రధాన ఎన్నికల అంశంగా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఈ అంశం ఇప్పటికే గుజరాత్ లో బీజేపీని డిఫెన్స్ లో పడేసింది. దీనికి తోడు మొయినాబాద్ ఫాం హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కూడా బీజేపీని ఆత్మరక్షణలో పడేసిందంటున్నారు. దీంతో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఢిల్లీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు నెమ్మదిస్తుందని అంటున్నారు. కేసీఆర్ కూడా అదే అంచనాతో ఉన్నారంటున్నారు. ఆ కారణంగానే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కవితపై ఆరోపణలను తురఫు ముక్కగా వాడే అవకాశాలను రిజర్వ్ లో ఉంచారని అంటున్నారు. ఇక తాను అనుకున్నట్లుగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో మూడు నుంచి నాలుగు స్థానాలలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తే.. రాష్ట్ర పగ్గాలను తనయుడు కేసీఆర్ కు అప్పగించేసి కుమార్తె కవితతో కలిసి పూర్తిగా జాతీయ రాజకీయాలపై కాన్సన్ ట్రేట్ చేయాలన్నది కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు. గుజరాత్ ఎన్నికలలో బీఆర్ఎస్ సత్తా చాటితే తాను ఇంత కాలం చెబుతూ వచ్చిన మూడో ఫ్రంట్ సాకారం అవ్వడానికీ, ఆ ఫ్రంట్ కు తానే నాయకత్వం వహించడానికి మార్గం సుగమమౌతుందని కేసీఆర్ అంచనా వేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే గుజరాత్ లో పెద్ద సంఖ్యలో ఉన్న తెలుగు వారు కేసీఆర్ వెంట ర్యాలీ అయ్యేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.  

ఓబుళాపురం కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కి క్లీన్ చిట్ 

ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో సీనియర్ ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి కి ఊరట లభించింది. ఈ కేసులో ఆమెను నిర్దోషిగా పరిగణించి తెలంగాణ హైకోర్టు క్లీన్ చిట్ ఇస్తూ ఆదేశాలు జారీచేసింది. ఆమెపై ఉన్న అభియోగాలను ధర్మాసనం కొట్టివేసింది. ఓబుళాపరం కంపెనీ నుంచి ముడుపులు తీసుకున్నా రని ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీబీఐ కేసు నమోదుతో ఏడాది పాటు ఐఏఎస్ అధికారిణి జైలులో గడపాల్సి వచ్చింది. మైనింగ్ కు పాల్పడిన వారికి ఐఎఎస్ అధికారిగా శ్రీలక్ష్మి సహకరించారని ఆరోపణలతో పాటు భారీ ముడుపులు తీసుకున్నారనీ సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే సీబీఐ ఆరోపణల్లో  సాక్ష్యాధారాలు లేనందున  ఆమెపై అభియోగాలన్నింటినీ కోర్టు కొట్టివేస్తూ ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది.  1988 బ్యాచ్‌కు చెందిన శ్రీలక్ష్మి ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో గనుల శాఖ కార్యదర్శిగా పనిచేశారు. గనుల కేటాయింపులో ఆయాచిత లబ్ధి కలిగించారన్న ఆరోపణలతో అరెస్టయి, దాదాపు ఏడాది పాటూ జైల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత శ్రీలక్ష్మి తెలంగాణ కేడర్‌‌లో ఉన్నారు.‌  తెలంగాణ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వెళ్లాలని దరఖాస్తు చేసుకోగా తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. ఏపీ కేడర్‌కు రాగానే ఆమెకు పురపాలకశాఖ కార్యదర్శిగా పోస్టింగ్‌ ఇచ్చారు. పురపాలకశాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మికి  లెవెల్‌ 15కి ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఆ శాఖలోనే ముఖ్య కార్యదర్శిగా నియమించింది. వాటిని రెగ్యులర్‌ ప్రమోషన్లుగానే పరిగణించారు. ఆమెపై పెండిం గ్‌లో ఉన్న కోర్టు కేసుల్లో వెలువడే నిర్ణయాన్ని బట్టి పదోన్నతి కొనసాగింపు ఉంటుందని అప్పటి ఉత్త ర్వుల్లో ప్రస్తావించారు. ఆమెకు అబౌ సూపర్‌టైమ్‌ స్కేల్‌ (2), అపెక్స్‌స్కేల్‌- లెవెల్‌ 17కి పదోన్నతి కల్పించి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. దాన్ని అడ్‌హాక్‌ ప్రమోషన్‌గా పేర్కొన్నారు. తాజాగా హైకోర్టు తీర్పుతో ఆమె ఏపీ చీఫ్ సెక్రటరీగా నియమితులు అయ్యేందుకు అడ్డంకులు తొలగి పోయాయనే చర్చ జరుగుతోంది. కాగా...ఈ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు క్లీన్‌చిట్ ఇవ్వడంతో శ్రీలక్ష్మి ఏపీ చీఫ్ సెక్రటరీగా నియమితులు అయ్యేందుకు అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయని చెప్పుకోవచ్చు.

ఆశ్రమపాఠశాలల కరిక్యూలమ్... ఎంఇసి స్థానంలో ఎంపిసి

సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, కాలేజీల్లో కరిక్యూలమ్ లో మార్పు చేసేందుకు ఏపీప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల్లో ఎంఇసీ (మాథ్స్,ఎకనామిక్స్, సివిక్స్) కి డిమాండ్ పెద్దగా లేదన్నది విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఈ కారణంగా దాని స్థానంలో ఎంపీసీ(మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) అలాగే బైపీసీ(బయోలజీ,ఫిజిక్స్, కెమిస్ట్రీ)లను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఎంఇసీ విభాగంలో సుమారు 8వేల సీట్లు మిగిలిపోవడంతో ప్రభుత్వం కరిక్యూలమ్ మార్పు నిర్ణయం తీసుకుంది.  సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, కాలేజీల్లో పెద్దగా డిమాండ్ లేని విభాగాలను గతంలో గుర్తించి వాటి స్థానంలో డిమాండ్ ఉండే విభాగాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నారు. పాఠశాలలు, కాలేజీలలో విద్యార్ధులు అధికంగా కోరుకుంటున్న విభాగాలకే అధిక ప్రాధాన్యతనీయాలన్నది అధికారు లు గుర్తించారు. కానీ అధికారులు ఈ విషయంలో జాప్యం చేశారని సంక్షేమశాఖ మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల , ఆశ్రమ పాఠశాలల పనితీరును మంత్రి సోమవారం సమీ క్షించారు. ఈ సందర్భంగా అధికారులను పాఠశాల, కాలేజీలలో డిమాండ్ ఉన్న విభాగంలోకి సీట్ల మార్పు అంశంలో వెంటనే చర్యలు చేపట్టాలని, వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులో ఉండేట్టు చూడాలని అధికారులను ఆదేశించారు.  రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, కాలేజీల అన్ని బ్రాంచీల్లోనూ దాదాపు 1.17 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఈ ఏడాది సుమారు 1.09 లక్షల మంది చేరారని మంత్రి తెలిపారు. ఎంపీసీ, బైపీసీ సీట్లకు డిమాండ్ బాగా పెరిగిందని, అందుబాటులో ఉన్న సీట్ల కంటే అధిక సంఖ్యలో దరఖాస్తులు అందాయన్నారు.  అలాగే జిల్లాల్లో పాఠశాలల్లో మెడికల్, ల్యాబ్ టెక్నాలజీ కోర్సులను కూడా ప్రవేశపెట్టాలని అధికారులును మంత్రి ఆదేశించారు. ఈ కారణంగా భవిష్యత్తులో ఈ కోర్సులు చేసినవారికి ఉద్యోగాలు వెంటనే లభించే అవకాశం ఉంటుందన్నారు. అంతేగాక, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచేందుకు పాఠశాలల కోఆర్డినేటర్లు, ప్రినిపాల్స్ కృషి చేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను అమలుచేయడంలో నిర్లక్ష్యం చేసేవారిపై చర్యలు తీసుకోవ డానికి వెనుకాడవద్దనీ సూచించారు. 

పాన్ ఇండియా పార్టీగా బీఆర్ఎస్.. గుజరాత్ ఎన్నికలలో పోటీ!?

మునుగోడు ఉప ఎన్నికలో విజయం తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి జాతీయ పార్టీ బీఆర్ఎస్ విస్తరణపై దృష్టి సారించారు. బీఆర్ఎస్ ను పాన్ ఇండియా పార్టీగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అదీ ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్ లో సత్తా చాటడం ద్వారా దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ ను విస్తరించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే వచ్చె నెల రెండు విడతలుగా జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పోటీ చేయనుంది. గుజరాత్ లో తెలుగువారు అధికంగా ఉండే సూరత్ ప్రాంతంపై కేసీఆర్ దృష్టి పెట్టారు. గుజరాత్ లో ఇప్పటికే పట్టు సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగాలని కేసీఆర్ భావించినా ఆ దిశగా ఎటువంటి ముందడుగూ పడలేదు. ఆప్ కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ తో పొత్తుకు పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదని చెబుతున్నారు. అయితే గుజరాత్ లో ఒక బలమైన నేతను బీఆర్ఎస్ లో చేర్చుకోవడానికి కేసీఆర్ ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింఘ్ వఘేలాతో కేసీఆర్ చర్చలు ఫలప్రదమయ్యాయనీ, ఆయన నేడో రేపో బీఆర్ఎస్ గూటికి చేరనున్నారనీ చెబుతున్నారు.  గత సెప్టెంబర్ లో శంకర్ సింఘ వఘేలా హైదరాబాద్ ప్రగతి భవన్ కు వచ్చి కేసీఆర్ తో బేటీ అయిన సంగతి విదితమే. ఆ భేటీలోనే బీఆర్ఎస్ గుజరాత్ రాష్ట్రంలో పోటీకి దిగితే సంపూర్ణ మద్దతు ఇవ్వడమే కాకుండా, తాను జాతీయ పార్టీ ఏర్పాటును విరమించుకుని బీఆర్ఎస్ లో చేరేందుకు కూడా శంకర్ సింగ్ వఘేలా కేసీఆర్ తో చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు అదే జరగబోతున్నదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్న కేసీఆర్ ఆ దిశగా తన తొలి అడుగుతోనే ఏను కుంభ స్థలాన్ని ఢీ కొనాలని కృత నిశ్చయానికి వచ్చినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందులో భాగంగానే వచ్చే నెలలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులను పోటీకి నిలపాలని నిర్ణయించారు. ఇందు కోసం ఆయన గుజరాత్ లో బీఆర్ఎస్ నాయకుడిగా శంకర్ సింగ్ వఘేలాను ప్రొజెక్టు చేయనున్నారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర, గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న శంకర్ సింగ్ వఘేలా బీఆర్ఎస్ లో చేరడం వల్ల ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ లాంఛింగ్ కు పెద్ద ప్లస్ అవుతుందని పరిశీలకులు కూడా చెబుతున్నారు. ఇక గుజరాత్ లో పెద్ద సంఖ్యలో ఉన్న తెలుగు వారి మద్దతుతో కొన్ని స్థానాలలో విజయం సాధించడం పెద్ద కష్టం కాదని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ కారణంగానే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో కనీసంలో కనీసం పది స్థానాలలోనైనా బీఆర్ఎస్ అభ్యర్థులను రంగంలోకి దింపాలని కేసీఆర్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారంటున్నారు.  గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో కనీసం పది స్థానాలలో పోటీ చేసి, వాటిలో ఎంత లేదన్నా నాలుగు స్థానాలలో విజయం సాధించగలమన్న ధీమాతో కేసీఆర్ ఉన్నారంటున్నారు. గుజరాత్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ ను కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి దిగి.. కొన్ని స్థానాలలో విజయం సాధించడం ద్వారా ప్రధాని మోడీకి గట్టి గుణపాఠం చెప్పాలన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. ఇప్పటికిప్పుడు తనతో చేతులు కలపడానికి ఒకింత సంకోచిస్తున్న బీజేపీయేతర పార్టీలు, ప్రాంతీయ పార్టీలూ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల లో  బీఆర్ఎస్ కొన్ని స్థానాలలో విజయంతో సత్తా చాటితే.. వాటంతట అవే ముందుకు వచ్చి తనతో జట్టు కడతారన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తున్నది. ఏది ఏమైనా బీఆర్ఎస్ ఆవిర్బావం సందర్భంగా కేసీఆర్ ప్రకటించిన ప్రణాళికలో గుజరాత్ లో పోటీ అంశం లేదు. ఆ తరువాత సంభవించిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జాతీయ రాజకీయాలలో తన తొలి అడుగు మోడీని ఢీకొట్టడంతోనే వేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గుజరాత్ లో బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ రాష్ట్రలో ఆప్ బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్నదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో మనీష్ సిసోడియాపై కేసు అంశాన్ని ప్రధాన ఎన్నికల అంశంగా తెరమీదకు తీసుకురావడంతో బీజేపీ డిఫెన్స్ లో పడిందంటున్నారు. అందుకే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకూ ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో దర్యాప్తు సంస్థలు పెద్దగా దూకుడు ప్రదర్శించే అవకాశం లేదన్న కూడా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితకు ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదమేమీ లేదని తెరాస శ్రేణులు కూడా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులను రంగంలోనికి దింపి కొన్ని స్థానాలను గెలుచుకోవడం ద్వారా మోడీకి గట్టి సవాల్ విసిరినట్లౌతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. గుజరాత్ ఫలితాల తరువాత బీఆర్ఎస్ విషయంలో కేసీఆర్ తన దూకుడును మరింత పెంచే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ మోడల్ గా దేశ ప్రగతి అంటూ దేశ వ్యాప్తంగా కేసీఆర్ నాయకత్వ పటిమను ప్రచారం చేస్తూ జారీ చేసిన ప్రకటనల ప్రభావం గుజరాత్ మీద కూడా గణనీయంగానే ఉందని పరిశీలకులు అంటున్నారు. సో.. గుజరాత్ ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ సభ్యులు రంగంలో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. 

