జగన్ బాణం ఎవరిమీద : సత్తిబాబు మండిపాటు

sharmila padayatra, sharmila ys jagan, botsa satyanarayana sharmila, sharmila ysr congress

 

తాను జగనన్న వదిలిన బాణాన్నంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలపై పిసిసి ఛీప్ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చేసిన నేరాలు, ఘోరాలు అన్నీ చేసేసి ఇప్పుడు వాటన్నింటినీ కాంగ్రెస్ నెత్తిన పడేసి తాము మంచివాళ్లుగా నిరూపించుకునే ప్రయత్నం జగన్ వర్గం చేస్తోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ని లక్ష్యంగా చేసుకుని వదిలిన బాణాలన్నీ నిష్ఫలమైపోయాయన్న సత్యాన్ని చరిత్రను చూసి తెలుసుకోవాలని బొత్స అన్నారు. అవకాశం కోసం పూటకోమాట మాట్లాడుతూ రాజకీయాన్ని భ్రష్టుపట్టించొద్దంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్చం చేశారు. రైతన్నలకోసం తాను ఓ పూట తిండిమానుకున్నానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. పాదయాత్రలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి వైద్యులు సలహా ఇవ్వడంవల్లే ఓ పూట రాత్రి భోజనం మానేశారు తప్ప, చంద్రబాబుకి చేనేతల సమస్యలమీద అక్కర లేదని బొత్స సత్యనారాయణ విమర్శించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu