11 పరాజయాల తర్వాత విజయం సాధించిన పూణే వారియర్స్
posted on Apr 12, 2013 6:47AM
ఐపిఎల్.-6 లీగ్ మ్యాచ్ లలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో తలపడిన పూణే వారియర్స్ తొలి విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో తన ఖాతా తెరిచింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాంటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ కుషాల్ పెరీరాను (0) భువనేశ్వర్ తోలిబంతికే ఎల్బీడబ్ల్యూ గా పెవిలియన్ కు పంపాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ ఓపెనర్ రహానేతో కలిసి 67బంతుల్లో 81 పరుగులు జోడించారు. ద్రావిడ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ ఐపిఎల్-6 లో తన రెండో అర్థసెంచరీని నమోదు చేశాడు. 54 పరుగులు చేసిన ద్రావిడ్ యువరాజ్ సింగ్ బౌలింగ్ లో టేలర్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. యువరాజ్ ఒకే ఓవర్లో ద్రావిడ్ (54), స్టువర్ట్ బిన్నీ (1) ల వికెట్లను తీసి రాజస్థాన్ పరుగులకు బ్రేక్ వేశాడు. మిగతా బ్యాట్స్ మెన్ ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ లో మిగతా బ్యాట్స్ మెన్ స్కోర్లు రహానే 30, హాడ్జ్ 22 నాటౌట్, యాజ్ఞిక్ 12, ఫాల్క్ నర్ 19 నాటౌట్. రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఓపెనర్లు రాబిన్ ఊతప్ప, ఫించ్ ధాటిగా ఆడారు. వీరిద్దరూ 29 బంతుల్లో 59 పరుగులు జోడించారు. ఊతప్ప (30), ఫాల్క్ నర్ వేసిన బంతిని ద్రావిడ్ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. రాస్ టేలర్, ఫించ్ కు తోడవడంతో తొలిమ్యాచ్ ఆడుతున్న ఫించ్ 36 బంతుల్లో అర్థసెంచరీ చేశాడు. రాస్ టేలర్ 17 చేశారు. యువరాజ్ 28 నాటౌట్, మాథ్యూస్ 1 నాటౌట్ గా ఉన్నారు. విజయలక్ష్యాన్ని 146 పరుగులను 18.4 ఓవర్లలోనే సాధించింది. 53 బంతుల్లో 64 పరుగులు చేసిన ఫించ్ కు మ్యాన్ ఆఫ్ ది అవార్డ్ దక్కింది. గత సీజన్ తో కలుపుకుని 11 మ్యాచ్ ల తరువాత పూణే వారియర్స్ కు ఇదే తొలివిజయం.