హిమాచల్ గుమ్మంలోకి ఎన్నికలు...గూడు దాటిన కాంగ్రెస్ నాయకులు

అసలే ఎన్నికల సమయం అందునా దక్షిణాదిన దెబ్బతింటున్న కాంగ్రెస్ పార్టీకి ఇపుడు మరో షాక్ తగిలింది.  హిమాచల్ ప్రదేశ్  అసెంబ్లీ ఎన్నికల సమయం గుమ్మం వరకూ వచ్చింది  అంతా యుద్ధానికి సన్నద్ధమవుతున్నారు. నినాదాల ప్లకార్డులు, జండాలు, వాహనాలు అన్నీ సిద్ధమయి నాయకులు ఇప్ప టికే అనుచరులను ఉత్సాహ పరుస్తున్నారు. ఇంతలో హఠాత్తుగా ఒకరిద్దరు కాదు.. ఏకంగా 26మంది కాంగ్రెస్ నాయకులు బీజేపీ లోకి దూకారు.  హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి ధర్మపాల్ ఠాకూర్ తో పాటు మరో 25 మంది కాంగ్రెస్ నేతలు బీజేపీ తీర్ధం పుచ్చుకోవడం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందే ఇలా వారు పార్టీకి ఝలక్ ఇవ్వడం పార్టీ అధినేతకు నోటమాట రాకుండా చేసింది. ఎందుకంత కఠిన నిర్ణయం తీసుకున్నారన్నది చర్చగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ థాకూర్, బీజేపీ రాష్ట్ర ఎన్నికలఇన్ఛార్జి సుధాన్ సింగ్ సమక్షంలో వారంతా పార్టీ కండువా మార్చు కున్నారు. ప్రధాని మోదీ, బీజేపీ పార్టీకి రాష్ట్రంలో పెరుగుతున్న అభిమానం, ప్రతిష్టకు విపక్షాల నుంచి కూడా నాయకులు ఆకర్షితులయ్యారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపినడ్డా ప్రకటించారు. మోదీ తో ఉంటే రాజకీయ ప్రగతి ఉంటుందన్న నమ్మకంతోనే కాంగ్రెస్ నుంచి పార్టీ లోకి వచ్చారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. దీనికి తోడు కాంగ్రెస్ ను ముందడుగు వేయించడంలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అంతగా అన్నిప్రాంతాలవారినీ ఉత్సాహపరిచే స్థాయిలో లేరన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు కాంగ్రెస్ పట్ల విముఖత క్రమేపీ అన్ని ప్రాంతా ల్లోనూ వ్యక్తమవుతుండడంతో బీజేపీ పార్టీ అలాంటి నాయకులను, రెబెల్స్ ను ఆకట్టుకోవడంలో విజయవంత మయింది.    ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా జైరామ్ థాకూర్ పాలన ప్రజారంజకంగా ఉందని, అన్ని పథకాలను సక్రమంగా ప్రజలకు ఉపయుక్తంగా అమలుచేస్తున్నారన్న నమ్మకం కలగడంతోనే కాంగ్రెస్ నాయకులు పార్టీలోకి వచ్చారని బీజేపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంటో అన్ని గ్రామాల్లోనూ పథకాలు బ్రహ్మాండంగా అమలు జరుగుతున్నాయని, ప్రజలు పార్టీ పట్ల, మోదీ నాయకత్వం పట్ల ఎంతో నమ్మకం చూపుతున్నారని ముఖ్యమంత్రి అన్నారు. పార్టీ వర్గాల ప్రచారం కంటే విపక్షాలను ఆకట్టుకోవ డంలో పార్టీ విజయవంతమయిందన్నది కాంగ్రెస్ నాయకులు బీజేపీ నీడన చేరడం స్పష్టం చేస్తుందని బీజేపీ నాయకులు అంటున్నారు.   కాగా నవంబర్ 12న రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ సీనియర్లు పార్టీ మారడం కాంగ్రెస్ ను దెబ్బతీస్తుందనే అంటున్నారు. ముఖ్యంగా ధర్మపాల్ థాకూర్ వంటి వారు పార్టీని వీడదం పార్టీని మరింత బలహీనపరుస్తుందని విశ్లేషకులు అంటున్నారు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందే థాకూర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల కాంగ్రెస్ నాయకులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

నగరిలో రోజాకు మరో పరాభవం.. కనీసం ప్రొటోకాల్ కూడా దక్కని వైనం!

నగరి నియోజకవర్గంలో రోజా ప్రభ రోజు రోజుకూ తగ్గిపోతోంది. ఆమెకు నియోజకవర్గంలో కనీసం ప్రొటోకాల్ కూడా అమలు కావడం లేదు. ఈ విషయంలో రోజా తన అసంతృప్తిని పలు మార్లు వెల్లడించినా ఫలితం లేకపోయింది. పార్టీ హై కమాండ్ కూడా ఆమె ఆవేదనను పట్టించుకోవడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటుంది.. సర్దుకు పోవాల్సిందే అని అన్యాపదేశంగానైనా పలు మార్లు రోజాకు అర్ధమయ్యేలా పార్టీ అగ్రనాయకత్వం వ్యవహరించింది. అయినా నియోజకవర్గంలో తన పట్టును నిరూపించుకుని ప్రత్యర్థుల చేత  శభాష్ అనిపించుకోకపోయినా.. మంత్రిగా తనకు దక్కాల్సిన గౌరవాన్ని వారి ద్వారా పొందాలన్న ప్రయత్నాలను రోజా విడవ లేదు. ఈ క్రమంలోనే తాజాగా రోజాకు మరో పరాభవం ఎదురైంది. వైసీపీ శ్రేణుల కథనం మేరకు ఆ ఉదంతానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  నగరి నియోజకవర్గంలో రోజాకు ప్రధాన ప్రత్యర్థి అయిన  రెడ్డివారి చక్రపాణి రెడ్డికి  జగన్  శ్రీశైలం ఆలయం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పదవి ఇచ్చారు. దీంతో ఆయన కూడా నగరి నియోజకవర్గంలో బలం పుంజుకుని మంత్రి రోజాకు దీటుగా నిలబడే అవకాశం వచ్చింది. ఇటీవల రోజా ప్రమేయం లేకుండా నగరి నియోజకవర్గంలో.. ఓ రైతు భరోసా కేంద్రానికి రెడ్డి వారి చక్రపాణి రెడ్డి శంకుస్థాపన చేసిన సంగతి విదితమే. ఈ విషయంపై ఆవేదన వ్యక్తం చేస్తూ రోజా మాట్లాడిన ఆడియో ఒకటి బయటకు వచ్చి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దాంతోటే రోజాకు నగరిలో సరైన గుర్తింపు, గౌరవం దక్కడం లేదన్న సంగతి బహిర్గతమైంది.   రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన వ్యవహారం ఇంకా పూర్తిగా మరుగున పడకుండానే రోజాకు మరో పరాభవం ఎదురైంది. మంత్రి హోదాలో రోజా.. శ్రీశైలం అలయానికి వెళ్లారు. ప్రోటోకాల్ ప్రకారం మంత్రికి ఆలయ చైర్మన్ స్వాగతం పలకాలి.  కానీ ఆలయం చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి శ్రీశైలంలోనే ఉన్నప్పటికీ మంత్రి రోజాకుస్వాగతం చెప్పడానికి రాలేదు. ఆయన వస్తారేమోనని కొద్ది సేపు ఎదురు చూసిన రోజా  ఆయన రాకపోవడంతో చిన్న బుచ్చుకున్నారు. చివరికి ఆలయ ఈవోనే లాంఛనంగా మంత్రి రోజాకు స్వాగతం పలికారు.  మంత్రి హోదాలో ఆలయ దర్శనానికి వెళ్లినా రెడ్డివారి చక్రపాణి రెడ్డి ప్రొటోకాల్ పాటించి స్వాగతం పలకకపోవడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. 

