Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం
posted on: Jul 20, 2015 5:05PM

సినీ నటి, పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి తిరిగి టీఆర్ఎస్ పార్టీలోకి చేరే ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరి శాసనసభకు పోటీ చేసి విజయశాంతి ఓడిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుండి విజయశాంతి రాజకీయాలకు కొంచెం దూరంగానే ఉంటున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ కారు ఎక్కే ప్రయత్నాలు చేస్తున్నట్టు.. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ అగ్రనాయకత్వంతో విజయశాంతి సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ కోసం చూస్తున్న విజయశాంతి.. కేసీఆర్ తన పార్టీలోకి అంగీకరిస్తే వెంటనే పార్టీలోకి చేరడమే అని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. గతంలో కేసీఆర్ మెదక్ పార్లమెంటు సీటు ఇచ్చి విజయశాంతిని ఎన్నికల్లో గెలిపించిన సంగతి తెలిసిందే.






