మొత్తానికి ‘ఖుషి’ టీంకి గుడ్ న్యూస్ చెప్పింది!
on Feb 4, 2023
సమంత హీరోయిన్గా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నిన్ను కోరి, మజిలీ వంటి చిత్రాల దర్శకుడు శివానిర్వాన దర్శకత్వంలో ఖుషి అనే చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆయన నానితో తీసిన టక్ జగదీష్ తో పరాజయం చవిచూశారు. దాంతో ఎలాగైనా ఖుషీతో తన సత్తా మరోసారి చాటాలని చూస్తున్నారు. దాంతో ఈ మూవీపై దర్శకుడు శివానిర్వణ బోలెడు ఆశలు పెట్టుకొని ఉన్నారు. కానీ సమంతకు నాగచైతన్యతో విడాకుల తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లడం ఆ వెంటనే మయోసైటీస్ అనే వ్యాధి రావడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. మరోపక్క సమంతా నటించిన శాకుంతల చిత్రం ఆమె పూర్తి చేసింది. ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కానుంది. మయోసైటిస్ నుంచి ఆమె కోలుకుందని వార్తలు వస్తున్నాయి.
ఆరోగ్యం బాగుండటంతో వెబ్ సిరీస్ ల షూటింగ్ లలో ఈమె పాల్గొంటోంది. అదే సమయంలో ఆమె ఖుషీ చిత్రంలో పాల్గొనకుండా రాజ్- డీకే దర్శక ద్వయం డైరెక్షన్ లో రూపొందుతున్న సిటాడెల్ అనే వెబ్ సిరీస్ కోసం వెళ్ళిపోయింది. ప్రస్తుతం ముంబైలో ఈ సిరీస్ షూటింగ్ జరుగుతుంది. అందులో సమంత పాల్గొంటోంది. దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు సమంతా పై మండిపడుతున్నారు. ఖుషి చిత్రాన్ని పూర్తి చేయకుండా ఆ సినిమా షూటింగులో పాల్గొనకుండా సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటించడం ఏమిటని ఆమెపై ఓ రేంజిలో ఫైర్ అవుతున్నారు. ఈ విషయం సమంతా వరకు చేరింది. దాంతో ఆమె తాజాగా స్పందించింది.
విజయ్ దేవరకొండ అభిమానులతో పాటు దర్శకుడు శివ నిర్వాణ మైత్రి మూవీ మేకర్స్ వారికి క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేసింది. ఖుషీ చిత్రం త్వరలోనే మొదలవుతుందని స్పష్టం చేసింది. ఆ చిత్రం షూటింగ్ లో తాను పాల్గొననున్నట్లు పేర్కొంది. సమంత చేసిన ట్వీట్ ను విజయ్ దేవరకొండ రీట్వీట్ చేస్తూ మీరంతా పూర్తిస్థాయిలో కోలుకొని నవ్వుతున్న ముఖంతో తిరిగి రావాలని కోరుకున్నాం.... అంటూ పేర్కొన్నారు. తాజాగా సమంత పై విజయ్ దేవరకొండ అభిమానులు ఫైర్ అయిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read