ఐఎస్ బీ ద్విదశాబ్ది ఉత్సవాలకు చంద్రబాబుకు ఆహ్వానం

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్ బి), హైదరాబాద్ ద్విదశాబ్ది  ఉత్సవాలకు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుకు ఆహ్వానం అందింది. ఐఎస్‌బీ నుంచి ఉన్నత స్థాయి బృందం చంద్రబాబు నివాసానికి వచ్చి మరీ ఆహ్వానం అందించారు. ఐఎస్ బీ ద్విదశాబ్ది ఉత్సవాలకు చంద్రబాబుకు ఆహ్వానం నిజంగా పెద్ద విశేషమే. ఎందుకంటే ఐఎస్ బీ హైదరాబాద్ లో స్థాపించిన క్రెడిట్ ను ఇంత కాలం ఆయనకు ఇవ్వకుండా రాజకీయం అడ్డుపడిందని పరిశీలకులు పలు విశ్లేషణలు చేశారు. అయితే ఇప్పుడు రాజకీయం మారిందా అంటే పరిస్థితిని బట్టి మారిందనే అనుకోవాల్సి వస్తోంది.  రాజకీయ పరిస్థితుల కారణంగా చంద్రబాబును ఐఎస్ బీ విషయంలో ఇగ్నోర్ చేసినా హైదరాబాద్ కు ఐఎస్ బీ రావడం వెనుక ఆయన కృషి దార్శనికత మాత్రం ఎవరూ కాదనలేరు. అది చరిత్ర. మహా మహా నగరాలను కాదని ఐఎస్ బీ హైదరాబాద్ లోనే ఏర్పాటు కావడానికి వెనుక ఎం జరిగిందో ఒక సారి అవలోకనం చేసుకుంటే... అప్పటికే ఐటీ హడ్ గా అమెరికా తరువాత అంతటి గుర్తింపు పొందిన బెంగళూరు (కర్నాటక)ను, భారత వాణిజ్య రాజధాని ముంబై అప్పటి బొంబై ( మహారాష్ట్ర)లను కాదని ఐఎస్ బీని హైదరాబాద్ ( అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని)కు తీసుకువచ్చిన చంద్రబాబు సమర్థత కళ్లకు కడుతుంది. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రగతి, పురోగతికే ప్రాధాన్యత ఇచ్చి, వర్తమానంతో పాటు భవిష్యత్ తరాల బాగును దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు  తీసుకున్న నిర్ణయాలు, అనుసరించిన విధానాలే.. ఆయనకు ఒక ప్రత్యేక నేతగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి.    ఆసియాలో ఒక బిజినెస్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రపంచంలోని 500 కంపెనీలు ఉమ్మడి భాగస్వామ్యంతో ముందుకు వచ్చిన తరుణంలో  నాడు అంటే 1988లో ఇండియన్ బిజినెస్ స్కూల్ ను తమ రాష్ట్రంలో ప్రారంభించాలంటే తమ రాష్ట్రంలో ప్రారంభించాలంటూ అప్పటికే ఐటీ హబ్ గా ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన కర్నాటక సహా పలు రాష్ట్రాలు పోటీ పడ్డాయి. తొలుత బిజినెస్ స్కూల్ ఏర్పాటు కోసం పరిశీలించినది కూడా బెంగళూరునే.. ఏపీలో ఐఎస్ బీ అనే ఉద్దేశమే   బిజినెస్ స్కూల్ ఏర్పాటు కోసం అనువైన నగరం కోసం అన్వేషించేందుకు వచ్చిన ప్రతినిథి బృందానికి లేదు. అయితే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాలనలో పారదర్శకతకు, మెరుగైన ప్రజాసేవకు ఐటీని వినియోగించుకుంటున్న తీరు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో సుపరిపానల అందిస్తున్నవిధానంపై  దేశంలోనే కాదు, ప్రపంచంలోని పారిశ్రామిక వేత్తలు సైతం  గుర్తించారు. అయినా కూడా అప్పటికి ఐఎస్ బీ ప్రమోటర్లు బిజినెస్ స్కూల్ ను బెంగళూరులో ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతోనే ఉన్నారు. అప్పుడప్పుడే హైదరాబాద్ బెంగళూరుకు పోటీగా ఐటీ హబ్ గా ఎదుగుతున్న దశ.  దక్షిణాదిన ప్రతిష్టాత్మక ఇండియన్ బిజినెస్ స్కూల్ ఏర్పాటుకు ప్రమోటర్లు ముందుకు వస్తున్నారన్న సంగతి తెలిసిన వెంటనే చంద్రబాబు స్వయంగా వారిని సంప్రదించారు. ఒక ముఖ్యమంత్రిగా ప్రమోటర్లతో సంప్రదింపులకు ఆయన వెనుకాడలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన సీఎంగా కంటే ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గానే ఎక్కువ కష్టపడ్డారు.  ఆ చొరవతోనే ఆయన ఇండియన్ బిజినెస్ స్కూల్ ప్రమోటర్లతో స్వయంగా మాట్లాడారు. హైదరాబాద్ ఆలోచనే లేదు..మా తొలి ప్రాధాన్యత బెంగళూరే అంటూ వారు కుండబద్దలు కొట్టినట్టు ముఖం మీదే చెప్పినా ఆయన నిరుత్సాహ పడలేదు.  ఆ బృందాన్ని హైదరాబాద్ కు ఆహ్వానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారిని ఆయన తేనేటి విందుకు ఆహ్వానించారు. బిజినెస్ స్కూల్ ప్రమోటర్లు అప్పటి వరకూ పలు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపారు. కానీ ఏపీ నుంచి సంప్రదింపుల ప్రతిపాదన ముఖ్యమంత్రి నుంచే రావడం వారికి ఒకింత ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే అప్పటి వరకూ వారితో సంప్రదింపులకు వచ్చింది అధికారులే. అందుకు భిన్నంగా సీఎం స్వయంగా ఆహ్వానించడంతో వారు కాదనలేక కేవలం మొహమాటంతోనే హైదరాబాద్ వచ్చారు. అలా వచ్చినంత మాత్రాన    హైదరాబాద్ లో ఐఎస్ బీ ఏర్పాటు  గ్యారంటీ అని భావించవద్దని వారు ముందుగానే చంద్రబాబుకు చెప్పారు.  అందుకు సమ్మతించే చంద్రబాబు వారిని ఆహ్వానించారు.  అలా వచ్చిన వారిని  ప్రొటోకాల్ ను సైతం కాదని ఎదురేగి ఆహ్వానించారు.   స్వయంగా  బ్రేక్ ఫాస్ట్ సర్వ్ చేశారు. తన నివాసంలోనే ఐఎస్ బీ ఏర్పాటు చేస్తే తమ ప్రభుత్వం ఇచ్చే రాయతీలు, కల్పించే సౌకర్యాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రం ప్రగతి దారిలో దూసుకుపోతున్న తీరును కళ్లకు కట్టారు. ఐటీని స్మార్ట్ గవర్నెన్స్ కోసం వినియోగించుకుంటున్న తీరునూ సవివరంగా వారికి ఎరుకపరిచారు.  చంద్రబాబు వ్యవహార శైలి, అభివృద్ధి కోసం ఆయన పడుతున్న తపన, ఆయన దార్శనికత ఆ బృందాన్ని మెస్మరైజ్ చేశాయి. చంద్రబాబు నివాసంలో తేనీటి విందు తరువాత కొన్ని రోజులకే హైదరాబాద్ లోనే బిజినస్ స్కూల్ ఏర్పాటు కార్యరూపం దాల్చింది.  బెంగళూరును కాదని హైదరాబాద్ ను ఎంచుకోవడానికి కారణం ఐఎస్ బి బృందం మీడియా సమావేశంలో వివరిస్తూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రోచ్, విజన్, అద్భుతం అని ప్రశంసించారు.   అయితే అంతటితో  పని అయిపోలేదు. అభివృద్ధిని అడ్డుకునే శక్తులు, రాజకీయంగా చంద్రబాబును ఇబ్బందులు పెట్టాలన్న శక్తులు తమతమ ప్రయత్నాలను కొనసాగించాయి. ఐఎస్బికి హైదరాబాద్‌ గచ్చిబౌలిలో 260 ఎకరాల స్థలాన్ని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది.  స్టాంపు డ్యూటీ మినహాయింపుతో పాటు కొన్ని రాయితీలూ కల్పించింది. దీనిపై నాడు ఏపీలో విపక్షం అయిన   కాంగ్రెస్‌ పలు విమర్శలు చేసింది.  ఆరోపణలు గుప్పించింది.    కొందరు నాయకులైతే కేసులు పెట్టారు. కానీ న్యాయస్థానం  సదుద్దేశంతో ఏర్పాటు చేస్తున్న ఐఎస్ బికి రాయతీలు ఇవ్వడంలో  రాష్ట్ర ప్రభుత్వం  ఎటువంటి అధికార దుర్వినియోగానికీ పాల్పడలేదని విస్పష్టంగా తీర్పు చెప్పింది.   చంద్రబాబు ఐఎస్ బీని సాధించడం ద్వారా ఏపీకి గొప్ప మేలు చేకూరిందంటూ జాతీయ పత్రికలు అప్పట్లో సంపాదకీయాలు రాశాయి. ఆయన దార్శనికత దేశానికి అవసరమంటూ ప్రశంసలతో ముంచెత్తాయి. 1999లో  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఐఎస్‌బి హైదరాబాద్‌ క్యాంపస్‌కు పునాదిరాయి పడింది.  2001లో నాటి ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి చేతుల మీదుగా, సీఎం చంద్రబాబు సమక్షంలో ఐఎస్‌బి హైదరాబాద్‌ క్యాంపస్‌ ప్రారంభోత్సవ వేడుక   ఘనంగా జరిగింది.   ఈ విషయాలన్నిటినీ   మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఇటీవల ఐఎస్‌బీలో జరిగిన ఓ కార్యక్రమంలో గుర్తు చేశారు.  ఐఎస్‌బీ వృద్ధికి సహకరించిన అందరి ఫోటోలు ఉన్నా.. చంద్రబాబు ఫోటో లేకపోవడం వెలితిగా ఉందని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల తరువాత  ఐఎస్పీలో చంద్రబాబు చిత్రపటం పెట్టారో లేదో తెలియదు కానీ..  ఇప్పుడు ఐఎస్ బీ ద్విదశాబ్ది వేడుకలకు ఆహ్వానించారు. ఒక దార్శనికుడి ఘనత, ప్రతిభలను ఏవో సంకుచిత కారణాలతో కొద్ది కాలం మరుగున పెట్టగలరే తప్ప ఎల్లకాలం కాదని చంద్రబాబు విషయంలో మరోసారి రుజువైంది. 

నీ గుణ మిదేనా తిలకా?

