దూసుకుపోతున్న తెలుగుదేశం కూటమి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం కూటమి భారీ ఆధిక్యతతో దూసుకుపోతున్నది. కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు, రాజమహేంద్రవరం రూరల్లో గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మంగళగిరిలో నారా లోకేశ్, పూతలపట్టులో మురళీమోహన్ ముందంజలో ఉన్నారు.
పిఠాపురంలో పవన్ కల్యాణ్, జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ, రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి వాసు, చిత్తూరులో ధూళిపాళ్ల నరేంద్ర, విజయవాడ సెంట్రల్ లో బోండా ఉమ, బొబ్బిలిలో సుజయకృష్ణ రంగారావు, ఒంగోలులో దామచర్ల జనార్ధన్, గుడివాడలో వెనిగండ్ల రాము ఆధిక్యంలో కొనసాగుతున్నారు.