సినీస్టార్లతో సమానం క్రికెట్ హీరోలు. అంతగా ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులు ఉంటారు. భారత్ అయినా, చిన్నపాటి లంక అయినా, ఆఫ్ఘనిస్తాన్, నెదర్లాండ్స్ అయినా సరే.. సూపర్ ప్లేయర్ కి ఎప్పుడూ యావత్ క్రికెట్ లోకం వీరాభిమానం ప్రకటిస్తూనే ఉంటుంది. సచిన్, పాంటింగ్, ధోనీ లు రిటైరయినా ఇంకా రోజూ తల్చుకుంటూనే ఉంటారు. అంతటి మహా స్థాయి కాకున్నా గుణ తిలక మంచి ఆల్ రౌండర్ గా ఎంతో పేరున్న లంక ప్లేయర్.  ఆటలో గొప్ప నైపుణ్యం ప్రదర్శించేవాడు హఠాత్తుగా గుణం వదిలేసి కేవలం తిలకంగా మిగిలిపోతాడనుకోలేదు ఏ ఒక్కరూ. కానీ ఊహించని విధంగా అదే జరిగింది. టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఆస్ట్రేలియాలో ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన దనుష్క గుణతిలకను అన్ని రకాల క్రికెట్‌ల నుంచి సస్పెండ్ చేస్తూ శ్రీలంక క్రికెట్ సోమవారం నిర్ణయం తీసుకుంది. శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ జాతీయ క్రీడాకారుడు దనుష్క గుణతిలకను అన్ని రకాల క్రికెట్ నుండి తక్షణమే సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. గుణతిలకను అరెస్టు చేసి ఆస్ట్రేలియాలో ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సమాచారం అందిన తర్వాత అతనిని ఎటువంటి ఎంపికల కోసం పరిగణించరని లంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. అంతేకాకుండా, శ్రీలంక క్రికెట్ ఆరోపించిన నేరంపై తక్షణమే విచారణ చేపట్టడానికి అవసరమైన చర్య లు తీసుకుంటుంది. ఆస్ట్రేలియాలోని పైన పేర్కొన్న కోర్టు కేసు ముగిసిన తర్వాత, నేరం రుజువైతే, జరిమానా విధించడానికి చర్యలు తీసుకోబడతాయి" అని పేర్కొంది. . పోలీసులు ఆదివారం (నవంబర్ 6) తెల్లవారుజామున సిడ్నీలోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లోని శ్రీలంక జట్టు హోటల్‌లో దిగారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై గుణతిలకను అరెస్టు చేశారు. సిడ్నీ శివారు లోని రోజ్ బేలోని ఒక ప్రైవేట్ నివాసంలో 29 ఏళ్ల మహిళపై లైంగిక వేధింపుల నివేదికలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. న్యూ సౌత్ వేల్స్ పోలీసుల ఒక ప్రకటన ప్రకారం, ఆ మహిళ ఆన్‌లైన్ డేటింగ్ అప్లికేషన్ ద్వారా చాలా రోజుల పాటు అతనితో కమ్యూనికేట్ చేసిన తర్వాత అతనితో కలిశారు; అతను 2 నవంబర్ 2022 బుధవారం సాయంత్రం ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించబడింది. స్టేట్ క్రైమ్ కమాండ్ సెక్స్ క్రైమ్స్ స్క్వాడ్ , ఈస్టర్న్ సబర్బ్స్ పోలీస్ ఏరియా కమాండ్ నుండి డిటెక్టివ్‌ లుగా ఆస్ట్రేలి యన్ మీడియా నివేదికలలో  స్పెషలిస్ట్ పోలీసుల క్రైమ్ సీన్ పరీక్ష తర్వాత  31 ఏళ్ల వ్యక్తిని ససెక్స్‌లోని  ఒక హోటల్‌లో అరెస్టు చేశారని పేర్కొన్నారు. శ్రీలంక క్రికెట్  ఆ తర్వాత గుణతిలక అనే ఆటగాడి గుర్తింపును ధృవీకరి స్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఫాక్స్ స్పోర్ట్స్ ఆస్ట్రేలియాపై ఒక నివేదిక డిటెక్టివ్ సూపరింటెండెంట్ జేన్ డోహెర్టీని ఉటంకిస్తూ వారు ముందుగా డ్రింక్స్  కోసం కలుసుకున్నారు, తిన్న తర్వాత  మహిళ ఇంటికి తిరిగి వెళ్లారు. మహిళ అన్ని జాగ్రత్తలు తీసుకుంది, ఆమె బహిరంగ ప్రదేశంలో కలుసుకుంది, ఇది దురదృష్టకరం. పోలీసుల కథనం ప్రకారం, గుణతిలకను సిడ్నీ సిటీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. సమ్మతి లేకుండా లైంగిక సంపర్కానికి సంబంధించి నాలుగు ఆరోపణలపై అభియోగాలు మోపారు. ఈ రోజు ఏవిఎల్ ద్వారా పర్రమట్టా బెయిల్ కోర్టులో హాజరు కావడానికి శ్రీలంక జాతీయుడికి బెయిల్ నిరాకరించారు. సిడ్నీలో ఒక మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణలపై క్రీడాకారిణి దనుష్క గుణతిలకను అరెస్టు చేసినట్లు ఐసిసి ద్వారా తెలియజేసినట్లు శ్రీలంక క్రికెట్ ధృవీకరించినట్టు లంక బోర్డు ప్రకటించింది. టీ20 ప్రపంచకప్‌లో గుణతిలక వాస్తవానికి మంచి ప్లేయర్ గా బ్రహ్మాండంగా రాణించాడు.  అతను టోర్నమెంట్  మొదటి రోజు అక్టోబర్ 16న రౌండ్ 1లో నమీబియాతో ఒకే ఒక గేమ్ ఆడాడు. నమీబియా 55 పరుగుల తేడాతో గెలిచిన మ్యాచ్‌లో అతను మొదటి బంతికే డకౌట్ అయ్యాడు. తరువాత అతను స్నాయువు గాయంతో బాధపడ్డాడు మరియు టోర్నమెంట్‌లో ఇకపై ఆడలేకపోయాడు, కానీ జట్టులోనే ఉన్నాడు. గుణతిలక  పాయిజ్డ్, అటాకింగ్ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ గా అభివర్ణించింది క్రికెట్ లోకం. అతను శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కరను ఎంతో  మెచ్చుకుంటాడు. నవంబర్ 2015లో అంతర్జాతీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి గుణతిలక శ్రీలంక తరఫున ఎనిమిది టెస్టు మ్యాచ్‌లు, 47 వన్డేలు, 46 టీ 20లు ఆడాడు. టీ20 వరల్డ్‌లో దేశ ప్రచారం సందర్భంగా లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆస్ట్రేలియాలో అరెస్టయిన తర్వాత శ్రీలంక క్రికెట్ బోర్డు  జాతీయ జట్టు ఆటగాడు దనుష్క గుణతిలకను అన్ని రకాల క్రికెట్ నుండి సస్పెండ్ చేసింది.

ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంతు.. తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యమా?

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు శాసనసభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. సరే ఆ మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే కొత్త రికార్డులు సృష్టించింది. ఎన్నికల వ్యయంలో కానీ, పోలింగ్ శాతంలో కానీ గత రికార్డులను బద్దలు కొట్టేసింది.  బీజేపీ, టీఆర్ఎస్ లు సొమ్ము వెదజల్లి మరీ గెలుపు ధీమాను ప్రదర్శించడంలో పోటీలు పడ్డారు. కానీ చివరాఖరికి తెరాస బీజేపీపై పై చేయి సాధించి మునుగోడు ఉప ఎన్నికలో తెరాస విజయం సాధించింది. సరే మునుగోడులో నైతిక విజయం మాదేనని బీజేపీ చెప్పుకుంటోంది. అది వేరే సంగతి. తెరాస విజయానికి కమ్యూనిస్టులతో  పొత్తే తెరాస విజయానికి కారణమని బీజేపీ అంటోంది. వంద మంది ఎమ్మెల్యేలు, నాయకులను మోహరించి మునుగోడును ఒక విధంగా అష్టదిగ్బంధనం చేసేసి విపక్షాలను ప్రచారం చేసుకోనీయకుండా పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడి సాధించిన ఈ విజయం తెరాసకు వాపే కానీ బలుపు కాదని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. అదంతా పక్కన పెడితే..  బీజేపీ మాత్రం మునుగోడులో తనకు ఓటు బ్యాంకు బాగా పెరిగిందని సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇదే ఊపుతో మరో ఉప ఎన్నికకు తెరతీయడానికి అప్పుడే తెరవేనుక ప్రయత్నాలు మొదలెట్టేసిందని పరిశీలకులు అంటున్నారు. ఈ సారి అసెంబ్లీకి కాకుండా పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చేలా ప్రణాళిక రూపొందించిందని చెబుతున్నారు. ఈ సారి నల్గొండ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేత రాజీనామా చేయించి నల్గొండ పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చేలా ప్రణాళిక రూపొందించిందంటున్నారు. ఇందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సై అన్నారనీ, త్వరలో ఆయన రాజీనామా చేయడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంత భారీ ఎత్తున ఖర్చు పెట్టిన బీజేపీ, టీఆర్ఎస్ లు నల్గొండ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక వస్తే ఇక ఆకాశమే హద్దుగా చెలరేగిపోతారా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమౌతున్నాయి. 

పేదోడి బియ్యాన్ని కూడా బొక్కేసిన జగన్ సర్కార్: గోరంట్ల

జగన్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా అధ్వానంగా తయారైంది. తన తుగ్లక్ విధానాలతో ఆయన రాష్ట్రంలోని ప్రతి వర్గాన్నీ ఇబ్బందుల పాలు చేస్తున్నారు. తాజాగా ధాన్యంకొనుగోళ్ల విషయంలో జగన్ సర్కార్ విధానాలు అన్నదాతలను నట్టేట ముంచుతున్నాయని తెలుగుదేశం సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రంగా ఆరోపిస్తున్నారు.  రాష్ట్రంలో వైసీపీ సర్కార్ పేదోడి బియ్యాన్ని కూడా బొక్కేసే దౌర్బాగ్య స్థితికి చేరిందన్నారు.  తెలుగుదేశం సీనియర్ నాయకుడు, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంతటి దౌర్భాగ్య సర్కార్ అధికారంలో ఉండటం ఏపీ దౌర్బాగ్యమన్నారు. ధాన్యం కొనుగోళ్లలో నూతన నిబంధనలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని గోరంట్ల అన్నారు. గత ఏడాది రైతులు విక్రయించిన ధాన్యానికే ఇప్పటికింకా సొమ్ములు అందక నానా అగచాట్లూ పడుతున్నారని ఆయన అన్నారు. జగన్ పాలనలో రైతులు నానా ఇబ్బందులూ పడుతున్నారనీ, వ్యవసాయం సంక్షోభంలో పడిపోయిందన్నారు. పంటలకు మద్దతు ధర లేదు, పంట నష్టపోయిన వారికి పరిహారం లేదు, రైతు భరోసా రైతు దగాగా రూపాంతరం చెందిందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి దుయ్యబట్టారు. అన్న దాతల ఆత్మహత్యలలో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందంటే వ్యవసాయాన్ని జగన్ సర్కార్ ఎంత సంక్షోభంలో ముంచేసిందో అర్ధం చేసుకోవచ్చని గోరంట్ల చెప్పారు. గత తెలుగుదేశం పాలనలో రైతులకు వారం రోజుల్లోనూ ధాన్యం బకాయిలు అందేవనీ, జగన్ హయాంలో అయితే నెలలు గడుస్తున్నా ధాన్యం బకాయిలు చెల్లించడం లేదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. జగన్ నూతన నిబంధనలను ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్‌)లు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటమే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందన్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని  డిమాండ్‌ చేశారు.   జగన్ రెడ్డి ఆర్భాటంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు వైకాపా నేతల అవినీతి కేంద్రాలుగా మారాయని దుయ్యబట్టారు. వైసీపీ నేతల ఇష్టాయిష్టాల మేరకు అక్కడ కార్యకలాపాలు సాగుతున్నాయని విమర్శించారు.ఆర్‌బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు ఎక్కడా పూర్తి స్థాయిలో అమలు కాలేదన్నారు.  

ప్రధానిలో నిరుత్సాహం దేనికో?

దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ భారతీయ జనతాపార్టీ విజయపథంలోనే దూసుకుపోతోందని నాయకులు, వీరాభిమానులు తెగ ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రధానిలో ఆ ఉత్సాహంకంటే అందరినీ నియం త్రించ లేకపోతున్నాననే నీరసం కనపడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. విజయోత్సవాలు, రవ్వంతలో విజయం చేజార్చుకున్నా మెజారిటీ సాధించామన్న వార్తలు కూడా ఆయన్ను పెద్దగా సంతోషపెట్టడం లేదు.  బీజేపీ సారధిగా ఆయన బీజేపీ నాయకులను కలిసికట్టుగా ముందుకు నడిపిం చలేక పోతు న్నారనే విశ్లేషకుల మాట.  హిమాచల్ ప్రదేశ్‌లోని ఫతేపూర్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తనను 15 సంవత్సరాలుగా అవమానపరిచారని రాష్ట్ర బిజెపి మాజీ ఉపాధ్యక్షుడు కృపాల్ పర్మార్‌ వాదిం చారు. నామినేషన్ ఉపసంహరణ చివరి రోజు ముగిసిపోయినందున, రెండు రోజుల ముందే తనకు పిలుపు రావాలని ప్రధానికి చెప్పినప్పుడు, మోదీ అచ్చా భయ్యా, అచ్చా జీ అంటూ ఫోన్‌ని విరమించు కోవడంతో విసుక్కున్నాడు. ప్రధాని మోదీతో వాదిస్తున్న సాధారణ బీజేపీ కార్యకర్త! మరుసటి రోజు, బిజెపి పర్మార్‌తోపాటు మరో నలుగురు తిరుగుబాటుదారు లను పార్టీ నుండి బహిష్కరించింది. ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో-వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పీఎంవో కానీ, బీజేపీ కానీ ఇప్పటి వరకు ఖండించలేదు.  ఇప్పుడు మరో నాయకుడు సాహెబ్ స్వయంగా తిరుగుబాటుదారులకు ఫోన్ చేస్తున్నాడు. రాబోయే ఓటమి సాహెబ్‌కు నిద్రలేకుండా చేసిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటే ట్వీట్ చేశారు. ఆర్థిక, జాతీయభద్రత విదేశాంగవిధాన సవాళ్లపై దృష్టి సారించడం కంటే మోడీ బిజెపి తిరుగుబాటు దారులను పిలవడం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుం దని ప్రతిపక్ష నాయకులు భావించాలి. సరే, వారు మోడీపై ఎలా స్పందిస్తారో తెలియదు. జోక్ అతని మీద కాదు, తన పార్టీ పట్ల ప్రధానమంత్రి నిబద్ధతను చూడండి. ఆయనకు బీజేపీ ప్రయోజనాలే ప్రధానం. మోడీ యాత్రలు-దేశీయంగా, కనీసం-అన్నీ బిజెపికి సంబంధించినవి అయితే భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీని యాత్రికుడని, పార్టీ అధ్యక్షతకు తగడని ముద్రవేయడం. మహా రాష్ట్రలో తన యాత్రను విజయవంతం చేసేందుకు శివసైనికులు,  నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కలుపుకొని పోయే ప్రయత్నంలో భాగంగా శరద్ పవార్ , ఉద్ధవ్ ఠాక్రేలను కూడా గాంధీతో చేరాలని కాంగ్రెస్ ఆహ్వా చింది. సోలన్‌లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ, మీరు అభ్యర్థులను ఎవరినీ గుర్తుంచుకో వాల్సిన అవసరం లేదు. నేనే  మీ వద్దకు వచ్చాను మీ ప్రతి ఓటు కమలానికి వేసి మోదీని ఆశీర్వదిం చాలన్నారు.  నిజానికి ఆయన బీజేపీకి తనదైన బ్రాండ్‌ను కట్టబెట్టారు. భారత ప్రధాని, తన కార్యాలయం పై అపారమైన బాధ్యత ఉన్నప్పటికీ, బిజెపి తిరుగుబాటుదారులకు డయల్ చేయడానికి సమయాన్ని వెచ్చిస్తున్నారు, ఆడియోక్లిప్ ప్రభావం విషయానికొస్తే.. బీజేపీ శిబిరంలోని లోపాలను బయటపెడుతోం దని కాంగ్రెస్ భావించవచ్చు. కానీ, మనకు తెలిసిన విషయమేమి టంటే, మోడీ తిరుగుబాటు అభ్యర్థిని అభ్యర్థించడం, అధికారిక అభ్యర్థుల వెనుక బిజెపి శ్రేణులను ఏకం చేయడం కూడా ముగుస్తుంది. అయితే, ఆడియో క్లిప్ ఒక పెద్ద సమస్యను తెలియజేసింది. క్యాడర్ ఆధారిత పార్టీలో పెరుగుతున్న క్రమశిక్షణ,  కక్ష సాధింపు, అగ్ర నాయకత్వం నిస్సహాయంగా చూస్తోంది. నడ్డా సొంత గడ్డ అయిన హిమాచల్‌లోని 68 స్థానాల్లో దాదాపు నాలుగింట ఒక వంతు బీజేపీ తిరుగుబాటుదారులు పోటీ చేయడం, మోడీ,  పార్టీ ప్రధాన వ్యూహకర్త అమిత్ షాలను అప్రమత్తం చేయాలి. నడ్డా అకస్మాత్తుగా తన సొంత రాష్ట్రంలో తన లోతులను చూస్తున్నా, తన సొంత జిల్లా బిలాస్‌పూర్‌లోని నాలుగు నియోజకవర్గాలలో రెండింటిలో బిజెపి తిరుగుబాటురులు పోటీ చేస్తున్నారు. నయా రివాజ్ బనాయేంగే లేదా కొత్త సంప్ర దాయం (అధికారం నిలుపుకోవడం ద్వారా) అనే బీజేపీ నినాదం కొత్త అర్థాన్ని సంతరించుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఇంటి గడ్డపై మంటలను ఆర్పేందుకు ప్రధాని మోదీ రంగంలోకి దిగాల్సి వస్తే, అది పార్టీ నాయకత్వం గురించి చాలా చెబుతుంది. ఈ సందిగ్ధత  హిమాచల్ ప్రదేశ్‌కే పరిమితం కాకపోవడం మోడీని కలవరపెడుతోన్న విషయం. కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ వంటి అనేక రాష్ట్రాల్లో బీజేపీలో అంతర్గత యుద్ధాలు కొనసాగుతున్నాయి. బీజేపీ హైకమాండ్ బి.ఎస్. యడియూరప్ప మరియు అతని స్థానంలో బసవరాజ్ బొమ్మైని కర్ణాటక ముఖ్యమంత్రిగా నియ మించారు. బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం రోజుకు ఒక వివాదాన్ని ఆశ్రయించడం మరియు ముఖ్యమంత్రి క్లూ లెస్‌గా కనిపించడం వల్ల బొమ్మై విపత్తుగా మారింది. దీంతో హైకమాండ్ యడియూరప్పను బీజేపీ పార్లమెంటరీ బోర్డులోకి చేర్చుకోవాల్సి వచ్చిందంటే, ఆయన్ను సహకరించేందుకు ప్రయత్నించారు. మధ్యప్రదేశ్‌లో, జ్యోతిరాదిత్య సింధియా విధేయులు సీఎం శివరాజ్ చౌహాన్‌పై వేడిని పెంచారు. ఇంధన శాఖ మంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్ గ్వాలియర్‌లోని కుండలు ఉన్న రోడ్లపై చెప్పులు లేకుండా నడిచి ఇతరులు అనుభవించే బాధను అనుభవించారు. పంచాయితీ , గ్రామీణాభివృద్ధి మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా, మరొక సింధియా విధేయుడు, రాష్ట్ర పరిపాలనను "నిరంకుష్" లేదా నిరంకుశ అని పిలిచారు మరియు దీనికి చౌహాన్ నమ్మకస్తుడైన చీఫ్ సెక్రటరీ ఇక్బాల్ సింగ్ బెయిన్స్ కారణమని ఆరో పించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయర్గియా, సింధియాతో పెరుగుతున్న అను బంధం పార్టీ వర్గాల్లో ఉత్సుకతను పెంచింది, ఈమధ్యనే సీఎం చౌహాన్‌పై విరుచుకుపడ్డారు. ఎన్నికల తర్వాత శివరాజ్ చౌహాన్ "త్వరలో" రాజీనామా చేయకుంటే 2018లో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండేది. ఉత్తరప్రదేశ్‌లో అమిత్ షాకు సన్నిహితుడిగా చెప్పబడుతున్న ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, సిఎం యోగి ఆదిత్య థ్‌కు సన్నిహితుడైన అదనపు ప్రధాన కార్యదర్శి అమిత్ మోహన్ ప్రసాద్ వద్ద తన తుపాకీలకు శిక్షణ ఇస్తున్నారు. అనేక మంది ఇతర మంత్రులు రాష్ట్రంలోని సీనియర్ బ్యూరోక్రాట్‌లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు రాస్తున్నారు, ఇది శక్తివంతమైన సిఎంపై పుష్‌బ్యాక్‌గా పరిగణించబడు తుంది. హర్యానాలో సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, హోంమంత్రి అనిల్‌ విజ్‌ మధ్య చిరకాల వాగ్వాదం ఇకపై వార్తల్లో కనిపించడం లేదు. రాజస్థాన్ బిజెపి ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు సిఎం ఆశావ హుల నుండి సవాలును ఎదుర్కొంటున్న మాజీ సిఎం వసుంధర రాజేతో కూడా తీవ్రమైన అంతర్గత పోరును చూస్తోంది. ఈ అంతర్గత గొడవలు కొత్త కాదు. అయితే, వారిని నిలువరించడంలో బీజేపీ హైకమాండ్ విఫలమవడం ఆశ్చర్య కరం. నిజానికి, ఇది రోజురోజుకు మరింత దిగజారుతోంది. జనాదరణ పొందిన ప్రధానమంత్రి  ఉత్తమ వ్యూహకర్త నేతృత్వంలోని పార్టీకి, ఈ వైఫల్యం ఆశ్చర్యకరమైనది. తటస్థ మధ్యవర్తిగా కాకుండా హైకమాండ్ (ప్రధానమంత్రిని మినహాయించి) పార్టీగా మారినందున ఇది కొంతవరకు కావచ్చు. ఈ రాష్ట్రాలన్నింటిలో, హైకమాండ్ మద్దతు ఉందని చెప్పబడే ఒక వర్గం ఉంది మరియు మరొకటి మూలన ఉంది. మనుగడ కోసం పోరాడాలి. తరువాతి వర్గంలో ఉన్నవారు మోడీపై ఆశలు పెట్టుకున్నా రు  కానీ ప్రధాని రోజువారీ సంస్థాగత వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేరు. అయితే, అతను హిమాచల్‌లో చేస్తున్నట్లు లేదా పార్టీ పార్లమెంటరీ బోర్డులో యడియూరప్పను చేర్చు కోవడం ద్వారా కర్ణాటకలో చేసినట్లుగా అతను జోక్యం చేసుకోవలసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంతకుముందు, మహారాష్ట్రలో, ఉద్ధవ్థాకరే నేతృత్వంలోని ప్రభుత్వపతనానికి నెలలు గడుపుతున్న ప్పటికీ, ఏక్‌నాథ్ షిండేను సీఎం చేయాలనే హైకమాండ్ నిర్ణయంతో దేవేంద్ర ఫడ్నవీస్ అవాక్కయ్యారు. ప్రభుత్వంలో భాగం కావడానికి నిరాకరించారు. అమిత్ షా, నడ్డా నుండి పిలుపులు ఉన్నప్పటికీ అతను తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నా, ఫడ్నవీస్ తర్వాత వెల్లడించినట్లుగా, ప్రధాని జోక్యం తర్వాత మాత్రమే తాను డిప్యూటీ సీఎం అయ్యేందు కు అంగీకరింనని చెప్పారు. ప్రధాని మోదీ నుంచి ఆశించడం చాలా ఎక్కువ,  ఆయన దేశాన్ని నడపాలి. ఆయన బీజేపీకి ఓట్లు పడేలా చూడాలి. ఇప్పుడు  మధ్యవర్తిగానూ ఆడాలని  అందరినీ కట్టుదిట్టంగా  కలిసి ఉంచాలని భావిస్తు న్నారు. ప్రధానమంత్రి బిజెపి కోసం అన్ని భారీ-ఎత్తులను తక్షణమే చేస్తున్నారు, అయితే ఆయన తన సీనియర్ పార్టీ సహచరులతో నిరాశ చెందడానికి కారణాలు ఉండవచ్చు.

అప్రూవర్ దొరికాడు.. ఇక కవితకు చుక్కలే!?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు ఉచ్చు బిగుస్తోందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇప్పటి దాకా కవితపై ఆరోపణలు వెల్లువెత్తినా ఆమెను ఈడీ కానీ సీబీఐ కానీ ఇప్పటి వరకూ విచారించలేదు. అయితే ఆమెకు సన్నిహితులను మాత్రం విచారించారు. వారిలో బోయనపల్లి అభిషేక్ ఇప్పటికే అరెస్టయ్యారు. ఇప్పుడు తాజాగా ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న దినేష్ అరోరా అప్రూవర్ గా మారారు. ఈయన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. అసలు ఈ కేసులో హైదరాబాద్ కు చెందిన రామచంద్రపిళ్లై అప్రూవర్ గా మారుతారని ఇంత వరకూ లీకులు వదులుతూ వచ్చారు. అనూహ్యంగా సీబీఐ దినేష్ అరోరాను అప్రూవర్ గా ప్రకటించి, ఆయనను సాక్షిగా పరిగణించాలని కోర్టును కోరింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన ముగ్గురిలో దినేష్ అరోరా ఒకరన్న సంగతి తెలిసిందే.దినేష్ అరోరా, ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా సహా నిందితులందరిపై ఐపీసీ సెక్షన్ 120 బి, 477 ఏతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో కేసీఆర్ కుమార్తె కవిత ప్రధాన సూత్రధారి, పాత్రధారి అని బీజేపీ ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి విదితమే. కవిత పీఏగా ప్రచారంలో ఉన్న బోయినపల్లి అభిషేక్‌నుఇప్పటికే  అరెస్ట్ అయ్యారు. బోయినపల్లి అభిషేక్ కు బెయిలిస్తే  ఆయన సాక్ష్యాలు తారుమారు చేస్తారంటూ   సీబీఐ అడ్డుకుంది. ఇప్పుడు దినేష్ అరోరాను సాక్షిగా చేయడంతో.. కవిత చుట్టూ ఉచ్చు బిగిసినట్లేనని పరిశీలకులు అంటున్నారు. ఏ క్షణంలోనైనా కవితను సీబీఐ విచారించే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తం మీద దినేష్ అరోరా అప్రూవర్ గా మారడంతో ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తు జోరందుకున్నట్లేనని అంటున్నారు.

ఇక కవిత రాజకీయాలకు దూరం అయినట్లేనా.. లిక్కర్ స్కాం ఆరోపణలతో కేసీఆరే దూరం పెట్టారా?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన కుమార్తె కవితను రాష్ట్ర రాజకీయాల నుంచి దూరం పెడుతున్నారా? అందుకు అవసరమైన రంగం సిద్ధం చేసేశారా? అంటే తెరాస వర్గాలు ఔననే అంటున్నాయి. ఆమెను రాజకీయాల నుంచి దూరంగా ఉంచి బీఆర్ఎస్ జాతీయ, అంతర్జాతీయ మీడియా కోఆర్డినేటర్ గా హస్తినకే పరిమితం చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోదని తెలుగు వన్ ముందే చెప్పింది. తెలుగు వన్ అంచనా వాస్తవమే అనడానికి కల్వకుంట్ల కవిత.. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ..ఉద్యమ కాలం నుంచీ తెరాసలో అత్యంత చురుకుగా ఉన్న కవిత.. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఎవరికీ కనిపించకుండా ముఖం చాటేయడమే నిదర్శనం అని చెప్పవచ్చు. మునుగోడు ఉప ఎన్నిక కంటే ముందే టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మార్చే సంరంభంలో కూడా కవిత ఎక్కడా కనిపించలేదు. చివరాఖరికి మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించిన తరువాత ఆమె నిజామాబాద్ లోని నీలకంఠేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేస్తూ కనిపించారు. అదీ కార్తీక సోమవారం సందర్భంగా. అసలు ఇన్ని నెలల పాటు ఎక్కడ ఉన్నారు. ఎందుకు మౌనంగా ఉన్నారు. ఎందుకు ప్రజలకు మొహం చాటేశారు.  లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఆమెను కేసీఆర్ ఉద్దేశ పూర్వకంగా దూరం పెట్టారా? అంటే తెరాస శ్రేణులు ఔననే అంటున్నాయి. అయితే మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలపై సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  తనదైన శైలిలో స్పందించారు. కార్తీక సోమవారం సందర్భంగా నిజామాబాద్‌లోని నీలకంఠేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో  మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా సీఎం కేసీఆర్ వెన్నంటే ప్రజలు ఉంటారనే విషయం మరోసారి రుజువైందన్నారు. టీఆర్ఎస్ పై విమర్శలు చేసేవారికి ఈ ఉప ఎన్నికలో ప్రజల తీర్పు చెంపపెట్టు అని అమె అభివర్ణించారు. ఇకపై తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు తప్పకుండా కేసీఆర్ పక్షానే ఉంటారనే విశ్వాసం ఉందని కల్వకుంట్ల కవిత ఉద్గాటించారు. అయితే కల్వకుంట్లు కవిత.. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వెలువడిన.. దాదాపు 18 గంగటల తర్వాత ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడంపై సోషల్ మీడియా సాక్షిగా నెటిజన్లు సెటైర్లు సంధిస్తున్నారు.   సినిమాలో జరగాల్సిందంతా జరిగాకా.. క్లైమాక్స్ సీన్‌లో పోలీసులు వచ్చినట్లు.. మునుగోడు ఉప ఎన్నిక ఎపిసోడ్ పూర్తయిపోయిన తరువాత కవిత మీడియా ముందుకు వచ్చిందని నెటిజనులు సెటైరికల్‌గా కామెంట్ చేస్తున్నారు. అప్పుడే అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చినట్లుగా కవిత వ్యవహారశైలి ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు. అంతే కాదు... మునుగోడు ఉప ఎన్నికల షెడ్యుల్ విడుదల అయిన నాటి నుంచి ఆ ఉప ఎన్నిక ఫలితం వెలువడే వరకు ఎక్కడ ఉన్నారంటూ కవితని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.  మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. అదీ కూడా టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చుకున్న తర్వాత వెలువడిన తొలి ఫలితం కావడంతో.. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో సంబరాలు మిన్నంటాయని.. వాటిలో కూడా కవిత ఎక్కడ కనిపించలేదు.  మరోవైపు ఈ ఉప ఎన్నికను టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొందని... ఆ క్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ సంస్థల చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లతోపాటు కీలక నేతలను సైతం సీఎం కేసీఆర్..  మునుగోడులో మొహరించారని... సదరు నియోజకవర్గాన్ని యూనిట్లుగా విభజించి... వారికి కీలక బాధ్యతలు అప్పగించారు. స్వయంగా సీఎం కేసీఆర్ కూడా మనుగోడు బహిరంగ సభలో పాల్గొన్నారు. కేటీఆర్ సైతం నియోజకవర్గంలో సుడిగాలి ప్రచారం చేశారు. ఇలా పార్టీ మొత్తం మునుగోడు ఉప ఎన్నిక కోసం చెమటోడిస్తే.. స్వయానా కేసీఆర్ కుమార్తె అయి ఉండీ, ఎమ్మెల్సీ అయి ఉండీ ప్రచారంలో ఎక్కడా ఎందుకు కనిపించలేదన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.    ఢిల్లీ లీక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవితపై ఆరోపణలు వెల్లువెత్తడంతో.. సీఎం కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే ఆమెను  మునుగోడు ఉప ఎన్నికకు దూరంగా ఉంచారని టీఆర్ఎస్ వర్గాలలో చర్చ అయితే జరుగుతోంది.  ఓ వేళ ఆమె ఈ ఎన్నికల్లో ప్రచారం చేస్తే.. ప్రత్యర్థి పార్టీ చేతికి ఆయుధం ఇచ్చినట్లు అవుతోందని భావించడం వల్లనే కేసీఆర్ కావాలనే  ఆమెను మునుగోడు పరిసరాలకు కూడా రానివ్వలేదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  ఇంకో వైపు కల్వకుంట్ల కవిత ఉత్తర భారతదేశంలోని పలు పుణ్య క్షేత్రాలు, దర్గాలు సందర్శన చేస్తున్నఫొటోలు  సోషల్ మీడియా సాక్షిగా తెగ హల్‌చల్ చేయడాన్ని ప్రస్తావిస్తూ... దీంతో మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఇక్కడ ఇంత హడావుడి ఉంటే.. ఆమె అక్కడ డివోషనల్ టూర్ ఏమిటని   నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.    జాతీయ అంతర్జాతీయ మీడియా సమన్వయ కర్తగా తన కుమార్తె కవిత  హస్తినకు పరిమితం  చేయడం ద్వారా లిక్కర్ స్కాం ప్రకంపనలు తమ జాతీయ పార్టీ బీఆర్ఎస్ పై ప్రబావం చూపకుండా జాగ్రత్తలు కేసీఆర్ తీసుకున్నారని అంటున్నారు. అలాగే రాష్ట్ర రాజకీయాల నుంచి కవితను పూర్తిగా దూరం పెట్టడం ద్వారా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆమెపై వచ్చిన ఆరోపణల ప్రభావం ఇక్కడ ప్రతిఫలించకుండా  ఉండేందుకే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెరాస వర్గాలే చెబుతున్నాయి.  అందుకే కవిత మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారం నుంచి ఫలితం వచ్చేదాకా ఎక్కడా బహిరంగంగా కనబడ కుండా జాగ్రత్త తీసుకున్నారనీ అంటున్నారు.

ప్రమాదంలో  సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు ..యుఎన్ నివేదిక

హరిత విప్లవం ద్వారా లభించే అవకాశాలను గుర్తించడంలో విఫలమైన దేశాలు సామాజిక అసమాన తలు, పౌర అశాంతి నెట్‌కు మార్పులను ప్రతిపాదిస్తే తక్కువ పోటీ ఆర్థిక వ్యవస్థలు పెరిగే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యుఎన్ డిపి) కొత్త నివేదిక పేర్కొంది. ఉద్గారాలు లేని మార్గాలు సరిగా నిర్వహించలేదు. రాబోయే కోప్ 27 వాతావరణ చర్చల ముందు ఈ నివేదిక విడుదలైంది. దేశాలు స్థిరమైన ఆర్థికవ్యవస్థలకు మారుతున్నందున, ఈ ప్రక్రియ న్యాయమైన, సమాన మైన మార్గాల్లో జరగడం చాలా కీలకం. పారిస్ ఒప్పందం ప్రపంచ వాతావరణ లక్ష్యాలను సాధించడంలో కేవలం పరివర్తన అనే భావన కీలకం. పారిస్ ఒప్పందం ప్రకారం తాజా జాతీయ వాతా వరణ ప్రతిజ్ఞలలో 38 శాతం, దీర్ఘకాలిక వ్యూహాలలో 56 శాతం ఇప్పుడు కేవలం పరివర్తన సూచించ బడిందని నివేదిక కనుగొంది, అయితే మరింత పని మిగిలి ఉంది. జాతీయంగా పేర్కొన్న విరాళాలు లేదా ఎన్డీ సీలు అని పిలువబడే మెరుగుపరచబడిన స్వల్పకాలిక వాతావరణ హామీలను,  దేశాలు తమ ప్రణాళికలను వివరించే దీర్ఘకాలిక వ్యూహాలను విశ్లేషిస్తుంది. ఇది కేవలం పరివర్తనకు దారితీసే ఐదు దేశాలలో ఉపయోగించబడుతున్న విధానాలను అందిస్తుంది: ఆంటిగ్వా , బార్బుడా, కోస్టా రికా, ఇండియా, సెర్బియా, దక్షిణాఫ్రికా. పారిస్ ఒప్పందాన్ని అందజేయడం లో కేవలం సహాయం చేసే ఐదు కీలక మార్గాలను కూడా ఇది గుర్తిస్తుంది. వాతావరణ మార్పు తీవ్రతరం కావడంతో,  ప్రపంచం విపరీతమైన శక్తి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నం దున, చాలాదేశాలు  శిలాజ ఇంధనాల నుండి విడదీయడం,  రేపటి గ్రీన్ ఎనర్జీ మౌలిక సదుపాయాలలో పెట్టుబడి పెడుతున్నాయి. ఇప్పుడు ఏకైక తార్కిక ఆర్థిక ఎంపిక అని యుఎన్ డిపి నిర్వాహకుడు అచిమ్ స్టైనర్ చెప్పారు. ఈ కొత్త నివేదిక ఇంధన రంగానికి,  అంతకుమించి న్యాయమైన, సమానమైన పరివర్తన చుట్టూ వేగాన్ని ఎలా వేగవంతం చేయాలనే దానిపై వాస్తవ-ప్రపంచ అంతర్దృ ష్టులను అంది స్తుంది: కార్మికులకు కొత్త గ్రీన్ ఎకానమీ నైపుణ్యాలను అందించడం సామాజిక రక్షణకు ప్రాప్యత; దేశాల జాతీయంగా నిర్ణయించిన విరాళాలు నికర-సున్నా భవిష్యత్తుకు స్పష్ట మైన మార్గాన్ని నిర్ధారిస్తాయి. అక్టోబర్ 31, 2022 నాటికి మెరుగుపరచబడిన ఎన్డీసీ ని సమర్పించిన 170 దేశాలలో, 65 (38 శాతం) కేవలం పరివర్త నను స్పష్టంగా సూచిస్తున్నాయి. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య దాదాపుగా కూడా చీలిక ఉంది (51 శాతం, 49 శాతం), మధ్య  తూర్పు ఐరోపా అగ్రస్థానంలో ఉంది, అమెరికా మరియు కరేబియన్ ఆఫ్రికా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆసియా పసిఫిక్,  అరబ్ రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి. అయితే, కేవలం 11 దేశాలు (17 శాతం) మాత్రమే పరివర్తనపై తమ ఎన్డీ సీ లో ప్రత్యేక అధ్యాయం లేదా విభాగాన్ని కలిగి ఉన్నాయి. అక్టోబర్ 31, 2022 నాటికి సమర్పించబడిన 52 దీర్ఘకాలిక వ్యూహాలలో (ఎల్టీ ఎస్) 29 (56 శాతం) కేవలం పరివర్త నను స్పష్టంగా సూచిస్తాయి, వీటిలో 17 యూరోప్ , మధ్య ఆసియా దేశాల నుండి, ఆ తర్వాత ఆసియా పసిఫిక్ , అమెరికా ప్రాంతాల నుండి కరేబియన్. ఆఫ్రికా,  అరబ్ రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి.  మెరుగైన ఎన్డీ సీ లు ఉన్న దేశాలు, కేవలం పరివర్తనను సూచిస్తాయి,  ఏది ఏమైనప్పటికీ, సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (ఎస్డీజీ లు) లేదా స్వల్ప లేదా దీర్ఘకాలిక వాతా వరణ ప్రణాళికలలో లింగ సమానత్వానికి అనుసంధానం చేయడంలో దేశాలు విఫలమవుతున్నా యని నివేదిక కనుగొంది-ఇది ఒక ముఖ్యమైన తప్పిపోయిన అవకాశాన్ని సూచిస్తుంది. కేవలం పరివర్తనను సూచిస్తున్న దేశాలలో, ప్రస్తుతం కేవలం నాలుగుదేశాలు మాత్రమే తమ ఎన్డీసీ లు ఎల్టీఎస్లలో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలకు కేవలం పరివర్తనను అనుసంధా నించాయి.   ఎనర్జీ రంగం కేవలం పరివర్తన కోసం చాలా శ్రద్ధ తీసుకుంటోందని నివేదిక పేర్కొంది, అయితే, సమగ్ర మైన మొత్తం-ఆర్థిక, మొత్తం-సమాజ విధానం - అన్ని రంగాలను పరిష్కరించే మరియు అన్ని వర్గాల నుండి కొనుగోలును సురక్షితం చేసేది.. అవసరం. గొప్ప అభివృద్ధి లాభాలను తీసుకురావడానికి. వాతా వరణ హామీ కింద, యుఎన్ డిపి కేవలం పరివర్తన సూత్రాలు, ప్రక్రియ మరియు అభ్యాసాలను బలో పేతం చేయడానికి  34 దేశాలకు మద్దతు ఇస్తుంది, ఇది ఎన్ డీసిలు, ఎల్ టీఎస్లలో పరిణా మాన్ని చేర్చడంకోసం యుఎన్ డిపి కార్యాచరణను ఉపయోగిస్తుంది. అంచనా; నిశ్చితార్థం; సంస్థాగత విధానం,  సామర్థ్య నిర్మాణం, ఫైనాన్స్, న్యాయమైన పరివర్తన సూత్రాలపై దేశ అవగాహనను పెంచడం, కేవలం పరివర్తన ప్రక్రియలలో పాల్గొనే వారి సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, కేవలం పరివర్తన పద్ధతులను అమలు చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం అనే అంశాలలో  మద్దతు లభిస్తుంది. 

జగన్ కు కడప సర్పంచ్ ల షాక్

అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలంటూ కడప జిల్లా  సర్పంచ్ లు ధర్నాలు, ర్యాలీకి దిగారు. సర్పంచ్ల ఖాతాలోకే నిధులు పడతాయి, పనులు చేపట్టవచ్చని ముఖ్యమంత్రి జగన్ అన్న ప్పటికీ ఇంతవరకూ తమ ఖాతాలో నిధులు వేయలేదని సర్పంచ్ లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ర్యాలీ చేపట్టారు. కడప ఏడు రోడ్ల కూడలి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. నిధులు వెంటనే విడుదల చేయకుంటే తాము నిరసనను మరింత ఉదృతం చేస్తామని హెచ్చ రించారు.  వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సర్పంచ్‌లు, పంచాయతీలకు డబ్బులు ఇవ్వడంలేదని ఆరోపించారు. పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఈ ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ఇప్పటికైన సీఎం జగన్ స్పందించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. గతంలో ప్రకాశం జిల్లాలో వైసీపీ సర్పంచ్‌ల నిరసనలు చేపట్టా రు.అర్ధవీడు మండల సమావేశాన్ని బహిష్కరించి అధికార పార్టీ సర్పంచ్‌లు ఆందోళన చేపట్టగా.. కంభంమండలం సర్పంచులు కూడా అదే బాట పట్టారు. మండల సర్వసభ్య సమావేశాన్ని బహిష్క రించి, ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించారు.  సర్పంచులుగా గెలిచి ఏడాదిన్నర అయినా ప్రభుత్వం పంచాయతీకి నిధులు ఇవ్వలేదని.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ పంచా యతీ అకౌంట్లను జీరో చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే 15వ ఆర్థిక సంఘం నిధులను మంజూరు చేయాలని వారు  అప్పట్లో డిమాండ్‌ చేశారు.  గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి నిధులు లేక సర్పంచులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా  ఏజెన్సీలోని సర్పంచ్‌లు వినూత్నంగా నిరసన చేపట్టారు. నిధుల కోసం సర్పంచ్‌లు మూకుమ్మడిగా వారపు సంతలో బిక్షాటన చేపట్టారు. 14,15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయితీ ఖాతాలలో జమ చేయాలంటూ మండలంలోని సర్పంచ్‌లు నిరసనగళం విప్పారు. చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ కేంద్రంలో జరిగిన వారపు సంతలో మండలంలోని సర్పంచ్‌లందరూ బిక్షాటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం  పంచాయతీలకు కేటా యించవలసిన నిధులను పక్కదారి పట్టించ వద్దంటూ సర్పంచ్‌లు  ప్లకార్డులు చేత పట్టుకొని నినాదాలు చేస్తూ.. భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు.

ఇద్దరూ ఇద్దరే.!

నటన సినీనటులకే పరిమితం కాదు. రాజకీయాల్లోనూ నటుటు, మహానటులు ఉన్నారు. తాజా ఉదా హరణతెలంగా ణా కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి.  తమ్ముడికోసం ఏదయినా చేస్తా అనే పాత సినిమా డైలాగే ఈయనకు సూట్ అవుతుంది. అవును. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటపడడంతో మునుగోడు ఉప ఎన్నిక జరిగింది. సోదరుడు రాజగోపాల్ కి కాంగ్రెస్ వ్యవహారాలు నచ్చక బీజేపీ లోకి మారారు. బీజేపీ సీనియర్లు ఈయన రాకతో ఘన విజయం సాధించ గలమనే అనుకున్నారు, తర్వాత సందేహించారు.. చివరగా ఓడిపోయారు.  సరిగ్గా ప్రచారం ఊపం దుకున్న సమయంలో తన పార్టీకి  కోమటి రెడ్డి వెంకట రెడ్డి ప్రచారం చేయలేదు. ఎన్నికల ప్రచారం కంటే విదేశీ పర్యటన అత్యవసరమయింది. పైగా మునుగోడు ఎన్నిక ముందు వరకూ కనిపించననీ అన్నారు. అన్నట్టే చేశారు.  వెళ్లినాయన ఊరికినే తన స్నేహితు లతోనో, బంధువులతోనో తిరిగి సరదాగా గడపకుండా అక్కడి నుంచి గొప్ప వార్త ప్రచారం చేసేరు.. మునుగోడులో మా వాళ్ల రావడం కష్టం సుమా.. అంటూ.  ఇదే పార్టీ వర్గాలను మరింత కుంగదీసింది. అసలే పార్టీ ఎంపిక చేసిన అభ్యర్ధి గెలుపు కాస్తంత కష్టమేనన్నదీ లోలోపల పార్టీ నాయకునికీ ఉన్పప్పటికీ ఆమె తండ్రి పెద్ద నాయకుడు కనుక ఆయన ప్రభతో ప్రచారం సాగించి సాధించవచ్చని అనుకున్నారు. కానీ చతికిల పడ్డారు కాంగ్రెస్ వారు.  టీఆర్ ఎస్ గెలిచింది. బీజేపీ ఓడింది. కానీ మెజారిటీ పరంగా టీఆర్ఎస్ కి పెద్దగా సంతృప్తి నివ్వలేదు, బీజేపీ వారికి రవ్వంత ఆనందాన్నిచ్చింది. కానీ బాగా నవ్వుకుంది మాత్రం కోమటి రెడ్డి బ్రదర్స్ అనాలి. చెరో పార్టీలో ఉన్నప్పటికీ ఆ రెండు పార్టీ లూ ఓడినప్పటికీ  కేసీఆర్  కంటే ఎంతో ఆనందిస్తున్నారిద్దరూ.  అన్నగారికి తమ పార్టీ ఓడినందుకు కాదు, తమ్ముడు గెలవబోయి గెలుపు గేటు దగ్గర పడిపోయినందుకు ఆనందం.. కేసీఆర్ కి బీజేపీ మెరుగుపడిందని బాధ, కాంగ్రెస్ రేవంత్ కి పార్టీని మరీ దారుణ పరిస్థితికి దిగజార్చేనని బాధా ఉండవచ్చు.  అయితే వెంకట రెడ్డి ముందే ఇవన్నీ ఊహించే సమయానికి తగిన ప్రాంతం ఎంచుకుని పారిపోయారనాలి. దగ్గరుండి ఓటమి కి ప్రచారం చేసుకునే కంటే ఓటు వేయడం మంచిదనే అనుకున్నారనుకోవాలి.  సోదరుడు గెలుస్తాడన్న నమ్మకం పెద్దాయనకు ఉండకపోలేదు. కానీ తమ్ముడు మారిన పార్టీ వారికే ఆయన మీద నమ్మకం సన్నగిల్లింది. అందుకే ప్రచారం పేరుతో బీజేపీ సీనియర్లంతా యాత్రలు చేశారు. ఇదంతా గమనిస్తూ సోదరుడు గెలుస్తాడన్న నమ్మకం వెంకటరెడ్డికీ వచ్చి ఉంటుంది. కానీ చివాఖర్న దెబ్బతీసింది. కానీ రేవంత్ ఏదో సాధిస్తాడని డబ్బాకొట్టుకున్న తన పార్టీవారికి డిపాజిట్ గల్లంతుకావడం విడ్డూరమే.  అంత భారీ ప్రచారాలు, భారీ ప్రసంగాలు ఓటరుని ఏమాత్రం ప్రభావితం చేయలేదు. తనను స్టార్ కాంపెనీర్ గా పెట్టుకుని, ఆయనే ముందుండి గెలిపిస్తారని కాంగ్రెస్ అనుకున్నప్పటికీ, ఆయనకు అంత ప్రాధాన్యతను వాస్తవానికి ఇవ్వలేదన్న ప్రచారమూ ఉంది. పార్టీ, అందునా పురాతన పార్టీలో విభేదాలు ఉండకా పోవు. కానీ సమయం గాని సమయంలో అభిప్రాయభేదా లతోనే స్టార్ కాంపనర్ గారు ఆస్ట్రేలియా పర్యటించడమే పార్టీని నీరసపరిచింది.  ఎవరో అన్నట్టు తమ్ముడు తమ్ముడే, అన్న మాత్రం అన్నకాదు తమ్ముడి వీరాభిమానే. అందుకే వీరాభి మానం ప్రదర్శించి తమ్ముడి విజయాన్ని ఆశించారు.. వెళుతూ వెళుతూ మావోడిని కాస్తం జూస్కోం డన్నా.. అని చిన్న సందేశం ఓటర్లకు చేరేలా చేసి మరీ పర్యటనకు వెళ్లారు. పార్టీలు వేరయినా సోదర ప్రేమ అంతకు మించి ఉంటుందన్నది కాంగ్రెస్ ఘోర పరాభవం తేటతెల్లం చేసింది.  కోమటిరెడ్డి బ్రదర్స్కి కొంత బాధ కంటే ఆనందమే ఎక్కువ మిగిలిం ది. పార్టీ మారి ఓడినా తన సత్తా ప్రదర్శించానని సోదరుడు తెలియజేశాడు. పెద్దాయన తమ్ముడి విజయాన్ని కాకున్నా విజేత సత్తాని గుర్తించానని ఆనందిస్తున్నారు. ఇద్దరూ ఇద్దరే.

మునుగోడులో బీజేపీ ఓడిందా..? గెలిచిందా..?

‘నేను చస్తే.. గెలుస్తానా… మరి ఇది చస్తే.. నేను గెలుస్తానా..?’ నేచురల్ స్టార్ నాని నటించిన  ఎంసీఏలో నటి భూమిక పాత్రను ఉద్దేశించి విలన్ చెప్పిన డైలాగ్ ఇది. ఈ డైలాగ్ ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిన బీజేపీకి అతికినట్టు సరిపోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మునుగోడులో హోరాహోరీ పోరాడిన బీజేపీ 10 వేల ఓట్ల పైచిలుకు తేడాతో ఓటమి చవిచూసింది. అయినప్పటికీ నైతికంగా తానే గెలిచానని ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించడం గమనార్హం. అంటే.. ఓట్ల సంఖ్యా పరంగా బీజేపీ ఓడిందే కానీ.. నైతికంగా గెలిచామనేది వారి అభిప్రాయం. మునుగోడులో తాను ఓడినా.. వచ్చే ఎన్నికల నాటికి 130 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిచే ఛాన్స్ లేదని, ఒక వేళ నిలిచినా ఉన్న కాస్త ప్రతిష్ఠ మంటగలవడం తప్ప మరో ఫలితం ఉండదన్న స్పష్టమైన సందేశాన్ని నియోజకవర్గం ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ విజయం సాధించిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఓట్ల పరంగా గెలవకపోయినా.. కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడం ద్వారా బీజేపీ విజయం సాధించినట్లే అంటున్నారు. తనకు- టీఆర్ఎస్ కు మధ్య మాత్రమే ద్విముఖ పోరు ఉంటుందని, కాంగ్రెస్ పార్టీని బీజేపీ తీసికట్టు మిడతంబొట్లు మాదిరిగా చేసిందంటున్నారు. అలా చూస్తే బీజేపీ తన వ్యూహాన్ని అమలు చేయడంలో సక్సెస్ ఫుల్ గా విజయం సాధించిందనే చెప్పాలంటున్నారు. గతంలో 2014 ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ 65 వేల 496 ఓట్లు తెచ్చుకుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీపై 38 వేల 55 ఓట్ల బంపర్ మెజార్టీతో గెలిచింది. మళ్లీ 2018లో జరిగిన ఎన్నికల్లో తెరాసప కాంగ్రెస్ పార్టీపై 22 వేల 552 ఓట్ల తేడాతో ఓటమి చవి చూసింది. అప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థికి 74 వేల 687 ఓట్లు పోలయ్యాయి. ఆ ఎన్నికల్లో మునుగోడులో బీజేపీకి లభించిన ఓట్లు కేవలం 12 వేలు మాత్రమే. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలో నిలిచారు. రాజగోపాల్ రెడ్డి పది వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి చవి చూశారు.  రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ పార్టీకి, శాసనసభ సభ్యత్వానికీ  రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి విదితమే. హుజురాబాద్ షాక్ లో సీఎం కేసీఆర్ మునుగోడుపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తారని బీజేపీ అధినేతలు ముందే పసిగట్టారు. మునుగోడులో గెలిచేందుకు పార్టీ యంత్రాంగాన్ని, మంత్రులు, ఎమ్మెల్యేలు, మద్యం, మనీ ఇలా ఒకటేమిటి అన్ని విధాలుగా కూడా కేసీఆర్ రంగంలోకి దిగుతారని కూడా బీజేపీ పెద్దలు ముందే   అంచనా వేశారు. 2018లో కేవలం 12 వేల ఓట్లు తెచ్చుకోడానికి ఆపసోపాలు పడిన బీజేపీ ఈ ఉప ఎన్నికల్లో 38.4 శాతంతో 86 వేల 697 ఓట్లు రాబట్టుకోవడం అంటే మాటలు కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలా చూసుకున్నప్పుడు బీజేపీ ఈ సారి గ్రాండ్ సక్సెస్ అయినట్టే అని చెబుతున్నారు. సంఖ్యాపరంగా ఓడినా మునుగోడు ఉప ఎన్నికల బరిలోకి బీజేపీ పకడ్బందీ వ్యూహంతోనే దిగిందని చెబుతున్నారు. ప్రణాళికలు ముందుగానే రచించుకుని, ఆ  ప్రకారమే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేత రాజీనామా చేయించింది. రెండు హేమాహేమీ పార్టీలైన టీఆర్ఎస్- బీజేపీ తలపడిన ఈ ఉప ఎన్నికల పోరులో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కకుండా చేసింది. తద్వారా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రభావాన్ని తప్పించడంలో కృతకృత్యం అయిందంటున్నారు. ఇక టీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయం అనేది జనంలోకి చొప్పించేలా చేయగలిగిందని చెబుతున్నారు. ఉప ఎన్నిక సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో షరా మామూలుగానే రచ్చ కొనసాగింది. తొలుత అభ్యర్థి విషయంలో పార్టీలో వివాదం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక మారరు. రేవంత్ రెడ్డికి సీనియర్లు సహకారం అందించలేదు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా లాభం లేదనే అభిప్రాయం జనంలోకి బాగా వెళ్లిపోయింది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా భావించే నల్గొండ జిల్లాలో ఆ పార్టీ నేతల మధ్య రచ్చే  పార్టీ ఉనికిని ప్రశ్నార్ధకం చేసిందంటున్నారు.  ఇలా మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయేలా చేయడంలో బీజేపీ అగ్రనేతల పాచిక పారిందంటున్నారు. తద్వారా కూడా బీజేపీ విజయం సాధించినట్లే అనే మాట వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని చూపించడంలో ఆ పార్టీ నేతలు గెలిచారనే చెప్పాలని చెబుతున్నారు. టీఆర్ఎస్- బీజేపీ- కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ ఉంటే గులాబీ పార్టీకి కలిసి రావచ్చని.. అందుకే అక్కడ ద్విముఖ పోటీకి రంగం సిద్ధం చేయాలనే వ్యూహాన్ని అమలు చేయడంలో బీజేపీ సక్సెస్ అయిందంటున్నారు. టీఆర్ఎస్ తో ముఖాముఖి తలపడితే తిమ్మిని బమ్మిని చేసి అయినా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించవచ్చనేది బీజేపీ వ్యూహం అంటున్నారు. టీఆర్ఎస్ ను మట్టి కరిపించగల సత్తా బీజేపీకి మాత్రమే ఉందనే సంకేతం పంపడంలో కమలనాథులు విజయం సాధించినట్లే అని చెబుతున్నారు. ఇప్పుడు ఓడిపోతే పోయింది కానీ.. అధికార టీఆర్ఎస్ పార్టీని మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ గడగడలాడించిందనే చెప్పాలంటున్నారు. ఉప ఎన్నికను సవాల్ గా తీసున్న కేసీఆర్ 14 మంది మంత్రుల్ని, సుమారు వంద మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను రంగంలోకి దింపారు. తనతో సహా బీజేపీతో ఒక యుద్ధమే చేశారని చెప్పొచ్చు. అంటే టీఆర్ఎస్ పార్టీ బీజేపీని చూసి  ఎంతలా వణికిపోతోందో చెప్పకుండానే చెప్పిందంటున్నారు. ఉప ఎన్నికలో బీజేపీ ఓడినప్పటికీ.. వ్యూహాత్మకంగా గెలిచిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే సీఎం స్వయంగాను, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే కాకుండా మొత్తం పార్టీని ఇంతలా మోహరించినప్పటికీ టీఆర్ఎస్ పార్టీ తక్కువ మెజార్టీ పరిమితం చేయడంలో బీజేపీ గెలిచిందంటున్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఉన్న సీపీఐ, సీపీఎం ఓట్ల వల్లే టీఆర్ఎస్ కు ఆ మాత్రం మెజారిటీ వచ్చిందంటున్నారు. లేదంటే టీఆర్ఎస్ పరిస్థితి ఇరకాటంలో పడేదనే అభిప్రాయాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్లడంలో బీజేపీ సక్సెస్ అయిందని చెబుతున్నారు.